IPO: వచ్చేవారం నాలుగు ఐపీఓలు.. రూ.1,860 కోట్ల సమీకరణ
సోమవారం నుంచి మొదలుకొని వచ్చే వారం మొత్తం నాలుగు కంపెనీలు ఐపీఓకి రానున్నాయి. రూ.1860 కోట్లు సమీకరించనున్నాయి. మరొక కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ కానుంది.
దిల్లీ: వచ్చేవారం నాలుగు కంపెనీలు ఐపీఓకి రానున్నాయి. సులా వైన్యార్డ్స్, అబన్స్ హోల్డింగ్స్, ల్యాండ్మార్క్ కార్స్, డ్రోన్ఆచార్య ఏరియల్ ఇన్నోవేషన్స్ ఈ జాబితాలో ఉన్నాయి. ఈ నాలుగు కలిపి రూ.1,860 కోట్లు సమీకరించనున్నాయి. అలాగే యూనిపార్ట్స్ ఇండియా షేర్లు కూడా వచ్చే వారంలోనే స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదు కానున్నాయి.
సులా వైన్యార్డ్స్: దేశంలో ప్రముఖ వైన్ తయారీ సంస్థ ‘సులా వైన్యార్డ్స్’ ఐపీఓ (Sula Vineyards IPO) డిసెంబరు 12న ప్రారంభమై 14న ముగియనుంది. ధరల శ్రేణిని రూ.340-357గా నిర్ణయించారు. గరిష్ఠ ధర వద్ద రూ.960 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఐపీఓలో పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (OFS) కింద షేర్లు అందుబాటులో ఉన్నాయి. మార్కెట్లో అందుబాటులో ఉన్న వివిధ రకాల వైన్ వేరియంట్ల తయారీలో సులా వైన్యార్డ్స్ అగ్రస్థానంలో ఉంది. 13 రకాల బ్రాండ్ల పేరిట ఇది వైన్ను విక్రయిస్తోంది.
ల్యాండ్మార్క్ కార్స్: ఆటోమొబైల్ డీలర్షిప్ చైన్ ల్యాండ్మార్క్ కార్స్ లిమిటెడ్ తమ ఐపీఓ (Landmark Cars IPO) ధరల శ్రేణిని రూ.481-506గా నిర్ణయించింది. ఈ కంపెనీ పబ్లిక్ ఇష్యూ డిసెంబరు 13 నుంచి 15 వరకు జరగనుంది. రూ.150 కోట్లు విలువ చేసే తాజా షేర్లతో పాటు రూ.402 కోట్లు విలువ చేసే షేర్లు ఆఫర్ ఫర్ సేల్ (OFS) కింద ఐపీఓలో అందుబాటులో ఉండనున్నాయి. సమీకరించిన నిధుల నుంచి రూ.120 కోట్లు రుణ భారాన్ని తగ్గించుకోవడానికి, ఇతర సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నారు. ల్యాండ్మార్క్ కార్స్ (Landmark Cars IPO) దేశంలో ప్రీమియం కార్ల రిటైల్ విక్రయాలకు వేదికగా ఉంది. ఇది మెర్సిడెస్ బెంజ్, హోండా, జీప్, ఫోక్స్వ్యాగన్, రెనోకు రిటైల్ డీలర్గా వ్యవహరిస్తోంది. కొత్త వాహనాల విక్రయాలతో పాటు విడిభాగాలు, ల్యూబ్రికెంట్స్, యాక్సెసరీస్ విక్రయాలు, మరమ్మతుల వంటి సేవలనూ అందిస్తోంది. అలాగే పాత కార్ల క్రయ విక్రయ వ్యాపారాన్నీ నిర్వహిస్తోంది.
అబన్స్ హోల్డింగ్స్: ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న అబన్స్ హోల్డింగ్స్ ఓ ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ. యూకే, సింగపూర్, యూఏఈ, చైనా, మారిషస్, భారత్లో ఇది కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కంపెనీ ఐపీఓ డిసెంబరు 13 నుంచి 15 వరకు కొనసాగనుంది. ధరల శ్రేణిని రూ.481-506గా నిర్ణయించారు. రూ.552 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మదుపర్లు కనీసం 29 షేర్లకు బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది.
డ్రోన్ఆచార్య: దేశంలో తొలి డ్రోన్ అంకుర సంస్థ అయిన డ్రోన్ఆచార్య ఏరియల్ ఇన్నోవేషన్స్ (Droneacharya AI IPO) ఐపీఓ సైతం వచ్చేవారంలో ప్రారంభం కానుంది. డిసెంబరు 13 నుంచి డిసెంబరు 15 మధ్య షేర్ల సబ్స్క్రిప్షన్ ప్రక్రియ కొనసాగనుంది. మొత్తం 62.90 లక్షల షేర్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 8.90 లక్షల షేర్లు సంస్థాగత మదుపర్లకు, 11.94 లక్షల షేర్లు అర్హతగల సంస్థాగత మదుపర్లకు, 20.92 లక్షల షేర్లు రిటైల్ ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉంచారు. ఇది ఎస్ఎంఈ ఐపీఓ. కనీసం 2000 షేర్లకు బిడ్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అంటే కనీస పెట్టుబడి రూ.1.08 లక్షలు. ఈ షేర్లు కేవలం బీఎస్ఈ ఎస్ఎంఈ ఇండెక్స్లో మాత్రమే లిస్ట్ కానున్నాయి.
యూనిపార్ట్స్ లిస్టింగ్: వచ్చే సోమవారం యూనిపార్ట్స్ ఇండియా (Uniparts India IPO) షేర్లు స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానున్నాయి. రూ.548-577 ధరల శ్రేణి వద్ద ఈ కంపెనీ ఐపీఓకి వచ్చిన విషయం తెలిసిందే. నవంబరు 30 నుంచి డిసెంబరు 2 వరకు షేర్ల సబ్స్క్రిప్షన్ ప్రక్రియ కొనసాగింది. ఐపీఓలో ఈ కంపెనీ షేర్లు 25.3 రెట్లు సబ్స్క్రైబ్ అయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4 లక్షల స్కూటర్లు రీకాల్ చేసిన సుజుకీ.. ఇందులో మీ మోడల్ ఉందా?
Suzuki Motorcycle: సుజుకీ కంపెనీ దాదాపు 4 లక్షల వాహనాలను రీకాల్ చేసింది. ఆయా వాహనాల్లో ఉన్న లోపాన్ని గుర్తించి ఈ రీకాల్ చేపట్టింది. -
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
తాజా వార్తలు (Latest News)
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్