stock market: అప్రమత్తంగా అడుగులు వేయాలి
ఎన్నికల ఫలితాలపై స్టాక్మార్కెట్ అనూహ్యంగా స్పందించింది. భాజపా సారథ్యంలో కేంద్రంలో మళ్లీ స్థిర ప్రభుత్వం ఏర్పడుతుందని, స్టాక్మార్కెట్లకు ఇబ్బందేమీ ఉండదనే ఎగ్జిట్పోల్స్ అంచనాలు..
ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే సరైన వ్యూహం
వచ్చే కొద్ది రోజులు ఎంతో కీలకం
స్టాక్మార్కెట్లపై నిపుణుల విశ్లేషణ
ఎన్నికల ఫలితాలపై స్టాక్మార్కెట్ (Stock Market) అనూహ్యంగా స్పందించింది. భాజపా సారథ్యంలో కేంద్రంలో మళ్లీ స్థిర ప్రభుత్వం ఏర్పడుతుందని, స్టాక్మార్కెట్లకు ఇబ్బందేమీ ఉండదనే ఎగ్జిట్పోల్స్ అంచనాలు.. సోమవారం స్టాక్మార్కెట్ సూచీలను రికార్డు స్థాయికి తీసుకువెళ్లాయి. ఫలితంగా షేర్ల విలువలూ అనూహ్యంగా పెరిగాయి. మంగళవారం వాస్తవ ఫలితాలు వెల్లడయ్యాక, సూచీలతో పాటు షేర్ల విలువలూ కుప్పకూలాయి. 400 సీట్లు వస్తాయని.. అందువల్ల జూన్ 4న ఎన్నికల ఫలితాల రోజు, సూచీలు భారీగా పెరుగుతాయంటూ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షా ఇటీవల చేసిన ప్రకటనల నేపథ్యంలో.. ముందుగానే షేర్లు కొని ఎదురుచూస్తున్న రిటైల్ మదుపర్ల ఆశలు నీరుగారి పోయాయి.
ఈ నేపథ్యంలో ‘స్టాక్మార్కెట్లు ఎలా ఉంటాయి, ఇప్పుడు ఎటువంటి వ్యూహాలు అనుసరించాలి’ అనే సందేహాలు రిటైల్ మదుపర్లలో ఉన్నాయి. కేంద్రంలో ప్రభుత్వం ఎలా రూపుదిద్దుకుంటుంది, సమీప భవిష్యత్తులో ప్రభుత్వ నిర్ణయాలు ఏవిధంగా ఉంటాయి.. అనే అంశాల ప్రభావం, కొద్ది కాలం పాటు దేశీయ స్టాక్మార్కెట్లపై అధికంగా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో అప్రమత్తంగా మెలగడం ఎంతో అవసరమని నిపుణులు వివరిస్తున్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే ఏర్పడుతుంది కాబట్టి, మార్కెట్లు కుప్పకూలే ప్రమాదం లేదని, అయినప్పటికీ జాగ్రత్తగా అడుగులు వేయడం మేలని పేర్కొంటున్నారు.
ఈ అంశాలు గమనించాలి
- స్టాక్ మార్కెట్ సూచీలు పెరుగుతున్నప్పుడు అన్ని షేర్ల ధరలూ పెరగవు. కానీ సూచీలు పడిపోతుంటే మాత్రం, ఎక్కువ కంపెనీల షేర్ల ధరలు వేగంగా పతనం అవుతాయి. ఈ సూత్రాన్ని మదుపరులు గుర్తెరగాలి.
- షేర్లలో మదుపు చేసే ముందు ఆ షేరు వాస్తవ విలువ ఎంత, ధర ఎంత ఆకర్షణీయంగా ఉంది, అనేది చూసుకోవాలి. అంతేకానీ మార్కెట్ స్థాయిని కాదు.భావోద్వేగాల ప్రభావంతో మార్కెట్ పెరుగుతున్నప్పుడే చాలామంది పెట్టుబడులు పెడుతుంటారు. రాబడికి ఆస్కారం ఉన్నా, దాంతో పాటే సొమ్మును నష్టపోయే అవకాశాలూ పెరుగుతాయి.
- మార్కెట్లో ర్యాలీ కొనసాగుతున్నప్పుడు ఒక షేరు ఎంత పెరుగుతుందనే చూస్తుంటారు. కానీ అనూహ్య పరిస్థితులు ఎదురైనప్పుడు ఎంత నష్టపోతామనే విషయాన్ని పట్టించుకోరు. మార్కెట్ పడుతున్నప్పుడు షేరు ధర ఇంకా ఎంత పతనం అవుతుందన్న దానిపై దృష్టి అధికంగా ఉంటుంది. కానీ, వాస్తవిక విలువకన్నా తక్కువకు దొరుకుతుందా, ఆ షేరు విలువ పెరిగేందుకు భవిష్యత్తు అవకాశాలను పరిగణనలోకి తీసుకోరు.
- ఏ ఇతర పెట్టుబడి/పొదుపు పథకాలతో పోల్చినా దీర్ఘకాలంలో స్టాక్ మార్కెట్ అధిక రాబడినిచ్చినట్లు చరిత్ర చెబుతోంది. మార్కెట్లో స్వల్పకాలిక హెచ్చుతగ్గులను చూసి భయపడి, ఎంతో మంది షేర్లను తెగనమ్ముకుని, నష్టాలను మూటగట్టుకుంటారు. సోమ, మంగళవారాల్లో మార్కెట్ను పరిశీలిస్తే స్వల్పకాలంలో మార్కెట్ పనితీరు ఎలా ఉంటుందన్నది స్పష్టమవుతుంది.
- స్వల్ప/మధ్య కాలాల్లో మార్కెట్ నుంచి వచ్చే నష్టాలను తప్పించుకోవాలంటే దీర్ఘకాలిక దృక్పథంతో చేసే పెట్టుబడులే రక్ష.
- మార్కెట్ గరిష్ఠ స్థాయుల్లో ఉన్నప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అదే సమయంలో తగ్గుతున్నప్పుడు మంచి షేరు విలువ ఆకర్షణీయంగా కనిపిస్తే వదులుకోవద్దు. మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా స్థిరంగా కదలాడుతూ, చక్కని వృద్ధిని అందించే షేర్లను పెట్టుబడి కోసం ఎంచుకోవడం ఉత్తమం.
ఎవరేమన్నారంటే..
లార్జ్ క్యాప్ షేర్లు మేలు
ఎన్నికల ఫలితాల ప్రభావంతో స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనైనప్పటికీ, కేంద్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వం ప్రస్తుత విధానాలనే కొనసాగించే పక్షంలో దీర్ఘకాలిక సానుకూలతకు వచ్చిన ఇబ్బందేమీ ఉండదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, రక్షణ, కేపిటల్ గూడ్స్.. తదితర రంగాలకు ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో మేలు జరుగుతుంది. అయితే మదుపర్లు స్వల్పకాలంలో హెచ్చుతగ్గులకు సిద్ధంగా ఉండాలి. ప్రస్తుత పరిస్థితుల్లో లార్జ్ క్యాప్ షేర్లపై పెట్టుబడి మేలు. అన్ని రకాల ఒత్తిళ్లను తట్టుకుని నిలిచే శక్తి లార్జ్ క్యాప్ షేర్లకు ఉంటుంది.
ప్రదీప్ గుప్తా, వైస్ఛైర్మన్, ఆనంద్ రాఠీ
మూడు, నాలుగు దఫాలుగా పెట్టుబడి పెట్టండి
ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే కేంద్రంలో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందని స్పష్టమవుతోంది. కొద్ది రోజుల పాటు ఫలితాల ప్రభావం, స్టాక్మార్కెట్పై ఉంటుంది. హెచ్చుతగ్గులు తప్పవు. కానీ తర్వాత ఆర్థిక వ్యవస్థ తీరు, వివిధ రంగాల పనితీరు, కొత్త ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపైకి దృష్టి మళ్లుతుంది. మదుపర్లు స్థిరమైన వృద్ధి సాధిస్తున్న మంచి కంపెనీలపై మూడు, నాలుగు దఫాలుగా పెట్టుబడి పెట్టడం మంచిది.
అజయ్ మీనన్, ఎండీ-సీఈఓ (బ్రోకింగ్, డిస్ట్రిబ్యూషన్), మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్
ఆర్థికాంశాలే కీలకం
స్టాక్మార్కెట్కు ఆర్థికాంశాలే ముఖ్యం. ఇతర అంశాల ప్రభావం తాత్కాలికమే. ఆర్ధిక విధానాలు, జీడీపీ, ద్రవ్యోల్బణం, ప్రపంచ దేశాల్లోని పరిస్థితులు.. తదితర అంశాలను పరిశీలించాలి. ప్రభుత్వం స్థిరమైన విధానాలు అనుసరిస్తే, స్టాక్మార్కెట్ పెట్టుబడులపై లాభాలు అధికంగా ఉంటాయి.
- సుమన్ బెనర్జీ, చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్, హెడోనోవా
ప్రభుత్వం స్థిరంగా ఉండాలి
బీజేపీకి సాధారణ మెజార్టీ కంటే తక్కువ సీట్లు వచ్చాయి. ప్రభుత్వం ఏర్పడాలంటే కొన్ని ఇతర పార్టీలపై ఆధారపడాలి. దీనివల్ల ప్రభుత్వ నిర్ణయాలపై ప్రభావం పడుతుంది. సంస్కరణలను గతంలో మాదిరిగా బలంగా ముందుకు తీసుకువెళ్లలేకపోవచ్చు.
- సిద్ధార్థ ఖేమ్కా, సీనియర్ మేనేజర్, అబన్స్ హోల్డింగ్స్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4 లక్షల స్కూటర్లు రీకాల్ చేసిన సుజుకీ.. ఇందులో మీ మోడల్ ఉందా?
Suzuki Motorcycle: సుజుకీ కంపెనీ దాదాపు 4 లక్షల వాహనాలను రీకాల్ చేసింది. ఆయా వాహనాల్లో ఉన్న లోపాన్ని గుర్తించి ఈ రీకాల్ చేపట్టింది. -
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..