Flights: అమెరికా మార్గాల్లో విమాన సర్వీసుల తాత్కాలిక తగ్గింపు
భారత్ నుంచి అమెరికాకు వెళ్లే కొన్ని మార్గాల్లో విమానాల సర్వీసుల సంఖ్యను తాత్కాలికంగా తగ్గించనున్నట్లు ఎయిరిండియా సీఈఓ క్యాంప్బెల్ విల్సన్ తెలిపారు.
ఎయిరిండియా సీఈఓ
దిల్లీ: భారత్ నుంచి అమెరికాకు వెళ్లే కొన్ని మార్గాల్లో విమానాల సర్వీసుల సంఖ్యను తాత్కాలికంగా తగ్గించనున్నట్లు ఎయిరిండియా సీఈఓ క్యాంప్బెల్ విల్సన్ తెలిపారు. విమాన క్యాబిన్ సిబ్బంది (క్రూ) కొరతే ఇందుకు కారణంగా పేర్కొన్నారు. అమెరికాకు వారంలో ఆరు విమాన సర్వీసులు- నెవార్క్కు 3, శాన్ఫ్రాన్సిస్కోకు వెళ్లేవి 3 తగ్గించనున్నామని తెలిపారు. రాబోయే 2-3 నెలల్లో ఈ సర్వీసుల కోత ఉంటుందని విల్సన్ పేర్కొన్నారు. మూడు నెలల్లో బోయింగ్ 777 విమానాల కోసం తమకు 100 మంది పైలట్లు ఉంటారని, 1,400 మంది క్యాబిన్ సిబ్బంది శిక్షణలో ఉన్నారని వివరించారు. ‘విమాన సిబ్బంది కొరత కారణంగా కొన్ని దీర్ఘకాల ప్రయాణ సర్వీసులపై ప్రభావం పడుతోంది. అందుకే కొన్ని అమెరికా మార్గాల్లో సర్వీసుల సంఖ్యను తగ్గించనున్నామ’ని కాపా ఇండియా సదస్సులో విల్సన్ తెలిపారు. ప్రస్తుతం ఎయిరిండియాలో ఫ్లైయింగ్ (గగనతల విహారంతో సంబంధమున్న), నాన్- ఫ్లైయింగ్ (సంబంధం లేని) ఉద్యోగులు మొత్తం 11,000 మంది వరకు ఉన్నారు.
విమానాల కొనుగోలుకు నిధులు సమీకరిస్తాం: బోయింగ్, ఎయిర్బస్ల నుంచి 470 విమానాల కొనుగోలుకు అవసరమైన భారీమొత్తం నిధులను సమీకరిస్తామనే నమ్మకంతో ఉన్నామని ఎయిరిండియా సీఈఓ క్యాంప్బెల్ విల్సన్ తెలిపారు. ఈ ఏడాది చివరి నుంచి ఈ విమానాల సరఫరా మొదలవుతుంది. నిధుల కోసం బ్యాంకులతో ఇప్పటికే ఎయిరిండియా సంప్రదింపులు జరుపుతోంది. తమ యజమాని టాటా సన్స్ నుంచి సహకారం లభిస్తుందని సంస్థ భావిస్తోంది. ‘మాకు టాటా సన్స్ అండ ఉంది. అందువల్ల విమానాల కొనుగోలుకు అవసరమైన నిధులు లభిస్తాయ’ని కాపా ఇండియా ఏవియేషన్ సదస్సు సందర్భంగా క్యాంప్బెల్ తెలిపారు. తమ అంతర్గత నిధుల నుంచి కొత్త విమానాల కోసం ఇప్పటికే కొంత మొత్తాన్ని ముందస్తుగా చెల్లించామని తెలిపారు. పెద్ద పరిమాణ (వైడ్బాడీ) విమానాల నవీకరణ కోసం 400 మిలియన్ డాలర్లను (సుమారు రూ.3,280 కోట్లు) ఎయిరిండియా వెచ్చించనుంది.
2023-24లో 1.6- 1.8 బి.డా. నష్టం
వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత విమానయాన సంస్థలు ఏకీకృతంగా 1.6- 1.8 బిలియన్ డాలర్ల మేర నష్టాన్ని నమోదు చేసే అవకాశం ఉందని విమానయాన కన్సల్టెన్సీ సంస్థ కాపా ఇండియా సోమవారం తెలిపింది. ఇందులో పూర్తి స్థాయి సేవల విమానయాన సంస్థలకే 1.1- 1.2 బిలియన్ డాలర్ల మేర నష్టం రావొచ్చని పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత విమానయాన సంస్థలకు కొత్తగా 132 విమానాలు సమకూరొచ్చని, దీంతో మొత్తం విమానాల సంఖ్య 816కు చేరొచ్చని తెలిపింది. సరఫరా, సరఫరాయేతర సమస్యల కారణంగా భారత విమానయాన సంస్థలకు చెందిన 100కి పైగా విమానాలు నిలిపేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ..2023-24పై అంచనాలు వెల్లడిస్తూ కాపా తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ 25 షేర్లు కొన్న రోజే ఖాతాలోకి వచ్చేస్తాయ్
ఇప్పటివరకు షేర్లు కొనుగోలు చేసినా, అమ్మినా.. అవి మన ఖాతాలో కనపడటం, ఇతరులకు బదిలీ కావడం మరుసటి ట్రేడింగ్ రోజున జరుగుతోంది. -
మన బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మోసాలు
గత 10 ఏళ్లలో భారతీయ బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మేర మోసాలు జరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. -
రిలయన్స్.. బ్యాంకింగ్ షేర్లు రాణించాయ్
దేశీయ సూచీలు బుధవారం లాభాల్లో ముగిశాయి. ముడిచమురు ధరలు తగ్గిన నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా ఇతర చమురు సంస్థల షేర్లు దూసుకెళ్లడం, బ్యాంకింగ్, వాహన షేర్లు కొనుగోళ్లతో కళకళలాడటం, సానుకూల స్థూల గణాంకాలతో సెన్సెక్స్ 526 పాయింట్లు, నిఫ్టీ 119 పాయింట్లు పెరిగాయి. -
పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్!
బజాజ్ ఫైనాన్స్లో ఓ విభాగంగా ఉన్న బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్.. తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. -
కూకట్పల్లిలో 264 ఎకరాలు రూ.3402 కోట్లు!
హైదరాబాద్ కూకట్పల్లిలో ఉన్న 264.50 ఎకరాల భూమిని రూ.3402 కోట్లకు విక్రయించనున్నట్లు హిందూజా గ్రూప్ సంస్థ జీఓసీఎల్ కార్పొరేషన్ బుధవారం వెల్లడించింది. -
జీడీపీలో 2% వెచ్చిస్తే 1.1 కోట్ల ఉద్యోగాల సృష్టి
భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో 2 శాతాన్ని నేరుగా ప్రజా సంరక్షణ సేవలపై వెచ్చించడం వల్ల 1.1 కోట్ల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంటుందని, ఈ ఉద్యోగాల్లో 70% వరకు మహిళలకే లభిస్తాయని ఫిక్కీ లేడిస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) రూపొందించిన ఓ నివేదిక వెల్లడించింది. -
హైదరాబాద్ ఇళ్ల విక్రయాల్లో 38% వృద్ధి
దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జనవరి-మార్చిలో ఇళ్ల విక్రయాలు సగటున 14% వృద్ధి చెందాయని, సగటు ధరలూ 10-32% పెరిగినట్లు స్థిరాస్తి సేవల సంస్థ అనరాక్ తాజా నివేదికలో తెలిపింది. -
బాండ్ల ద్వారా రూ.7.5 లక్షల కోట్ల సమీకరణకు నిర్ణయం
2024-25 ఏప్రిల్-సెప్టెంబరులో మార్కెట్ ద్వారా రూ.7.5 లక్షల కోట్ల రుణాలను సమీకరించాలని కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. -
సనోఫి టీకాలను పంపిణీ చేయనున్న డాక్టర్ రెడ్డీస్
సనోఫి హెల్త్కేర్ ఇండియా టీకాలను మనదేశంలో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ పంపిణీ చేయనుంది. -
సంక్షిప్త వార్తలు(6)
జర్మనీలోని మ్యూనిచ్ కేంద్రంగా పనిచేసే డ్యూయిష్ ఎయిర్క్రాఫ్ట్తో హైదరాబాద్కు చెందిన సైయెంట్ లిమిటెడ్ భాగస్వామ్యం కుదుర్చుకుంది.