Flipkart: ఫ్లిప్కార్ట్ సమ్మర్ సేల్.. ఏసీ, ఫ్యాన్లు, రిఫ్రిజిరేటర్లపై ఆఫర్లు
Flipkart: ఏటా నిర్వహించే ఫ్లిప్కార్ట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. బుధవారం ప్రారంభమై వారం పాటు అది కొనసాగనుంది. కూలింగ్ అప్లయన్సెస్పై పలురకాల ఆఫర్లు ఉన్నాయి.
దిల్లీ: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ సమ్మర్ సేల్ (Flipkart Summer Sale) ప్రారంభం కాబోతోంది. ఏప్రిల్ 17న మొదలై 23 వరకు కొనసాగుతుంది. ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కూలర్లు, ఫ్యాన్ల వంటి కూలింగ్ హోమ్ అప్లయన్సెన్స్పై ఆఫర్లు ఉండనున్నాయి.
‘సూపర్ కూలింగ్ డేస్ 2024 (Flipkart Super cooling days 2024)’ పేరిట నిర్వహిస్తున్న ఈ సేల్లో వివిధ కంపెనీలు, బ్రాండ్లకు చెందిన అనేక రకాల హోమ్ అప్లయన్సెస్ అందుబాటులో ఉంటాయి. కస్టమర్ల అవసరాలు, బడ్జెట్ను దృష్టిలోఉంచుకొని వివిధ రకాల ఆఫర్లు ఉంటాయని కంపెనీ తెలిపింది. రూ.1,299 నుంచి ధరలు ప్రారంభమవుతాయని ఫ్లిప్కార్ట్ పేర్కొంది. క్యాష్బ్యాక్, ఎక్స్ఛేంజ్, న్యూ కస్టమర్, ట్యాప్ అండ్ విన్ సూపర్కాయిన్స్ సహా పలు రకాల ఆఫర్లను అందించనున్నట్లు వెల్లడించింది. నో-కాస్ట్ ఈఎంఐ, డౌన్ పేమెంట్, క్యాష్ ఆన్ డెలివరీ, ఫ్లిప్కార్ట్ పే లేటర్ ఈఎంఐ వంటి పేమెంట్ ఆప్షన్లు ఉన్నాయి.
కొనబోయే అప్లయన్సెస్ ఎలా ఉన్నాయో ముందే చూసుకునేలా వ్యూ ఇన్ 360, ఫైర్డ్రాప్స్ గేమిఫికేషన్, 3డీ వ్యూయింగ్, వీడియో అసిస్టెన్స్ వంటి ఆప్షన్లు ప్రీమియం కస్టమర్లకు ఉంటాయని ఫ్లిప్కార్ట్ (Flipkart) తెలిపింది. ఫ్లిప్కార్ట్ జీవ్స్ సబ్స్క్రిప్షన్ ఉన్నవారికి ఇన్స్టలేషన్ వంటి ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ కూడా అందిస్తామని తెలిపింది.
శామ్సంగ్, వర్ల్పూల్, హయర్, గోద్రేజ్, ఐఎఫ్బీ బ్రాండ్లలో వివిధ రకాల రిఫ్రిజిరేటర్లు ఉన్నాయని ఫ్లిప్కార్ట్ (Flipkart) తెలిపింది. వీటి ధరలు రూ.9,990 నుంచి ప్రారంభమై రూ.2 లక్షల వరకు ఉన్నట్లు వెల్లడించింది. ఏసీల్లో ఎల్జీ, వోల్టాస్, గోద్రేజ్, డైకిన్, పానాసోనిక్, బ్లూస్టార్ బ్రాండ్లు రూ.25,000-65,000 ధరల శ్రేణిలో అందుబాటులో ఉన్నాయని తెలిపింది. సీలింగ్ ఫ్యాన్ల ధర రూ.1,299 నుంచి రూ.15,000 వరకు ఉన్నట్లు పేర్కొంది. పాత రిఫ్రిజిరేటర్లపై రూ.22,000, ఏసీలపై రూ.8,000 వరకు ఎక్స్ఛేంజ్ రాయితీ ఉన్నట్లు వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
Mahindra XUV 3XO: మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఎక్స్యూవీ 3XOను లాంచ్ చేసింది. దీని ధర రూ.7.49 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. -
4 నెలలకే ఓలా క్యాబ్స్ సీఈఓ రాజీనామా.. 10% మంది ఉద్యోగులకు ఉద్వాసన!
ఓలా క్యాబ్స్ సీఈఓ పదవికి హేమంత్ భక్షి రాజీనామా చేశారు. సీఈఓ పదవి చేపట్టిన 4 నెలలకే బాధ్యతల నుంచి వైదొలిగారు. -
సౌత్ ఇండియన్ బ్యాంకుతో జట్టు కట్టిన టాటా మోటార్స్
వాణిజ్య వాహనాల ఫైనాన్స్ కోసం టాటా మోటార్స్.. సౌత్ ఇండియన్ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది. -
యూపీఐ వచ్చినా క్యాషే కింగ్.. పెరిగిన ఏటీఎం విత్డ్రాలు!
దేశంలో డిజిటల్ లావాదేవీలతో పాటు నగదు వినియోగమూ అదే స్థాయిలో పెరుగుతోంది. సీఎంఎస్ సంస్థ వెలువరించిన తాజా నివేదిక ఈ పరిస్థితిని తెలియజేస్తోంది. -
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 900+, నిఫ్టీ 220+
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 941 పాయింట్లు, నిఫ్టీ 223 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ఈ క్రెడిట్ కార్డులతో బిల్లులు చెల్లిస్తున్నారా? మే 1 నుంచి అదనపు ఛార్జీ..!
Credit Card: ఇప్పటి వరకు అద్దె చెల్లింపులపై మాత్రమే అదనపు రుసుము వసూలు చేసిన క్రెడిట్ కార్డు జారీ సంస్థలు ఇకపై ఇతర యుటిలిటీ బిల్లులకు కూడా దాన్ని విస్తరించేందుకు క్రమంగా సిద్ధమవుతున్నాయి. -
భారత్లో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్.. ధర, ఫీచర్లివే..!
Nothing phone 2a: నథింగ్ ఫోన్ 2ఏ ప్రత్యేక ఎడిషన్ భారత్లో విడుదలైంది. నేవీ బ్లూ రంగులో దీన్ని తీసుకొచ్చారు. -
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 329 పాయింట్ల లాభంతో 74,059 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 85 పాయింట్లు పెరిగి 22,505 దగ్గర కొనసాగుతోంది. -
3 ఏళ్లలో రూ.3,000 కోట్లు.. అపోలో హాస్పిటల్స్ పెట్టుబడులు!
వచ్చే మూడేళ్లలో రూ.3,000 కోట్ల పెట్టుబడులకు అపోలో హాస్పిటల్స్ సన్నాహాలు చేస్తోంది. అమెరికాకు చెందిన దిగ్గజ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్తో ఒప్పందం ఫలితంగా, వస్తున్న నిధులకు మరికొంత జతచేసి, సంస్థ విస్తరణ కార్యకలాపాలపై పెట్టుబడి పెట్టాలని అపోలో నిర్ణయించింది. -
కార్పొరేట్ ఫలితాలు.. అమెరికా వడ్డీరేట్లే కీలకం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈవారంలో వెలువడే పెద్ద కంపెనీల ఆర్థిక ఫలితాలకు తోడు, వడ్డీరేట్లపై బుధవారం వెల్లడయ్యే అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు మార్కెట్కు దిశానిర్దేశం చేయొచ్చంటున్నారు. -
అదానీకనెక్స్ రూ.11,520 కోట్ల రుణ సమీకరణ
అదానీ ఎంటర్ప్రైజెస్, ఎడ్జ్కనెక్స్ సంయుక్తంగా డేటా కేంద్రాల కోసం నెలకొల్పిన సంస్థ అదానీకనెక్స్ 1.44 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.11,520 కోట్ల) వరకు రుణం సమీకరించినట్లు ప్రకటించింది. -
బ్యాంకుల రుణవృద్ధి అంతంతే!
దేశంలో ఆర్థిక వృద్ధి బలంగా ఉన్నందున బ్యాంకుల లాభదాయకత, ఆస్తుల నాణ్యత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ పటిష్ఠంగా ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. -
చైనాలో ఎలాన్ మస్క్
అమెరికా విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హఠాత్తుగా చైనాలో పర్యటిస్తున్నారు. -
వెండిపై ఆచితూచి!
పసిడి జూన్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.72,462 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.72,944; రూ.73,425 వరకు రాణించే అవకాశం ఉంటుంది. -
74500 ఎగువన కొత్త గరిష్ఠాలకు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం దేశీయ సూచీలు లాభపడ్డాయి. బాండ్ రాబడులు పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు, చమురు ధరలు ప్రభావం చూపాయి. -
సంక్షిప్త వార్తలు
స్టాక్ మార్కెట్లు, బీమా కంపెనీలు, ఆన్లైన్ చెల్లింపు గేట్వే ఇంటర్మీడియర్లు, క్రిప్టో కరెన్సీ సేవల ప్రొవైడర్లకు భారత ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) తాజా హెచ్చరికలు జారీ చేసింది. -
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
SBI Credit Card: ఎస్బీఐ కార్డు విమాన ప్రయాణికుల కోసం మూడు ప్రత్యేక క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. వాటిలోని ప్రయోజనాలు, ఫీజుల వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..!
తాజా వార్తలు (Latest News)
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’