Flipkart: భారత ఈ-కామర్స్లో 48% మార్కెట్ వాటాతో ఫ్లిప్కార్ట్ ముందంజ!
Flipkart: ఫ్లిప్కార్ట్కు (Flipkart) వస్తున్న వ్యాపారంలో దుస్తులు, మొబైల్ విభాగాలదే అధిక వాటా అని అలయన్స్బెర్న్స్టెయిన్ నివేదిక తెలిపింది.
దిల్లీ: వాల్మార్ట్ నేతృత్వంలోని ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ (Flipkart) భారత మార్కెట్లో 48 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉన్నట్లు అలయన్స్బెర్న్స్టెయిన్ నివేదిక తెలిపింది. మీషో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఈ-కామర్స్ కంపెనీగా నిలిచినట్లు వెల్లడించింది. నివేదిక ప్రకారం.. 2023 ఆర్థిక సంవత్సరంలో వార్షిక ప్రాతిపదికన ఫ్లిప్కార్ట్ వినియోగదారుల సంఖ్య 21 శాతం పెరిగింది. మీషో 32 శాతం, అమెజాన్ 13 శాతం వృద్ధిని నమోదు చేశాయి. పోటీ సంస్థలతో పోలిస్తే ఖరీదైన వస్తువులను ఎక్కువగా విక్రయిస్తుండడం వల్లే అమెజాన్ వృద్ధి నెమ్మదించినట్లు పేర్కొంది.
‘‘ఫ్లిప్కార్ట్కు (Flipkart) వస్తున్న వ్యాపారంలో దుస్తులు, మొబైల్ విభాగాలదే అధిక వాటా. ఆన్లైన్ స్మార్ట్ఫోన్ విక్రయాల్లో 48 శాతం, ఫ్యాషన్ విభాగంలో 60 శాతం మార్కెట్ వాటా ఈ కంపెనీదే. సున్నా కమీషన్, టైర్-2 సహా చిన్న పట్టణాలపై దృష్టి సారించడమే మీషో (Meesho) వృద్ధికి ప్రధాన కారణం. ఏడాది ప్రాతిపదికన కంపెనీ ఆర్డర్ల సంఖ్య 43 శాతం పెరిగింది. ఆదాయం 54 శాతం పుంజుకుంది. ఒకసారి కొన్నవారిలో 80 శాతం వినియోగదారులు మీషోను తిరిగి ఆశ్రయిస్తున్నారు. ఈ వేదికపై 80 శాతం విక్రేతలు రిటైల్ వ్యాపారులే. అమ్ముడవుతున్న వస్తువుల్లో 95 శాతం బ్రాండెడ్ కానివే. కంపెనీ ‘స్థూల సరకుల విలువ (GMV)’ ఐదు బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని అంచనా. దీంట్లో 50 శాతం దుస్తులు, 8-10 శాతం బీపీసీ (beauty and personal care), 8-10 శాతం హోమ్ అండ్ కిచెన్ విభాగాల నుంచే వస్తోంది’’ అని బెర్న్స్టెయిన్ నివేదిక తెలిపింది.
ఫ్లిప్కార్ట్లో 1100 ఉద్యోగాల కోత
ఫ్యాషన్ ఈ-కామర్స్లో రిలయన్స్కు చెందిన అజియో వేగంగా కస్టమర్లను సంపాదించుకుంటోందని నివేదిక వెల్లడించింది. నెలవారీ క్రియాశీల వినియోగదారుల్లో 30 శాతం వాటా ఈ కంపెనీదే. మార్కెట్ వాటాపరంగా మాత్రం 50 శాతంతో ఫ్లిప్కార్ట్కు చెందిన మింత్రా తొలిస్థానంలో ఉంది. 2023 డిసెంబర్లో పోటీ సంస్థలతో పోలిస్తే అత్యధికంగా 25 శాతం వృద్ధి నమోదు చేసింది. అయితే, గతంలో పోలిస్తే మాత్రం విక్రయాలు నెమ్మదించాయి. ఈ-గ్రాసరీ విభాగంలో జీఎంవీపరంగా 40 శాతం వాటాతో వేగంగా వృద్ధి చెందుతున్న కంపెనీగా బ్లింకిట్ నిలిచింది. ఇన్స్టామార్ట్ 37-39 శాతం, జెప్టోకు 20 శాతం వాటా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది. -
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
మారుతీ సుజుకీ త్వరలోనే అందుబాటు ధరలో హైబ్రిడ్ కార్లను తీసుకురావడంపై పని చేస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
గూగుల్లో ఉద్యోగం మొదలుపెట్టి 20 ఏళ్లు అయిందని సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai) వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు. -
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!