Elon Musk: ఎలాన్ మస్క్ను చంపేస్తారేమో.. తండ్రి ఆందోళన!
Elon Musk: ఎలాన్ మస్క్ అమెరికా ప్రభుత్వ నిర్ణయాల్లో తీవ్ర ప్రభావం చూపుతున్నారంటూ ‘న్యూ యార్కర్’ ఓ కథనాన్ని ప్రచురించింది. దీనిపై మస్క్ తండ్రి ఆందోళన వ్యక్తం చేశారు. తన కొడుకుని చంపేస్తారేమోనని భయమేస్తోందన్నారు.
వాషింగ్టన్: టెస్లా, ఎక్స్ (ట్విటర్) అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ (Elon Musk)ను చంపేస్తారేమోనంటూ స్వయంగా ఆయన తండ్రి ఎరాల్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాన్ మస్క్ (Elon Musk) అమెరికా ప్రభుత్వ నిర్ణయాలను పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తున్నారంటూ ‘ది న్యూ యార్కర్’ ప్రచురించిన ఓ కథనాన్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ది న్యూ యార్కర్ ‘ఎలాన్ మస్క్ షాడో రూల్’ పేరిట ఓ కథనాన్ని ప్రచురించింది. అంతరిక్షం, ఉక్రెయిన్, సామాజిక మాధ్యమాలు, విద్యుత్ వాహనాల వంటి అంశాల్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై మస్క్ పెద్ద ఎత్తున ప్రభావం చూపుతున్నారని పేర్కొంది. ఉక్రెయిన్ యుద్ధంలో మస్క్ స్టార్లింక్ ఉపగ్రహ సేవలు ఎంత కీలకంగా వ్యవహరించాయో కూడా పత్రిక ఉటంకించింది. మరోవైపు ‘విదేశాలతో మస్క్ సంబంధాలను పరిశీలించాల్సి ఉంది’ అంటూ ట్విటర్ కొనుగోలు సమయంలో అధ్యక్షుడు బైడెన్ చేసిన వ్యాఖ్యలనూ న్యూ యార్కర్ ఈ సందర్భంగా గుర్తు చేసింది.
ఈ కథనాన్ని ఉద్దేశిస్తూ.. ఇది ఎలాన్ మస్క్పై దాడే అని ఎరాల్ ‘ది సన్’ మీడియాతో మాట్లాడుతూ ఎరాల్ అన్నారు. ‘‘షాడో ప్రభుత్వ’’ మద్దతుతోనే ఇది జరుగుతోందని ఆరోపించారు. ‘‘ఈ షాడో ప్రభుత్వమే ఎలాన్ మస్క్ను అంతం చేస్తుందని మీరు భయపడుతున్నారా?’’ అని అడిగిన ప్రశ్నకు ఆయన ‘‘అవును’’ అని సమాధానమివ్వడం గమనార్హం. ట్విటర్ కొనుగోలు విషయంలో మస్క్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అలాగే ఈ సామాజిక మాధ్యమ వేదికపై విద్వేషపూరిత సందేశాలను అనుమతిస్తున్నారన్న ఆరోపణలూ ఎదుర్కొన్నారు.
మరోవైపు ఉక్రెయిన్కు స్టార్లింక్ సేవలను అందించడంపై రష్యా స్పేస్ ఏజెన్సీ చీఫ్ దిమిత్రి రోగోజిన్.. మస్క్ను కొన్ని నెలల క్రితం బెదిరించిన విషయం తెలిసిందే. దీన్ని అప్పట్లో మస్క్ చాలా తేలిగ్గా తీసుకున్నారు. అయితే, కొన్ని నెలల తర్వాత రోగోజిన్ను రష్యా అధ్యక్షుడు పుతిన్ తొలగించడం గమనార్హం. మరోవైపు మస్క్ నిత్యం అంగరక్షకుల పర్యవేక్షణలో ఉంటున్నారని ఎక్స్ ఉద్యోగులు కొన్ని నెలల క్రితం ఓ ప్రధాన మీడియా సంస్థతో అన్నారు. బహుశా కంపెనీలో ఉద్యోగుల తొలగింపులు, కీలక మార్పుల నేపథ్యంలో ఆయనకు ఇది తప్పడం లేదోమోనని వారు అప్పట్లో వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
అన్నకు నచ్చని తమ్ముడి పెళ్లి.. యువతి అమ్మమ్మ ఇంటికి నిప్పుపెట్టిన ప్రబుద్ధుడు
-
ఆసుపత్రికెళ్తే.. విసనకర్ర, కొవ్వొత్తి తీసుకెళ్లాల్సిందే!
-
‘మా అమ్మాయికి కాళ్లే చచ్చుబడ్డాయి.. ఏపీలో వ్యవస్థే చచ్చుబడింది’
-
ఒక్క ఫోటో .. నాలుగేళ్ల కష్టం
-
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
-
పెళ్లి శుభలేఖపై పెంపుడు శునకాల పేర్లు