అధ్వాన పరిస్థితులు ముగిసినట్లే
వృద్ధి, ద్రవ్యోల్బణం, కరెన్సీ ఊగిసలాటలపై తాజా గణాంకాలు చూస్తుంటే.. ఆర్థిక మార్కెట్లకు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అధ్వాన పరిస్థితులు ముగిసినట్లేనని అనిపిస్తోందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అభిప్రాయపడ్డారు.
వృద్ధి, ద్రవ్యోల్బణం ఇక రాణిస్తాయ్
అధిక వడ్డీ రేట్లు ఎక్కువ కాలం కొనసాగవు
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
ముంబయి: వృద్ధి, ద్రవ్యోల్బణం, కరెన్సీ ఊగిసలాటలపై తాజా గణాంకాలు చూస్తుంటే.. ఆర్థిక మార్కెట్లకు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అధ్వాన పరిస్థితులు ముగిసినట్లేనని అనిపిస్తోందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అభిప్రాయపడ్డారు. అధిక వడ్డీ రేట్లు ఎక్కువ కాలం పాటు కొనసాగడానికి సైతం తక్కువ అవకాశాలే ఉండొచ్చని ఆయన అంచనా వేశారు. దుబాయ్లో జరిగిన ఒక వార్షిక సమావేశాన్ని ఉద్దేశించిన దాస్ ఇంకా ఏమన్నారంటే..
తీవ్ర మాంద్యం రాదు..: 2023లో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఎంచదగ్గరీతిలో క్షీణిస్తుందన్న అంచనాలు ఉన్నప్పటికీ.. అటు వృద్ధి.. ఇటు ద్రవ్యోల్బణం పరంగా అధ్వాన పరిస్థితులు ముగిసినట్లే. వివిధ దేశాల్లో కరోనా సంబంధిత ఆంక్షలు తగ్గుతుండడం, ద్రవ్యోల్బణం నెమ్మదిస్తుండడం కేంద్ర బ్యాంకులు కీలక రేట్లను తగ్గించడం లేదా పెంపును పక్కనపెట్టడం చేయొచ్చు. అయితే కేంద్ర బ్యాంకులు తమ లక్ష్యాలకు చేరువగా ద్రవ్యోల్బణం దిగివచ్చేంత వరకు కృషి చేస్తాయి. అదే సమయంలో అధిక వడ్డీ రేట్లు మాత్రం ఎక్కువ కాలం పాటు కొనసాగించకపోవచ్చు. ఇక వృద్ధి విషయానికొస్తే.. కొద్ది నెలల కిందట అంచనా వేసినట్లు తీవ్ర మాంద్యం కాకుండా.. సరళ మాంద్యమే కనిపించే అవకాశం ఉంది.
మన మూలాలు బలంగానే..: భారత ఆర్థిక వ్యవస్థ విషయానికొస్తే.. అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలోనూ మనం మాత్రం స్థిరంగా ఉన్నాం. మన స్థూల ఆర్థిక మూలాల నుంచి బలం అందుతోంది. మన బ్యాంకులు, కంపెనీలు సంక్షోభ సమయంలో కంటే మిన్నగా రాణిస్తున్నాయి. బ్యాంకుల రుణాల్లో వృద్ధి రెండంకెల స్థాయికి చేరింది. ప్రపంచ వృద్ధి మసకబారుతున్నా.. మనం మాత్రం వెలుగులీనుతున్నాం. మన ద్రవ్యోల్బణం ఇంకా అధికంగానే ఉన్నా.. నవంబరు, డిసెంబరులో తగ్గుముఖం పట్టడం ఆహ్వానించదగ్గ పరిణామం. 1990ల నుంచీ ఇప్పటి దాకా మన ఆర్థిక మార్కెట్లు రాణిస్తున్నాయి. గత దశాబ్దం కాలంగా అయితే మన ఆర్థిక మార్కెట్లు స్థిరంగా ప్రగతిని సాధిస్తున్నాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చే సవాళ్లను మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి.
ద్వైపాక్షిక ఒప్పందాలు అవసరం: ఇటీవలి అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలకు ఇబ్బందులు ఎదురైన నేపథ్యంలో మళ్లీ రక్షణాత్మక దోరణులు కనిపిస్తున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను నిర్మించుకోవడం ఇపుడు అవసరం. ఆ దిశగా ప్రభుత్వం ఇటీవల యూఏఈ, ఆస్ట్రేలియా దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. మరిన్ని ఒప్పందాలూ కుదరనున్నాయి. భవిష్యత్లో సవాళ్లు కనిపిస్తున్న మాట వాస్తవమే. అయితే మనం ఆశావహ దృక్పథం, ధీమాతో వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గూగుల్లో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. తోషిబాలోనూ 5,000 మంది!
Google layoffs: గూగుల్ మరోసారి ఉద్యోగులను తొలగిస్తోంది. పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మరోవైపు జపాన్ కంపెనీ తోషిబా సైతం ఉద్యోగుల ఉద్వాసనకు సిద్ధమైంది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,268
Stock Market Opening bell: ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్ 334 పాయింట్లు లాభపడి 73,278 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 120 పాయింట్లు పెరిగి 22,268 దగ్గర కొనసాగుతోంది. -
దిగివస్తున్న ముడి ఔషధాల ధరలు
మందుల తయారీలో ఫార్మా కంపెనీలు వినియోగించే కొన్ని ముడి ఔషధాల ధరలు దిగివస్తున్నాయి. దాదాపు 10- 15 రకాల ముడి ఔషధాలను (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రేడియంట్స్/ కీ స్టార్టింగ్ మెటీరియల్స్) ఫార్మా పరిశ్రమ అధికంగా వినియోగిస్తోంది. -
భారత వృద్ధి 6.5 శాతం
భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 6.5 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. దేశంలో పలు బహుళజాతి కంపెనీలు తమ తయారీని కొనసాగిస్తుండడం వల్ల, భారత ఎగుమతులపై సానుకూల ప్రభావం పడుతోందని పేర్కొంది. -
10 ఏళ్లలో 15 లక్షల వృద్ధుల నివాసాలు
దేశంలో వచ్చే 10 ఏళ్లలో వయోవృద్ధుల నివాసాలు 15 లక్షల మేర నిర్మించాల్సి రావొచ్చని స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ అంచనా వేస్తోంది. 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వారి (వయోవృద్ధుల) సంఖ్య పెరుగుతుండటమే ఇందుకు కారణమని పేర్కొంది. -
యువశక్తి సద్వినియోగం ఏదీ?
దేశంలో పనిచేసే వయస్సులోని యువతీ, యువకులు అధికంగా ఉన్నారని, ఆ శక్తిని సద్వినియోగం చేసుకోవడం మాత్రం జరగడం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ రాజన్ ఆక్షేపించారు. -
డాక్టర్ పావులూరి సుబ్బారావుకు ‘ఆర్యభట్ట’ అవార్డు
అనంత్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ డాక్టర్ పావులూరి సుబ్బారావును ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ), ‘ఆర్యభట్ట’ అవార్డు తో సత్కరించింది. -
యూపీఐ లావాదేవీల్లో ఫోన్పే, గూగుల్పే వాటా 86%
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) విభాగంలో ఫోన్పే, గూగుల్పే సంస్థల ఆధిపత్యం పెరుగుతుండటంపై నెలకొన్న ఆందోళనలను పరిష్కరించేందుకు ఫిన్టెక్ అంకుర సంస్థలతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఓ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. -
స్మాల్క్యాప్ ఫండ్ల నిర్వహణలోని ఆస్తులు రూ.2.43 లక్షల కోట్లు
గత ఆర్థిక సంవత్సరం (2023-24) చివరికి చిన్నతరహా కంపెనీ (స్మాల్ క్యాప్) మ్యూచువల్ఫండ్ల (ఎంఎఫ్) నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.2.43 లక్షల కోట్లకు చేరింది. -
శామ్సంగ్ కృత్రిమ మేధ టీవీలు
కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో కూడిన అల్ట్రా ప్రీమియం నియో క్యూఎల్ఈడీ, ఓఎల్ఈడీ టీవీలను శామ్సంగ్ బుధవారం విపణిలోకి విడుదల చేసింది. -
యాంకర్ మదుపర్ల నుంచి వొడాఫోన్ ఐడియా రూ.5,400 కోట్ల సమీకరణ
ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీఓ)కు ముందు, యాంకర్ మదుపర్ల నుంచి రూ.5,400 కోట్లు సమీకరించినట్లు వొడాఫోన్ ఐడియా ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్కు చెందిన ప్రీమియర్ ఎనర్జీస్కు అనుబంధంగా ఉన్న ప్రీమియర్ ఎనర్జీస్ ఫొటోవోల్టాయిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు 140 మెగావాట్ల సొలార్ పీవీ (ఫొటో వోల్టాయిక్) మాడ్యూల్స్ సరఫరా ఎగుమతి కాంట్రాక్టు లభించింది. -
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
Ghazal Alagh: కెరియర్ టిప్స్ పంచుకుంటూ నెట్టింట యాక్టివ్గా ఉండే మామాఎర్త్ సీఈఓ తాజాగా ఓ భావోద్వేగమైన పోస్ట్ పెట్టారు. ఉమ్మడి కుటుంబ ప్రాధాన్యం గురించి రాసుకొచ్చారు. -
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
Samsung: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఫీచర్లతో శాంసంగ్ కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి..
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్ను బద్నాం చేయాలనే కాఫర్ డ్యామ్ కట్టడంలేదు: కేటీఆర్
-
మల్కాజిగిరిలో భారీ మెజారిటీతో ఈటల గెలుపు: కిషన్రెడ్డి
-
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
-
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
-
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
-
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై