మలివిడత పబ్లిక్ ఆఫర్ యథాతథంగానే
అదానీ ఎంటర్ప్రైజెస్ రూ.20,000 కోట్ల మలివిడత పబ్లిక్ ఆఫర్పై (ఎఫ్పీఓ) వెనుకడుగు వేసేది లేదని అదానీ గ్రూపు స్పష్టం చేసింది.
తేదీల్లో మార్పుల్లేవ్.. ఇష్యూ ధర తగ్గించబోం
ఊహాగానాలపై అదానీ గ్రూపు స్పష్టత
ముంబయి: అదానీ ఎంటర్ప్రైజెస్ రూ.20,000 కోట్ల మలివిడత పబ్లిక్ ఆఫర్పై (ఎఫ్పీఓ) వెనుకడుగు వేసేది లేదని అదానీ గ్రూపు స్పష్టం చేసింది. ఇష్యూ ధర, తేదీల్లో మార్పులు చేస్తున్నట్లు వస్తున్న ఊహాగానాలను కొట్టిపారేసింది. ‘అనుకున్న సమయానికే.. నిర్ణయించిన ధరల శ్రేణి ప్రకారమే ఎఫ్పీఓ జరుగుతుంద’ని కంపెనీ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. బీఎస్ఈ వద్ద లభ్యమవుతున్న సమాచారం ప్రకారం.. ఎఫ్పీఓకు తొలి రోజున (శుక్రవారం) కేవలం 1 శాతం మాత్రమే స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 4.55 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. 4.7 లక్షల షేర్లకే బిడ్లు దాఖలయ్యాయి. హిండెన్బర్గ్ ఆరోపణల ప్రభావంతో అదానీ గ్రూపు షేర్లు పతనమైన నేపథ్యంలో.. ఇష్యూలో మార్పులు చేయాలని బ్యాంకర్లు అనుకుంటున్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇష్యూ సమయాన్ని పొడిగించడం లేదంటే ఇష్యూ ధరను తగ్గించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. అయితే ఈ ఊహాగానాలపై పై విధంగా అదానీ గ్రూపు స్పష్టత ఇచ్చింది. ‘బ్యాంకర్లు, మదుపర్లు సహా మా వాటాదార్లందరూ ఎఫ్పీఓపై పూర్తి విశ్వాసంతో ఉన్నారు. ఈ ఇష్యూ విజయవంతం అవుతుందనే నమ్మకంతో మేం ఉన్నామ’ని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది.
ఆరోపణలపై వివరణ ఇవ్వండి: ఎంఎస్సీఐ
షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని.. ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందంటూ హిండెన్బర్గ్ నివేదిక చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాల్సిందిగా అదానీ గ్రూపును సూచీల సంస్థ ఎంఎస్సీఐ అడిగింది. ‘నివేదికలోని అంశాలను సునిశితంగా పరిశీలిస్తున్నాం. ఎంఎస్సీఐ గ్లోబల్ ఇన్వెస్టబుల్ మార్కెట్ సూచీలలో సంబంధిత షేర్ల అర్హతపై దీని ప్రభావం ఎలా ఉంటుందో కూడా గమనిస్తున్నామ’ని ఎంఎస్సీఐ తెలిపింది. ఈ వ్యవహారంపై మార్కెట్ వర్గాల నుంచి ఎప్పటికప్పుడు అభిప్రాయాలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఎంఎస్సీఐ స్టాండర్డ్ ఇండెక్స్లో అదానీ గ్రూపునకు చెందిన 8 కంపెనీలు ఉన్నాయి. నివేదిక సంబంధించి ఏమైనా ప్రతికూల వివరణ అందితే.. ఎంఎస్సీఐ సూచీలో అదానీ గ్రూపు షేర్ల వెయిటేజీని తగ్గించడం లేదంటే తొలగించే అవకాశాలు ఉంటాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే జరిగితే షేర్లు మరింత అమ్మకాల ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
అదానీ గ్రూపునకు వివాదాలు కొత్త కాదు
అదానీ గ్రూపునకు వివాదాలు కొత్తేమీ కాదనే మాట వినిపిస్తోంది. ఆస్ట్రేలియాలోని క్వీన్స్ల్యాండ్లో ఏర్పాటు చేసిన బొగ్గు గని ప్రాజెక్టుపై అక్కడి పర్యావరణవేత్తల నుంచి అప్పట్లో వ్యతిరేకత ఎదురైంది. కేరళలో 900 మిలియన్ డాలర్లతో అదానీ గ్రూపు నిర్మిస్తున్న నౌకాశ్రయంపైనా మత్స్యకారులు ఆందోళనలు చేశారు. ఈ వ్యవహారంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం, మత్స్యకారుల నాయకులపై అదానీ గ్రూపు కేసు వేసింది. తాజాగా హిండెన్బర్గ్ నివేదిక రూపంలో మరో సవాలును అదానీ గ్రూపు ఎదుర్కొంటోంది. సరిగ్గా అదానీ గ్రూపు ఎంటర్ప్రైజెస్ మలివిడత పబ్లిక్ ఆఫర్కు ముందే ఈ నివేదిక వెలువడటం, గ్రూపు కంపెనీల షేర్లు పతనమవ్వడంతో.. ఈ సమస్యను ఎలా అధిగమించి ఎఫ్పీఓను విజయవంతం చేసుకుంటుందనే దానిపై ఇప్పుడు కార్పొరేట్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
దర్యాప్తునకు కాంగ్రెస్ డిమాండ్
అదానీ గ్రూపు కంపెనీల షేర్ల భారీ పతనం ప్రభావంతో ఆ కంపెనీలకు రుణాలిచ్చిన ఎస్బీఐ, వాటిల్లో పెట్టుబడులు పెట్టిన ఎల్ఐసీ సంస్థలు మొత్తంగా రూ.78,000 కోట్ల మార్కెట్ విలువను కోల్పోయినప్పటికీ.. కేంద్ర ఆర్థిక మంత్రి, దర్యాప్తు సంస్థలు ఇంకా మౌనంగా ఎందుకు ఉన్నారంటూ కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. ఈ వ్యవహారంలో పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించాలని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రణ్దీప్ సుర్జేవాలా డిమాండు చేస్తున్నారు. హిండెన్బర్గ్ నివేదిక అనంతరం షేర్లు పతనమైన తర్వాత కూడా అదానీ గ్రూపులో మళ్లీ రూ.300 కోట్లను ఎల్ఐసీ ఎందుకు పెట్టుబడిగా పెడుతోందని ఆయన ప్రశ్నిస్తున్నారు.
ఎన్డీటీవీకి శ్రీనివాసన్ జైన్ రాజీనామా
ఎన్డీటీవీకి రాజీనామా చేస్తున్నట్లు జర్నలిస్టు శ్రీనివాసన్ జైన్ తెలిపారు. ‘ఎన్డీటీవీలో మూడు దశాబ్దాల పాటు అద్భుతంగా సాగిన నా ప్రయాణం నేటితో ముగిసింది. రాజీనామా తీసుకోవాలనే నిర్ణయం అంత సులభమైనది కాదు. కానీ తీసుకోవాల్సి వచ్చింద’ని ట్విటర్లో ఆయన తెలిపారు. ఎన్డీటీవీలో ప్రముఖ వ్యక్తుల్లో శ్రీనివాసన్ జైన్ ఒకరు. వీక్షకుల ఆదరణ పొందిన పలు కార్యక్రమాలకు ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
IndiGo: విమాన ప్రయాణంలో వినోదాన్ని అందించే సేవల్ని మే1 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఇండిగో ఓ ప్రకటనలో పేర్కొంది. -
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
Gold price: బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా గిరాకీ తగ్గడంతో అంతర్జాతీయంగా వీటి ధరలు దిగివచ్చాయి. -
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
సోషల్మీడియాలో లుక్ బిట్వీన్ పేరిట కొత్త ట్రెండ్ మొదలైంది. ఇంతకీ ఏమిటీ ట్రెండ్..? ఎక్కడ మొదలైంది? -
రాబోయే 3-4 ఏళ్లలో ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమలో భారీ పెట్టుబడులు
రాబోయే 3-4 ఏళ్లలో ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమ.. వాటి విడిభాగాల ఉత్పత్తి నిమిత్తం రూ.25 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ICRA తెలిపింది. -
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
OTP frauds: ఓటీపీ స్కామ్లకు చెక్ పెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. అందులోభాగంగానే టెలికాం, ఎస్బీఐ కార్డ్స్తో కలిసి పనిచేస్తోంది. -
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
తన స్మార్ట్ఫోన్లను ఎవరో కొట్టేస్తే చిన్న ట్రిక్తో పట్టేశాడు ఓ టెక్ ఇన్ఫ్లూయెన్సర్. జరిగిందంతా ఓ పోస్ట్లో రాసుకొచ్చాడు. -
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 89 పాయింట్లు, నిఫ్టీ 31 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
WhatsApp: ఫొటోలు, వీడియోలు పంపించడాన్ని సులభతరం చేయడం కోసం ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ (WhatsApp) కొత్త ఫీచర్ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. -
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
Xiaomi: షావోమి మంగళవారం మరికొన్ని స్మార్ట్ ఉత్పత్తులను భారత్లో విడుదల చేసింది. వీటిలో ప్యాడ్, బడ్స్, క్లీనర్, స్టీమర్ ఉన్నాయి. వీటి ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం..! -
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
విమానాల్లో తల్లిదండ్రులకు పక్కనే చిన్నారులకు సీటు కేటాయించాలని డీజీసీఏ విమానయాన సంస్థలకు సూచించింది. -
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
Patanjali: పతంజలి ఉత్పత్తుల ప్రయోజనాలపై ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో ఆ కంపెనీపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. క్షమాపణలు చెబుతూ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చామని తెలపగా.. అది ఏ సైజ్లో ఉందని ధర్మాసనం ప్రశ్నించింది. -
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
e-pan: కొత్తగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు రోజులతరబడి ఎదురుచూడాల్సిన పని లేకుండా తక్షణమే ఈ-పాన్ పొందే సదుపాయం ఉంది. అదెలాగంటే..? -
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
OnePlus Nord CE 3: నార్డ్ సీఈ3 ధరను వన్ప్లస్ తగ్గించింది. మరికొన్ని అదనపు ప్రయోజనాలనూ అందిస్తోంది. అవేంటి? ధర ఎంత వరకు తగ్గిందో చూద్దాం..! -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 పైన నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 196 పాయింట్లు లాభంతో 73,844 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 64 పాయింట్లు పెరిగి 22,401 దగ్గర కొనసాగుతోంది. -
రిలయన్స్ టర్నోవర్ రూ.10 లక్షల కోట్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్చి త్రైమాసిక నికర లాభంలో పెద్దగా మార్పు కనిపించకపోయినా.. వార్షిక లాభంలో మాత్రం రికార్డులు తిరగరాసింది. ముడి చమురు, పెట్రోరసాయనాల వ్యాపారాలు గణనీయంగా రాణించడంతో పాటు.. టెలికాం, రిటైల్ విభాగాల్లో జోరు కొనసాగడం ఇందుకు నేపథ్యంగా నిలిచింది. -
ఆధ్యాత్మిక పర్యటనలకు చలో.. చలో
భారతీయులు తరచుగా ఆధ్యాత్మిక పర్యటనలకు వెళ్తున్నట్లు మేక్మైట్రిప్ ఇండియా రూపొందించిన నివేదికలో తేలింది. అయోధ్య, ఉజ్జయిని, బద్రినాధ్ లాంటి ఆధ్యాత్మిక ప్రదేశాల వివరాల కోసం, ఇంటర్నెట్లో వెతకడం పెరిగిందని పేర్కొంది. -
రెండో రోజూ లాభాల జోరు
ఆసియా, ఐరోపా సంకేతాలు సానుకూలంగా మారడంతో, వరుసగా రెండో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ పరుగులు తీశాయి. ఇరాన్- ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు కొద్దిగా సద్దుమణగడం.. ఫలితంగా ముడిచమురు ధరలు తగ్గడం, విదేశీ మదుపర్ల కొనుగోళ్లు.. -
పేటీఎం దేశీయ 4జీ సౌండ్బాక్స్ల ఆవిష్కరణ
దేశీయ ఫిన్టెక్ దిగ్గజం పేటీఎం, చెల్లింపుల కోసం వినియోగించే యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్), క్రెడిట్ కార్డ్ల కోసం దేశీయంగా తయారైన రెండు సౌండ్బాక్స్లను సోమవారం ఆవిష్కరించింది. -
పార్కిన్సన్ చికిత్సకు ‘మెడ్ట్రానిక్’ పరికరం
పార్కిన్సన్ వ్యాధి చికిత్సలో వినియోగించే ‘న్యూరోస్మార్ట్’ పోర్టబుల్ మైక్రో ఎలక్ట్రోడ్ రికార్డింగ్ (ఎంఈఆర్) నావిగేషన్ సిస్టమ్ను మనదేశంలో తొలిసారిగా మెడ్ట్రానిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రవేశపెట్టింది. -
దేశీయ విమానాల్లో ఒక్కరోజులో 4.71 లక్షల మంది ప్రయాణం
దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ కొత్త గరిష్ఠాలకు చేరింది. ఈనెల 21న (ఆదివారం) దేశీయ మార్గాల్లో విమాన ప్రయాణికుల సంఖ్య రికార్డు స్థాయిలో 4,71,751గా నమోదైంది. -
ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలా పొడుల్లోని సుగంధ ద్రవ్యాల నాణ్యతా పరిశీలన
మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న ఎండీహెచ్, ఎవరెస్ట్ బ్రాండ్ల మసాలా పొడుల నాణ్యతపై సింగపూర్, హాంకాంగ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేయడంతో.. ఆహార భద్రత, ప్రమాణాల మండలి (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అప్రమత్తమైంది.
తాజా వార్తలు (Latest News)
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM