Job Security: మా ఉద్యోగాలకు భద్రత లేదు.. సగం మంది భారతీయుల అభిప్రాయమిదే: సర్వే
దేశంలోని ఉద్యోగుల్లో దాదాపు సగం మంది తమ కొలువులపై ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగాలు భద్రంగా ఉంటాయన్న నమ్మకం లేదని 47% ఉద్యోగులు అభిప్రాయపడుతున్నట్లు ఏడీపీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సర్వే వెల్లడించింది.
దిల్లీ: దేశంలోని ఉద్యోగుల్లో దాదాపు సగం మంది తమ కొలువులపై ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగాలు భద్రంగా ఉంటాయన్న నమ్మకం లేదని 47% ఉద్యోగులు అభిప్రాయపడుతున్నట్లు ఏడీపీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సర్వే వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ అభద్రత ఆందోళనకర అంశంగా మారుతోందని తెలిపింది. ‘పీపుల్ ఎట్ వర్క్ 2023: ఏ గ్లోబల్ వర్క్ఫోర్స్ వ్యూ’ పేరిట సంస్థ ఈ నివేదికను వెలువరించింది. అన్ని దేశాల్లోనూ ఉద్యోగాలపై అభద్రతాభావం యువతలోనే ఎక్కువగా ఉంది. 32,000 మందికి పైగా ఉద్యోగుల నుంచి వివరాలు సేకరించి, ఈ నివేదిక రూపొందించినట్లు ఏడీపీ తెలిపింది. సగానికి పైగా జన్జడ్ (18-24 ఏళ్ల వయసు వారు) యువత తమ ఉద్యోగ భద్రతపై నమ్మకంతో లేరు. 55 ఏళ్లకు పైబడిన ఉద్యోగుల కంటే, ఈ అభిప్రాయం వీరిలో రెట్టింపు స్థాయిలో ఉంది.
* ‘ప్రతికూల, అనిశ్చితితో కూడిన పరిస్థితుల వల్ల ఉద్యోగులు తమ కొలువులపై కలవరపడుతున్నారు. కృత్రిమ మేధ వంటి కొత్త టెక్నాలజీల వల్ల భారీగా సంఖ్యలో ఉద్యోగాలు పోతున్నట్లు వస్తున్న వార్తలు ఆందోళన పెంచుతున్నాయి’ అని ఏడీపీ ఎండీ రాహుల్ గోయల్ తెలిపారు. నైపుణ్యం కలిగిన వారిని వెతకడం, కొనసాగించడంలో చాలా సంస్థలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, కొంత మంది భావిస్తున్నట్లు పరిస్థితి లేదని అన్నారు.
* భారత్లో ఉద్యోగ అభద్రత ఎక్కువగా ఉన్న రంగాల్లో స్థిరాస్తి, నిర్మాణ కార్యకలాపాలకు సంబంధించినవి ఉన్నాయి. అంతర్జాతీయంగా చూస్తే.. మీడియా, సమాచార పరిశ్రమలో ఈ తరహా వైఖరి కనిపించింది. ఆ తర్వాత ఆతిథ్యం, వినోద రంగాలున్నాయి. ఉద్యోగ భద్రత పెంచేందుకు నిర్దేశించిన సమయం కంటే ఎక్కువగా పనిచేసిన సమయానికి వేతనం ఇవ్వాలని 60% మంది అభిప్రాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.25,000 కోట్ల పెట్టుబడులకు అవకాశం
ద్విచక్ర వాహనాలు, బస్సులు మనదేశంలో ఈవీ (విద్యుత్తు వాహన) పరిశ్రమకు చోదక శక్తిగా మారుతున్నాయి. -
టెస్లా పవర్పై టెస్లా దావా
భారత్కు చెందిన ఒక కంపెనీ తమ పేరును వినియోగిస్తూ, వినియోగదారుల్లో గందరగోళ సృష్టిస్తోందని ఆరోపిస్తూ, దిల్లీ హైకోర్టులో అమెరికా విద్యుత్ వాహన (ఈవీ) దిగ్గజం టెస్లా దావా వేసింది. -
కొత్త పల్సర్ ఎన్ఎస్400జెడ్
యువతను ఆకట్టుకునే లక్ష్యంతో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో సరికొత్త పల్సర్ ఎన్ఎస్400జెడ్ ను విపణిలోకి శుక్రవారం విడుదల చేసింది. -
క్యాపిటా ల్యాండ్కు హైదరాబాద్లో 25 లక్షల చ.అ. కార్యాలయ స్థలం
స్థిరాస్తి సేవల సంస్థ ఫినిక్స్ గ్రూపు, హైదరాబాద్లోని హైటెక్ సిటీ సమీపంలో నిర్మిస్తున్న 25 లక్షల చదరపు అడుగుల వాణిజ్య భవనాన్ని కేపిటా ల్యాండ్ ఇండియా ట్రస్ట్ అనే సంస్థ కొనుగోలు చేయనుంది. -
ఎంఆర్ఎఫ్ తుది డివిడెండ్ రూ.194
టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్, మార్చి త్రైమాసికంలో రూ.396 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని నమోదు చేసింది. -
39% తగ్గిన అదానీ గ్రీన్ ఎనర్జీ లాభం
అదానీ గ్రూప్నకు చెందిన అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏజీఈఎల్), మార్చి త్రైమాసికంలో రూ.310 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. -
గోద్రేజ్ ప్రాపర్టీస్ రికార్డు అమ్మకాలు
గోద్రేజ్ గ్రూప్నకు చెందిన స్థిరాస్తి సంస్థ గోద్రేజ్ ప్రాపర్టీస్, మార్చి త్రైమాసికంలో గతంలో ఎన్నడూ లేనంతగా రూ.471.26 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
గరిష్ఠాల నుంచి వెనక్కి
సూచీల గరిష్ఠ స్థాయుల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో శుక్రవారం సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ముగిశాయి. టెలికాం, యంత్ర పరికరాలు, టెక్ షేర్లు డీలాపడటంతో సెన్సెక్స్ 74,000 పాయింట్ల దిగువకు చేరింది. -
నరేశ్ గోయల్కు బెయిల్ ఇవ్వొద్దు.. ఈడీ
మనీ లాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్, వైద్య ప్రాతిపదికన మధ్యంతర బెయిల్ కోరడాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం వ్యతిరేకించింది. -
అంతరిక్ష కార్యకలాపాలకు నిధులు
మనదేశంలో అంతరిక్ష రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థలకు నిధులు సమకూర్చడానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏబీబీ) సుముఖంగా ఉంది. -
యాపిల్ ఆదాయాల్లో రెండంకెల వృద్ధి
భారతదేశంలో మార్చి త్రైమాసికంలో రికార్డు ఆదాయాన్ని నమోదుచేసినట్లు అమెరికా దిగ్గజ సంస్థ యాపిల్ ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు( 8)
సిగ్నిటీ టెక్నాలజీస్లో 54% వాటా కొంటున్న కోఫోర్జ్ లిమిటెడ్, ఇప్పుడు ఆ సంస్థ వాటాదార్లకు ‘ఓపెన్ ఆఫర్’ జారీ చేసింది. -
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ భారత్లో పెద్దఎత్తున ఖాతాలపై చర్యలు చేపట్టింది. ఒక్క 2024 తొలి త్రైమాసికంలోనే ఏకంగా 2.23 కోట్ల ఖాతాలపై నిషేధం విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
గులకరాయి ఘటనను.. ఎన్నికల్లో లబ్ధికి వినియోగించుకోకుండా అడ్డుకోండి
-
గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజుకో రికార్డు
-
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు
-
హైదరాబాద్లో స్థానికేతరులకే పట్టం
-
అంతేలేని ప్రజ్వల్ రేవణ్ణ ఆగడాలు.. ఒక్కొక్కరుగా స్పందిస్తున్న బాధితులు
-
పెళ్లయిన నెలకే బావను కడతేర్చారు.. చెల్లి ప్రేమ వివాహం ఇష్టం లేని బావమరుదుల ఘాతుకం