సంక్షిప్త వార్తలు
అపాచీ ఆర్టీఆర్ 160 4వీలో 2023 ప్రత్యేక ఎడిషన్ను టీవీఎస్ మోటార్ కంపెనీ మంగళవారం విడుదల చేసింది.
టీవీఎస్ సరికొత్త అపాచీ
చెన్నై: అపాచీ ఆర్టీఆర్ 160 4వీలో 2023 ప్రత్యేక ఎడిషన్ను టీవీఎస్ మోటార్ కంపెనీ మంగళవారం విడుదల చేసింది. ధర రూ.1.30 లక్షలు (ఎక్స్షోరూం, దిల్లీ). దేశవ్యాప్తంగా టీవీఎస్ డీలర్లందరి వద్ద ఇది అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. తెల్లటి ముత్యపు రంగులో లభ్యమయ్యే ఈ 159.7 సీసీ మోటార్ సైకిల్లో డ్యూయల్ టోన్ సీటు, అడ్జస్టబుల్ క్లచ్, బ్రేక్ లివర్స్, ముందువైపు రేడియల్ టైర్, ఫైవ్ స్పీడ్ గేర్బాక్స్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ లాంటివి ఉన్నాయి.
ఎఫ్పీఐ, సామాజిక స్టాక్ ఎక్స్ఛేంజీ సలహా సంఘాల్లో మార్పులు
దిల్లీ: విదేశీ పోర్ట్ఫోలియో మదుపర్లు (ఎఫ్పీఐలు), సామాజిక స్టాక్ ఎక్స్ఛేంజీలకు సంబంధించి తన సలహా సంఘాల్లో మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ మార్పులు చేర్పులు చేసింది. 16 మంది సభ్యులుండే ఎఫ్పీఐ సలహా కమిటీకి ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి హస్ముఖ్ అథియా నేతృత్వం వహిస్తారు. అంతక్రితం మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్ దీనికి నేతృత్వం వహించేవారు. ఆగస్టులో ఏర్పాటైన 15 మంది సభ్యుల కమిటీలో జేపీమోర్గాన్ చేస్ బ్యాంక్కు చెందిన మాధవ్ కల్యాణ్ ఒక సభ్యుడిగా ఉండగా.. ఆయన స్థానంలో జీఐసీ ఎండీ చూ హాయ్ జాంగ్; జేపీమోర్గాన్ (డైరెక్ట్ కస్టడీ, క్లియరింగ్) ఎండీ మైఖేల్ డ్రమ్గూల్ చేరతారు.
* సామాజిక స్టాక్ ఎక్స్ఛేంజీ సలహా సంఘంలోకి సమున్నతి ఫైనాన్షియల్ ఇంటర్మీడియేషన్ సీఈఓ అనిల్ కుమార్; హెచ్సీఎల్ టెక్ గ్లోబల్ హెడ్ సంతోశ్ జయరామ్; గైడ్స్టార్ ఇండియా సీఈఓ పుష్ప అమన్ సింగ్; బిల్ రైర్సన్ టెక్నాలజీ స్టార్టప్ ఇంక్యుబేటర్ ఫౌండేషన్ ఎండీ హేమంత్గుప్తా చేరతారు. ప్రస్తుతమున్న మోహన్దాస్ పాయ్, రూపా కుద్వా, గిరీశ్ సొహానీలు వైదొలగుతారు. 18 మంది సభ్యులుండే ఈ కమిటీకి గ్రాస్రూట్స్ రీసెర్చ్ అండ్ అడ్వొకసీ మూమెంట్ ఛైర్మన్ ఆర్ బాలసుబ్రమణియం నేతృత్వం వహిస్తారు.
అరుణోదయ హాస్పిటల్స్లో కిమ్స్ హాస్పిటల్స్కు 65.62% వాటా
ఈనాడు, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంలో ఉన్న అరుణోదయ హాస్పిటల్స్లో అదనంగా 7.79 శాతం వాటాను కిమ్స్ హాస్పిటల్స్ (కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) సొంతం చేసుకుంది. ఒక్కో షేరును రూ.370 ధరకు కొనుగోలు చేసినట్లు కిమ్స్ హాస్పిటల్స్ వెల్లడించింది. దీంతో అరుణోదయ హాస్పిటల్స్లో కిమ్స్ వాటా ఇంతకు ముందున్న 57.83% నుంచి 65.62 శాతానికి పెరిగింది. 200 పడకలున్న అరుణోదయ హాస్పిటల్స్ ఉత్తరాంధ్ర, ఒడిశా నుంచి వచ్చే రోగులకు సేవలు అందిస్తోంది.
రూ.350 కోట్లతో ఫిలాటెక్స్ ఫ్యాషన్స్ విస్తరణ
ఈనాడు, హైదరాబాద్: ప్రముఖ సంస్థల కోసం సాక్సులను తయారు చేసే హైదరాబాదీ సంస్థ ఫిలాటెక్స్ ఫ్యాషన్స్ రూ.350 కోట్లతో తమ ప్లాంటును విస్తరించడంతోపాటు, సాక్సుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 70 లక్షల నుంచి 3 కోట్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. మధుమేహులు, చిన్న పిల్లలు, మహిళల కోసం ప్రత్యేక ఉత్పత్తులను అందిస్తున్నామని, త్వరలోనే ట్రాక్, టీషర్టుల విభాగాల్లోకి అడుగుపెడతామని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రభాత్ సేథియా మంగళవారం ఇక్కడ చెప్పారు. ఏడాదిన్నరలో విస్తరణ పూర్తవుతుందని, మరో 1500-1700 మంది ఉద్యోగులను నియమించుకుంటామన్నారు. శ్రీలంకలో ఏడాదికి 4.8 కోట్ల సాక్సులను ఉత్పత్తి చేసే ఇసాబెల్లాలో 51% వాటాను రూ.75 కోట్లతో కొనుగోలు చేశామని పేర్కొన్నారు. హైదరాబాద్ ప్లాంటు విస్తరణకు అవసరమైన 60 శాతం నిధుల కోసం ప్రిఫరెన్షియల్ షేర్లు జారీ చేయబోతున్నామని, 40 శాతం కంపెనీ నిధులను వెచ్చిస్తామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.120 కోట్ల టర్నోవర్, రూ.10 కోట్ల నికర లాభాన్ని ఆర్జిస్తామనే అంచనాలున్నాయన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
Kotak Mahindra Bank: ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు గురువారం భారీగా నష్టపోయాయి. -
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
Audi: భారత్లో విక్రయిస్తున్న అన్ని రకాల కార్లపై గరిష్ఠంగా రెండు శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు ఆడి ఇండియా ప్రకటించింది. -
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
Jio Cinema: జియో సినిమా కొత్తగా రెండు సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. -
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
IRCTC tour package: వేసవిలో పుణ్యక్షేత్రాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీని ఓ సారి పరిశీలించండి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు