Elon Musk : ట్విటర్లో మరో మార్పు.. త్వరలో ‘డార్క్ మోడ్’ మాత్రమే ఉంటుందన్న మస్క్!
ట్విటర్లో (Twitter) రోజుకో మార్పు వస్తోంది. త్వరలో ఈ సామాజిక మాధ్యమాన్ని యూజర్లు కేవలం డార్క్ మోడ్లో (Dark mode) మాత్రమే చూడగలరు.
ఇంటర్నెట్ డెస్క్ : ట్విటర్ (ప్రస్తుతం ఎక్స్) అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) మరో మార్పునకు శ్రీకారం చుట్టబోతున్నారు. త్వరలో ‘ఎక్స్’ ప్లాట్ ఫామ్ (X platform) మొత్తాన్ని డార్క్మోడ్లో (Dark mode) చూడబోతున్నారని ఆయన ట్వీటర్లో తెలిపారు. ప్రస్తుతం సెట్టింగ్స్లోని డిస్ప్లే ఆప్షన్స్లో లైట్, డార్క్, డిమ్ మోడ్లు అందుబాటులో ఉన్నాయి. మస్క్ నిర్ణయం అమలైతే డార్క్ మాత్రమే మిగులుతుంది.
అమెజాన్ నుంచి ఫ్రీడమ్ సేల్.. తేదీలు, ఆఫర్లు ఇవే!
అపర కుబేరుడైన ఎలాన్ మస్క్ కొద్ది నెలల క్రితం ట్విటర్ను కొనుగోలు చేశారు. అప్పటి నుంచి అందులో మార్పులు, చేర్పులు చేస్తున్నారు. సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లకు ఉండే బ్లూ టిక్ను అకస్మాత్తుగా తొలగించారు. నెలకు ఇంత మొత్తం చెల్లిస్తే సామాన్యులకు సైతం ఆ ‘టిక్’ ఇస్తామని ప్రకటన చేశారు. ఆ తరువాత ట్వీట్లు చూడటానికి, చేయడానికి సైతం పరిమితి పెట్టారు. యూజర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కొంచెం వెనక్కి తగ్గారు. ట్విటర్లో ఇన్ని మార్పులు చేపట్టిన ఎలాన్ మస్క్ ఈ వారంలోనే దాని పేరును ‘ఎక్స్’గా మార్చారు. ట్విటర్ లోగోలో ఉన్న పిట్టను తొలగించి ‘ఎక్స్’ చేర్చారు. ఆ సందర్భంలో ట్విటర్ను త్వరలో ఓ సూపర్ యాప్గా అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. తాజాగా ‘ఈ ప్లాట్ ఫామ్ మొత్తం డార్క్ మోడ్లోకి మారబోతోంది. ఇది అన్ని విధాలుగా మంచిది’ అంటూ ట్విటర్లో వెల్లడించారు.
ఈ మార్పుపై ట్విటర్ యూజర్లు స్పందిస్తున్నారు. ‘నాకు కూడా నలుపు రంగు ఇష్టం. కానీ, డార్క్మోడ్ను వినియోగించడం అంతగా బాగోదని’ ఓ నెటిజన్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ‘ఎక్కువ మంది ఇష్టపడే ఎంపికను దూరం చేయడం మంచిది కాదు. ఇది ఉద్దేశపూర్వకంగా ప్రజలను ట్విటర్ నుంచి వెళ్లిపోయేలా చేస్తున్నట్లుందని’ ఓ నెటిజన్ అభిప్రాయపడ్డాడు. ‘ఇది భయంకరమైన నిర్ణయం. సూర్యరశ్మి, పరిసరాలు ప్రకాశవంతంగా ఉన్నప్పుడు డార్క్మోడ్లో చదవడం చాలా కష్టం. అనవసరంగా కళ్లపై ఒత్తిడి పడుతుంది. టెక్స్ట్ ఆధారిత ప్లాట్ఫామ్లో కేవలం డార్క్మోడ్ పెడితే భయంకరంగా ఉంటుంది. ఈ అర్థం లేని మార్పుపై పునరాలోచన చేయండి. ట్విటర్. క్షమించండి ఎక్స్’ అంటూ ఓ యూజర్ తన ఆవేదన వెలిబుచ్చాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ