Adani Group: ఎస్బీఐకి మరిన్ని షేర్ల తాకట్టు
షేర్ల విలువలు బాగా తగ్గిన నేపథ్యంలో, 3 అదానీ గ్రూప్ కంపెనీలు ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ బ్యాంక్ ఇండియా (ఎస్బీఐ)కు అదనంగా మరిన్ని షేర్లను తాకట్టు పెట్టాయి.
అదానీ గ్రూప్
దిల్లీ: షేర్ల విలువలు బాగా తగ్గిన నేపథ్యంలో, 3 అదానీ గ్రూప్ కంపెనీలు ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ బ్యాంక్ ఇండియా (ఎస్బీఐ)కు అదనంగా మరిన్ని షేర్లను తాకట్టు పెట్టాయి. అమెరికాకు చెందిన షార్ట్-సెల్లర్ హిండెన్బర్గ్ ఆరోపణల అనంతరం, అదానీ గ్రూప్ సంస్థల మార్కెట్ విలువ 100 బిలియన్ డాలర్లకు పైగా కోల్పోయిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే తాము తీసుకున్న రుణాలకు గాను, ఎస్బీఐ వద్ద మరిన్ని షేర్లను తాకట్టు పెట్టినట్లు ఎక్స్ఛేంజీలకు ఆయా సంస్థల నుంచి సమాచారం అందింది.
* అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ (ఏపీఎస్ఈజెడ్), అదానీ ట్రాన్స్మిషన్ లిమిటెడ్, అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థలు ఎస్బీఐ యూనిట్ ఎస్బీఐ క్యాప్ ట్రస్టీ కంపెనీ వద్ద అదనంగా షేర్లను తాకట్టు పెట్టాయి. ఏపీఎస్ఈజెడ్ అదనంగా 75 లక్షలకు పైగా తాకట్టు పెట్టింది. వీటితో కలిపి సంస్థలో మొత్తం 1 శాతం షేర్లను ఎస్బీఐక్యాప్ వద్ద తాకట్టు పెట్టినట్లు అయ్యింది.
* అదానీ గ్రీన్ 60 లక్షలకు పైగా అదనపు షేర్లను తాకట్టు పెట్టడంతో, మొత్తం 1.06 శాతం వాటా తాకట్టులో ఉన్నట్లయ్యింది.
* అదానీ ట్రాన్స్మిషన్ 13 లక్షలకు పైగా అదనపు షేర్లను ఎస్బీఐక్యాప్ వద్ద తాకట్టు పెట్టడంతో ఈ కంపెనీలోని 0.55 శాతం వాటా ఎస్బీఐ వద్ద ఉంది.
* అదనంగా పెట్టిన షేర్ల తాకట్టుతో 300 మిలియన్ డాలర్ల లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ఓసీ)ను వేరే బ్యాంక్కు ఎస్బీఐ జారీ చేసింది. ఆస్ట్రేలియాలోని అదానీ గ్రూప్నకు చెందిన కార్మిఖేల్ బొగ్గు గని ప్రాజెక్టులో చెల్లింపులకు గ్యారెంటీగా ఎస్బీఐ ఎల్ఓసీని జారీ చేసింది.
నేటి బోర్డు సమావేశాలు
జీ ఎంటర్టైన్మెంట్, పీఎఫ్సీ, ఇక్రా, హడ్కో, ఐఎఫ్సీఐ, నేషనల్ ఫెర్టిలైజర్స్, నైకా, వోకార్డ్, పీవీపీ, ఒమాక్స్, బజాజ్ హెల్త్కేర్, గుజరాత్ గ్యాస్, హైడెల్బర్గ్ సిమెంట్, బజాజ్ హిందుస్థాన్ షుగర్, శ్రీరేణుకా షుగర్, రెప్కో హోమ్ ఫైనాన్స్, స్పార్క్, తమిళనాడు న్యూస్ప్రింట్ అండ్ పేపర్స్, అంజనీ ఫుడ్స్, బీజీఆర్ ఎనర్జీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే