EPFO interest rate: ఈపీఎఫ్ వడ్డీ రేట్లపై త్వరలో నిర్ణయం
EPFO interest rate: పీఎఫ్ చందాదారుల నగదు నిల్వలపై ఇచ్చే వడ్డీని త్వరలో నిర్ణయించనున్నారు. మార్చి 25, 26 తేదీల్లో జరిగే సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: ఉద్యోగ భవిష్యత్ నిధి సంస్థ (EPFO) అత్యున్నత నిర్ణయాక మండలి సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీల (CBDT) సమావేశం త్వరలో జరగనుంది. మార్చి 25, 26 తేదీల్లో నిర్వహించాలని ఈపీఎఫ్వో నిర్ణయించింది. ఈ మేరకు బోర్డు సభ్యులకు ఇప్పటికే సమావేశం అందించింది. అయితే, ట్రస్టీల సమావేశం ప్రదేశం, ఎజెండా వివరాలు తెలియరాలేదు. ఈ సమావేశంలో ప్రధానంగా రెండు అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022-23) సంబంధించిన వడ్డీ రేటుతో పాటు, అధిక పింఛను అంశాలు ఈ సమావేశంలో చర్చించనున్నారు.
గత ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును 8.1 శాతంగా ఈపీఎఫ్వో నిర్ణయించింది. గత నాలుగు దశాబ్దాలకు పైగా కాలంలో పీఎఫ్పై ఇదే అత్యల్ప వడ్డీ రేటు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో జరిగే సమావేశంలో వడ్డీ రేట్లను 8 శాతం కంటే తగ్గించకపోవచ్చన్న అంచనాలు ఉన్నాయి. రెపో రేటు పెరిగిన కారణంగా ఇప్పటికే ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో వడ్డీ రేట్లు తగ్గించకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. బోర్డు తీసుకోబోయే నిర్ణయంపై 6 కోట్ల మంది చందాదారులు వడ్డీ రేటుపై ఆసక్తిగా ఉన్నారు.
మరోవైపు అధిక పింఛనుపై గతేడాది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అంశంపై వాడీవేడి చర్చ జరిగే అవకాశం ఉంది. ఇటీవల అధిక పింఛన్కు సంబంధించిన వెబ్లింక్ ఆప్షన్ ఇచ్చిన ఈపీఎఫ్వో.. 26 (6) నిబంధన పేరుతో ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలని చూస్తోందని విమర్శలు వినవస్తున్నాయి. ఈ క్రమంలో ఈపీఎఫ్వో షరతులను తీవ్రంగా వ్యతిరేకించాలని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. ఇందుకు ఈ సమావేశం వేదిక అయ్యే అవకాశముంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నెట్ఫ్లిక్స్కు నిరసన సెగ.. నెట్టింట్లో బాయ్కాట్ కాల్స్
-
బ్రోకర్లకు కమీషన్లు ఇచ్చి అధిక వడ్డీలకు వేల కోట్ల అప్పు తెస్తున్నారు : బండి సంజయ్
-
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
-
ఉనికి కోసమే దిల్లీలో జగన్ డ్రామాలు : కేశినేని చిన్ని
-
బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధమా?: సీఎం రేవంత్రెడ్డి