FPIs: రెండు నెలల విరామం తర్వాత మళ్లీ అమ్మేశారు!
విదేశీ మదుపర్ల వరుస తొమ్మిది నెలల పెట్టుబడుల ఉపసంహరణకు జులై, ఆగస్టులో బ్రేక్ పడింది. తిరిగి సెప్టెంబరులో మళ్లీ నికర అమ్మకందారులుగా నిలిచారు.
దిల్లీ: రెండు నెలల విరామం తర్వాత విదేశీ మదుపర్లు (FPI) సెప్టెంబరులో తిరిగి నికర అమ్మకందారులుగా నిలిచారు. రూపాయి భారీ పతనం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ కఠిన నిర్ణయాల నేపథ్యంలో దాదాపు రూ.7,600 కోట్లు ఉపసంహరించుకున్నారు. దీంతో 2022లో ఇప్పటి వరకు ఎఫ్పీఐలు భారత్ నుంచి రూ.1.68 లక్షల కోట్లు వెనక్కి తీసుకున్నట్లయింది. వచ్చే కొన్ని నెలల పాటు పలు అంతర్జాతీయ, దేశీయ పరిణామాల వల్ల భారత్లోకి ఎఫ్పీఐల ప్రవాహం అస్థిరంగా ఉంటుందని నిపుణులు అంచనా వేశారు.
అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం ఆందోళనకర స్థాయిలో కొనసాగుతున్నట్లు కొటాక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ విభాగాధిపతి శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు. ఈ సమయంలో యూకే ప్రభుత్వం అవలంబిస్తున్న ద్రవ్య విధానాలు ప్రధాన కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపాయని పేర్కొన్నారు. దేశీయంగా ఇంధన సంబంధిత ఇబ్బందులతో పాటు జీడీపీ అంచనాల్లో కోత ఈక్విటీ మార్కెట్ల కదలికలపై ప్రభావం చూపిందని పేర్కొన్నారు. డిపాజిటరీల సమాచారం ప్రకారం.. సెప్టెంబరులో ఎఫ్పీఐలు రూ.7,624 కోట్లు ఉపసంహరించుకున్నారు. ఆగస్టులో రూ.51,200 కోట్లు, జులైలో రూ.5,000 కోట్లు దేశీయ మార్కెట్లలో పెట్టుబడిగా పెట్టిన విషయం తెలిసిందే. అంతక్రితం వరుసగా ఎనిమిది నెలల పాటు వీరు భారీ ఎత్తున నిధుల్ని వెనక్కి తీసుకున్నారు.
అమెరికా ఫెడరల్ రిజర్వు కఠిన నిర్ణయాలు, రూపాయి పతనం, యూఎస్ బాండ్లపై వడ్డీలు పెరగడం, ఆర్థిక మాంద్యం భయాలు మదుపర్ల సెంటిమెంటును దెబ్బతీశాయి. మరోవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతుండడం కూడా ప్రభావం చూపింది. ఆగస్టు నెలలో అమెరికాలో ద్రవ్యోల్బణం అంచనాలకు మించి 8.3 శాతంగా నమోదు కావడం పరిస్థితిని మరింత దిగజార్చింది. దీంతో ఫెడ్ వడ్డీరేట్లను 75 బేసిస్ పాయింట్లు పెంచింది. అలాగే మున్ముందు మరింత పెంచుతామని స్పష్టం చేసింది. ఫలితంగా ఆర్థికమాంద్యం తప్పకపోవచ్చని ప్రకటించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లను ఓ కదుపు కుదిపింది. దీనికి కరెన్సీల పతనం కూడా జతయ్యింది. సెప్టెంబరులో డాలర్ విలువ గణనీయంగా పెరిగింది. అమెరికాలో వడ్డీరేట్లు కూడా పెరగడంతో ఎఫ్పీఐలు అమెరికా స్థిర ఆదాయ మార్గాల్లోకి తమ పెట్టుబడులను మళ్లించడానికి మొగ్గుచూపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం