Flipkart: భారత ఈ-కామర్స్లో 48% మార్కెట్ వాటాతో ఫ్లిప్కార్ట్ ముందంజ!
Flipkart: ఫ్లిప్కార్ట్కు (Flipkart) వస్తున్న వ్యాపారంలో దుస్తులు, మొబైల్ విభాగాలదే అధిక వాటా అని అలయన్స్బెర్న్స్టెయిన్ నివేదిక తెలిపింది.
దిల్లీ: వాల్మార్ట్ నేతృత్వంలోని ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ (Flipkart) భారత మార్కెట్లో 48 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉన్నట్లు అలయన్స్బెర్న్స్టెయిన్ నివేదిక తెలిపింది. మీషో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఈ-కామర్స్ కంపెనీగా నిలిచినట్లు వెల్లడించింది. నివేదిక ప్రకారం.. 2023 ఆర్థిక సంవత్సరంలో వార్షిక ప్రాతిపదికన ఫ్లిప్కార్ట్ వినియోగదారుల సంఖ్య 21 శాతం పెరిగింది. మీషో 32 శాతం, అమెజాన్ 13 శాతం వృద్ధిని నమోదు చేశాయి. పోటీ సంస్థలతో పోలిస్తే ఖరీదైన వస్తువులను ఎక్కువగా విక్రయిస్తుండడం వల్లే అమెజాన్ వృద్ధి నెమ్మదించినట్లు పేర్కొంది.
‘‘ఫ్లిప్కార్ట్కు (Flipkart) వస్తున్న వ్యాపారంలో దుస్తులు, మొబైల్ విభాగాలదే అధిక వాటా. ఆన్లైన్ స్మార్ట్ఫోన్ విక్రయాల్లో 48 శాతం, ఫ్యాషన్ విభాగంలో 60 శాతం మార్కెట్ వాటా ఈ కంపెనీదే. సున్నా కమీషన్, టైర్-2 సహా చిన్న పట్టణాలపై దృష్టి సారించడమే మీషో (Meesho) వృద్ధికి ప్రధాన కారణం. ఏడాది ప్రాతిపదికన కంపెనీ ఆర్డర్ల సంఖ్య 43 శాతం పెరిగింది. ఆదాయం 54 శాతం పుంజుకుంది. ఒకసారి కొన్నవారిలో 80 శాతం వినియోగదారులు మీషోను తిరిగి ఆశ్రయిస్తున్నారు. ఈ వేదికపై 80 శాతం విక్రేతలు రిటైల్ వ్యాపారులే. అమ్ముడవుతున్న వస్తువుల్లో 95 శాతం బ్రాండెడ్ కానివే. కంపెనీ ‘స్థూల సరకుల విలువ (GMV)’ ఐదు బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని అంచనా. దీంట్లో 50 శాతం దుస్తులు, 8-10 శాతం బీపీసీ (beauty and personal care), 8-10 శాతం హోమ్ అండ్ కిచెన్ విభాగాల నుంచే వస్తోంది’’ అని బెర్న్స్టెయిన్ నివేదిక తెలిపింది.
ఫ్లిప్కార్ట్లో 1100 ఉద్యోగాల కోత
ఫ్యాషన్ ఈ-కామర్స్లో రిలయన్స్కు చెందిన అజియో వేగంగా కస్టమర్లను సంపాదించుకుంటోందని నివేదిక వెల్లడించింది. నెలవారీ క్రియాశీల వినియోగదారుల్లో 30 శాతం వాటా ఈ కంపెనీదే. మార్కెట్ వాటాపరంగా మాత్రం 50 శాతంతో ఫ్లిప్కార్ట్కు చెందిన మింత్రా తొలిస్థానంలో ఉంది. 2023 డిసెంబర్లో పోటీ సంస్థలతో పోలిస్తే అత్యధికంగా 25 శాతం వృద్ధి నమోదు చేసింది. అయితే, గతంలో పోలిస్తే మాత్రం విక్రయాలు నెమ్మదించాయి. ఈ-గ్రాసరీ విభాగంలో జీఎంవీపరంగా 40 శాతం వాటాతో వేగంగా వృద్ధి చెందుతున్న కంపెనీగా బ్లింకిట్ నిలిచింది. ఇన్స్టామార్ట్ 37-39 శాతం, జెప్టోకు 20 శాతం వాటా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4 లక్షల స్కూటర్లు రీకాల్ చేసిన సుజుకీ.. ఇందులో మీ మోడల్ ఉందా?
Suzuki Motorcycle: సుజుకీ కంపెనీ దాదాపు 4 లక్షల వాహనాలను రీకాల్ చేసింది. ఆయా వాహనాల్లో ఉన్న లోపాన్ని గుర్తించి ఈ రీకాల్ చేపట్టింది. -
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
-
పారిస్ టూర్.. సంతోషకరమైన క్షణమిది: చిరంజీవి పోస్ట్
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు