Nirmala Sitharaman: ప్రజల్లో ఆ స్పృహ కలిగితేనే సైబర్ దాడులను అడ్డుకోగలం: నిర్మలా సీతారామన్
ఫోన్లో సైబర్ నేరగాళ్లు చెప్పేది చేయకూడదనే స్పృహ ప్రజల్లో కలిగినప్పుడే సైబర్ నేరాలను కట్టడి చేయడం సాధ్యమవుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.
దిల్లీ: సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ సైబర్ నేరగాళ్లు చేస్తున్న మోసాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) అన్నారు. ‘డేట్ విత్ టెక్’ (DATE with Tech) అనే కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఫోన్ కాల్, ఎస్సెమ్మెస్ ద్వారా జరిగే సైబర్ మోసాలను అడ్డుకునేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆన్లైన్ భద్రత వ్యవస్థలను కేంద్రం, ఆర్బీఐ తరచుగా సమీక్షిస్తాయని తెలిపారు. బీమా కంపెనీలు కూడా ఈ పద్ధతిని పాటిస్తాయని చెప్పారు.
‘‘ డిజిటల్ దిశగా భారత్ అడుగులు వేస్తోంది. ప్రస్తుతం మనం కీలక దశలో ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో సైబర్ నేరగాళ్లు సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ.. ప్రజల బ్యాంకు ఖాతాల నుంచి నగదు దొంగిలిస్తున్నారు. దీనివల్ల ప్రజలతోపాటు, దేశ భవిష్యత్తుకు ముప్పు పొంచి ఉంది. సైబర్ మోసాలపై అవగాహన కల్పించేందుకు అన్ని విధాల కృషి చేస్తున్నాం. ఫోన్లో సైబర్ నేరగాళ్లు చెప్పేది చేయకూడదనే స్పృహ ప్రజల్లో కలిగినప్పుడే వీటిని నియంత్రించడం సాధ్యమవుతుంది. ఇందుకోసం చాలా శ్రమించాలి. అయితే, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతకు అనుగుణంగా సైబర్ మోసాలు జరిగే తీరు కూడా మారుతోంది. వీటిని అడ్డుకునే బాధ్యత ముందుగా తమపై ఉందనే విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలి’’ అని నిర్మలా సీతారామన్ తెలిపారు.
NPS విత్డ్రా కొత్త రూల్.. SLWతో క్రమం తప్పని ఆదాయం
పెద్ద సంస్థలు, వ్యవస్థాగతంగా సున్నితమైన సమాచారాన్ని భద్రపరిచే సంస్థలు పటిష్ఠమైన ఫైర్వాల్ వ్యవస్థను కలిగి ఉండాలని నిర్మలా సీతారామన్ సూచించారు. కాలానుగుణంగా కంపెనీలు ఫైర్వాల్ వ్యవస్థలను సైబర్ దాడులను అడ్డుకునేలా అప్డేట్ చేయగలితేనే ప్రజల డేటా బహిర్గతం కాకుండా అడ్డుకోగలమని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు