Elon Musk: ట్విటర్లో మళ్లీ ఉద్యోగాల కోత.. ఈసారి ఎవరివంతంటే..!
ట్విటర్ (Twitter) ఉద్యోగాల్లో నవంబరు 2022 నుంచి కోతలు విధించబోనని చెప్పిన ఎలాన్ మస్క్ (Elon Musk).. ఆ తర్వాత రెండు సార్లు ఉద్యోగులపై వేటు వేశారు. తాజాగా మరోసారి ఉద్యోగాల్లో కోత విధించినట్లు తెలుస్తోంది.
ఇంటర్నెట్డెస్క్: ట్విటర్ (Twitter)ను ఎలాన్మస్క్ (Elon Musk) కొనుగోలు చేసిన నాటి నుంచి భారీగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అటు ఉన్నతస్థాయిలో ఉద్యోగులతోపాటు, దిగువస్థాయి సిబ్బందిలోనూ సమూలంగా మార్పులుచేర్పులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ సంస్థ సీఈవో పరాగ్ అగర్వాల్ (Parag Agarwal)ను ఇంటికి పంపించేసి.. సీఈవో బాధ్యతలను తాను తీసుకున్నారు. ఆయన ఒక్కరే కాదు చాలా మంది కీలక సభ్యులపైనా వేటు వేశారు. మరోవైపు కొందరు ఉద్యోగులను తొలగించడం (Lay off)తోపాటు మరికొందరి జీతాల్లో కోత విధించారు. నవంబరు 2022 తర్వాత ట్విటర్ ఉద్యోగాల్లో కోత విధించబోమంటూ చెప్పిన ఎలాన్ మస్క్.. ఆ అప్పటి నుంచి రెండు విడతలుగా ఉద్యోగులను తొలగించారు. తాజాగా వారం రోజుల క్రితం మరోసారి ఉద్యోగులపై వేటు పడినట్లు తెలుస్తోంది. ఈ సారి సేల్స్, ఇంజినీరింగ్ విభాగంలోని ఉద్యోగులు బాధితులుగా మారినట్లు సమాచారం.
అమెరికాకు చెందిన వర్జే న్యూస్వెబ్సైట్ వెల్లడించిన వివరాల ప్రకారం... గత వారం సేల్స్, ఇంజినీరింగ్ విభాగంలో పని చేస్తున్న ఉద్యోగులను తొలగించారు. దీనిపై కొందరు ఉద్యోగులు నేరుగా ఎలాన్ మస్క్కే ఫిర్యాదు చేశారు. సంస్థ ఆదేశాల మేరకు ట్విటర్ యాడ్స్ కోసం పని చేస్తున్నా తమను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నారని ఆయనతో మొరపెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ట్విటర్ యాడ్స్పై ఉద్యోగులు పూర్తి స్థాయిలో అధ్యయం చేసిన వారం రోజుల్లోగా సరైన పరిష్కారాన్ని కనుగొనాల్సిందిగా ఉద్యోగులపై ఎలాన్మస్క్ హుకుం జారీ చేసినట్లు వెబ్సైట్ పేర్కొంది. అయితే, తాజాగా ఉద్యోగుల్లో కోత విధించడానికి గల కారణాలేంటో మాత్రం స్పష్టంగా తెలియడం లేదు.
తాజా పరిస్థితులపై గతంలో ట్విటర్లో మానిటైజేషన్ మేనేజర్గా విధులు నిర్వహించిన మార్సిన్ కల్దుల్క్సా ట్విటర్ వేదికగా స్పందించారు. ట్విటర్ యాడ్స్కు ఓ పరిష్కారం కనుకొనాలంటే కనీసం రెండుమూడు నెలలు పడుతుందని, ఒక వారంలో చేయడం సాధ్యం కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. మరోవైపు ట్విటర్ యాడ్స్, మానిటైజేషన్ ఇన్ఫ్రాలో పని చేస్తున్న వారంతా ఎంతో అనుభవశీలురని పేర్కొంటూ, పరిస్థితులను చక్కదిద్దడంలో వారికున్న నైపుణ్యం, అనుభవం, దూరదృష్టి ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఉపయోగపడతాయన్నారు.
ఎలాన్మస్క్ క్షమాపణ
ట్విటర్లో అనసవరమైన, అభ్యంతరకరమైన ప్రకటనలు వస్తుండటంపై ఎలాన్ మస్క్ ఇటీవల యూజర్లకు క్షమాపణలు చెప్పారు. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు సత్వర చర్యలు తీసుకుంటానని అన్నారు. గూగుల్ సెర్చ్ మాదిరిగా ట్విటర్లోనూ యూజర్ టాపిక్స్, కీవర్డ్స్ ఆధారంగా ప్రకటనలు కనిపించేలా మార్పులు తీసుకొస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే ఉద్యోగులపై మరింత భారం పెడుతున్నట్లు తెలుస్తోంది. యాడ్స్ విషయంలోనే సంస్థ ప్రకటనల విభాగం మాజీ అధిపతి బ్రూస్ ప్లాక్, ఎలాన్ మస్క్ మధ్య ట్విటర్ వేదికగా ఇటీవల మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ‘మస్క్ ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు’ అంటూ బ్రూస్ఫ్లాక్ ట్వీట్ చేయగా.. ‘ మీరు చాలా మేధావి. అందుకే ట్విటర్ యాడ్స్ అత్యంత దుర్భర పరిస్థితులను ఎదుర్కొంది. ట్విటర్లో ప్రకటనలు చూసి దాదాపు ఎవరూ ఏమీ కొనడం లేదు’’ అంటే ఘాటుగా సమాధానమిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
దీపికా పదుకొణెతో ఇంటిమేట్ సీన్స్.. భయాందోళనకు గురయ్యా: బాలీవుడ్ నటుడు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నెట్ఫ్లిక్స్కు నిరసన సెగ.. నెట్టింట్లో బాయ్కాట్ కాల్స్
-
బ్రోకర్లకు కమీషన్లు ఇచ్చి అధిక వడ్డీలకు వేల కోట్ల అప్పు తెస్తున్నారు : బండి సంజయ్
-
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
-
ఉనికి కోసమే దిల్లీలో జగన్ డ్రామాలు : కేశినేని చిన్ని