EV Manufacturing: ఈవీల వల్ల చైనాపై మరింత ఆధారపడాలి!: GTRI
Electric vehicles Manufacturing: విద్యుత్ వాహనాల తయారీని పెంచడం వల్ల చైనాపై ఆధారపడడం పెరుగుతుందని ఓ నివేదిక పేర్కొంది. విద్యుత్ వాహనాల్లో ఉన్న ఇతర అంశాలనూ చర్చించింది.
దిల్లీ: దేశంలో విద్యుత్ వాహనాల (Electric vehicles) వినియోగం క్రమక్రమంగా పెరుగుతోంది. కర్బన ఉద్గారాలు తగ్గించేందుకు ప్రభుత్వం సైతం రాయితీలు ఇస్తోంది. దీంతో విద్యుత్ వాహనాల కొనుగోలుకు వాహనదారులు ముందుకొస్తున్నారు. అయితే, దేశంలో విద్యుత్ వాహనాల తయారీని (EV Manufacturing) పెంచడం వల్ల చైనాపై భారత్ ఆధారపడడమూ పెరుగుతుందని ఆర్థిక మేధో సంస్థ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చి ఇనిషియేటివ్ (GTRI) తెలిపింది. ముడి సరకులు, మినరల్ ప్రాసెసింగ్, బ్యాటరీ ఉత్పత్తి కోసం ఆ దేశంపై ఆధారపడాల్సిన అవసరం పెరుగుతుందని తన నివేదికలో పేర్కొంది. ఈవీల వల్ల ఉన్న మరికొన్ని లోటుపాట్లను సైతం తన నివేదికలో చర్చించింది. బ్యాటరీ తయారీ, వినియోగం, రీసైక్లింగ్ వల్ల కాలుష్యం పెరుగుతుందని చెప్పింది.
ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా నుంచి భారీగా లిథియం గనులను చైనా కొనుగోలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తయ్యే లిథియంలో 60 శాతం చైనానే ప్రాసెస్ చేస్తుంటుంది. ఒక్క లిథియమే కాదు 65 శాతం కోబాల్ట్, 93 శాతం మాంగనీస్ను చైనా ప్రాసెస్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నాలుగు బ్యాటరీలు ఉత్పత్తి అయితే అందులో మూడు బ్యాటరీలు చైనానే తయారు చేస్తోంది. లిథియం ఐయాన్ సెల్స్లో వినియోగించే 60 శాతం కేథోడ్లను, 80 శాతం యానోడ్స్ను చైనా కంపెనీలే తయారు చేస్తున్నాయి. దీనివల్ల భారత్లో విద్యుత్ వాహనాల తయారీ పెంచితే తద్వారా చైనాపై ఆధారపడడం పెరుగుతుందని జీటీఆర్ఐ తన నివేదికలో వెల్లడించింది.
ఇంకేం చెప్పిందంటే..?
విద్యుత్ వాహనాల వల్ల ఉపాధి అవకాశాలతో పాటు వినియోగదారులు, పరిశ్రమ, ప్రభుత్వ వర్గాలపై పడే ప్రభావాన్నీ తన నివేదికలో జీటీఆర్ఐ లేవనెత్తింది. విద్యుత్ వాహన ధరలు అధికంగా ఉండడం, దూర ప్రయాణాలకు ఈవీల వినియోగం, భిన్న వాతావరణ పరిస్థితుల్లో పనితీరు, విద్యుత్కు డిమాండ్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వినియోగించలేకపోవడం, కాలుష్యం తగ్గించకపోవడం, ఆటోమొబైల్ విడి భాగాల పరిశ్రమపై ప్రభావం, లిథియం అందుబాటు వంటి అంశాలను చర్చించింది. ‘‘ఈవీల వల్ల దీర్ఘకాలంలో ఉపాధి అవకాశాలపై పడే ప్రభావాన్ని, కాలుష్యం, దిగుమతులు, ఆర్థికవృద్ధి వంటి అంశాలనూ చర్చించాల్సిన అవసరం ఉంది’’ అని జీటీఆర్ఐ సహ వ్యవస్థాపకులు అజయ్ శ్రీవాస్తవ అన్నారు.
500 కేజీల లిథియం కారు బ్యాటరీని తీసుకుంటే అందులో 12 కేజీల లిథియంను వాడుతారు. 15 కేజీల కోబాల్ట్, 30 కేజీల నికెల్, 44 కేజీల కాపర్, 50 కేజీల గ్రాఫైట్ వినియోగిస్తారు. అంతేకాకుండా 200 కేజీల దాకా స్టీల్, అల్యూమినియం, ప్లాస్టిక్ వంటి పదార్థాలను వినియోగిస్తారు. అయితే వీటన్నింటినీ వెలికి తీయడం, రవాణా, ప్రాసెసింగ్ వల్ల గాలి, నీటి కాలుష్యం జరుగుతుందని జీటీఆర్ఐ తన నివేదికలో పొందుపరిచింది. సాధారణంగా బ్యాటరీ జీవితకాలం ఆరేడేళ్లు ఉంటుందని, ఆ తర్వాత దాన్ని రీసైకిల్ చేసే సమయంలోనూ ఉద్గారాలు వెలువడతాయని గుర్తుచేసింది. ఈవీలను ప్రమోట్ చేసే సంస్థలేవీ వీటి గురించి మాట్లాడడం లేదని పేర్కొంది.
విద్యుత్ వాహన వినియోగం వల్ల బ్యాటరీ ఛార్జింగ్ చేయడానికి బొగ్గు ఆధారిత విద్యుత్నే మళ్లీ వినియోగించాల్సి ఉంటుందని జీటీఆర్ఐ గుర్తుచేసింది. భారత్లో ఉత్పత్తి అయ్యే 60 శాతం విద్యుత్ శిలాజ ఇంధనాల నుంచే వస్తోందని పేర్కొంది. విద్యుత్ వాహనాల వల్ల విడిభాగాల తయారీలో ఉన్న సంఘటిత, అసంఘటిత తయారీ సంస్థల మనుగడ సైతం ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తంచేసింది. గ్యారేజీలు, షాపులు సైతం మూతపడతాయని తెలిపింది. ఒక్కో విద్యుత్ వాహన తయారీ సంస్థ ఒక్కో ఛార్జింగ్ పోర్ట్ టెక్నాలజీని వాడుతున్నాయని, ప్రామాణికత పాటించడం లేదని తెలిపింది. ఇలాగైతే ఒక్కో కంపెనీ ఒక్కో ఛార్జింగ్ నెట్వర్క్ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
Akshaya Tritiya 2024: అక్షయ తృతీయకు బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే హాల్మార్కింగ్ను ఎలా చెక్ చేయాలో తెలుసా? -
బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఊరట.. యాప్పై ఆంక్షలు ఎత్తివేసిన ఆర్బీఐ
బ్యాంక్ ఆఫ్ బరోడాపై గతంలో విధించిన ఆంక్షలను ఆర్బీఐ ఎత్తివేసింది. బ్యాంక్ ఈవిషయాన్ని వెల్లడించింది. -
యాపిల్ నుంచి ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ ప్రో, పెన్సిల్.. ధర, విశేషాలు ఇవీ..
Apple Let Loose Event 2024: ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్ లెట్ లూజ్ ఈవెంట్లో కొత్త ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ ప్రో, యాపిల్ పెన్సిల్ ప్రోలను ఆవిష్కరించింది. -
రోజంతా ఒడుదుడుకుల్లో సూచీలు.. చివరికి ఫ్లాట్గా
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 45 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ పూర్తి ఫ్లాట్గా ముగిసింది. -
మొన్న విస్తారా.. నేడు ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. టాటాలకు ఎందుకీ సెగ..?
టాటా గ్రూప్నకు చెందిన విమానయాన సంస్థల ఉద్యోగులు తరచూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఎందుకీ పరిస్థితి నెలకొంది. -
భారత్లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఏమేం యాడ్ చేయొచ్చు?
Google Wallet: టికెట్లు, పాసులు, ఐడీలను భద్రపర్చుకునేందుకు వీలుగా గూగుల్ డిజిటల్ వాలెట్ను భారత్లో విడుదల చేసింది. -
‘ఉద్యోగం ఉంటుందో?లేదో?’: ఎయిరిండియా విమానాల రద్దుపై ప్రయాణికుల ఆందోళన
ఎయిరిండియా ఎక్స్ప్రెస్కు (Air India Express) చెందిన పలు విమానాలు రద్దుకావడంతో విమానాశ్రయాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. -
AI ఫీచర్లు, 64MP కెమెరాతో గూగుల్ పిక్సెల్ 8ఏ.. ధర, ఫీచర్లివే
Google Pixel 8a: గూగుల్ పిక్సెల్ 8ఏ ఫోన్ 64ఎంపీ కెమెరా సహా అత్యాధునిక ఏఐ ఫీచర్లతో భారత్లో విడుదలైంది. -
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఉద్యోగుల మూకుమ్మడి సెలవు.. 80కి పైగా విమానాల రద్దు
Air India Express: దాదాపు 300 మంది క్యాబిన్ క్రూ అనారోగ్య కారణంతో సెలవు పెట్టినట్లు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ వెల్లడించింది. దీంతో దాదాపు 80కి పైగా సర్వీసులు రద్దయ్యాయి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,276
Stock Market Opening bell: ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్ 267 పాయింట్ల నష్టంతో 73,244 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు కుంగి 22,276 దగ్గర కొనసాగుతోంది. -
టాటా సెమీ కండక్టర్ చిప్ల ఎగుమతి!
మన దేశం నుంచి సెమీ కండక్టర్ చిప్సెట్ల ప్రయోగాత్మక ఎగుమతి ప్రారంభమైంది. చిప్సెట్ల కోసం దిగుమతులపైనే ఆధారపడిన మన దేశానికి ఇది ఎంతో ప్రోత్సాహకర అంశమే. -
మెట్రో నగరాల్లో ఖాళీగా షాపింగ్ మాల్స్!
దేశంలోని 8 ప్రధాన నగరాల్లో, స్టాల్స్ స్థలం అతి తక్కువగా నిండుతున్న షాపింగ్ మాల్స్ సంఖ్య పెరిగిందని స్థిరాస్తి సేవల సంస్థ నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. -
డాక్టర్ రెడ్డీస్కు రూ.1,307 కోట్ల లాభం
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి ఆకర్షణీయ ఫలితాలు నమోదు చేసింది. -
యాపిల్ కొత్త ఐప్యాడ్ ఎయిర్
టెక్ దిగ్గజం యాపిల్ సరికొత్త ఐప్యాడ్ ఎయిర్ను మంగళవారం జరిగిన ‘లెట్ లూజ్’ కార్యక్రమంలో ఆవిష్కరించింది. -
అయిదేళ్ల కనిష్ఠానికి పొదుపు
దేశంలో కుటుంబాల నికర పొదుపు గణనీయంగా తగ్గుతోంది. 2020-21తో పోలిస్తే, 2022-23 ఆర్థిక సంవత్సరం చివరకు కుటుంబాల నికర పొదుపు రూ.9 లక్షల కోట్లు తగ్గి రూ.14.16 లక్షల కోట్లకు పరిమితమైంది. -
3 రోజులు.. రూ.11 లక్షల కోట్ల నష్టం
హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి పెద్ద షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో మంగళవారం సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
ట్రేడింగ్ సమయం పొడిగింపు లేనట్లే
ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలో ట్రేడింగ్ సమయాన్ని పొడిగించేందుకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) సమర్పించిన ప్రతిపాదనను కేపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తిరస్కరించింది. -
పోర్షే రూ.1.69 కోట్ల కారు
పోర్షే సరికొత్త పనమేరాను, అత్యంత ఆకర్షణీయ ఫీచర్లతో ఆవిష్కరించింది. దీని ధర(ఎక్స్ షోరూం) రూ.1,69,62,000. -
వైద్య పరికరాల దిగుమతులు తగ్గాలి
వైద్య పరికరాల కోసం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలంటే ప్రభుత్వం, పరిశ్రమ కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని ఫార్మాస్యూటికల్స్ (ఔషధ) విభాగ కార్యదర్శి అరుణీష్ చావ్లా వెల్లడించారు. -
హ్యాపియెస్ట్ మైండ్స్ డివిడెండ్ 163%
ఐటీ సంస్థ హ్యాపియెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.71.98 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
సంక్షిప్త వార్తలు(5)
సజ్జన్ జిందాల్ నేతృత్వంలోని జేఎస్డబ్ల్యూ ఎనర్జీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.351 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
చెలరేగిన హెడ్, అభిషేక్.. హైదరాబాద్ అద్భుత విజయం
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్కుమార్ ఫన్నీ వీడియో
-
పులివెందుల సీఐపై ఎన్నికల సంఘానికి దస్తగిరి ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM