సంక్షిప్త వార్తలు(4)
హైదరాబాద్కు చెందిన బ్రైట్కామ్ గ్రూపు (బీసీజీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి కన్సాలిడేటెడ్ ఖాతాల ప్రకారం రూ.1,683 కోట్ల ఆదాయాన్ని, రూ.320 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది.
బ్రైట్కామ్ గ్రూపు లాభం రూ.320 కోట్లు
ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్కు చెందిన బ్రైట్కామ్ గ్రూపు (బీసీజీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి కన్సాలిడేటెడ్ ఖాతాల ప్రకారం రూ.1,683 కోట్ల ఆదాయాన్ని, రూ.320 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోల్చితే ఆదాయం 52.48 శాతం, నికరలాభం 51.15 శాతం పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది. యూఎస్, ఐరోపా దేశాల్లో వ్యాపార కార్యకలాపాలు విస్తరించినందున అధిక ఆదాయాలు నమోదు చేసే అవకాశం వచ్చినట్లు పేర్కొంది. అంతేగాక భవిష్యత్తులో వృద్ధి బాటలో కొనసాగేందుకు వీలుగా ‘హైగ్రోత్ మోడల్’ను అనుసరించనున్నట్లు వివరించింది.
1 కువైట్ దినార్... రూ.266.64
ప్రపంచంలోనే అత్యంత విలువైన కరెన్సీ ఇదే
ప్రపంచంలోనే బలమైన కరెన్సీలు అనగానే.. మనకు గుర్తొచ్చేవి అమెరికా డాలరు, గ్రేట్ బ్రిటన్ పౌండ్, యూరోలే. అయితే 2023లో ఈ మూడు కూడా అత్యంత విలువైనవి కావు. ఒక అమెరికా డాలరుకు మహా అయితే రూ.82 వస్తాయి. అదే యూరో, పౌండ్లకైతే.. రూ.88, రూ.100 వరకు వస్తాయి. అయితే వీటన్నికంటే విలువైనది ఒకటి ఉంది. అదేంటంటే.. కువైట్ దినార్. ఆ దేశ స్థిర ఆర్థిక వ్యవస్థ రీత్యా కువైట్ దినార్ అత్యంత విలువైన కరెన్సీగా కొనసాగుతోంది. తాజాగా ఒక కువైట్ దినార్ విలువ రూ.266.64కు చేరింది. బెహ్రెయిన్ దినార్(రూ.215.90), ఒమిని రియాల్(రూ.211.39)లు కూడా విలువైన కరెన్సీల్లో ముందు వరుసలో నిలిచాయి.
ఇండస్ టవర్స్లో23% వాటా ఎయిర్టెల్ కొనుగోలు
దిల్లీ: టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ తమ పూర్తి స్థాయి అనుబంధ సంస్థ నెటిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వద్ద ఉన్న 23.01 శాతం ఇండస్ టవర్స్ షేర్లను కొనుగోలు చేసినట్లు నియంత్రణ సంస్థలకు శనివారం సమాచారమిచ్చింది. దీంతో ప్రస్తుతం ఇండస్ టవర్స్లో భారతీ ఎయిర్టెల్ వాటా 47.95 శాతానికి చేరింది. గతంలో ఈ సంస్థకు ఇండస్ టవర్స్లో 24.94 శాతం వాటా నేరుగా ఉండగా, అనుబంధ సంస్థ నెటిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా 23.01 శాతం వాటా ఉంది. ఇప్పుడు ఆ సంస్థ నుంచి వాటాను కొనుగోలు చేయడంతో నేరుగా 47.95 శాతం వాటా సొంతం చేసుకుంది.
సంక్షిప్తంగా
* రిలయన్స్ జియో తాజాగా హరిద్వార్లోనూ 5జీ సేవలను ప్రారంభించింది.
* క్వెస్ కార్ప్ డిసెంబరు త్రైమాసికంలో రూ.85.63 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో సంస్థ ఆర్జించిన నికర లాభం రూ.88.51 కోట్లతో పోలిస్తే ఇది 3.25% తక్కువ. కార్యకలాపాల ఆదాయం రూ.3,684.98 కోట్ల నుంచి 21.18 శాతం పెరిగి రూ.4,465.55 కోట్లకు చేరింది.
* దిగ్గజ కమొడిటీ ఎక్స్ఛేంజ్ ఎంసీఎక్స్ డిసెంబరు త్రైమాసికంలో రూ.38.79 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఆర్జించిన రూ.34.46 కోట్లతో పోలిస్తే ఇది 12.5% ఎక్కువ. మొత్తం ఏకీకృత ఆదాయం రూ.104.06 కోట్ల నుంచి రూ.163.65 కోట్లకు చేరింది.
* ప్రిఫరెన్షియల్ కేటాయింపు పద్ధతిలో 37.75 కోట్ల షేర్లను అనుబంధ సంస్థ ఐడీఎఫ్సీకి జారీ చేయడం ద్వారా రూ.2,196 కోట్లను సమీకరించేందుకు ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ బోర్డు ఆమోదం తెలిపింది.
* డెర్మటైటిస్, ఎగ్జిమా, సోరియాసిస్ వంటి చర్మ వ్యాధుల చికిత్సలో వినియోగించే క్రీము ట్యూబులను (5,720) అమెరికా విపణి నుంచి వెనక్కి పిలిపిస్తున్నట్లు(రీకాల్) లుపిన్ అనుబంధ సంస్థ తెలిపింది.
* పేటెంట్ ఉల్లంఘన కేసులో హైకోర్టు తీర్పును పట్టించుకోకుండా కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు త్రివేణి ఇంటర్కెమ్, ఫైజర్కు 2 వారాల్లోగా రూ.2 కోట్లు చెల్లించాలని దిల్లీ హైకోర్టు ఆదేశించింది.
* 2018లో టెస్లా ఒప్పందానికి సంబంధించి ట్వీట్ల ద్వారా ఎలాన్ మస్క్ మదుపర్లను మోసం చేయలేదని దీనిపై విచారించిన జ్యూరీ వెల్లడించింది.
* అంతర్జాతీయ బాండ్ల సూచీలో భారత్ చేరాలనుకుంటే, దేశీయ విధానాలకు అనుగుణంగా వెళుతుందే తప్ప విదేశీ మదుపర్లకు సరిపోయేలా నిబంధనలు మార్చబోమని ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ అన్నారు.
* భారతీ ఎయిర్టెల్ తమ పూర్తి స్థాయి అనుబంధ సంస్థ నెటిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వద్ద ఉన్న 23.01% ఇండస్ టవర్స్ షేర్లను కొనుగోలు చేసింది. దీంతో ప్రస్తుతం ఇండస్ టవర్స్లో భారతీ ఎయిర్టెల్ వాటా 47.95 శాతానికి చేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాయిస్ ఇన్పుట్ రిమోట్తో అమెజాన్ 4K ఫైర్స్టిక్.. ధరెంత?
Amazon Fire TV Stick: అమెజాన్ కొత్త ఫైర్ స్టిక్ను లాంచ్ చేసింది. 4కె సపోర్ట్తో ఇది వస్తోంది. -
పూర్వ వైభవానికి బైజూస్ పాట్లు.. కోర్సు ఫీజు తగ్గింపు!
బైజూస్ సంస్థ పూర్వ వైభవం కోసం కృషి చేస్తోంది. ఇందులోభాగంగా కోర్సు ఫీజులను తగ్గించింది. సేల్స్ టీమ్కు ప్రోత్సాహకాలను పెంచింది. -
దలాల్ దఢేల్: భారీ నష్టాల్లో సూచీలు.. ₹6 లక్షల కోట్లు ఆవిరి
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ వెయ్యికి పైగా పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 22 వేల స్థాయిని కోల్పోయింది. -
ఎస్బీఐ లాభం ₹21,384 కోట్లు.. పీఎన్బీ లాభం మూడింతలు
ప్రభుత్వరంగ బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) మెరుగైన త్రైమాసిక ఫలితాలను ప్రకటించాయి. -
మారుతీ సుజుకీ స్విఫ్ట్ మరింత కొత్తగా.. ధర రూ.6.50 లక్షలు
Maruti Suzuki Swift: అత్యాధునిక ఫీచర్లను జోడిస్తూ మారుతీ సుజుకీ తమ హ్యాచ్బ్యాక్ మోడల్లో కొత్త స్విఫ్ట్ను విడుదల చేసింది. దీని ధర రూ.6.50 లక్షల నుంచి ప్రారంభమవుతోంది. -
మోటో నుంచి రెండు కొత్త ఇయర్బడ్స్.. ధర, ఫీచర్లు ఇవే..
Moto: 50dB, 46dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్కు సపోర్ట్ చేసే రెండు కొత్త ఇయర్బడ్స్ను మోటో భారత్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. -
అందుకే భారత్కు సొంత టెక్నాలజీ అవసరం.. లింక్డిన్పై ఓలా సీఈఓ ఫైర్!
Ola CEO: ఓలా సీఈఓ చేసిన ఓ పోస్ట్ను లింక్డిన్ తొలగించింది. దీనిపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్ సొంతంగా ఏఐ సాంకేతికతను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. -
ఐపీఓకు గో డిజిట్ ఇన్సూరెన్స్.. విరుష్క జోడీ వాటాలు వదులుకుంటున్నారా?
డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ ఐపీఓకు రానుంది. మే 15న సబ్స్క్రిప్షన్ ప్రారంభమై.. 17న ముగియనుంది. -
2023-24లో టీసీఎస్ సీఈఓ వేతనం రూ.25 కోట్లు
TCS CEO Salary: టీసీఎస్ సీఈఓ కృతివాసన్ గత ఆర్థిక సంవత్సరంలో రూ.25 కోట్ల వేతనాన్ని అందుకున్నారు. అదే సమయంలో సీఓఓ గణపతి సుబ్రమణియం రూ.26.18 కోట్ల వేతనాన్ని పొందారు. -
రహస్యంగా ఐపీఓకు.. ఈ కొత్త వ్యూహం వెనక మతలబేంటి?
Confidential IPO filing: కొన్ని కంపెనీలు ఇటీవల ఐపీఓకి రహస్యంగా సెబీకి ప్రాథమిక పత్రాలు సమర్పించాయి. ఈ కొత్త మార్గాన్ని సంస్థలు ఎందుకు ఎంచుకుంటున్నాయి? దీని వెనకున్న వ్యూహమేంటో చూద్దాం.. -
ఉద్యోగులకు ఏఐఎక్స్ షాక్.. 25 మంది తొలగింపు.. మిగిలిన వారికి అల్టిమేటం
AI Express: ఎయిరిండియా ఎక్స్ప్రెస్లో ఉద్యోగుల మూకుమ్మడి సెలవు వ్యవహారం తీవ్ర పరిణామాలకు దారితీస్తోంది. కంపెనీ 25 మందిని తొలగించింది. మిగిలిన వారికి అల్టిమేటం జారీ చేసింది. -
నష్టాల్లోనే స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,271
Stock Market Opening bell: ఉదయం 9:28 గంటల సమయంలో సెన్సెక్స్ 145 పాయింట్ల నష్టంతో 73,321 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 31 పాయింట్లు కుంగి 22,271 దగ్గర కొనసాగుతోంది. -
21వ శతాబ్దపు ఆర్థిక శక్తిగా భారత్.. మోదీ, అంబానీ, అదానీ కీలక పాత్ర: సీఎన్ఎన్
India Economic Superpower: రాబోయే కొన్ని దశాబ్దాల్లో భారత్ ఆర్థిక శక్తిగా అవతరిస్తుందని సీఎన్ఎన్ కథనం పేర్కొంది. దీంట్లో ప్రధాని మోదీతో పాటు అంబానీ, అదానీ కీలక పాత్ర పోషించనున్నారని తెలిపింది. -
యువత మెచ్చేలా కొత్త పథకాలు
కెనరా బ్యాంకు కాసా (కరెంటు, సేవింగ్స్ ఖాతాల) డిపాజిట్లు పెంచుకునేందుకు విభిన్న పథకాలను ఆవిష్కరిస్తోంది. ఇందువల్ల డిపాజిట్ల వ్యయం తగ్గి, బ్యాంకు స్థిర వృద్ధికి తోడ్పడుతుందని అంచనా వేస్తోంది. -
ప్రవాసుల నుంచి రూ.9.20 లక్షల కోట్లు
ప్రవాసులు 2022లో మన దేశంలోని కుటుంబీకులు, సన్నిహితులకు 111 బిలియన్ డాలర్ల (సుమారు రూ.9.2 లక్షల కోట్ల)ను బదిలీ చేశారు. వృత్తి, వ్యాపారాల నిమిత్తం ఒక దేశం నుంచి తరలి వెళ్లి, వివిధ దేశాల్లో నివశిస్తున్న వారు.. తమ స్వదేశానికి పంపిన అత్యధిక మొత్తం ఇదే. -
ఆద్యంతం ఒడుదొడుకులే
ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో సూచీలు బుధవారం స్తబ్దుగా ముగిశాయి. బలహీన అంతర్జాతీయ సంకేతాలతో ప్రైవేట్ బ్యాంకులు, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. -
8% వృద్ధికే అధిక అవకాశం
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24) భారత జీడీపీ వృద్ధి 8 శాతంగా నమోదయ్యేందుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి.అనంత నాగేశ్వరన్ తెలిపారు. -
‘కొవిషీల్డ్’ టీకాను వెనక్కి తీసుకుంటున్న ఆస్ట్ర జెనేకా
పలు రకాల దుష్ఫలితాలు కనిపిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, మార్కెట్లో ఉన్న కొవిడ్-19 టీకాను వెనక్కి తీసుకోవాలని యూకే కంపెనీ ఆస్ట్రజెనేకా నిర్ణయించింది. -
ఆండ్రాయిడ్ మొబైల్లో గూగుల్ వాలెట్ యాప్
భారత్లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేసే మొబైల్స్ కోసం గూగుల్ వాలెట్ యాప్ను టెక్ దిగ్గజం గూగుల్ ఆవిష్కరించింది. బోర్డింగ్ పాసులు, లాయల్టీ కార్డులు, టికెట్లు, ప్రభుత్వ రవాణా పాసులు.. తదితరాలను భద్రంగా నిల్వ చేసుకునేందుకు ఈ వాలెట్ వీలు కల్పిస్తుంది. -
నగదు రుణాలు రూ.20వేల లోపే!
నగదు రూపంలో ఇచ్చే రుణాలు రూ.20వేలకు మించకుండా ఉండాలని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశాలు జారీ చేసిందని సమాచారం. నగదు లావాదేవీల విషయంలో కచ్చితంగా నిబంధనలు పాటించాలని ఆర్బీఐ పేర్కొందని తెలుస్తోంది. -
ఏప్రిల్లో శాకాహారం 8% ప్రియం
ఉల్లిపాయలు, టమోటాల ధరలు పెరగడంతో గత నెలలో వెజిటేరియన్ (శాకాహార) థాలీ సగటు ధర సుమారు 8% పెరిగిందని క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనాలసిస్ నెలవారీ ‘రోటీ రైస్ రేట్’ నివేదిక వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది సమ్మె విరమణ.. ఆ 25 మంది తొలగింపు వెనక్కి!
-
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్
-
వీసా లేకుండానే థాయిలాండ్కు.. మరో ఆరు నెలలు వెసులుబాటు
-
అసెంబ్లీలో అలా తిట్టుకోవడం చూసి షాకయ్యా..: చిరంజీవి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
వాయిస్ ఇన్పుట్ రిమోట్తో అమెజాన్ 4K ఫైర్స్టిక్.. ధరెంత?