మలివిడత పబ్లిక్ ఆఫర్ యథాతథంగానే
అదానీ ఎంటర్ప్రైజెస్ రూ.20,000 కోట్ల మలివిడత పబ్లిక్ ఆఫర్పై (ఎఫ్పీఓ) వెనుకడుగు వేసేది లేదని అదానీ గ్రూపు స్పష్టం చేసింది.
తేదీల్లో మార్పుల్లేవ్.. ఇష్యూ ధర తగ్గించబోం
ఊహాగానాలపై అదానీ గ్రూపు స్పష్టత
ముంబయి: అదానీ ఎంటర్ప్రైజెస్ రూ.20,000 కోట్ల మలివిడత పబ్లిక్ ఆఫర్పై (ఎఫ్పీఓ) వెనుకడుగు వేసేది లేదని అదానీ గ్రూపు స్పష్టం చేసింది. ఇష్యూ ధర, తేదీల్లో మార్పులు చేస్తున్నట్లు వస్తున్న ఊహాగానాలను కొట్టిపారేసింది. ‘అనుకున్న సమయానికే.. నిర్ణయించిన ధరల శ్రేణి ప్రకారమే ఎఫ్పీఓ జరుగుతుంద’ని కంపెనీ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. బీఎస్ఈ వద్ద లభ్యమవుతున్న సమాచారం ప్రకారం.. ఎఫ్పీఓకు తొలి రోజున (శుక్రవారం) కేవలం 1 శాతం మాత్రమే స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 4.55 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. 4.7 లక్షల షేర్లకే బిడ్లు దాఖలయ్యాయి. హిండెన్బర్గ్ ఆరోపణల ప్రభావంతో అదానీ గ్రూపు షేర్లు పతనమైన నేపథ్యంలో.. ఇష్యూలో మార్పులు చేయాలని బ్యాంకర్లు అనుకుంటున్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇష్యూ సమయాన్ని పొడిగించడం లేదంటే ఇష్యూ ధరను తగ్గించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. అయితే ఈ ఊహాగానాలపై పై విధంగా అదానీ గ్రూపు స్పష్టత ఇచ్చింది. ‘బ్యాంకర్లు, మదుపర్లు సహా మా వాటాదార్లందరూ ఎఫ్పీఓపై పూర్తి విశ్వాసంతో ఉన్నారు. ఈ ఇష్యూ విజయవంతం అవుతుందనే నమ్మకంతో మేం ఉన్నామ’ని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది.
ఆరోపణలపై వివరణ ఇవ్వండి: ఎంఎస్సీఐ
షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని.. ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందంటూ హిండెన్బర్గ్ నివేదిక చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాల్సిందిగా అదానీ గ్రూపును సూచీల సంస్థ ఎంఎస్సీఐ అడిగింది. ‘నివేదికలోని అంశాలను సునిశితంగా పరిశీలిస్తున్నాం. ఎంఎస్సీఐ గ్లోబల్ ఇన్వెస్టబుల్ మార్కెట్ సూచీలలో సంబంధిత షేర్ల అర్హతపై దీని ప్రభావం ఎలా ఉంటుందో కూడా గమనిస్తున్నామ’ని ఎంఎస్సీఐ తెలిపింది. ఈ వ్యవహారంపై మార్కెట్ వర్గాల నుంచి ఎప్పటికప్పుడు అభిప్రాయాలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఎంఎస్సీఐ స్టాండర్డ్ ఇండెక్స్లో అదానీ గ్రూపునకు చెందిన 8 కంపెనీలు ఉన్నాయి. నివేదిక సంబంధించి ఏమైనా ప్రతికూల వివరణ అందితే.. ఎంఎస్సీఐ సూచీలో అదానీ గ్రూపు షేర్ల వెయిటేజీని తగ్గించడం లేదంటే తొలగించే అవకాశాలు ఉంటాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే జరిగితే షేర్లు మరింత అమ్మకాల ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
అదానీ గ్రూపునకు వివాదాలు కొత్త కాదు
అదానీ గ్రూపునకు వివాదాలు కొత్తేమీ కాదనే మాట వినిపిస్తోంది. ఆస్ట్రేలియాలోని క్వీన్స్ల్యాండ్లో ఏర్పాటు చేసిన బొగ్గు గని ప్రాజెక్టుపై అక్కడి పర్యావరణవేత్తల నుంచి అప్పట్లో వ్యతిరేకత ఎదురైంది. కేరళలో 900 మిలియన్ డాలర్లతో అదానీ గ్రూపు నిర్మిస్తున్న నౌకాశ్రయంపైనా మత్స్యకారులు ఆందోళనలు చేశారు. ఈ వ్యవహారంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం, మత్స్యకారుల నాయకులపై అదానీ గ్రూపు కేసు వేసింది. తాజాగా హిండెన్బర్గ్ నివేదిక రూపంలో మరో సవాలును అదానీ గ్రూపు ఎదుర్కొంటోంది. సరిగ్గా అదానీ గ్రూపు ఎంటర్ప్రైజెస్ మలివిడత పబ్లిక్ ఆఫర్కు ముందే ఈ నివేదిక వెలువడటం, గ్రూపు కంపెనీల షేర్లు పతనమవ్వడంతో.. ఈ సమస్యను ఎలా అధిగమించి ఎఫ్పీఓను విజయవంతం చేసుకుంటుందనే దానిపై ఇప్పుడు కార్పొరేట్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
దర్యాప్తునకు కాంగ్రెస్ డిమాండ్
అదానీ గ్రూపు కంపెనీల షేర్ల భారీ పతనం ప్రభావంతో ఆ కంపెనీలకు రుణాలిచ్చిన ఎస్బీఐ, వాటిల్లో పెట్టుబడులు పెట్టిన ఎల్ఐసీ సంస్థలు మొత్తంగా రూ.78,000 కోట్ల మార్కెట్ విలువను కోల్పోయినప్పటికీ.. కేంద్ర ఆర్థిక మంత్రి, దర్యాప్తు సంస్థలు ఇంకా మౌనంగా ఎందుకు ఉన్నారంటూ కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. ఈ వ్యవహారంలో పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించాలని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రణ్దీప్ సుర్జేవాలా డిమాండు చేస్తున్నారు. హిండెన్బర్గ్ నివేదిక అనంతరం షేర్లు పతనమైన తర్వాత కూడా అదానీ గ్రూపులో మళ్లీ రూ.300 కోట్లను ఎల్ఐసీ ఎందుకు పెట్టుబడిగా పెడుతోందని ఆయన ప్రశ్నిస్తున్నారు.
ఎన్డీటీవీకి శ్రీనివాసన్ జైన్ రాజీనామా
ఎన్డీటీవీకి రాజీనామా చేస్తున్నట్లు జర్నలిస్టు శ్రీనివాసన్ జైన్ తెలిపారు. ‘ఎన్డీటీవీలో మూడు దశాబ్దాల పాటు అద్భుతంగా సాగిన నా ప్రయాణం నేటితో ముగిసింది. రాజీనామా తీసుకోవాలనే నిర్ణయం అంత సులభమైనది కాదు. కానీ తీసుకోవాల్సి వచ్చింద’ని ట్విటర్లో ఆయన తెలిపారు. ఎన్డీటీవీలో ప్రముఖ వ్యక్తుల్లో శ్రీనివాసన్ జైన్ ఒకరు. వీక్షకుల ఆదరణ పొందిన పలు కార్యక్రమాలకు ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే