సంక్షిప్త వార్తలు
అపాచీ ఆర్టీఆర్ 160 4వీలో 2023 ప్రత్యేక ఎడిషన్ను టీవీఎస్ మోటార్ కంపెనీ మంగళవారం విడుదల చేసింది.
టీవీఎస్ సరికొత్త అపాచీ
చెన్నై: అపాచీ ఆర్టీఆర్ 160 4వీలో 2023 ప్రత్యేక ఎడిషన్ను టీవీఎస్ మోటార్ కంపెనీ మంగళవారం విడుదల చేసింది. ధర రూ.1.30 లక్షలు (ఎక్స్షోరూం, దిల్లీ). దేశవ్యాప్తంగా టీవీఎస్ డీలర్లందరి వద్ద ఇది అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. తెల్లటి ముత్యపు రంగులో లభ్యమయ్యే ఈ 159.7 సీసీ మోటార్ సైకిల్లో డ్యూయల్ టోన్ సీటు, అడ్జస్టబుల్ క్లచ్, బ్రేక్ లివర్స్, ముందువైపు రేడియల్ టైర్, ఫైవ్ స్పీడ్ గేర్బాక్స్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ లాంటివి ఉన్నాయి.
ఎఫ్పీఐ, సామాజిక స్టాక్ ఎక్స్ఛేంజీ సలహా సంఘాల్లో మార్పులు
దిల్లీ: విదేశీ పోర్ట్ఫోలియో మదుపర్లు (ఎఫ్పీఐలు), సామాజిక స్టాక్ ఎక్స్ఛేంజీలకు సంబంధించి తన సలహా సంఘాల్లో మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ మార్పులు చేర్పులు చేసింది. 16 మంది సభ్యులుండే ఎఫ్పీఐ సలహా కమిటీకి ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి హస్ముఖ్ అథియా నేతృత్వం వహిస్తారు. అంతక్రితం మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్ దీనికి నేతృత్వం వహించేవారు. ఆగస్టులో ఏర్పాటైన 15 మంది సభ్యుల కమిటీలో జేపీమోర్గాన్ చేస్ బ్యాంక్కు చెందిన మాధవ్ కల్యాణ్ ఒక సభ్యుడిగా ఉండగా.. ఆయన స్థానంలో జీఐసీ ఎండీ చూ హాయ్ జాంగ్; జేపీమోర్గాన్ (డైరెక్ట్ కస్టడీ, క్లియరింగ్) ఎండీ మైఖేల్ డ్రమ్గూల్ చేరతారు.
* సామాజిక స్టాక్ ఎక్స్ఛేంజీ సలహా సంఘంలోకి సమున్నతి ఫైనాన్షియల్ ఇంటర్మీడియేషన్ సీఈఓ అనిల్ కుమార్; హెచ్సీఎల్ టెక్ గ్లోబల్ హెడ్ సంతోశ్ జయరామ్; గైడ్స్టార్ ఇండియా సీఈఓ పుష్ప అమన్ సింగ్; బిల్ రైర్సన్ టెక్నాలజీ స్టార్టప్ ఇంక్యుబేటర్ ఫౌండేషన్ ఎండీ హేమంత్గుప్తా చేరతారు. ప్రస్తుతమున్న మోహన్దాస్ పాయ్, రూపా కుద్వా, గిరీశ్ సొహానీలు వైదొలగుతారు. 18 మంది సభ్యులుండే ఈ కమిటీకి గ్రాస్రూట్స్ రీసెర్చ్ అండ్ అడ్వొకసీ మూమెంట్ ఛైర్మన్ ఆర్ బాలసుబ్రమణియం నేతృత్వం వహిస్తారు.
అరుణోదయ హాస్పిటల్స్లో కిమ్స్ హాస్పిటల్స్కు 65.62% వాటా
ఈనాడు, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంలో ఉన్న అరుణోదయ హాస్పిటల్స్లో అదనంగా 7.79 శాతం వాటాను కిమ్స్ హాస్పిటల్స్ (కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) సొంతం చేసుకుంది. ఒక్కో షేరును రూ.370 ధరకు కొనుగోలు చేసినట్లు కిమ్స్ హాస్పిటల్స్ వెల్లడించింది. దీంతో అరుణోదయ హాస్పిటల్స్లో కిమ్స్ వాటా ఇంతకు ముందున్న 57.83% నుంచి 65.62 శాతానికి పెరిగింది. 200 పడకలున్న అరుణోదయ హాస్పిటల్స్ ఉత్తరాంధ్ర, ఒడిశా నుంచి వచ్చే రోగులకు సేవలు అందిస్తోంది.
రూ.350 కోట్లతో ఫిలాటెక్స్ ఫ్యాషన్స్ విస్తరణ
ఈనాడు, హైదరాబాద్: ప్రముఖ సంస్థల కోసం సాక్సులను తయారు చేసే హైదరాబాదీ సంస్థ ఫిలాటెక్స్ ఫ్యాషన్స్ రూ.350 కోట్లతో తమ ప్లాంటును విస్తరించడంతోపాటు, సాక్సుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 70 లక్షల నుంచి 3 కోట్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. మధుమేహులు, చిన్న పిల్లలు, మహిళల కోసం ప్రత్యేక ఉత్పత్తులను అందిస్తున్నామని, త్వరలోనే ట్రాక్, టీషర్టుల విభాగాల్లోకి అడుగుపెడతామని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రభాత్ సేథియా మంగళవారం ఇక్కడ చెప్పారు. ఏడాదిన్నరలో విస్తరణ పూర్తవుతుందని, మరో 1500-1700 మంది ఉద్యోగులను నియమించుకుంటామన్నారు. శ్రీలంకలో ఏడాదికి 4.8 కోట్ల సాక్సులను ఉత్పత్తి చేసే ఇసాబెల్లాలో 51% వాటాను రూ.75 కోట్లతో కొనుగోలు చేశామని పేర్కొన్నారు. హైదరాబాద్ ప్లాంటు విస్తరణకు అవసరమైన 60 శాతం నిధుల కోసం ప్రిఫరెన్షియల్ షేర్లు జారీ చేయబోతున్నామని, 40 శాతం కంపెనీ నిధులను వెచ్చిస్తామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.120 కోట్ల టర్నోవర్, రూ.10 కోట్ల నికర లాభాన్ని ఆర్జిస్తామనే అంచనాలున్నాయన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
iPhones cheaper: ఐఫోన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. కస్టమ్స్ సుంకాన్ని తగ్గించడమే దీనికి కారణం. -
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
Sundar Pichai: భారత్లోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఐఐటీ ఖరగ్పూర్ నుంచి గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. -
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
Stock market: దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1292, నిఫ్టీ 428 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
TIME Greatest Places: హోటళ్లు, క్రూజ్లు, రెస్టారంట్లు, పర్యటక స్థలాలు, మ్యూజియంలు, పార్క్లను పరిగణనలోకి తీసుకొని టైమ్ మ్యాగజైన్ ప్రపంచంలోని 100 గొప్ప ప్రదేశాల జాబితాను విడుదల చేసింది. -
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
Gold price: బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో ఆ దుకాణాల్లో ఆభరణాలు కొనుగోలు చేసే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. -
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
SearchGPT: గూగుల్కు పోటీగా ఓపెన్ ఏఐ సంస్థ కొత్త సెర్చింజిన్ను తీసుకొచ్చింది. ఏఐ సాయంతో ఇది పని చేస్తుంది. -
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?
ITR filing: ఐటీఆర్ ఫైలింగ్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దాఖలు గడువు ఉండకపోవచ్చునని అంచనా వేస్తున్నాయి. -
జియో ఫ్రీడమ్ ఆఫర్.. ఈ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లపై 30% తగ్గింపు
Jio Freedom Offer: ఫ్రీడమ్ ఆఫర్లో భాగంగా జియో ఎయిర్ఫైబర్ ప్లాన్ల ఇన్స్టాలేషన్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు జియో ప్రకటించింది. ఇది పరిమితకాల ఆఫర్. -
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
Job Trends: ఉదయం వచ్చి సాయంత్రం ఇంటికెళ్లే ఉద్యోగాలు ఇకపై కనుమరుగవుతాయని లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ అంచనా వేశారు. -
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 222 పాయింట్లు లాభపడి 82,262 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 24,489 వద్ద ట్రేడవుతోంది. -
పసిడి బాండ్లు ఇక జారీ కావా?
పసిడి లోహాన్ని కొనే బదులు, డిజిటల్ పద్ధతిలో బంగారంపై పెట్టుబడులు పెట్టించి, దానిపై ప్రతిఫలం కూడా అందించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన పసడి బాండ్లు ఇకపై జారీ కావనే అభిప్రాయాన్ని కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
స్థిరమైన వృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం
కెనరా బ్యాంకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.3,905 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వేతన పెంపు ఈ త్రైమాసికంలోనే
ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా, ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.851 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
అయిదో రోజూ నష్టాలే
లోహ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా అయిదో రోజూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
పబ్లిక్ ఇష్యూకు స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ త్వరలో ఐపీఓ (తొలి పబ్లిక్ ఆఫర్) కు రానుంది. -
లారస్ ల్యాబ్స్ లాభం రూ.13 కోట్లు
లారస్ ల్యాబ్స్ 2024-25 మొదటి త్రైమాసికానికి రూ.13 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఆదాయం రూ.1195 కోట్ల్లుగా నమోదైంది. -
పిట్టీ ఇంజినీరింగ్ చేతికి దక్షిణ్ ఫౌండ్రీ
పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్, కర్ణాటకకు చెందిన దక్షిణ్ ఫౌండ్రీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కొనుగోలు చేయనుంది. -
స్వల్పంగా తగ్గిన సైయెంట్ ఆదాయాలు
ఐటీ, ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయెంట్ ఆదాయాలు, లాభాల్లో క్షీణత కనిపించింది. -
హెచ్ఎమ్డీ ‘క్రెస్ట్’ ఫోన్ల ఆవిష్కరణ
ఫిన్లాండ్కు చెందిన మొబైల్ కంపెనీ హెచ్ఎమ్డీ కొత్త శ్రేణి, సొంత బ్రాండ్ల స్మార్ట్ఫోన్లను మనదేశంలో తయారు చేయనుంది. -
ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ విలువ 4 రెట్లు
కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీ(సీపీఎస్ఈ)ల పనితీరును మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందదని.. కేవలం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాల కోసమే చూడటం లేదని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు (7)
సంక్షిప్త వార్తలు
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు