Elon Musk: ట్విటర్లో మళ్లీ ఉద్యోగాల కోత.. ఈసారి ఎవరివంతంటే..!
ట్విటర్ (Twitter) ఉద్యోగాల్లో నవంబరు 2022 నుంచి కోతలు విధించబోనని చెప్పిన ఎలాన్ మస్క్ (Elon Musk).. ఆ తర్వాత రెండు సార్లు ఉద్యోగులపై వేటు వేశారు. తాజాగా మరోసారి ఉద్యోగాల్లో కోత విధించినట్లు తెలుస్తోంది.
ఇంటర్నెట్డెస్క్: ట్విటర్ (Twitter)ను ఎలాన్మస్క్ (Elon Musk) కొనుగోలు చేసిన నాటి నుంచి భారీగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అటు ఉన్నతస్థాయిలో ఉద్యోగులతోపాటు, దిగువస్థాయి సిబ్బందిలోనూ సమూలంగా మార్పులుచేర్పులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ సంస్థ సీఈవో పరాగ్ అగర్వాల్ (Parag Agarwal)ను ఇంటికి పంపించేసి.. సీఈవో బాధ్యతలను తాను తీసుకున్నారు. ఆయన ఒక్కరే కాదు చాలా మంది కీలక సభ్యులపైనా వేటు వేశారు. మరోవైపు కొందరు ఉద్యోగులను తొలగించడం (Lay off)తోపాటు మరికొందరి జీతాల్లో కోత విధించారు. నవంబరు 2022 తర్వాత ట్విటర్ ఉద్యోగాల్లో కోత విధించబోమంటూ చెప్పిన ఎలాన్ మస్క్.. ఆ అప్పటి నుంచి రెండు విడతలుగా ఉద్యోగులను తొలగించారు. తాజాగా వారం రోజుల క్రితం మరోసారి ఉద్యోగులపై వేటు పడినట్లు తెలుస్తోంది. ఈ సారి సేల్స్, ఇంజినీరింగ్ విభాగంలోని ఉద్యోగులు బాధితులుగా మారినట్లు సమాచారం.
అమెరికాకు చెందిన వర్జే న్యూస్వెబ్సైట్ వెల్లడించిన వివరాల ప్రకారం... గత వారం సేల్స్, ఇంజినీరింగ్ విభాగంలో పని చేస్తున్న ఉద్యోగులను తొలగించారు. దీనిపై కొందరు ఉద్యోగులు నేరుగా ఎలాన్ మస్క్కే ఫిర్యాదు చేశారు. సంస్థ ఆదేశాల మేరకు ట్విటర్ యాడ్స్ కోసం పని చేస్తున్నా తమను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నారని ఆయనతో మొరపెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ట్విటర్ యాడ్స్పై ఉద్యోగులు పూర్తి స్థాయిలో అధ్యయం చేసిన వారం రోజుల్లోగా సరైన పరిష్కారాన్ని కనుగొనాల్సిందిగా ఉద్యోగులపై ఎలాన్మస్క్ హుకుం జారీ చేసినట్లు వెబ్సైట్ పేర్కొంది. అయితే, తాజాగా ఉద్యోగుల్లో కోత విధించడానికి గల కారణాలేంటో మాత్రం స్పష్టంగా తెలియడం లేదు.
తాజా పరిస్థితులపై గతంలో ట్విటర్లో మానిటైజేషన్ మేనేజర్గా విధులు నిర్వహించిన మార్సిన్ కల్దుల్క్సా ట్విటర్ వేదికగా స్పందించారు. ట్విటర్ యాడ్స్కు ఓ పరిష్కారం కనుకొనాలంటే కనీసం రెండుమూడు నెలలు పడుతుందని, ఒక వారంలో చేయడం సాధ్యం కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. మరోవైపు ట్విటర్ యాడ్స్, మానిటైజేషన్ ఇన్ఫ్రాలో పని చేస్తున్న వారంతా ఎంతో అనుభవశీలురని పేర్కొంటూ, పరిస్థితులను చక్కదిద్దడంలో వారికున్న నైపుణ్యం, అనుభవం, దూరదృష్టి ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఉపయోగపడతాయన్నారు.
ఎలాన్మస్క్ క్షమాపణ
ట్విటర్లో అనసవరమైన, అభ్యంతరకరమైన ప్రకటనలు వస్తుండటంపై ఎలాన్ మస్క్ ఇటీవల యూజర్లకు క్షమాపణలు చెప్పారు. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు సత్వర చర్యలు తీసుకుంటానని అన్నారు. గూగుల్ సెర్చ్ మాదిరిగా ట్విటర్లోనూ యూజర్ టాపిక్స్, కీవర్డ్స్ ఆధారంగా ప్రకటనలు కనిపించేలా మార్పులు తీసుకొస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే ఉద్యోగులపై మరింత భారం పెడుతున్నట్లు తెలుస్తోంది. యాడ్స్ విషయంలోనే సంస్థ ప్రకటనల విభాగం మాజీ అధిపతి బ్రూస్ ప్లాక్, ఎలాన్ మస్క్ మధ్య ట్విటర్ వేదికగా ఇటీవల మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ‘మస్క్ ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు’ అంటూ బ్రూస్ఫ్లాక్ ట్వీట్ చేయగా.. ‘ మీరు చాలా మేధావి. అందుకే ట్విటర్ యాడ్స్ అత్యంత దుర్భర పరిస్థితులను ఎదుర్కొంది. ట్విటర్లో ప్రకటనలు చూసి దాదాపు ఎవరూ ఏమీ కొనడం లేదు’’ అంటే ఘాటుగా సమాధానమిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు