Elon Musk: ‘పోతే పోండి.. బెదిరించొద్దు’.. అడ్వర్టైజర్లపై మస్క్ ఆగ్రహం!
Elon Musk | యూదు వ్యతిరేక పోస్ట్నకు మద్దతు తెలిపినందుకు మస్క్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని కంపెనీలు ఎక్స్లో వాణిజ్య ప్రకటనలను నిలిపివేశాయి. దీనిపై మస్క్ తాజాగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
న్యూయార్క్: తమ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’పై (Social Media X) వాణిజ్య ప్రకటనలను నిలిపివేసిన కంపెనీలపై ఎలాన్ మస్క్ (Elon Musk) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాను చేసిన కొన్ని వ్యాఖ్యలను సాకుగా చూపించి బెదిరింపులకు పాల్పడుతున్నారని అభిప్రాయపడ్డారు. అలాంటి వారి ప్రకటనలు తమకు అవసరం లేదని.. వెళ్లానుకునేవారు వెళ్లొచ్చని కఠినంగా వ్యాఖ్యానించారు.
మరోవైపు ఇటీవల ‘ఎక్స్’లో ఓ యూదు వ్యతిరేక పోస్టుకు మద్దతునిచ్చినందుకు మస్క్ (Elon Musk) తాజాగా క్షమాపణలు చెప్పారు. న్యూయార్క్ టైమ్స్ డీల్బుక్ సమ్మిట్లో బుధవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటి వరకు చేసిన మెసేజ్లలో ఇదే అత్యంత దారుణమైన పోస్ట్ అని తెలిపారు. ‘ఎక్స్’ నుంచి వాణిజ్య ప్రకటనలను ఉపసంహరించుకోవాలని చూస్తున్న వారికి ఇది ఆయుధంగా మారిందని పేర్కొన్నారు. అయితే, తాను (Elon Musk) యూదు వ్యతిరేకినని ప్రచారం చేస్తూ బెదిరించాలనుకోవద్దని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యల సందర్భంలో ఆయన ఓ అభ్యంతరకర పదాన్ని పలుసార్లు ఉపయోగించారు. అలాగే ‘ఎక్స్’కు వాణిజ్య ప్రకటనలను నిలిపివేసిన కంపెనీల జాబితాలో ఉన్న వాల్ట్ డిస్నీ సీఈఓ బాబ్ ఇగర్ పేరును నేరుగా ప్రస్తావించారు.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో ‘గ్రేట్ రీప్లేస్మెంట్’ పేరిట సామాజిక మాధ్యమాల్లో ఓ యూదు వ్యతిరేక ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. వామపక్షవాదులు, యూదులు కలిసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్వేతజాతి వ్యతిరేక ఉద్యమాన్ని నడుపుతున్నారన్నది ‘గ్రేట్ రీప్లేస్మెంట్’ సారాంశం. దీన్ని ఆధారం చేసుకొని ఇటీవల ఓ వ్యక్తి ‘ఎక్స్’లో యూదు వ్యతిరేక పోస్ట్ చేశారు. దీనికి మస్క్ (Elon Musk) మద్దతు తెలిపారు.
నాటి నుంచి మస్క్ (Elon Musk)పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం ఇజ్రాయెల్లో ఆయన పర్యటించారు. ఆ దేశ ప్రధాని నెతన్యాహుతో చర్చలు జరిపారు. హమాస్ చేతిలో బందీలుగా ఉన్నవారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. యూదు విద్వేష భావజాలానికి తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు. మస్క్ చేసిన ఈ పోస్ట్ తర్వాతే వాల్ట్ డిస్నీ, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ, ఎన్బీసీయూనివర్సల్ వంటి కంపెనీలు ఎక్స్లో వాణిజ్య ప్రకటనలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏటీఎంలో కార్డు ఇరుక్కుపోయిందా?.. ఇదో కొత్త స్కామ్!
ATM Scam: ఎప్పటికప్పుడు దుండగులు కొత్త రకం స్కామ్లకు తెరతీస్తున్నారు. తాజాగా ఏటీఎం మెషీన్లోని కార్డు రీడర్ను తొలగించి మోసాలకు పాల్పడుతున్నారు. -
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,652
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 135 పాయింట్ల లాభంతో 74,618 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 47 పాయింట్లు పెరిగి 22,652 దగ్గర కొనసాగుతోంది. -
గోద్రేజ్ విభజన షేర్ల బదిలీతోనే.. ముంబయిలోని 3400 ఎకరాలు జెంషెడ్ వర్గానికి..
దేశంలోనే దిగ్గజ గ్రూప్లలో ఒకటిగా ఉండి, 127 ఏళ్ల ఘన చరిత్ర గల గోద్రేజ్ గ్రూప్ రెండుగా విడిపోవడం కార్పొరేట్ ప్రపంచంలో ఆసక్తిని పెంచుతోంది. -
వసూళ్లలో జైఎస్టీ (జీఎస్టీ)
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు తొలిసారిగా రూ.2 లక్షల కోట్ల మైలురాయిని తాకాయి. ఈ ఏడాది ఏప్రిల్లో ఇవి రూ.2.10 లక్షల కోట్లకు చేరాయి. 2023 ఏప్రిల్ నాటి రూ.1.87 లక్షల కోట్లతో పోలిస్తే, ఇవి 12.4% అధికం. -
వాహన దూకుడుకు ఎన్నికల ఆంక్షల పగ్గం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి నెల (ఏప్రిల్)లో టోకుగా 3.38 లక్షల ప్రయాణికుల వాహన (పీవీ) విక్రయాలు నమోదయ్యాయి. -
ఇళ్లపై పెట్టుబడులు మూడింతలు
ఈ ఏడాది జనవరి- మార్చి త్రైమాసికంలో గృహాల విభాగంలో పెట్టుబడులు మూడు రెట్లకు పైగా పెరిగి రూ.5,743 కోట్లకు చేరాయని స్థిరాస్తి కన్సల్టంట్ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ తాజా నివేదికలో వెల్లడించింది. -
జిందాల్ స్టెయిన్లెస్ రూ.5,400 కోట్ల పెట్టుబడులు
జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్ (జేఎస్ఎల్) వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 4.2 మిలియన్ టన్నులకు విస్తరించేందుకు రూ.5,400 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు కంపెనీ ఎండీ అభ్యుదయ్ జిందాల్ బుధవారం వెల్లడించారు. -
ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ 8 నుంచి 10 వరకు
ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం బ్లాక్స్టోన్ పెట్టుబడులున్న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ఈ నెల 8న ప్రారంభమై 10న ముగియనుంది. -
బేబీ పౌడర్తో క్యాన్సర్ ఆరోపణలు!
జాన్సన్ అండ్ జాన్సన్ (జే అండ్ జే)కు చెందిన అనుబంధ కంపెనీ తయారు చేస్తున్న బేబీ పౌడర్లోని టాల్కమ్ వల్ల అండాశయ క్యాన్సర్ రావొచ్చన్న ఆరోపణలను సెటిల్ చేసుకోవడానికి 25 ఏళ్లలో 6.48 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.54,000 కోట్లు) కట్టడానికి ఆ సంస్థ సిద్ధమైంది. -
లీజుదార్ల చేతికి గోఫస్ట్ 54 విమానాలు
విమానయాన సంస్థ గోఫస్ట్కు అద్దె (లీజ్) పద్ధతిలో ఇచ్చిన 54 విమానాలను వెనక్కి తీసుకునేందుకు లీజుదార్లకు కోర్టు అనుమతించిన నేపథ్యంలో, పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) వాటిని డీరిజిస్టర్ చేసింది. -
అదానీ పవర్ లాభంలో 48% క్షీణత
వ్యయాలు పెరగడంతో ఆర్థిక ఫలితాల్లో అదానీ పవర్ రాణించలేకపోయింది. మార్చి త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.2,737.24 కోట్లకు పరిమితమైంది. -
అదానీ విల్మర్ లాభంలో 67% వృద్ధి
ఫార్చ్యూన్ బ్రాండ్పై నూనెలు, ఇతర ఆహార ఉత్పత్తులు విక్రయించే ఎఫ్ఎమ్సీజీ సంస్థ అదానీ విల్మర్.. జనవరి- మార్చిలో రూ.156.75 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. -
మన్పసంద్పై సెబీ ఆంక్షలు
2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాల గణాంకాల్లో అవకతవకలు వెలుగు చూడటం, వాటిని తప్పుగా వెల్లడించినందుకు గాను మన్పసంద్ బేవరేజెస్, ఆ కంపెనీకి చెందిన ముగ్గురు ఉన్నతాధికారులను మూడేళ్ల పాటు సెక్యూరిటీస్ మార్కెట్లలో పాల్గొనకుండా సెబీ నిషేధం విధించింది. -
సంక్షిప్త వార్తలు(7)
అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్కు (ఏపీఎస్ఈజెడ్) ‘ఏఏఏ’ రేటింగ్ను కేర్ రేటింగ్స్ ఇచ్చింది. తద్వారా ఈ రేటింగ్ పొందిన తొలి దిగ్గజ ప్రైవేట్ మౌలిక రంగ సంస్థగా నిలిచినట్లు ఏపీఎస్ఈజెడ్ తెలిపింది. -
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
WhatsApp: ప్రముఖ మేసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సప్ భద్రతాపరంగా కొత్త ఫీచర్ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. తెలియని వ్యక్తుల ఖాతాల నుంచి మెసేజ్లు రాకుండా తాత్కాలికంగా అడ్డుకోనుంది. -
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
కార్పొరేట్ ప్రపంచంలో మరో కొత్త ట్రెండ్ ప్రారంభమైంది. అదే ఆఫీస్ పికాకింగ్. ఇంతకీ ఏమిటిది? ఎలా ప్రాచుర్యంలోకి వచ్చింది? -
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
బాంబే షేవింగ్ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ శంతను దేశ్పాండే సొంతిటిని కొనుగోలు చేయడం కంటే అద్దెంట్లో ఉండటమే బెటర్ అంటూ తన అభిప్రాయాన్ని ఓ పాడ్కాస్ట్లో తెలిపారు. -
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడాలనుకునే వారి కోసం గూగుల్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. దీంతో ఇంగ్లిష్లో స్పీకింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు.
తాజా వార్తలు (Latest News)
-
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
-
దిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. మహిళా కమిషన్లో 223 మంది తొలగింపు
-
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
-
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
-
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
-
భానుడి ప్రతాపం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్నెట్స్..