Flipkart: రెండేళ్లలో రూ.41,000 కోట్లు తగ్గిన ఫ్లిప్కార్ట్ విలువ!
Flipkart: మాతృసంస్థ వాల్మార్ట్ ఈక్విటీ లావాదేవీల ప్రకారం ఫ్లిప్కార్ట్ విలువ గత రెండేళ్లలో రూ.41 వేల కోట్లు తగ్గింది. ఫ్లిప్కార్ట్ మాత్రం దీన్ని తప్పుబట్టింది. ఫోన్పే వేరుపడిన తర్వాత కంపెనీ విలువ పెరిగిందని.. దాన్ని వాల్మార్ట్ సర్దుబాటు చేయలేదని వివరించింది.
దిల్లీ: ప్రముఖ దేశీయ ఈ - కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ (Flipkart) విలువ రెండేళ్లలో రూ.41,000 కోట్లు కుంగింది. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న దాని మాతృసంస్థ వాల్మార్ట్ ఈక్విటీ లావాదేవీలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతోంది. 2022 జనవరిలో కంపెనీ విలువ 40 బిలియన్ డాలర్లుగా ఉండగా.. అది ఈ ఏడాది తొలి నెల నాటికి 35 బిలియన్ డాలర్లకు దిగొచ్చింది. ఫిన్టెక్ సంస్థ ఫోన్పే వేరుపడడం వల్లే ఫ్లిప్కార్ట్ విలువ తగ్గిందని కంపెనీ వర్గాలు తెలిపాయి.
2022లో ఫ్లిప్కార్ట్ (Flipkart) విలువను 40 బిలియన్ డాలర్లుగా అంచనా వేసిన వాల్మార్ట్ 3.2 బిలియన్ డాలర్ల విలువ చేసే ఎనిమిది శాతం ఈక్విటీ వాటాలను విక్రయించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో 3.5 బిలియన్ డాలర్లు చెల్లించి సంస్థలో మరో 10 శాతం వాటాను సొంతం చేసుకుంది. దీంతో ఫ్లిప్కార్ట్లో దాని వాటా 85 శాతానికి చేరింది. ఫలితంగా ఈ - కామర్స్ సంస్థ విలువ 35 బిలియన్ డాలర్లుగా నమోదైంది. అయితే, వాల్మార్ట్ అంచనాలను ఫ్లిప్కార్ట్ (Flipkart) తప్పుబట్టింది. 2023లోనే ఫోన్పే వేర్పాటు పూర్తయిన నేపథ్యంలో ఇప్పటివరకు పెరిగిన విలువను వాల్మార్ట్ తమ సమాచారంలో అప్డేట్ చేయలేదని పేర్కొంది. చివరిసారి తమ కంపెనీ విలువను 2021లో అంచనా వేసినట్లు గుర్తుచేసింది. అప్పుడు ఫోన్పేను కూడా కలిపి మదింపు చేసినట్లు వెల్లడించింది.
జనరల్ అట్లాంటిక్, టైగర్ గ్లోబల్, రిబ్బిట్ క్యాపిటల్, టీవీఎస్ క్యాపిటల్ ఫండ్స్ వంటి సంస్థల నుంచి ఫోన్పే 850 మిలియన్ డాలర్లు సమీకరించింది. దీంతో దాని విలువ 12 బిలియన్ డాలర్లకు చేరింది. మరోవైపు ఫ్లిప్కార్ట్ స్థూల విక్రయాల విలువ (GMV) 2023లో వార్షిక ప్రాతిపదికన 25 శాతం నుంచి 28 శాతం పెరిగి... 29 నుంచి 30 బిలియన్ డాలర్లకు చేరిందని కంపెనీ వర్గాలు తెలిపాయి. దీని వల్ల కంపెనీ విలువ గణనీయంగా పెరిగి 38 నుంచి 40 బిలియన్ డాలర్లకు చేరి ఉంటుందని వివరించాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో ఫ్లిప్కార్ట్ రూ.56,012 కోట్ల ఏకీకృత నికర ఆదాయం, రూ.4,846 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. వ్యయాలు రూ.60,858 కోట్లుగా నివేదించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘12th ఫెయిల్’కు జాతీయ అవార్డు.. ప్రచారంపై స్పందించిన నటుడు
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం