EV Manufacturing: ఈవీల వల్ల చైనాపై మరింత ఆధారపడాలి!: GTRI
Electric vehicles Manufacturing: విద్యుత్ వాహనాల తయారీని పెంచడం వల్ల చైనాపై ఆధారపడడం పెరుగుతుందని ఓ నివేదిక పేర్కొంది. విద్యుత్ వాహనాల్లో ఉన్న ఇతర అంశాలనూ చర్చించింది.
దిల్లీ: దేశంలో విద్యుత్ వాహనాల (Electric vehicles) వినియోగం క్రమక్రమంగా పెరుగుతోంది. కర్బన ఉద్గారాలు తగ్గించేందుకు ప్రభుత్వం సైతం రాయితీలు ఇస్తోంది. దీంతో విద్యుత్ వాహనాల కొనుగోలుకు వాహనదారులు ముందుకొస్తున్నారు. అయితే, దేశంలో విద్యుత్ వాహనాల తయారీని (EV Manufacturing) పెంచడం వల్ల చైనాపై భారత్ ఆధారపడడమూ పెరుగుతుందని ఆర్థిక మేధో సంస్థ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చి ఇనిషియేటివ్ (GTRI) తెలిపింది. ముడి సరకులు, మినరల్ ప్రాసెసింగ్, బ్యాటరీ ఉత్పత్తి కోసం ఆ దేశంపై ఆధారపడాల్సిన అవసరం పెరుగుతుందని తన నివేదికలో పేర్కొంది. ఈవీల వల్ల ఉన్న మరికొన్ని లోటుపాట్లను సైతం తన నివేదికలో చర్చించింది. బ్యాటరీ తయారీ, వినియోగం, రీసైక్లింగ్ వల్ల కాలుష్యం పెరుగుతుందని చెప్పింది.
ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా నుంచి భారీగా లిథియం గనులను చైనా కొనుగోలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తయ్యే లిథియంలో 60 శాతం చైనానే ప్రాసెస్ చేస్తుంటుంది. ఒక్క లిథియమే కాదు 65 శాతం కోబాల్ట్, 93 శాతం మాంగనీస్ను చైనా ప్రాసెస్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నాలుగు బ్యాటరీలు ఉత్పత్తి అయితే అందులో మూడు బ్యాటరీలు చైనానే తయారు చేస్తోంది. లిథియం ఐయాన్ సెల్స్లో వినియోగించే 60 శాతం కేథోడ్లను, 80 శాతం యానోడ్స్ను చైనా కంపెనీలే తయారు చేస్తున్నాయి. దీనివల్ల భారత్లో విద్యుత్ వాహనాల తయారీ పెంచితే తద్వారా చైనాపై ఆధారపడడం పెరుగుతుందని జీటీఆర్ఐ తన నివేదికలో వెల్లడించింది.
ఇంకేం చెప్పిందంటే..?
విద్యుత్ వాహనాల వల్ల ఉపాధి అవకాశాలతో పాటు వినియోగదారులు, పరిశ్రమ, ప్రభుత్వ వర్గాలపై పడే ప్రభావాన్నీ తన నివేదికలో జీటీఆర్ఐ లేవనెత్తింది. విద్యుత్ వాహన ధరలు అధికంగా ఉండడం, దూర ప్రయాణాలకు ఈవీల వినియోగం, భిన్న వాతావరణ పరిస్థితుల్లో పనితీరు, విద్యుత్కు డిమాండ్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వినియోగించలేకపోవడం, కాలుష్యం తగ్గించకపోవడం, ఆటోమొబైల్ విడి భాగాల పరిశ్రమపై ప్రభావం, లిథియం అందుబాటు వంటి అంశాలను చర్చించింది. ‘‘ఈవీల వల్ల దీర్ఘకాలంలో ఉపాధి అవకాశాలపై పడే ప్రభావాన్ని, కాలుష్యం, దిగుమతులు, ఆర్థికవృద్ధి వంటి అంశాలనూ చర్చించాల్సిన అవసరం ఉంది’’ అని జీటీఆర్ఐ సహ వ్యవస్థాపకులు అజయ్ శ్రీవాస్తవ అన్నారు.
500 కేజీల లిథియం కారు బ్యాటరీని తీసుకుంటే అందులో 12 కేజీల లిథియంను వాడుతారు. 15 కేజీల కోబాల్ట్, 30 కేజీల నికెల్, 44 కేజీల కాపర్, 50 కేజీల గ్రాఫైట్ వినియోగిస్తారు. అంతేకాకుండా 200 కేజీల దాకా స్టీల్, అల్యూమినియం, ప్లాస్టిక్ వంటి పదార్థాలను వినియోగిస్తారు. అయితే వీటన్నింటినీ వెలికి తీయడం, రవాణా, ప్రాసెసింగ్ వల్ల గాలి, నీటి కాలుష్యం జరుగుతుందని జీటీఆర్ఐ తన నివేదికలో పొందుపరిచింది. సాధారణంగా బ్యాటరీ జీవితకాలం ఆరేడేళ్లు ఉంటుందని, ఆ తర్వాత దాన్ని రీసైకిల్ చేసే సమయంలోనూ ఉద్గారాలు వెలువడతాయని గుర్తుచేసింది. ఈవీలను ప్రమోట్ చేసే సంస్థలేవీ వీటి గురించి మాట్లాడడం లేదని పేర్కొంది.
విద్యుత్ వాహన వినియోగం వల్ల బ్యాటరీ ఛార్జింగ్ చేయడానికి బొగ్గు ఆధారిత విద్యుత్నే మళ్లీ వినియోగించాల్సి ఉంటుందని జీటీఆర్ఐ గుర్తుచేసింది. భారత్లో ఉత్పత్తి అయ్యే 60 శాతం విద్యుత్ శిలాజ ఇంధనాల నుంచే వస్తోందని పేర్కొంది. విద్యుత్ వాహనాల వల్ల విడిభాగాల తయారీలో ఉన్న సంఘటిత, అసంఘటిత తయారీ సంస్థల మనుగడ సైతం ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తంచేసింది. గ్యారేజీలు, షాపులు సైతం మూతపడతాయని తెలిపింది. ఒక్కో విద్యుత్ వాహన తయారీ సంస్థ ఒక్కో ఛార్జింగ్ పోర్ట్ టెక్నాలజీని వాడుతున్నాయని, ప్రామాణికత పాటించడం లేదని తెలిపింది. ఇలాగైతే ఒక్కో కంపెనీ ఒక్కో ఛార్జింగ్ నెట్వర్క్ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4 లక్షల స్కూటర్లు రీకాల్ చేసిన సుజుకీ.. ఇందులో మీ మోడల్ ఉందా?
Suzuki Motorcycle: సుజుకీ కంపెనీ దాదాపు 4 లక్షల వాహనాలను రీకాల్ చేసింది. ఆయా వాహనాల్లో ఉన్న లోపాన్ని గుర్తించి ఈ రీకాల్ చేపట్టింది. -
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
తాజా వార్తలు (Latest News)
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత