Sam Bankman Fried: ‘కింగ్ ఆఫ్ క్రిప్టో’గా పేరొందాడు.. చివరకు దోషిగా తేలాడు!
Sam Bankman Fried | క్రిప్టో ఎక్స్చేంజ్ ఎఫ్టీఎక్స్ వ్యవస్థాపకుడు శామ్ బ్యాంక్మన్ ఆర్థిక మోసాలు, అక్రమ నగదు చలామణి వంటి నేరాలకు పాల్పడ్డట్లు న్యూయార్క్ కోర్టు తేల్చింది.
న్యూయార్క్: క్రిప్టోకరెన్సీ పరిశ్రమలో శామ్ బ్యాంక్మన్ ఫ్రైడ్ (Sam Bankman Fried)ది ఓ ప్రత్యేక అధ్యాయం. అయితే, ఆయన ఎంత వేగంగా ఎదిగారో.. అంతే వేగంగా పతనాన్ని చవిచూశారు. ఖరీదైన వాణిజ్య ప్రకటనలు, నిత్యం అత్యున్నతస్థాయి వ్యాపారులు, రాజకీయ నాయకులతో సమావేశాలు, భవిష్యత్లో అగ్రరాజ్య అధ్యక్షుడవుతాడనే అంచనాలు.. ఇవన్నీ గురువారం న్యూయార్క్లోని ఓ కోర్టు తీర్పుతో అడుగంటిపోయాయి. ఆర్థిక మోసం, అక్రమ నగదు చలామణిలో ఆయనను దోషిగా తేలుస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. దీంతో ఒకప్పుడు ‘కింగ్ ఆఫ్ క్రిప్టో’గా పేరొందిన ఆయన ఇప్పుడు జైలులో గడపాల్సిన పరిస్థితి నెలకొంది.
ఎవరీ బ్యాంక్మన్?
2017లో వాల్ స్ట్రీట్లో ఉద్యోగం వదిలేసి అలమెడా రీసెర్చ్ పేరిట హెడ్జ్ ఫండ్ను ఏర్పాటు చేశారు శామ్ బ్యాంక్మన్ ఫ్రైడ్ (Sam Bankman Fried). ఆయన తల్లిదండ్రులు స్టాన్ఫోర్డ్ లా స్కూల్లో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు. రెండేళ్ల తర్వాత ఎఫ్టీఎక్స్ పేరుతో క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజ్ను నెలకొల్పారు. తర్వాత రెండేళ్ల పాటు క్రిప్టోలో భారీ ర్యాలీ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం బ్యాంక్మన్ సంపద 26 బిలియన్ డాలర్లకు చేరింది. అప్పటికీ ఆయన వయసు 30 ఏళ్లు కూడా నిండలేదు. తన సంపదతో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థులకు భారీ ఎత్తున విరాళాలు ఇచ్చారు. 2022 అమెరికా మధ్యంతర ఎన్నికల సమయంలో పార్టీ కార్యకలాపాలకు ఆర్థిక సాయం చేశారు. బహమాస్ కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహించిన బ్యాంక్మన్.. తనదైన ఆహార్యంతో అప్పట్లో అందరి దృష్టినీ ఆకర్షించారు. బిల్ క్లింటన్ వంటి హేమాహేమీలతోనూ ఆయన షార్ట్స్ ధరించి సమావేశమయ్యేవారు.
క్రిప్టోకరెన్సీపై తొలి నుంచీ అనేక అనుమానాలు, సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే, ఇది సురక్షితమైన పెట్టుబడి మార్గమని చెప్పడం కోసం బ్యాంక్మన్ (Sam Bankman Fried) భారీ ఎత్తున వాణిజ్య ప్రకటనలు ఇచ్చారు. అందుకోసం హాలీవుడ్కు చెందిన పెద్ద పెద్ద సెలబ్రిటీలను రంగంలోకి దింపారు. వారికి పెద్ద మొత్తం చెల్లించేందుకూ వెనుకాడలేదు.
ఇదీ జరిగిందీ..
అసలు వివాదం ఎఫ్టీఎక్స్, అలమెడా రీసెర్చ్ మధ్య సంబంధంతోనే మొదలైంది. వాస్తవానికి ఈ రెండు కంపెనీలు వేర్వేరని బ్యాంక్మన్ (Sam Bankman Fried) చెప్పేవారు. కానీ, అది వాస్తవం కాదని తర్వాత తేలింది. ఈ విషయాన్ని కాయిన్డెస్క్ అనే వెబ్సైట్ బహిర్గతం చేసింది. అలమెడా ఆస్తుల్లో చాలా వరకు ఎఫ్టీఎక్స్ ఆవిష్కరించిన ఎఫ్టీటీ క్రిప్టో టోకెన్ల రూపంలోనే ఉన్నట్లు తెలిపింది. మార్కెట్ విలువ ప్రకారం తమ ఎఫ్టీటీ టోకెన్ల విలువ బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు అప్పట్లో అలమెడా లెక్కగట్టింది. వాస్తవానికి టోకెన్లన్నీ ఈ ఇరు సంస్థల అధీనంలోనే ఉన్నాయి. అసలు సర్క్యులేషన్లో ఉన్నవి చాలా తక్కువ. అంటే అలమెడా విలువ పూర్తిగా ఊహాజనితమే.
ఈ విషయం బయటకు రాగానే ఎఫ్టీఎక్స్ ప్రత్యర్థి సంస్థ బైనాన్స్ వ్యూహాత్మకంగా వ్యవహరించి తమ వద్ద ఉన్న ఎఫ్టీటీ టోకెన్లను అన్నింటినీ విక్రయించేసింది. దీంతో మిగతా ట్రేడర్లు సైతం తమ ఎఫ్టీటీ హోల్డింగ్స్ను వదిలించుకునేందుకు ఎగబడ్డారు. ఫలితంగా ఎఫ్టీటీ విలువ 75 శాతానికి పైగా పడిపోయింది. అలమెడా ఆస్తుల విలువ పూర్తిగా ఆవిరైంది. మరోవైపు ఎఫ్టీఎక్స్ నుంచి నిధులను ఉపసంహరించుకునేందుకు మదుపర్లు ఎగబడ్డారు. కానీ, కస్టమర్లు, ఇన్వెస్టర్ల ఫండ్లను అప్పటికే ఎఫ్టీఎక్స్ అక్రమంగా అలమెడా లోన్ల కోసం తనఖా కిందకు తరలించింది. తద్వారా అలమెడా నష్టాలను పూడ్చేందుకు ప్రయత్నించారు. అలాగే రాజకీయ విరాళాలు, బహమాస్లో విలాసవంతమైన లైఫ్స్టైల్ కోసం వినియోగించారు. కానీ, మదుపర్లు ఒక్కసారిగా విత్డ్రాలకు ఎగబడడంతో ఎఫ్టీఎక్స్ వద్ద మదుపర్లకు చెల్లించేందుకు నిధులు లేవు. మరోవైపు అలమెడా దగ్గర ఉన్న టోకెన్లకు విలువ లేకుండా పోయింది. ఫలితంగా ఎఫ్టీఎక్స్ దివాలా పరిష్కార ప్రణాళికకు దరఖాస్తు చేసుకుంది. ఈ వ్యవహారంలో బ్యాంక్మన్తో పాటు మరో ముగ్గురూ ఉన్నారు. వారంతా తప్పులను కోర్టు ముందు అంగీకరించారు. బ్యాంక్మన్ ఆదేశాల మేరకే తాము నడుచుకున్నట్లు తెలిపారు. కస్టమర్లను మోసం చేయడం, అక్రమ నగదు చలామణి సహా మొత్తం ఏడు అభియోగాల్లో బ్యాంక్మన్ దోషిగా తేలారు. దాదాపు 10 బిలియన్ డాలర్ల విలువైన ఆర్థిక నేరం సంభవించినట్లు తేల్చారు. ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక మోసాల్లో ఒకటని కోర్టు వ్యాఖ్యానించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
తాజా వార్తలు (Latest News)
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం