Elon Musk: రిలాక్స్ అయ్యేందుకు ఎలాన్ మస్క్ ఏం చేస్తారో తెలుసా?
Elon Musk: వివిధ కంపెనీలను నిర్వహిస్తున్న బిలియనీర్ ఎలాన్ మస్క్పై ఎంత ఒత్తిడి ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. అయితే, దాన్ని అధిగమించడం కోసం ఆయన ఏం చేస్తారో ఇటీవల ఓ పాడ్కాస్ట్లో స్వయంగా వెల్లడించారు.
ఇంటర్నెట్ డెస్క్: చిన్న ఉద్యోగంలోనూ ఎంతో కొంత ఒత్తిడి ఉంటుంది. అలాగే వ్యాపారంలోనూ అంతే. ఇక పెద్ద కంపెనీలను ముందుకు నడిపే వ్యక్తులపై ఎన్ని బరువు బాధ్యతలు ఉంటాయో చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ఎంత ఒత్తిడి ఉన్నా.. ఏదో మార్గంలో రిలాక్స్ అయ్యి మానసిక ప్రశాంతతను పొందడం చాలా ముఖ్యం. లేదంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ దెబ్బతిని అది చివరకు ఆరోగ్యంపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది. మరి టెస్లా, ఎక్స్, న్యూరాలింక్, స్టార్లింక్.. ఇలా దాదాపు ఓ పది కంపెనీలను నిర్వహిస్తున్న బిలియనీర్ ఎలాన్ మస్క్ (Elon Musk) ఒత్తిడిని ఎలా అధిగమిస్తారు? ఇటీవల ఆయన ఓ పాడ్కాస్ట్లో స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అదేంటో చూద్దాం..
తన మైండ్ ఓ తుపానులా ఉంటుందని మస్క్ (Elon Musk) చెప్పారు. పరోక్షంగా అనేక విషయాలపై తాను ఫోకస్ చేయాల్సి ఉంటుందని.. అంతా గందరగోళంగా అనిపిస్తుందని వెల్లడించారు. చాలా మంది తనలా ఉండాలనుకుంటారని.. కానీ, అది అంత సులభం కాదని వివరించారు. తనలా ఉండడం అంటే ఏంటో అర్థం చేసుకోలేనివారే అలా అనుకుంటారని వ్యాఖ్యానించారు. అయితే, ఒత్తిడి నుంచి బయటపడేందుకు తాను వీడియో గేమ్స్ ఆడతానని వెల్లడించారు. వాటిలోని వర్చువల్ ఛాలెంజెస్ను ఎదుర్కోవడం ద్వారా తన ఆలోచనల్లో ఉండే గందరగోళాన్ని సమర్థంగా పరిష్కరించే సామర్థ్యం వస్తుందని వివరించారు. వినోదం కోసం ఇప్పటి వరకు చాలా వీడియో గేమ్స్ ఆడానని తెలిపారు.
మస్క్కు వీడియో గేమ్స్ ఆడడం తప్ప మరో హాబీ లేదని ఆయనతో కలిసి ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన గ్రైమ్స్ ఓ సందర్భంలో వెల్లడించారు. అవే ఆయనకు విశ్రాంతినిస్తాయని తెలిపారు. అయితే, వాటిని కూడా మస్క్ చాలా సీరియస్గా ఆడతారని వివరించారు. మస్క్ ఫేవరెట్ వీడియో గేమ్ ‘ది బ్యాటిల్ ఆఫ్ పాలిటోపియా’ అని ఆయన సోదరుడు కింబల్ మస్క్ (Elon Musk) గతంలో ఓ సందర్భంలో వెల్లడించారు. ఇది ఒక నాగరికతను నిర్మించడం, యుద్ధానికి వెళ్లడం గురించిన వ్యూహాత్మక గేమ్ అని తెలిపారు. ఒక సీఈఓకు కావాల్సిన నైపుణ్యాలను నేర్చుకునేందుకు ఈ గేమ్ను మస్క్ ఓ సాధనంగా భావిస్తారని పేర్కొన్నారు.
మస్క్ (Elon Musk) ఇష్టపడే మరో వీడియో గేమ్ ‘ఎల్డెన్ రింగ్’. యుద్ధంపై దృష్టి సారించడం, రాజ్యాన్ని నిర్మించడమే ఈ గేమ్ లక్ష్యం. దీన్ని మస్క్ అత్యుత్తమైన గేమ్గా అభివర్ణించారు. జీవితంతో పాటు వీడియో గేమ్లో అంతర్గత శత్రుత్వాన్ని జయించడం అత్యంత సవాల్తో కూడుకున్న అంశమని తాజా పాడ్కాస్ట్లో వివరించారు. తన మెదడును ఒక నిర్దిష్ట స్థితికి తీసుకెళ్లడానికి వీడియో గేమ్స్ను సాధనంగా వాడతానని మస్క్ వెల్లడించారు. కఠినమైన గేమ్ను ఆడడం వల్ల మెదడు స్థితి ఒక స్థాయికి చేరుతుందని తెలిపారు. గేమ్లో ముందుకు వెళుతున్న కొద్దీ పురోగతి సాధిస్తున్న ఫీలింగ్ కలుగుతుందని.. అలాగే దాంట్లో గొప్ప కళ దాగి ఉంటుందని.. అద్భుతమైన పజిల్ను పరిష్కరించినట్లు అవుతుందని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
పేటలో ఒకసారి ఓడిన వారికి చోటులేనట్లే!
-
కిమ్ను తలదన్నే జగన్ సర్కారు... కిమ్మనకూడదు జనం నోరు..!
-
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
-
కాలేయానికి అధిక కొవ్వు ముప్పు.. వర్క్ ఫ్రం హోం తర్వాత పెరిగిన కేసులు
-
‘అమ్మో జగన్ బొమ్మా’ళీ.. అడ్డగోలుగా ఫైబర్నెట్ ధరల పెంపు!
-
అన్నకు నచ్చని తమ్ముడి పెళ్లి.. యువతి అమ్మమ్మ ఇంటికి నిప్పుపెట్టిన ప్రబుద్ధుడు