Investing for a child: పిల్లల ఆర్థిక భవిష్యత్తు కోసం ఎడెల్వీస్ సీఈఓ టిప్స్
Tips on investing for a child: పిల్లల మెరుగైన ఆర్థిక భవిష్యత్తు కోసం ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ, ఎండీ రాధికా గుప్తా కొన్ని సూచనలు చేశారు. అవేంటో ఆమె మాటల్లోనే..!
ఇంటర్నెట్ డెస్క్: పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడులు ప్రారంభించాలనుకునే వారికి ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ, ఎండీ రాధికా గుప్తా (Radhika Gupta) కొన్ని విలువైన సూచనలు చేశారు. చిన్న వయసులోనే మదుపు ప్రారంభించాలని ప్రోత్సహించే ఆమె.. పిల్లల కోసం కూడా వీలైనంత త్వరగా పెట్టుబడులు పెట్టాలని చెప్పారు. కీలక పత్రాలను చేయించడంతో మొదలుపెట్టి నెలనెలా సిప్ చేయాలని సూచించారు. లక్ష్యాలను నిర్దేశించుకొని.. పరిస్థితులకు అనుగుణంగా వాటిని సమీక్షించాలని ఎక్స్ వేదికగా సూచించారు. ఆ సూచనలేంటో చూద్దాం..
- జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్, పాన్, బ్యాంక్ అకౌంట్ వంటి డాక్యుమెంట్లను చేయించాలి. మైనర్లు అయినప్పటికీ వీటన్నింటినీ పొందొచ్చు.
- పిల్లల కోసం మదుపు చేసే ముందు కచ్చితమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. ఉదాహరణకు వారి ఉన్నత చదువులు. దీన్ని తిరిగి చిన్న చిన్న లక్ష్యాలుగా విభజించుకొని.. ఒక్కో ఏడాది ఎంత ఇన్వెస్ట్ చేయాలో నిర్ణయించుకోవాలి.
- ప్రతినెలా క్రమానుగత పెట్టుబడి పథకాల్లో (SIP) మదుపు చేయాలి. కనీసం 2, 3 ఫండ్లలో సిప్ చేస్తే మేలు. మార్కెట్ ఎక్స్పోజర్ కోసం లార్జ్/మిడ్ ఇండెక్స్ ఫండ్, రిస్క్ కోసం మిడ్/స్మాల్ ఫండ్, విదేశీ విద్య కోసం కరెన్సీ హెచ్చుతగ్గులకు అనుగుణంగా ఇంటర్నేషనల్ ఫండ్ను పరిశీలించొచ్చు.
- లక్ష్యాలను ఎప్పటికప్పుడు సమీక్షించాలి. వాటికి చేరువవుతున్న కొద్దీ పొదుపుగా వ్యవహరించాలి. పిల్లలకు అర్థం చేసుకునే వయసు వచ్చిన తర్వాత వారిని కూడా ఈ ప్రయాణంలో భాగం చేయాలి.
- ఇది ప్రతిఒక్కరికీ సరిపోయే ప్రణాళిక కాదు. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎవరికి వారు వాళ్ల ప్రణాళికలను రచించుకోవాలి. ‘‘ఆట వస్తువులతో ఇంటిని నింపి స్థలం లేకుండా చేసుకోవడానికి బదులు ఇలాంటి ఆర్థిక బహుమతుల వల్ల వారి భవిష్యత్తుకు భరోసా లభిస్తుంది. వీటి వల్ల ప్రయోజనమే కాకుండా.. ఇంట్లో స్థలమూ మిగులుతుంది’’ అని గుప్తా సరదాగా వ్యాఖ్యానించారు.
పిల్లలు పుట్టిన వెంటనే జనన ధ్రువీకరణ పత్రం పొందొచ్చని.. దానితో ఆధార్ కార్డు తీసుకోవచ్చని మరో ఎక్స్ పోస్ట్లో రాధికా గుప్తా తెలిపారు. ఈ రెండూ ఉంటే పాన్ లభిస్తుందని చెప్పారు. మైనర్లకూ బ్యాంక్ అకౌంట్ తీసే సదుపాయం ఉంటుందని వెల్లడించారు. పిల్లల పేరు మీద ప్రత్యేకంగా చిల్డ్రన్ ఫండ్స్లోనే కాకుండా రెగ్యులర్ వాటిలో కూడా ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుందని చెబుతూ.. పిల్లల విషయంలో ఉన్న కొన్ని అపోహలను తొలగించారు.
ఒకేసారి పెట్టుబడి పెట్టడం వల్ల మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల నష్టభయం ఉండొచ్చు. ఇందుకు భిన్నంగా నెలనెలా కొంత మొత్తాన్ని మదుపు చేస్తూ వెళ్లడం ద్వారా మార్కెట్ హెచ్చుతగ్గుల నుంచి సగటు ప్రయోజనాన్ని అందుకోవచ్చు. ఈ సూత్రం ఆధారంగానే సిప్ (SIP) పనిచేస్తుంది. కొంత మొత్తంతో ప్రారంభించి, కాలం గడుస్తున్న కొద్దీ పెట్టుబడి మొత్తాన్ని పెంచుకోవచ్చు. తక్కువ నష్టభయంతో దీర్ఘకాలంలో అధిక మొత్తాన్ని జమ చేసేందుకు ఈ మార్గం తోడ్పడుతుంది. ఆదాయం, ఆర్థిక లక్ష్యాలను బట్టి, మీరు అనుకున్నంత కాలంపాటు ప్రతి వారం, నెల, త్రైమాసికం లేదా ఆరు నెలలకోసారి నిర్ణీత మొత్తాన్ని మదుపు చేయొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోపోర్జ్ చేతికి సిగ్నిటీ టెక్నాలజీస్
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఐటీ టెస్టింగ్ సేవల సంస్థ సిగ్నిటీ టెక్నాలజీస్ను, దేశీయ ఐటీ రంగ అగ్రశ్రేణి సంస్థల్లో ఒకటైన కోఫోర్జ్ లిమిటెడ్ (గతంలో ఎన్ఐఐటీ టెక్నాలజీస్) సొంతం చేసుకోనుంది. -
పన్ను రాయితీలను ‘ఊహాజనిత నష్టం’గా ఎలా పరిగణిస్తారు?
ప్రభుత్వం ప్రకటించిన పన్ను రాయితీలను, కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా) ‘ఊహాజనిత నష్టం’ గా ఎలా నిర్ణయిస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ప్రశ్నించారు. -
మన ఎలక్ట్రానిక్స్లో చైనా, హాంకాంగ్ నుంచే 56%
గత ఆర్థిక సంవత్సరంలో మన ఎలక్ట్రానిక్స్, టెలికాం, ఎలక్ట్రికల్ ఉత్పత్తుల దిగుమతులు 89.8 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.7.45 లక్షల కోట్లు)గా నమోదయ్యాయి. -
సేవల ఎగుమతులు స్వల్పంగా తగ్గాయ్
మన దేశం నుంచి సేవల ఎగుమతులు, ఏడాది క్రితంతో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో 1.3% తగ్గి 30 బిలియన్ డాలర్ల (సుమరు రూ.2.5 లక్షల కోట్ల)కు పరిమితమయ్యాయని రిజర్వ్ బ్యాంక్ గురువారం తెలిపింది. -
ఒకాయా ఇ-బైక్ డిస్రప్టర్
దిల్లీకి చెందిన ఒకాయా సంస్థ ప్రీమియం బ్రాండ్ ఫెరాటో, సరికొత్త విద్యుత్ బైక్ ‘డిస్రప్టర్’ను విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ.1,59,999. విద్యుత్ వాహన రాయితీల తర్వాత దిల్లీలో ఈ బైకు రూ.1.40 లక్షలకు లభించనుంది. -
నష్టాల నుంచి లాభాల్లోకి
ఏప్రిల్లో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదవ్వడం, సానుకూల తయారీ గణాంకాల మద్దతుతో దేశీయ సూచీలు గురువారం లాభాల్లో ముగిశాయి. విదేశీ కొనుగోళ్లు మదుపర్ల సెంటిమెంట్ను బలోపేతం చేశాయి. -
రాణించిన డాబర్ ఇండియా
డాబర్ ఇండియా, జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.341.22 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.292.76 కోట్ల కంటే ఇది 16.55% అధికం. కార్యకలాపాల ఆదాయం రూ.2,677.80 కోట్ల నుంచి 5.11% పెరిగి రూ.2,814.6 4 కోట్లకు చేరింది. -
బియ్యం, డెయిరీ ఉత్పత్తులపైనా నిఘా
దేశీయ మార్కెట్లో విక్రయమయ్యే పోషక బియ్యం (ఫోర్టిఫైడ్ రైస్), డెయిరీ ఉత్పత్తులు, మసాలాలపై నిఘా పెట్టాలని ఆహార నియంత్రణాధికార సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ భావిస్తోంది. -
‘కొవాగ్జిన్’ ఆవిష్కరణలో భద్రతకే పెద్దపీట
టీకా తీసుకున్న ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా ‘కొవాగ్జిన్’ టీకాను రూపొందించినట్లు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ గురువారం వెల్లడించింది. ‘ఏదైనా టీకా ప్రభావం కొంతకాలమే ఉండొచ్చు, కానీ రోగుల భద్రత ఎంతో ముఖ్యం. -
కోల్ ఇండియా లాభంలో 26% వృద్ధి
కోల్ ఇండియా మార్చి త్రైమాసికంలో రూ.8,682.20 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.6,875.07 కోట్ల కంటే ఇది 26.2% అధికం. -
37% తగ్గిన అదానీ ఎంటర్ప్రైజెస్ లాభం
అదానీ ఎంటర్ప్రైజెస్, జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.450.58 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.722.48 కోట్లతో పోలిస్తే ఇది 37% తక్కువ. -
జీఎస్టీ నకిలీ రిజిస్ట్రేషన్లపై ఉక్కుపాదం
రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో కేంద్ర, రాష్ట్రాల జీఎస్టీ ఉన్నతాధికారుల 3వ జాతీయ సమన్వయ సమావేశం శుక్రవారం జరగనుంది. -
సంక్షిప్త వార్తలు( 7)
ఇండస్ట్రియల్ సాఫ్ట్వేర్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సేవల సంస్థ అవేవా, హైదరాబాద్లో కస్టమర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభించింది. ఈ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇటువంటి కేంద్రాల్లో ఇది ఆరోది. -
తీవ్ర వ్యాధుల చికిత్సకు ఆర్థిక భరోసా
అనారోగ్యం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. ఓవైపు పెరుగుతున్న వైద్య చికిత్స ఖర్చులతో కేవలం ఆరోగ్య బీమా పాలసీ ఒక్కటే ఉంటే సరిపోని రోజులివి. -
వేతనంలోఎంత పొదుపు చేయాలంటే
వచ్చిన ఆదాయాన్నంతా ఖర్చు చేస్తే.. భవిష్యత్ లక్ష్యాలను సాధించడం కష్టమవుతుంది. కాబట్టి, పొదుపు, పెట్టుబడులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. -
అప్పు చేసి ఇల్లు కొంటున్నారా?
సొంతిల్లు.. ప్రతి ఒక్కరి కల. దీన్ని నిజం చేసుకునే క్రమంలో గృహరుణం తీసుకుంటాం. తొలిసారి ఇల్లు కొనుగోలు చేస్తున్నవారూ.. ఇప్పటికే ఉన్నదాన్ని మార్చి, పెద్దది తీసుకోవాలనుకున్నా. -
ఫిక్స్డ్ డిపాజిట్.. ఈ పత్రాలు ఇచ్చారా?
బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయా? వీటిపై వచ్చే వడ్డీపై మూలం వద్ద పన్ను మినహాయింపు (టీడీఎస్) విధించకుండా ఫారం 15జీ / ఫారం15హెచ్ సమర్పించేందుకు సమయం ఇదే. -
క్రెడిట్ కార్డు.. ఇలా తీసుకుందాం
క్రెడిట్ కార్డులు మన రోజువారీ ఆర్థిక లావాదేవీల్లో ఒక భాగం అయ్యాయి. ఇప్పుడు యూపీఐ ఆధారిత చెల్లింపుల కోసమూ వీటిని ఉపయోగించుకునేందుకు వీలవుతోంది. -
ప్రభుత్వ సంస్థల్లో
ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ఒక ఈటీఎఫ్ (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్) పథకాన్ని తీసుకొచ్చింది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ నిఫ్టీ పీఎస్ఈ ఈటీఎఫ్ అనే ఈ పథకం ఎన్ఎఫ్ఓ ముగింపు తేదీ ఈ నెల 16. కనీస పెట్టుబడి రూ.500. నిఫ్టీ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ (పీఎస్) ఇండెక్స్ ఆధారంగా రూపొందించిన ఓపెన్ ఎండెడ్ పథకం ఇది.