Flipkart: ఫ్లిప్‌కార్ట్‌ సమ్మర్‌ సేల్‌.. ఏసీ, ఫ్యాన్లు, రిఫ్రిజిరేటర్లపై ఆఫర్లు

Flipkart: ఏటా నిర్వహించే ఫ్లిప్‌కార్ట్‌ సమ్మర్‌ సేల్‌ వచ్చేసింది. బుధవారం ప్రారంభమై వారం పాటు అది కొనసాగనుంది. కూలింగ్‌ అప్లయన్సెస్‌పై పలురకాల ఆఫర్లు ఉన్నాయి.

Published : 16 Apr 2024 14:48 IST

దిల్లీ: ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ సమ్మర్‌ సేల్‌ (Flipkart Summer Sale) ప్రారంభం కాబోతోంది. ఏప్రిల్‌ 17న మొదలై 23 వరకు కొనసాగుతుంది. ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌ కూలర్లు, ఫ్యాన్ల వంటి కూలింగ్‌ హోమ్‌ అప్లయన్సెన్స్‌పై ఆఫర్లు ఉండనున్నాయి.

‘సూపర్‌ కూలింగ్‌ డేస్‌ 2024 (Flipkart Super cooling days 2024)’ పేరిట నిర్వహిస్తున్న ఈ సేల్‌లో వివిధ కంపెనీలు, బ్రాండ్లకు చెందిన అనేక రకాల హోమ్‌ అప్లయన్సెస్‌ అందుబాటులో ఉంటాయి. కస్టమర్ల అవసరాలు, బడ్జెట్‌ను దృష్టిలోఉంచుకొని వివిధ రకాల ఆఫర్లు ఉంటాయని కంపెనీ తెలిపింది. రూ.1,299 నుంచి ధరలు ప్రారంభమవుతాయని ఫ్లిప్‌కార్ట్‌ పేర్కొంది. క్యాష్‌బ్యాక్‌, ఎక్స్ఛేంజ్, న్యూ కస్టమర్‌, ట్యాప్‌ అండ్‌ విన్‌ సూపర్‌కాయిన్స్‌ సహా పలు రకాల ఆఫర్లను అందించనున్నట్లు వెల్లడించింది. నో-కాస్ట్‌ ఈఎంఐ, డౌన్ పేమెంట్‌, క్యాష్‌ ఆన్ డెలివరీ, ఫ్లిప్‌కార్ట్‌ పే లేటర్‌ ఈఎంఐ వంటి పేమెంట్‌ ఆప్షన్లు ఉన్నాయి.

కొనబోయే అప్లయన్సెస్‌ ఎలా ఉన్నాయో ముందే చూసుకునేలా వ్యూ ఇన్‌ 360, ఫైర్‌డ్రాప్స్‌ గేమిఫికేషన్‌, 3డీ వ్యూయింగ్‌, వీడియో అసిస్టెన్స్‌ వంటి ఆప్షన్లు ప్రీమియం కస్టమర్లకు ఉంటాయని ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) తెలిపింది. ఫ్లిప్‌కార్ట్‌ జీవ్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఉన్నవారికి ఇన్‌స్టలేషన్‌ వంటి ఆఫ్టర్‌ సేల్స్‌ సర్వీస్‌ కూడా అందిస్తామని తెలిపింది.

శామ్‌సంగ్‌, వర్ల్‌పూల్‌, హయర్‌, గోద్రేజ్‌, ఐఎఫ్‌బీ బ్రాండ్లలో వివిధ రకాల రిఫ్రిజిరేటర్లు ఉన్నాయని ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) తెలిపింది. వీటి ధరలు రూ.9,990 నుంచి ప్రారంభమై రూ.2 లక్షల వరకు ఉన్నట్లు వెల్లడించింది. ఏసీల్లో ఎల్‌జీ, వోల్టాస్‌, గోద్రేజ్‌, డైకిన్‌, పానాసోనిక్‌, బ్లూస్టార్‌ బ్రాండ్లు రూ.25,000-65,000 ధరల శ్రేణిలో అందుబాటులో ఉన్నాయని తెలిపింది. సీలింగ్‌ ఫ్యాన్ల ధర రూ.1,299 నుంచి రూ.15,000 వరకు ఉన్నట్లు పేర్కొంది. పాత రిఫ్రిజిరేటర్లపై రూ.22,000, ఏసీలపై రూ.8,000 వరకు ఎక్స్ఛేంజ్ రాయితీ ఉన్నట్లు వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని