Investing for a child: పిల్లల ఆర్థిక భవిష్యత్తు కోసం ఎడెల్వీస్ సీఈఓ టిప్స్
Tips on investing for a child: పిల్లల మెరుగైన ఆర్థిక భవిష్యత్తు కోసం ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ, ఎండీ రాధికా గుప్తా కొన్ని సూచనలు చేశారు. అవేంటో ఆమె మాటల్లోనే..!
ఇంటర్నెట్ డెస్క్: పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడులు ప్రారంభించాలనుకునే వారికి ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ, ఎండీ రాధికా గుప్తా (Radhika Gupta) కొన్ని విలువైన సూచనలు చేశారు. చిన్న వయసులోనే మదుపు ప్రారంభించాలని ప్రోత్సహించే ఆమె.. పిల్లల కోసం కూడా వీలైనంత త్వరగా పెట్టుబడులు పెట్టాలని చెప్పారు. కీలక పత్రాలను చేయించడంతో మొదలుపెట్టి నెలనెలా సిప్ చేయాలని సూచించారు. లక్ష్యాలను నిర్దేశించుకొని.. పరిస్థితులకు అనుగుణంగా వాటిని సమీక్షించాలని ఎక్స్ వేదికగా సూచించారు. ఆ సూచనలేంటో చూద్దాం..
- జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్, పాన్, బ్యాంక్ అకౌంట్ వంటి డాక్యుమెంట్లను చేయించాలి. మైనర్లు అయినప్పటికీ వీటన్నింటినీ పొందొచ్చు.
- పిల్లల కోసం మదుపు చేసే ముందు కచ్చితమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. ఉదాహరణకు వారి ఉన్నత చదువులు. దీన్ని తిరిగి చిన్న చిన్న లక్ష్యాలుగా విభజించుకొని.. ఒక్కో ఏడాది ఎంత ఇన్వెస్ట్ చేయాలో నిర్ణయించుకోవాలి.
- ప్రతినెలా క్రమానుగత పెట్టుబడి పథకాల్లో (SIP) మదుపు చేయాలి. కనీసం 2, 3 ఫండ్లలో సిప్ చేస్తే మేలు. మార్కెట్ ఎక్స్పోజర్ కోసం లార్జ్/మిడ్ ఇండెక్స్ ఫండ్, రిస్క్ కోసం మిడ్/స్మాల్ ఫండ్, విదేశీ విద్య కోసం కరెన్సీ హెచ్చుతగ్గులకు అనుగుణంగా ఇంటర్నేషనల్ ఫండ్ను పరిశీలించొచ్చు.
- లక్ష్యాలను ఎప్పటికప్పుడు సమీక్షించాలి. వాటికి చేరువవుతున్న కొద్దీ పొదుపుగా వ్యవహరించాలి. పిల్లలకు అర్థం చేసుకునే వయసు వచ్చిన తర్వాత వారిని కూడా ఈ ప్రయాణంలో భాగం చేయాలి.
- ఇది ప్రతిఒక్కరికీ సరిపోయే ప్రణాళిక కాదు. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎవరికి వారు వాళ్ల ప్రణాళికలను రచించుకోవాలి. ‘‘ఆట వస్తువులతో ఇంటిని నింపి స్థలం లేకుండా చేసుకోవడానికి బదులు ఇలాంటి ఆర్థిక బహుమతుల వల్ల వారి భవిష్యత్తుకు భరోసా లభిస్తుంది. వీటి వల్ల ప్రయోజనమే కాకుండా.. ఇంట్లో స్థలమూ మిగులుతుంది’’ అని గుప్తా సరదాగా వ్యాఖ్యానించారు.
పిల్లలు పుట్టిన వెంటనే జనన ధ్రువీకరణ పత్రం పొందొచ్చని.. దానితో ఆధార్ కార్డు తీసుకోవచ్చని మరో ఎక్స్ పోస్ట్లో రాధికా గుప్తా తెలిపారు. ఈ రెండూ ఉంటే పాన్ లభిస్తుందని చెప్పారు. మైనర్లకూ బ్యాంక్ అకౌంట్ తీసే సదుపాయం ఉంటుందని వెల్లడించారు. పిల్లల పేరు మీద ప్రత్యేకంగా చిల్డ్రన్ ఫండ్స్లోనే కాకుండా రెగ్యులర్ వాటిలో కూడా ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుందని చెబుతూ.. పిల్లల విషయంలో ఉన్న కొన్ని అపోహలను తొలగించారు.
ఒకేసారి పెట్టుబడి పెట్టడం వల్ల మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల నష్టభయం ఉండొచ్చు. ఇందుకు భిన్నంగా నెలనెలా కొంత మొత్తాన్ని మదుపు చేస్తూ వెళ్లడం ద్వారా మార్కెట్ హెచ్చుతగ్గుల నుంచి సగటు ప్రయోజనాన్ని అందుకోవచ్చు. ఈ సూత్రం ఆధారంగానే సిప్ (SIP) పనిచేస్తుంది. కొంత మొత్తంతో ప్రారంభించి, కాలం గడుస్తున్న కొద్దీ పెట్టుబడి మొత్తాన్ని పెంచుకోవచ్చు. తక్కువ నష్టభయంతో దీర్ఘకాలంలో అధిక మొత్తాన్ని జమ చేసేందుకు ఈ మార్గం తోడ్పడుతుంది. ఆదాయం, ఆర్థిక లక్ష్యాలను బట్టి, మీరు అనుకున్నంత కాలంపాటు ప్రతి వారం, నెల, త్రైమాసికం లేదా ఆరు నెలలకోసారి నిర్ణీత మొత్తాన్ని మదుపు చేయొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4 లక్షల స్కూటర్లు రీకాల్ చేసిన సుజుకీ.. ఇందులో మీ మోడల్ ఉందా?
Suzuki Motorcycle: సుజుకీ కంపెనీ దాదాపు 4 లక్షల వాహనాలను రీకాల్ చేసింది. ఆయా వాహనాల్లో ఉన్న లోపాన్ని గుర్తించి ఈ రీకాల్ చేపట్టింది. -
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు