Elections: ఈ-కామర్స్ సైట్లలోనూ ఎన్నికల హడావుడి
Elections: ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీలకు చెందిన అనేక రకాల వస్తువులు ఈ-కామర్స్ సైట్లలో అందుబాటులో ఉన్నాయి.
దిల్లీ: దేశవ్యాప్తంగా ఎన్నికల (Lok sabha Elections) సందడి నెలకొంది. పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. కార్యకర్తలు, నాయకులు సభలు, సమావేశాల్లో నిమగ్నమయ్యారు. అయితే, ఈ హడావుడి ఇప్పుడు ఈ-కామర్స్ సైట్లలోనూ కనిపిస్తోంది. భాజపా (BJP) కమలం బ్యాడ్జ్లు, ఆప్ లోగోతో గడియారాలు, కాంగ్రెస్ (Congress) కండువాలు.. ఇలా ఎలెక్షన్ థీమ్తో వివిధ రకాల వస్తువులు ఆన్లైన్లో హల్చల్ చేస్తున్నాయి.
ఈ-కామర్స్ సైట్లలోని సెర్చ్ బార్లో రాజకీయ పార్టీ పేరు ఎంటర్ చేస్తే చాలు జెండాలు, లాకెట్లు, పెన్నులు, కండువాలు.. ఇలా రకరకాల వస్తువులు తెరపై దర్శనమిస్తున్నాయి. వాస్తవానికి ఈ ట్రెండ్ 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలోనే ప్రారంభమైంది. కానీ, 2020 కరోనా సంక్షోభం కావడంతో ఆదరణ తగ్గింది. కాని ఇప్పుడు ఈ-కామర్స్ సైట్లకు ఆదరణ పెరిగిన నేపథ్యంలో ఈసారి తాకిడి మరింత ఎక్కువగా ఉంది. అన్నీ ఆన్లైన్లో అందుబాటులో ఉన్నప్పుడు వీటిని మాత్రం ఎందుకు విక్రయించొద్దనే ఉద్దేశంతోనే విక్రేతలు ఎలక్షన్ ఆధారిత వస్తువులను సైతం తమ సైట్లలో అందుబాటులో ఉంచుతున్నారని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
కొన్ని పార్టీలు సొంతంగా వెబ్సైట్లను ప్రారంభించి పలు రకాల వస్తువులను విక్రయిస్తుండడం గమనార్హం. ఇటీవలే నమో మర్చండైజ్ వెబ్సైట్ ప్రారంభమైంది. అందులో టీ-షర్టులు, పుస్తకాలు, బ్యాడ్జ్లు, రిస్ట్బ్యాండ్లు, కీచైన్లు, స్టిక్కర్లు, టోపీలు, పెన్నులు ఇలా రకరకాల వస్తువులు అందుబాటులో ఉన్నాయి. ‘మోదీ కా పరివార్’, ‘ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్’, ‘మోదీ కీ గ్యారంటీ’.. ఇలా వివిధ రకాల నినాదాలతో వాటిని రూపొందించారు.
రాజకీయ పార్టీలకు సంబంధించిన వస్తువులను గత కొంతకాలంగా ఈ-కామర్స్ వెబ్సైట్లలో ఉంచుతున్నామని ఓ విక్రేత తెలిపారు. కానీ, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వాటికి ఇప్పుడు డిమాండ్ పెరిగిందన్నారు. భాజపా, కాంగ్రెస్కు సంబంధించిన వస్తువులకు భారీ గిరాకీ ఉందని వెల్లడించారు. ఈసారి ప్రాంతీయ పార్టీల వస్తువులకు సైతం డిమాండ్ పెరిగిందని మరో సెల్లర్ తెలిపారు. సమాజ్వాదీ పార్టీ లోగోతో కీచైన్లు, టీఎంసీ ఏసీ అడాప్టర్ నైట్ ల్యాంప్లు, సీపీఎం బానెట్ జెండాలకు ఆర్డర్లు వస్తున్నాయని చెప్పారు.
మరోవైపు ఒకప్పుడు దుకాణాల్లో మాత్రమే ఎలక్షన్లకు సంబంధించిన వస్తువులను విక్రయించిన వ్యాపారులు.. నెమ్మదిగా ఆన్లైన్ వైపు మళ్లుతున్నారు. గత దశాబ్దకాలంగా పరిస్థితి పూర్తిగా మారిందని.. ఆన్లైన్ ప్రచారానికి ప్రాధాన్యం పెరిగిన నేపథ్యంలో వస్తువులనూ ఆ వేదికగా అందుబాటులో ఉంచాల్సివస్తోందని వివరించారు. ఈనేపథ్యంలో ఆయా వస్తువులను ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లపై విక్రయిస్తున్నామని తెలిపారు. లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు విడతల్లో జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ