ఎయిరిండియా.. 470 కొత్త విమానాలు
టాటా గ్రూపు అధీనంలోని ఎయిరిండియా తన కార్యకలాపాలను భారీగా విస్తరించనుంది. దేశీయంగా, అంతర్జాతీయంగా మరిన్ని గమ్యస్థానాలకు చేరేంద]ుకు, సర్వీసులు పెంచుకునేందుకు ఏకంగా 470 విమానాల కొనుగోలుకు మంగళవారం ఒప్పందం కుదుర్చుకుంది.
ఎయిర్బస్ నుంచి 250 .. బోయింగ్ నుంచి 220
విలువ రూ.6.40 లక్షల కోట్లు
దిల్లీ: టాటా గ్రూపు అధీనంలోని ఎయిరిండియా తన కార్యకలాపాలను భారీగా విస్తరించనుంది. దేశీయంగా, అంతర్జాతీయంగా మరిన్ని గమ్యస్థానాలకు చేరేంద]ుకు, సర్వీసులు పెంచుకునేందుకు ఏకంగా 470 విమానాల కొనుగోలుకు మంగళవారం ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో ఫ్రాన్స్ సంస్థ ఎయిర్బస్ నుంచి 250 విమానాలు, అమెరికా సంస్థ బోయింగ్ నుంచి 220 విమానాలు సరఫరా అవుతాయి. ఈమొత్తం ఆర్డరు విలువ 80 బిలియన్ డాలర్లు (సుమారు రూ.6.40 లక్షల కోట్లు) ఉంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
ఎయిర్బస్ నుంచి 40 వైడ్బాడీ (పెద్ద) ఏ 350 విమానాలు, 210 నారో బాడీ (చిన్న) ఏ320/321 నియో విమానాలు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ వెల్లడించారు. దృశ్యమాధ్యమ పద్ధతిలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎమాన్యువల్ మాక్రాన్, కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, పీయూష్ గోయల్, టాటా గ్రూపు గౌరవ ఛైర్మన్ రతన్ టాటా, ఎయిరిండియా సీఈఓ విల్సన్ క్యాంప్బెల్, ఎయిర్బస్ సీఈఓ గిలామే ఫారే పాల్గొన్నారు. 16 గంటలకు పైగా ప్రయాణించే అల్ట్రా- లాంగ్ హాల్ విమానాల కోసం వైడ్ బాడీ విమానాలను ఉపయోగిస్తామని చంద్రశేఖరన్ తెలిపారు.
బోయింగ్ నుంచి పెద్ద విమానాలైన 20 బోయింగ్ 787ఎస్; 10 బోయింగ్ 777-9ఎస్తో పాటు సింగిల్ యాసిల్ బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు 190 కొనుగోలు చేసేందుకూ ఎయిరిండియా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పంద విలువ 34 బిలియన్ డాలర్లు (సుమారు రూ.2.80 లక్షల కోట్లు). మరో 70 విమానాలు కొనుగోలు చేసే హక్కునూ ఎయిరిండియా పొందింది. అప్పుడు మొత్తం విలువ 45.9 బిలియన్ డాలర్లు (సుమారు రూ.3.76 లక్షల కోట్లు). విలువ పరంగా బోయింగ్కు లభించిన మూడో అతిపెద్ద ఆర్డరు ఇది కాగా, విమానాల సంఖ్యా పరంగా రెండోది. ఇందువల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 14.7 లక్షల ఉద్యోగావకాశాలు లభిస్తాయని అంచనా. బోయింగ్, ఎయిరిండియా ఒప్పందం ఇరు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు.
* ఎయిర్బస్ ఏ350 విమానాలకు రోల్స్రాయిస్ ఇంజిన్లు, బోయింగ్ 777/787ఎస్ విమానాలకు జీఈ ఏరోస్పేస్ ఇంజిన్లు, సింగిల్ యాసిల్ విమానాలన్నింటికీ జీఎఫ్ఎం ఇంటర్నేషనల్ ఇంజిన్లు వినియోగిస్తామని ఎయిరిండియా తెలిపింది.
* కొత్త ఆర్డర్లకు సంబంధించి తొలి విమానం ఈ ఏడాది ఆఖరులో చేరుతుందని, అధిక విమానాలు 2025 మధ్య నుంచి వస్తాయని ఎయిరిండియా పేర్కొంది. ప్రస్తుత అవసరాల కోసం 11 బోయింగ్ 777 విమానాలు, ఏ320 విమానాలు 25 లీజుకు తీసుకున్నట్లు తెలిపింది. కొత్త విమానాల కోసం ఎయిరిండియా ఆర్డరు పెట్టడం 17 ఏళ్ల తరవాత ఇప్పుడే.
15 ఏళ్లలో 2000 విమానాలు అవసరం: ప్రధాని మోదీ
ఎయిర్బస్, బోయింగ్ - ఎయిరిండియా ఒప్పందం చరిత్రాత్మకమని ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. భారత్, ఫ్రాన్స్, అమెరికాల మధ్య ఉన్న బలమైన బంధానికి, భారత పౌర విమానయాన రంగ విజయాలు, ఆశయాలకు ఇది నిదర్శనమని అన్నారు. విమానయాన రంగంలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద విపణిగా ఎదగనున్న భారత్కు, వచ్చే 15 ఏళ్లలో 2,000కి పైగా విమానాలు అవసరం అవుతాయని ప్రధాని తెలిపారు. ‘జాతీయ మౌలిక సదుపాయాల విధానంలో విమానయాన రంగాన్ని బలోపేతం చేయడం ముఖ్యమైన అంశమ’ని వివరించారు. గత 8 ఏళ్లలో దేశంలోని విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 147కు పెరిగిందని ప్రధాని గుర్తు చేశారు.
చివరిసారి 2005లో 111 విమానాలకు (బోయింగ్ నుంచి 68, ఎయిర్బస్ నుంచి 43) ఎయిరిండియా ఆర్డరు పెట్టింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
-
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
-
‘12th ఫెయిల్’కు జాతీయ అవార్డు.. ప్రచారంపై స్పందించిన నటుడు
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు