సంక్షిప్త వార్తలు(4)
హైదరాబాద్కు చెందిన బ్రైట్కామ్ గ్రూపు (బీసీజీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి కన్సాలిడేటెడ్ ఖాతాల ప్రకారం రూ.1,683 కోట్ల ఆదాయాన్ని, రూ.320 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది.
బ్రైట్కామ్ గ్రూపు లాభం రూ.320 కోట్లు
ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్కు చెందిన బ్రైట్కామ్ గ్రూపు (బీసీజీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి కన్సాలిడేటెడ్ ఖాతాల ప్రకారం రూ.1,683 కోట్ల ఆదాయాన్ని, రూ.320 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోల్చితే ఆదాయం 52.48 శాతం, నికరలాభం 51.15 శాతం పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది. యూఎస్, ఐరోపా దేశాల్లో వ్యాపార కార్యకలాపాలు విస్తరించినందున అధిక ఆదాయాలు నమోదు చేసే అవకాశం వచ్చినట్లు పేర్కొంది. అంతేగాక భవిష్యత్తులో వృద్ధి బాటలో కొనసాగేందుకు వీలుగా ‘హైగ్రోత్ మోడల్’ను అనుసరించనున్నట్లు వివరించింది.
1 కువైట్ దినార్... రూ.266.64
ప్రపంచంలోనే అత్యంత విలువైన కరెన్సీ ఇదే
ప్రపంచంలోనే బలమైన కరెన్సీలు అనగానే.. మనకు గుర్తొచ్చేవి అమెరికా డాలరు, గ్రేట్ బ్రిటన్ పౌండ్, యూరోలే. అయితే 2023లో ఈ మూడు కూడా అత్యంత విలువైనవి కావు. ఒక అమెరికా డాలరుకు మహా అయితే రూ.82 వస్తాయి. అదే యూరో, పౌండ్లకైతే.. రూ.88, రూ.100 వరకు వస్తాయి. అయితే వీటన్నికంటే విలువైనది ఒకటి ఉంది. అదేంటంటే.. కువైట్ దినార్. ఆ దేశ స్థిర ఆర్థిక వ్యవస్థ రీత్యా కువైట్ దినార్ అత్యంత విలువైన కరెన్సీగా కొనసాగుతోంది. తాజాగా ఒక కువైట్ దినార్ విలువ రూ.266.64కు చేరింది. బెహ్రెయిన్ దినార్(రూ.215.90), ఒమిని రియాల్(రూ.211.39)లు కూడా విలువైన కరెన్సీల్లో ముందు వరుసలో నిలిచాయి.
ఇండస్ టవర్స్లో23% వాటా ఎయిర్టెల్ కొనుగోలు
దిల్లీ: టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ తమ పూర్తి స్థాయి అనుబంధ సంస్థ నెటిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వద్ద ఉన్న 23.01 శాతం ఇండస్ టవర్స్ షేర్లను కొనుగోలు చేసినట్లు నియంత్రణ సంస్థలకు శనివారం సమాచారమిచ్చింది. దీంతో ప్రస్తుతం ఇండస్ టవర్స్లో భారతీ ఎయిర్టెల్ వాటా 47.95 శాతానికి చేరింది. గతంలో ఈ సంస్థకు ఇండస్ టవర్స్లో 24.94 శాతం వాటా నేరుగా ఉండగా, అనుబంధ సంస్థ నెటిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా 23.01 శాతం వాటా ఉంది. ఇప్పుడు ఆ సంస్థ నుంచి వాటాను కొనుగోలు చేయడంతో నేరుగా 47.95 శాతం వాటా సొంతం చేసుకుంది.
సంక్షిప్తంగా
* రిలయన్స్ జియో తాజాగా హరిద్వార్లోనూ 5జీ సేవలను ప్రారంభించింది.
* క్వెస్ కార్ప్ డిసెంబరు త్రైమాసికంలో రూ.85.63 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో సంస్థ ఆర్జించిన నికర లాభం రూ.88.51 కోట్లతో పోలిస్తే ఇది 3.25% తక్కువ. కార్యకలాపాల ఆదాయం రూ.3,684.98 కోట్ల నుంచి 21.18 శాతం పెరిగి రూ.4,465.55 కోట్లకు చేరింది.
* దిగ్గజ కమొడిటీ ఎక్స్ఛేంజ్ ఎంసీఎక్స్ డిసెంబరు త్రైమాసికంలో రూ.38.79 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఆర్జించిన రూ.34.46 కోట్లతో పోలిస్తే ఇది 12.5% ఎక్కువ. మొత్తం ఏకీకృత ఆదాయం రూ.104.06 కోట్ల నుంచి రూ.163.65 కోట్లకు చేరింది.
* ప్రిఫరెన్షియల్ కేటాయింపు పద్ధతిలో 37.75 కోట్ల షేర్లను అనుబంధ సంస్థ ఐడీఎఫ్సీకి జారీ చేయడం ద్వారా రూ.2,196 కోట్లను సమీకరించేందుకు ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ బోర్డు ఆమోదం తెలిపింది.
* డెర్మటైటిస్, ఎగ్జిమా, సోరియాసిస్ వంటి చర్మ వ్యాధుల చికిత్సలో వినియోగించే క్రీము ట్యూబులను (5,720) అమెరికా విపణి నుంచి వెనక్కి పిలిపిస్తున్నట్లు(రీకాల్) లుపిన్ అనుబంధ సంస్థ తెలిపింది.
* పేటెంట్ ఉల్లంఘన కేసులో హైకోర్టు తీర్పును పట్టించుకోకుండా కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు త్రివేణి ఇంటర్కెమ్, ఫైజర్కు 2 వారాల్లోగా రూ.2 కోట్లు చెల్లించాలని దిల్లీ హైకోర్టు ఆదేశించింది.
* 2018లో టెస్లా ఒప్పందానికి సంబంధించి ట్వీట్ల ద్వారా ఎలాన్ మస్క్ మదుపర్లను మోసం చేయలేదని దీనిపై విచారించిన జ్యూరీ వెల్లడించింది.
* అంతర్జాతీయ బాండ్ల సూచీలో భారత్ చేరాలనుకుంటే, దేశీయ విధానాలకు అనుగుణంగా వెళుతుందే తప్ప విదేశీ మదుపర్లకు సరిపోయేలా నిబంధనలు మార్చబోమని ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ అన్నారు.
* భారతీ ఎయిర్టెల్ తమ పూర్తి స్థాయి అనుబంధ సంస్థ నెటిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వద్ద ఉన్న 23.01% ఇండస్ టవర్స్ షేర్లను కొనుగోలు చేసింది. దీంతో ప్రస్తుతం ఇండస్ టవర్స్లో భారతీ ఎయిర్టెల్ వాటా 47.95 శాతానికి చేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్