Budget 2023: డిజిలాకర్ విస్తరణ..ఇక చిటికెలో కేవైసీ సేవలు..!
డిజిలాకర్ (digilocker services) సేవలను ఫిన్టెక్ సర్వీసులు, చిన్న, మధ్యతరహా పరిశ్రమ వర్గాలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
ఇంటర్నెట్డెస్క్: ప్రభుత్వం అందించే వివిధ రకాల సేవలకు ప్రజలను చేరువ చేసేందుకు కేంద్రం ఇప్పటికే ఎన్నో చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా పలు రకాల సేవలను డిజిటల్ రూపంలో అందించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో పౌరులకు విస్తృతంగా సేవలను అందిస్తున్న డిజిలాకర్ (digilocker services)ను ఫిన్టెక్ సర్వీసులు, చిన్న, మధ్యతరహా పరిశ్రమ వర్గాలకు కూడా అందుబాటులోకి తీసుకురానుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో కీలక ప్రకటన చేశారు.
‘‘ఫిన్టెక్ సర్వీసుల కోసం కేవైసీ (KYC) (నో యువర్ కస్టమర్) సేవలు మరింత సరళతరం చేయనున్నాం. ఇందులో భాగంగా ఆర్థిక సేవలు అందించే సంస్థలకు ఆధార్, పీఎం జన్ధన్ యోజన, వీడియో కేవైసీ, ఇండియా స్టేక్, యూపీఐ వివరాలను డిజిలాకర్లో అందుబాటులో ఉంచుతాం. దీని ద్వారా ఆర్థిక సేవలు మరింత త్వరగా పౌరులకు అందుతాయి’’ అని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అయితే, కేవైసీ వివరాలు బయటకు పొక్కకుండా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన బాధ్యత సదరు సంస్థలకు ఉంటుంది. వాటి భద్రతకు ఆయా సంస్థలే బాధ్యత వహించాలి. డిజిలాకర్ వినియోగంతో ఆర్థిక సేవలకు సంబంధించిన వ్యవహారాలు మరింత సులభంగా జరిగిపోతాయి. అటు ఆర్థిక సంస్థల, ఇటు వినియోగదారుల సమయం ఆదా అవుతుంది.
‘‘చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, పెద్ద వ్యాపారాలు, స్వచ్ఛంద సంస్థల అవసరాలకు అనుగుణంగా డిజిలాకర్ సేవలు అందుబాటులోకి తెస్తాం. దీని వల్ల అధికార వర్గాలు, నియంత్రణా సంస్థలు, బ్యాంకులు, వ్యాపార నిర్వాహకులు తమకు అవసరమైన సేవలను దాని ద్వారా పొందవచ్చు’’
ప్రభుత్వ గణాంకాల ప్రకారం 14.6కోట్ల మందికి పైగా ప్రజలు డిజిలాకర్ సేవలు పొందుతున్నారు. ముఖ్యంగా ఆధార్, పాలసీ డాక్యుమెంట్లు, పాన్ కార్డ్, ధ్రువీకరణ పత్రాలు, బీమా పాలసీలు ఇలా అనేక ముఖ్య పత్రాలు డిజిలాకర్లో అందుబాటులో ఉంటున్నాయి. తాజా నిర్ణయం ద్వారా డిజిటల్ ఇండియా దిశగా ప్రభుత్వం అడుగులు వేసినట్లైంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ఎక్స్లెన్స్ కేంద్రాలు
‘మేక్ ఏఐ ఇన్ ఇండియా, మేక్ ఏఐ వర్క్ ఫర్ ఇండియా’ విజన్ను సాకారం చేయడం కోసం, అగ్రశ్రేణి విద్యా సంస్థల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం మూడు ఎక్స్లెన్స్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.
5జీ అప్లికేషన్ల తయారీకి ఇంజినీరింగ్ సంస్థల్లో 100 ప్రయోగశాలలు ఏర్పాటు చేయటంతో పాటు, స్టార్టప్లకు ప్రత్యేక ప్రోత్సాహం అందించడం ద్వారా రిస్క్ తగ్గించేందుకు కృషి చేయనున్నట్లు ఆర్థిక మంత్రి వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4 లక్షల స్కూటర్లు రీకాల్ చేసిన సుజుకీ.. ఇందులో మీ మోడల్ ఉందా?
Suzuki Motorcycle: సుజుకీ కంపెనీ దాదాపు 4 లక్షల వాహనాలను రీకాల్ చేసింది. ఆయా వాహనాల్లో ఉన్న లోపాన్ని గుర్తించి ఈ రీకాల్ చేపట్టింది. -
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..