Elections: ఈ-కామర్స్ సైట్లలోనూ ఎన్నికల హడావుడి
Elections: ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీలకు చెందిన అనేక రకాల వస్తువులు ఈ-కామర్స్ సైట్లలో అందుబాటులో ఉన్నాయి.
దిల్లీ: దేశవ్యాప్తంగా ఎన్నికల (Lok sabha Elections) సందడి నెలకొంది. పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. కార్యకర్తలు, నాయకులు సభలు, సమావేశాల్లో నిమగ్నమయ్యారు. అయితే, ఈ హడావుడి ఇప్పుడు ఈ-కామర్స్ సైట్లలోనూ కనిపిస్తోంది. భాజపా (BJP) కమలం బ్యాడ్జ్లు, ఆప్ లోగోతో గడియారాలు, కాంగ్రెస్ (Congress) కండువాలు.. ఇలా ఎలెక్షన్ థీమ్తో వివిధ రకాల వస్తువులు ఆన్లైన్లో హల్చల్ చేస్తున్నాయి.
ఈ-కామర్స్ సైట్లలోని సెర్చ్ బార్లో రాజకీయ పార్టీ పేరు ఎంటర్ చేస్తే చాలు జెండాలు, లాకెట్లు, పెన్నులు, కండువాలు.. ఇలా రకరకాల వస్తువులు తెరపై దర్శనమిస్తున్నాయి. వాస్తవానికి ఈ ట్రెండ్ 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలోనే ప్రారంభమైంది. కానీ, 2020 కరోనా సంక్షోభం కావడంతో ఆదరణ తగ్గింది. కాని ఇప్పుడు ఈ-కామర్స్ సైట్లకు ఆదరణ పెరిగిన నేపథ్యంలో ఈసారి తాకిడి మరింత ఎక్కువగా ఉంది. అన్నీ ఆన్లైన్లో అందుబాటులో ఉన్నప్పుడు వీటిని మాత్రం ఎందుకు విక్రయించొద్దనే ఉద్దేశంతోనే విక్రేతలు ఎలక్షన్ ఆధారిత వస్తువులను సైతం తమ సైట్లలో అందుబాటులో ఉంచుతున్నారని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
కొన్ని పార్టీలు సొంతంగా వెబ్సైట్లను ప్రారంభించి పలు రకాల వస్తువులను విక్రయిస్తుండడం గమనార్హం. ఇటీవలే నమో మర్చండైజ్ వెబ్సైట్ ప్రారంభమైంది. అందులో టీ-షర్టులు, పుస్తకాలు, బ్యాడ్జ్లు, రిస్ట్బ్యాండ్లు, కీచైన్లు, స్టిక్కర్లు, టోపీలు, పెన్నులు ఇలా రకరకాల వస్తువులు అందుబాటులో ఉన్నాయి. ‘మోదీ కా పరివార్’, ‘ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్’, ‘మోదీ కీ గ్యారంటీ’.. ఇలా వివిధ రకాల నినాదాలతో వాటిని రూపొందించారు.
రాజకీయ పార్టీలకు సంబంధించిన వస్తువులను గత కొంతకాలంగా ఈ-కామర్స్ వెబ్సైట్లలో ఉంచుతున్నామని ఓ విక్రేత తెలిపారు. కానీ, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వాటికి ఇప్పుడు డిమాండ్ పెరిగిందన్నారు. భాజపా, కాంగ్రెస్కు సంబంధించిన వస్తువులకు భారీ గిరాకీ ఉందని వెల్లడించారు. ఈసారి ప్రాంతీయ పార్టీల వస్తువులకు సైతం డిమాండ్ పెరిగిందని మరో సెల్లర్ తెలిపారు. సమాజ్వాదీ పార్టీ లోగోతో కీచైన్లు, టీఎంసీ ఏసీ అడాప్టర్ నైట్ ల్యాంప్లు, సీపీఎం బానెట్ జెండాలకు ఆర్డర్లు వస్తున్నాయని చెప్పారు.
మరోవైపు ఒకప్పుడు దుకాణాల్లో మాత్రమే ఎలక్షన్లకు సంబంధించిన వస్తువులను విక్రయించిన వ్యాపారులు.. నెమ్మదిగా ఆన్లైన్ వైపు మళ్లుతున్నారు. గత దశాబ్దకాలంగా పరిస్థితి పూర్తిగా మారిందని.. ఆన్లైన్ ప్రచారానికి ప్రాధాన్యం పెరిగిన నేపథ్యంలో వస్తువులనూ ఆ వేదికగా అందుబాటులో ఉంచాల్సివస్తోందని వివరించారు. ఈనేపథ్యంలో ఆయా వస్తువులను ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లపై విక్రయిస్తున్నామని తెలిపారు. లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు విడతల్లో జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
3 ఏళ్లలో రూ.3,000 కోట్లు.. అపోలో హాస్పిటల్స్ పెట్టుబడులు!
వచ్చే మూడేళ్లలో రూ.3,000 కోట్ల పెట్టుబడులకు అపోలో హాస్పిటల్స్ సన్నాహాలు చేస్తోంది. అమెరికాకు చెందిన దిగ్గజ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్తో ఒప్పందం ఫలితంగా, వస్తున్న నిధులకు మరికొంత జతచేసి, సంస్థ విస్తరణ కార్యకలాపాలపై పెట్టుబడి పెట్టాలని అపోలో నిర్ణయించింది. -
కార్పొరేట్ ఫలితాలు.. అమెరికా వడ్డీరేట్లే కీలకం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈవారంలో వెలువడే పెద్ద కంపెనీల ఆర్థిక ఫలితాలకు తోడు, వడ్డీరేట్లపై బుధవారం వెల్లడయ్యే అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు మార్కెట్కు దిశానిర్దేశం చేయొచ్చంటున్నారు. -
అదానీకనెక్స్ రూ.11,520 కోట్ల రుణ సమీకరణ
అదానీ ఎంటర్ప్రైజెస్, ఎడ్జ్కనెక్స్ సంయుక్తంగా డేటా కేంద్రాల కోసం నెలకొల్పిన సంస్థ అదానీకనెక్స్ 1.44 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.11,520 కోట్ల) వరకు రుణం సమీకరించినట్లు ప్రకటించింది. -
బ్యాంకుల రుణవృద్ధి అంతంతే!
దేశంలో ఆర్థిక వృద్ధి బలంగా ఉన్నందున బ్యాంకుల లాభదాయకత, ఆస్తుల నాణ్యత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ పటిష్ఠంగా ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. -
చైనాలో ఎలాన్ మస్క్
అమెరికా విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హఠాత్తుగా చైనాలో పర్యటిస్తున్నారు. -
వెండిపై ఆచితూచి!
పసిడి జూన్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.72,462 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.72,944; రూ.73,425 వరకు రాణించే అవకాశం ఉంటుంది. -
74500 ఎగువన కొత్త గరిష్ఠాలకు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం దేశీయ సూచీలు లాభపడ్డాయి. బాండ్ రాబడులు పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు, చమురు ధరలు ప్రభావం చూపాయి. -
సంక్షిప్త వార్తలు
స్టాక్ మార్కెట్లు, బీమా కంపెనీలు, ఆన్లైన్ చెల్లింపు గేట్వే ఇంటర్మీడియర్లు, క్రిప్టో కరెన్సీ సేవల ప్రొవైడర్లకు భారత ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) తాజా హెచ్చరికలు జారీ చేసింది. -
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
SBI Credit Card: ఎస్బీఐ కార్డు విమాన ప్రయాణికుల కోసం మూడు ప్రత్యేక క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. వాటిలోని ప్రయోజనాలు, ఫీజుల వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..!