Elon Musk: ఎలాన్ మస్క్ను చంపేస్తారేమో.. తండ్రి ఆందోళన!
Elon Musk: ఎలాన్ మస్క్ అమెరికా ప్రభుత్వ నిర్ణయాల్లో తీవ్ర ప్రభావం చూపుతున్నారంటూ ‘న్యూ యార్కర్’ ఓ కథనాన్ని ప్రచురించింది. దీనిపై మస్క్ తండ్రి ఆందోళన వ్యక్తం చేశారు. తన కొడుకుని చంపేస్తారేమోనని భయమేస్తోందన్నారు.
వాషింగ్టన్: టెస్లా, ఎక్స్ (ట్విటర్) అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ (Elon Musk)ను చంపేస్తారేమోనంటూ స్వయంగా ఆయన తండ్రి ఎరాల్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాన్ మస్క్ (Elon Musk) అమెరికా ప్రభుత్వ నిర్ణయాలను పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తున్నారంటూ ‘ది న్యూ యార్కర్’ ప్రచురించిన ఓ కథనాన్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ది న్యూ యార్కర్ ‘ఎలాన్ మస్క్ షాడో రూల్’ పేరిట ఓ కథనాన్ని ప్రచురించింది. అంతరిక్షం, ఉక్రెయిన్, సామాజిక మాధ్యమాలు, విద్యుత్ వాహనాల వంటి అంశాల్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై మస్క్ పెద్ద ఎత్తున ప్రభావం చూపుతున్నారని పేర్కొంది. ఉక్రెయిన్ యుద్ధంలో మస్క్ స్టార్లింక్ ఉపగ్రహ సేవలు ఎంత కీలకంగా వ్యవహరించాయో కూడా పత్రిక ఉటంకించింది. మరోవైపు ‘విదేశాలతో మస్క్ సంబంధాలను పరిశీలించాల్సి ఉంది’ అంటూ ట్విటర్ కొనుగోలు సమయంలో అధ్యక్షుడు బైడెన్ చేసిన వ్యాఖ్యలనూ న్యూ యార్కర్ ఈ సందర్భంగా గుర్తు చేసింది.
ఈ కథనాన్ని ఉద్దేశిస్తూ.. ఇది ఎలాన్ మస్క్పై దాడే అని ఎరాల్ ‘ది సన్’ మీడియాతో మాట్లాడుతూ ఎరాల్ అన్నారు. ‘‘షాడో ప్రభుత్వ’’ మద్దతుతోనే ఇది జరుగుతోందని ఆరోపించారు. ‘‘ఈ షాడో ప్రభుత్వమే ఎలాన్ మస్క్ను అంతం చేస్తుందని మీరు భయపడుతున్నారా?’’ అని అడిగిన ప్రశ్నకు ఆయన ‘‘అవును’’ అని సమాధానమివ్వడం గమనార్హం. ట్విటర్ కొనుగోలు విషయంలో మస్క్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అలాగే ఈ సామాజిక మాధ్యమ వేదికపై విద్వేషపూరిత సందేశాలను అనుమతిస్తున్నారన్న ఆరోపణలూ ఎదుర్కొన్నారు.
మరోవైపు ఉక్రెయిన్కు స్టార్లింక్ సేవలను అందించడంపై రష్యా స్పేస్ ఏజెన్సీ చీఫ్ దిమిత్రి రోగోజిన్.. మస్క్ను కొన్ని నెలల క్రితం బెదిరించిన విషయం తెలిసిందే. దీన్ని అప్పట్లో మస్క్ చాలా తేలిగ్గా తీసుకున్నారు. అయితే, కొన్ని నెలల తర్వాత రోగోజిన్ను రష్యా అధ్యక్షుడు పుతిన్ తొలగించడం గమనార్హం. మరోవైపు మస్క్ నిత్యం అంగరక్షకుల పర్యవేక్షణలో ఉంటున్నారని ఎక్స్ ఉద్యోగులు కొన్ని నెలల క్రితం ఓ ప్రధాన మీడియా సంస్థతో అన్నారు. బహుశా కంపెనీలో ఉద్యోగుల తొలగింపులు, కీలక మార్పుల నేపథ్యంలో ఆయనకు ఇది తప్పడం లేదోమోనని వారు అప్పట్లో వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?