Elon Musk: ఎలాన్ మస్క్ను చూసి ఏడ్చేసిన తండ్రి.. ఏడేళ్ల తర్వాత ఇరువురి భేటీ
Elon Musk: ఇటీవల స్పేస్ఎక్స్ మెగా రాకెట్ స్టార్షిప్ ప్రయోగాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎలాన్ మస్క్ ఆయన తండ్రి ఎరాల్ మస్క్ను కలిశారు. దీంతో వారి కుటుంబంలో భావోద్వేగ క్షణాలు నెలకొన్నాయి.
టెక్సాస్: స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) కుటుంబంలో ఇటీవల భావోద్వేగ క్షణాలు నెలకొన్నాయి. దాదాపు ఏడేళ్ల తర్వాత ఆయన తన తండ్రి ఎరాల్ మస్క్ను కలవడమే ఇందుకు కారణం. టెక్సాస్ తీరం నుంచి గత శనివారం మెగా రాకెట్ ‘స్టార్షిప్’ ప్రయోగం జరిగిన విషయం తెలిసిందే. అది విఫలమైనప్పటికీ.. మస్క్ కుటుంబంలో మాత్రం ఆనందం నెలకొంది.
స్టార్షిప్ ప్రయోగానికి ఎలాన్ మస్క్ (Elon Musk) తన తండ్రి ఎరాల్ను కూడా ఆహ్వానించారని ‘ది సన్’ అనే పత్రిక పేర్కొంది. ఈ కార్యక్రమానికి ఎరాల్ తన మాజీ భార్య హైడ్, మనవరాలు కోరాతో కలిసి హాజరయ్యారు. ఎలాన్ను చూసి ఆయన తండ్రి ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నారని హైడ్ తెలిపారు. ఎలాన్ మస్క్ సైతం తండ్రిని చూసి చాలా సంతోషించారని పేర్కొన్నారు.
ఇరువురూ పక్కపక్కనే కూర్చొని చాలాసేపు ముచ్చటించుకున్నారని ‘ది సన్’కు హైడ్ తెలిపారు. ఈ దృశ్యాన్ని చూసి తాను, తన కూతుళ్లు చాలా సంతోషించామని పేర్కొన్నారు. తమ కుటుంబానికి ఇవి చాలా భావోద్వేగపూరితమైన క్షణాలని అన్నారు. వీఐపీ గ్యాలరీలో కూర్చొని మస్క్ (Elon Musk) కుటుంబం రాకెట్ ప్రయోగాన్ని వీక్షించింది. ఎంఆర్ఎన్ఏ పరిశోధన, ఆర్థోపెడిక్ సర్జరీ సంబంధిత అంశాలు, రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే ‘స్టాటిన్స్’ అనే ఔషధాల ముప్పు.. వంటి విషయాల గురించి ఇద్దరం చర్చించామని ఎరాల్ తనతో చెప్పారని హైడ్ తెలిపారు.
చివరిసారి ఎలాన్ మస్క్ (Elon Musk) ఆయన తండ్రిని 2016లో కలిశారు. సోదరుడు కింబల్ మస్క్తో కలిసి దక్షిణాఫ్రికాలోని కేప్టౌన్లో తండ్రి 70వ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఆ తర్వాత వారు కలవడం ఇదే. ఇరువురి మధ్య తీవ్రమైన అభిప్రాయభేదాలు ఉన్నట్లు ఇటీవల విడుదలైన ఎలాన్ మస్క్ జీవిత చరిత్ర పుస్తకంలో రచయిత ఐజాక్సన్ పేర్కొన్న విషయం తెలిసిందే.
మానవులను అంగారకుడు, చంద్రుడిపైకి పంపేందుకు స్పేస్ఎక్స్ సంస్థ మెగా రాకెట్ ‘స్టార్షిప్’ను రూపొందించింది. గత శనివారం జరిగిన రెండో ప్రయోగంలోనూ ఇది విఫలమైంది. నింగిలోకి పయనమైన 8 నిమిషాలకే ఈ రాకెట్తో సంబంధాలు తెగిపోయాయి. అనంతరం అది పేలిపోయింది. అయితే, విస్ఫోటానికి ముందు అది విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశించగలిగింది. అదొక్కటే ఊరట కలిగించే అంశం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
SBI Credit Card: ఎస్బీఐ కార్డు విమాన ప్రయాణికుల కోసం మూడు ప్రత్యేక క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. వాటిలోని ప్రయోజనాలు, ఫీజుల వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..! -
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
Elon Musk: దాదాపు వారం క్రితం ఎలాన్ మస్క్ భారత పర్యటనను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఆకస్మికంగా చైనాలో పర్యటిస్తున్నట్లు సంబంధిత వ్యక్తులు తెలిపారు. -
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
BSNL Cinemaplus: బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ పేరిట ఓటీటీ ప్యాకేజీలను అందిస్తోంది. దీంట్లో మొత్తం మూడు ప్యాక్లు ఉన్నాయి. తాజాగా స్టార్టర్ ప్యాక్ ధరను సంస్థ కుదించింది. -
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
వేసవిలో స్మార్ట్ఫోన్ ఛార్జింగ్లో వేగం మందగిస్తుంది. దీనికి కారణమేంటి? ఎందుకు వేగం తగ్గుతుంది? -
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
-
అత్యాచారం చేసి.. కాల్చిన ఇనుప రాడ్డుతో ముఖంపై పేరు రాసి..
-
శెభాష్ గుకేశ్.. ₹75 లక్షలు అందజేసిన సీఎం స్టాలిన్
-
బంగ్లాతో తొలి టీ20.. భారత్ ఘన విజయం