Microsoft: చైనా హ్యాకింగ్ నివారణలో మైక్రోసాప్ట్ నిర్లక్ష్యం: కీలక నివేదిక
Microsoft: చైనాకు చెందిన స్టార్మ్-0558 అనే గ్రూప్ చేసిన హ్యాకింగ్పై అమెరికా ప్రభుత్వ కమిటీ కీలక విషయాలు వెల్లడించింది. ఈ సైబర్ దాడి నివారించదగినదేనని తెలిపింది. మైక్రోసాఫ్ట్ నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించినట్లు ఆరోపించింది.
Microsoft | బోస్టన్: యూజర్ల భద్రతను కాపాడే విషయంలో మైక్రోసాఫ్ట్ (Microsoft) తప్పిదాలకు పాల్పడినట్లు ఓ కీలక నివేదిక వెల్లడించింది. లోపాలను సవరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఆరోపించింది. ఫలితంగా చైనా ప్రభుత్వ మద్దతున్న సైబర్ నేరగాళ్లు అమెరికా అధికారులు, సంస్థల ఈమెయిల్ ఖాతాల్లో చొరబడ్డారని తెలిపింది. బాధితుల్లో అమెరికా వాణిజ్య కార్యదర్శి సైతం ఉన్నట్లు తేల్చింది. దీనివల్ల సున్నితమైన సమాచారం బయటకు వెళ్లి ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది.
సైబర్ దాడులను అరికట్టేందుకు వివిధ కంపెనీలు తీసుకుంటున్న చర్యలను సమీక్షించేందుకుగనూ బైడెన్ ప్రభుత్వం 2021లో ‘సైబర్ సేఫ్టీ రివ్యూ బోర్డు’ పేరిట ఓ కమిటీని ఏర్పాటు చేసింది. సైబర్ సెక్యూరిటీ విషయంలో మైక్రోసాఫ్ట్ (Microsoft) విధానాలు గందరగోళంగా ఉన్నాయని ఈ బోర్డు తేల్చింది. పైగా దాడులకు సంబంధించిన సమాచారం తెలుసా.. లేదా.. అనే విషయంలోనూ మైక్రోసాఫ్ట్ నిజాయతీగా వ్యవహరించలేదని ఆరోపించింది. ఈ నేపథ్యంలో కంపెనీ భద్రతా విధానాలు ప్రమాణాలకు అనుగుణంగా లేవని.. వాటిని పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందని సూచించింది. టెక్ రంగంలో అంతర్జాతీయంగా కీలక పాత్ర పోషిస్తున్న ఈ కంపెనీ అనేక దేశాల జాతీయ భద్రత, ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్యం వంటి కీలక రంగాలకు కావాల్సిన ఉత్పత్తులను అందిస్తోందని గుర్తుచేసింది.
గత ఏడాది మే నుంచి జూన్ వరకు జరిగిన సైబర్ దాడులు నివారించదగినవేనని కమిటీ గుర్తించింది. మైక్రోసాఫ్ట్ వాటిని గుర్తించి సరిదిద్దడంలో విఫలమైందని ఆరోపించింది. ఈ నేపథ్యంలో భద్రతా వ్యవస్థను మరింత పటిష్ఠపరిచే వరకు క్లౌడ్ కంప్యూటింగ్కు కొత్త ఫీచర్లను జత చేయొద్దని సిఫార్సు చేసింది. ఆ దిశగా వేగంగా చర్యలు తీసుకోవాలని.. వాటికి సంబంధించిన టైమ్లైన్ను వెల్లడించాలని తెలిపింది. 22 సంస్థలు, 500 మంది కీలక వ్యక్తుల ఈమెయిళ్లను నేరగాళ్లు యాక్సెస్ చేశారని గుర్తించింది. ఆరు వారాల్లో ఒక్క విదేశాంగ శాఖకు చెందినవే దాదాపు 60 వేల ఈమెయిళ్లను డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపింది.
స్టార్మ్-0558 అనే చైనా కంపెనీ సైబర్ దాడులకు పాల్పడినట్లు మైక్రోసాఫ్ట్ (Microsoft) ఓ బ్లాగ్పోస్ట్ ద్వారా జులైలో వెల్లడించింది. అయితే, కచ్చితమైన సమాచారాన్ని మాత్రం పేర్కొనలేదు. హ్యాకర్లు చొరబడడానికి గల కారణాన్ని కూడా గుర్తించినట్లు తెలిపింది. అయితే, లోపం ఎక్కడుందో కంపెనీకి అప్పటికి తెలియదని తాజాగా బోర్డు తేల్చింది. నిరంతర ఒత్తిడి తర్వాత ఆ పోస్టును సవరించినట్లు తెలిపింది.
రివ్యూ బోర్డు నివేదికపై మైక్రోసాఫ్ట్ స్పందించింది. బోర్డు చేసిన పరిశోధనను అభినందిస్తున్నామని తెలిపింది. సైబర్దాడులను నిలువరించేలా భద్రతా వ్యవస్థలను మరింత పటిష్ఠపరుస్తామని పేర్కొంది. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.25,000 కోట్ల పెట్టుబడులకు అవకాశం
ద్విచక్ర వాహనాలు, బస్సులు మనదేశంలో ఈవీ (విద్యుత్తు వాహన) పరిశ్రమకు చోదక శక్తిగా మారుతున్నాయి. -
టెస్లా పవర్పై టెస్లా దావా
భారత్కు చెందిన ఒక కంపెనీ తమ పేరును వినియోగిస్తూ, వినియోగదారుల్లో గందరగోళ సృష్టిస్తోందని ఆరోపిస్తూ, దిల్లీ హైకోర్టులో అమెరికా విద్యుత్ వాహన (ఈవీ) దిగ్గజం టెస్లా దావా వేసింది. -
కొత్త పల్సర్ ఎన్ఎస్400జెడ్
యువతను ఆకట్టుకునే లక్ష్యంతో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో సరికొత్త పల్సర్ ఎన్ఎస్400జెడ్ ను విపణిలోకి శుక్రవారం విడుదల చేసింది. -
క్యాపిటా ల్యాండ్కు హైదరాబాద్లో 25 లక్షల చ.అ. కార్యాలయ స్థలం
స్థిరాస్తి సేవల సంస్థ ఫినిక్స్ గ్రూపు, హైదరాబాద్లోని హైటెక్ సిటీ సమీపంలో నిర్మిస్తున్న 25 లక్షల చదరపు అడుగుల వాణిజ్య భవనాన్ని కేపిటా ల్యాండ్ ఇండియా ట్రస్ట్ అనే సంస్థ కొనుగోలు చేయనుంది. -
ఎంఆర్ఎఫ్ తుది డివిడెండ్ రూ.194
టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్, మార్చి త్రైమాసికంలో రూ.396 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని నమోదు చేసింది. -
39% తగ్గిన అదానీ గ్రీన్ ఎనర్జీ లాభం
అదానీ గ్రూప్నకు చెందిన అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏజీఈఎల్), మార్చి త్రైమాసికంలో రూ.310 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. -
గోద్రేజ్ ప్రాపర్టీస్ రికార్డు అమ్మకాలు
గోద్రేజ్ గ్రూప్నకు చెందిన స్థిరాస్తి సంస్థ గోద్రేజ్ ప్రాపర్టీస్, మార్చి త్రైమాసికంలో గతంలో ఎన్నడూ లేనంతగా రూ.471.26 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
గరిష్ఠాల నుంచి వెనక్కి
సూచీల గరిష్ఠ స్థాయుల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో శుక్రవారం సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ముగిశాయి. టెలికాం, యంత్ర పరికరాలు, టెక్ షేర్లు డీలాపడటంతో సెన్సెక్స్ 74,000 పాయింట్ల దిగువకు చేరింది. -
నరేశ్ గోయల్కు బెయిల్ ఇవ్వొద్దు.. ఈడీ
మనీ లాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్, వైద్య ప్రాతిపదికన మధ్యంతర బెయిల్ కోరడాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం వ్యతిరేకించింది. -
అంతరిక్ష కార్యకలాపాలకు నిధులు
మనదేశంలో అంతరిక్ష రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థలకు నిధులు సమకూర్చడానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏబీబీ) సుముఖంగా ఉంది. -
యాపిల్ ఆదాయాల్లో రెండంకెల వృద్ధి
భారతదేశంలో మార్చి త్రైమాసికంలో రికార్డు ఆదాయాన్ని నమోదుచేసినట్లు అమెరికా దిగ్గజ సంస్థ యాపిల్ ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు( 8)
సిగ్నిటీ టెక్నాలజీస్లో 54% వాటా కొంటున్న కోఫోర్జ్ లిమిటెడ్, ఇప్పుడు ఆ సంస్థ వాటాదార్లకు ‘ఓపెన్ ఆఫర్’ జారీ చేసింది. -
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ భారత్లో పెద్దఎత్తున ఖాతాలపై చర్యలు చేపట్టింది. ఒక్క 2024 తొలి త్రైమాసికంలోనే ఏకంగా 2.23 కోట్ల ఖాతాలపై నిషేధం విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సీఎం రేవంత్రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి..
-
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ.. డైరెక్టర్ ఎవరంటే!
-
10 వేలమంది అనుచరులు.. 700 వాహనాలు: కుమారుడి నామినేషన్ వేళ బ్రిజ్భూషణ్ హడావుడి
-
రోహిత్కు ఏమైంది? ఇంపాక్ట్ ప్లేయర్గా రావడానికి కారణమిదే!
-
నిజ్జర్ హత్య కేసు.. ఆ ముగ్గురు నిందితులకు ‘పాక్ ఐఎస్ఐ’తో సంబంధాలు..!