అధ్వాన పరిస్థితులు ముగిసినట్లే
వృద్ధి, ద్రవ్యోల్బణం, కరెన్సీ ఊగిసలాటలపై తాజా గణాంకాలు చూస్తుంటే.. ఆర్థిక మార్కెట్లకు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అధ్వాన పరిస్థితులు ముగిసినట్లేనని అనిపిస్తోందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అభిప్రాయపడ్డారు.
వృద్ధి, ద్రవ్యోల్బణం ఇక రాణిస్తాయ్
అధిక వడ్డీ రేట్లు ఎక్కువ కాలం కొనసాగవు
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
ముంబయి: వృద్ధి, ద్రవ్యోల్బణం, కరెన్సీ ఊగిసలాటలపై తాజా గణాంకాలు చూస్తుంటే.. ఆర్థిక మార్కెట్లకు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అధ్వాన పరిస్థితులు ముగిసినట్లేనని అనిపిస్తోందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అభిప్రాయపడ్డారు. అధిక వడ్డీ రేట్లు ఎక్కువ కాలం పాటు కొనసాగడానికి సైతం తక్కువ అవకాశాలే ఉండొచ్చని ఆయన అంచనా వేశారు. దుబాయ్లో జరిగిన ఒక వార్షిక సమావేశాన్ని ఉద్దేశించిన దాస్ ఇంకా ఏమన్నారంటే..
తీవ్ర మాంద్యం రాదు..: 2023లో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఎంచదగ్గరీతిలో క్షీణిస్తుందన్న అంచనాలు ఉన్నప్పటికీ.. అటు వృద్ధి.. ఇటు ద్రవ్యోల్బణం పరంగా అధ్వాన పరిస్థితులు ముగిసినట్లే. వివిధ దేశాల్లో కరోనా సంబంధిత ఆంక్షలు తగ్గుతుండడం, ద్రవ్యోల్బణం నెమ్మదిస్తుండడం కేంద్ర బ్యాంకులు కీలక రేట్లను తగ్గించడం లేదా పెంపును పక్కనపెట్టడం చేయొచ్చు. అయితే కేంద్ర బ్యాంకులు తమ లక్ష్యాలకు చేరువగా ద్రవ్యోల్బణం దిగివచ్చేంత వరకు కృషి చేస్తాయి. అదే సమయంలో అధిక వడ్డీ రేట్లు మాత్రం ఎక్కువ కాలం పాటు కొనసాగించకపోవచ్చు. ఇక వృద్ధి విషయానికొస్తే.. కొద్ది నెలల కిందట అంచనా వేసినట్లు తీవ్ర మాంద్యం కాకుండా.. సరళ మాంద్యమే కనిపించే అవకాశం ఉంది.
మన మూలాలు బలంగానే..: భారత ఆర్థిక వ్యవస్థ విషయానికొస్తే.. అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలోనూ మనం మాత్రం స్థిరంగా ఉన్నాం. మన స్థూల ఆర్థిక మూలాల నుంచి బలం అందుతోంది. మన బ్యాంకులు, కంపెనీలు సంక్షోభ సమయంలో కంటే మిన్నగా రాణిస్తున్నాయి. బ్యాంకుల రుణాల్లో వృద్ధి రెండంకెల స్థాయికి చేరింది. ప్రపంచ వృద్ధి మసకబారుతున్నా.. మనం మాత్రం వెలుగులీనుతున్నాం. మన ద్రవ్యోల్బణం ఇంకా అధికంగానే ఉన్నా.. నవంబరు, డిసెంబరులో తగ్గుముఖం పట్టడం ఆహ్వానించదగ్గ పరిణామం. 1990ల నుంచీ ఇప్పటి దాకా మన ఆర్థిక మార్కెట్లు రాణిస్తున్నాయి. గత దశాబ్దం కాలంగా అయితే మన ఆర్థిక మార్కెట్లు స్థిరంగా ప్రగతిని సాధిస్తున్నాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చే సవాళ్లను మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి.
ద్వైపాక్షిక ఒప్పందాలు అవసరం: ఇటీవలి అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలకు ఇబ్బందులు ఎదురైన నేపథ్యంలో మళ్లీ రక్షణాత్మక దోరణులు కనిపిస్తున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను నిర్మించుకోవడం ఇపుడు అవసరం. ఆ దిశగా ప్రభుత్వం ఇటీవల యూఏఈ, ఆస్ట్రేలియా దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. మరిన్ని ఒప్పందాలూ కుదరనున్నాయి. భవిష్యత్లో సవాళ్లు కనిపిస్తున్న మాట వాస్తవమే. అయితే మనం ఆశావహ దృక్పథం, ధీమాతో వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల