ఎయిరిండియా.. 470 కొత్త విమానాలు
టాటా గ్రూపు అధీనంలోని ఎయిరిండియా తన కార్యకలాపాలను భారీగా విస్తరించనుంది. దేశీయంగా, అంతర్జాతీయంగా మరిన్ని గమ్యస్థానాలకు చేరేంద]ుకు, సర్వీసులు పెంచుకునేందుకు ఏకంగా 470 విమానాల కొనుగోలుకు మంగళవారం ఒప్పందం కుదుర్చుకుంది.
ఎయిర్బస్ నుంచి 250 .. బోయింగ్ నుంచి 220
విలువ రూ.6.40 లక్షల కోట్లు
దిల్లీ: టాటా గ్రూపు అధీనంలోని ఎయిరిండియా తన కార్యకలాపాలను భారీగా విస్తరించనుంది. దేశీయంగా, అంతర్జాతీయంగా మరిన్ని గమ్యస్థానాలకు చేరేంద]ుకు, సర్వీసులు పెంచుకునేందుకు ఏకంగా 470 విమానాల కొనుగోలుకు మంగళవారం ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో ఫ్రాన్స్ సంస్థ ఎయిర్బస్ నుంచి 250 విమానాలు, అమెరికా సంస్థ బోయింగ్ నుంచి 220 విమానాలు సరఫరా అవుతాయి. ఈమొత్తం ఆర్డరు విలువ 80 బిలియన్ డాలర్లు (సుమారు రూ.6.40 లక్షల కోట్లు) ఉంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
ఎయిర్బస్ నుంచి 40 వైడ్బాడీ (పెద్ద) ఏ 350 విమానాలు, 210 నారో బాడీ (చిన్న) ఏ320/321 నియో విమానాలు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ వెల్లడించారు. దృశ్యమాధ్యమ పద్ధతిలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎమాన్యువల్ మాక్రాన్, కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, పీయూష్ గోయల్, టాటా గ్రూపు గౌరవ ఛైర్మన్ రతన్ టాటా, ఎయిరిండియా సీఈఓ విల్సన్ క్యాంప్బెల్, ఎయిర్బస్ సీఈఓ గిలామే ఫారే పాల్గొన్నారు. 16 గంటలకు పైగా ప్రయాణించే అల్ట్రా- లాంగ్ హాల్ విమానాల కోసం వైడ్ బాడీ విమానాలను ఉపయోగిస్తామని చంద్రశేఖరన్ తెలిపారు.
బోయింగ్ నుంచి పెద్ద విమానాలైన 20 బోయింగ్ 787ఎస్; 10 బోయింగ్ 777-9ఎస్తో పాటు సింగిల్ యాసిల్ బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు 190 కొనుగోలు చేసేందుకూ ఎయిరిండియా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పంద విలువ 34 బిలియన్ డాలర్లు (సుమారు రూ.2.80 లక్షల కోట్లు). మరో 70 విమానాలు కొనుగోలు చేసే హక్కునూ ఎయిరిండియా పొందింది. అప్పుడు మొత్తం విలువ 45.9 బిలియన్ డాలర్లు (సుమారు రూ.3.76 లక్షల కోట్లు). విలువ పరంగా బోయింగ్కు లభించిన మూడో అతిపెద్ద ఆర్డరు ఇది కాగా, విమానాల సంఖ్యా పరంగా రెండోది. ఇందువల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 14.7 లక్షల ఉద్యోగావకాశాలు లభిస్తాయని అంచనా. బోయింగ్, ఎయిరిండియా ఒప్పందం ఇరు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు.
* ఎయిర్బస్ ఏ350 విమానాలకు రోల్స్రాయిస్ ఇంజిన్లు, బోయింగ్ 777/787ఎస్ విమానాలకు జీఈ ఏరోస్పేస్ ఇంజిన్లు, సింగిల్ యాసిల్ విమానాలన్నింటికీ జీఎఫ్ఎం ఇంటర్నేషనల్ ఇంజిన్లు వినియోగిస్తామని ఎయిరిండియా తెలిపింది.
* కొత్త ఆర్డర్లకు సంబంధించి తొలి విమానం ఈ ఏడాది ఆఖరులో చేరుతుందని, అధిక విమానాలు 2025 మధ్య నుంచి వస్తాయని ఎయిరిండియా పేర్కొంది. ప్రస్తుత అవసరాల కోసం 11 బోయింగ్ 777 విమానాలు, ఏ320 విమానాలు 25 లీజుకు తీసుకున్నట్లు తెలిపింది. కొత్త విమానాల కోసం ఎయిరిండియా ఆర్డరు పెట్టడం 17 ఏళ్ల తరవాత ఇప్పుడే.
15 ఏళ్లలో 2000 విమానాలు అవసరం: ప్రధాని మోదీ
ఎయిర్బస్, బోయింగ్ - ఎయిరిండియా ఒప్పందం చరిత్రాత్మకమని ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. భారత్, ఫ్రాన్స్, అమెరికాల మధ్య ఉన్న బలమైన బంధానికి, భారత పౌర విమానయాన రంగ విజయాలు, ఆశయాలకు ఇది నిదర్శనమని అన్నారు. విమానయాన రంగంలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద విపణిగా ఎదగనున్న భారత్కు, వచ్చే 15 ఏళ్లలో 2,000కి పైగా విమానాలు అవసరం అవుతాయని ప్రధాని తెలిపారు. ‘జాతీయ మౌలిక సదుపాయాల విధానంలో విమానయాన రంగాన్ని బలోపేతం చేయడం ముఖ్యమైన అంశమ’ని వివరించారు. గత 8 ఏళ్లలో దేశంలోని విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 147కు పెరిగిందని ప్రధాని గుర్తు చేశారు.
చివరిసారి 2005లో 111 విమానాలకు (బోయింగ్ నుంచి 68, ఎయిర్బస్ నుంచి 43) ఎయిరిండియా ఆర్డరు పెట్టింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
ICICI Credit Cards: కొత్తగా జారీ చేసిన దాదాపు 17 వేల క్రెడిట్ కార్డుల వివరాలు పొరపాటున ఇతరుల ఖాతాలకు అనుసంధానమైనట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 94 పాయింట్ల లాభంతో 74,434 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 22,599 దగ్గర కొనసాగుతోంది. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!