Flights: అమెరికా మార్గాల్లో విమాన సర్వీసుల తాత్కాలిక తగ్గింపు
భారత్ నుంచి అమెరికాకు వెళ్లే కొన్ని మార్గాల్లో విమానాల సర్వీసుల సంఖ్యను తాత్కాలికంగా తగ్గించనున్నట్లు ఎయిరిండియా సీఈఓ క్యాంప్బెల్ విల్సన్ తెలిపారు.
ఎయిరిండియా సీఈఓ
దిల్లీ: భారత్ నుంచి అమెరికాకు వెళ్లే కొన్ని మార్గాల్లో విమానాల సర్వీసుల సంఖ్యను తాత్కాలికంగా తగ్గించనున్నట్లు ఎయిరిండియా సీఈఓ క్యాంప్బెల్ విల్సన్ తెలిపారు. విమాన క్యాబిన్ సిబ్బంది (క్రూ) కొరతే ఇందుకు కారణంగా పేర్కొన్నారు. అమెరికాకు వారంలో ఆరు విమాన సర్వీసులు- నెవార్క్కు 3, శాన్ఫ్రాన్సిస్కోకు వెళ్లేవి 3 తగ్గించనున్నామని తెలిపారు. రాబోయే 2-3 నెలల్లో ఈ సర్వీసుల కోత ఉంటుందని విల్సన్ పేర్కొన్నారు. మూడు నెలల్లో బోయింగ్ 777 విమానాల కోసం తమకు 100 మంది పైలట్లు ఉంటారని, 1,400 మంది క్యాబిన్ సిబ్బంది శిక్షణలో ఉన్నారని వివరించారు. ‘విమాన సిబ్బంది కొరత కారణంగా కొన్ని దీర్ఘకాల ప్రయాణ సర్వీసులపై ప్రభావం పడుతోంది. అందుకే కొన్ని అమెరికా మార్గాల్లో సర్వీసుల సంఖ్యను తగ్గించనున్నామ’ని కాపా ఇండియా సదస్సులో విల్సన్ తెలిపారు. ప్రస్తుతం ఎయిరిండియాలో ఫ్లైయింగ్ (గగనతల విహారంతో సంబంధమున్న), నాన్- ఫ్లైయింగ్ (సంబంధం లేని) ఉద్యోగులు మొత్తం 11,000 మంది వరకు ఉన్నారు.
విమానాల కొనుగోలుకు నిధులు సమీకరిస్తాం: బోయింగ్, ఎయిర్బస్ల నుంచి 470 విమానాల కొనుగోలుకు అవసరమైన భారీమొత్తం నిధులను సమీకరిస్తామనే నమ్మకంతో ఉన్నామని ఎయిరిండియా సీఈఓ క్యాంప్బెల్ విల్సన్ తెలిపారు. ఈ ఏడాది చివరి నుంచి ఈ విమానాల సరఫరా మొదలవుతుంది. నిధుల కోసం బ్యాంకులతో ఇప్పటికే ఎయిరిండియా సంప్రదింపులు జరుపుతోంది. తమ యజమాని టాటా సన్స్ నుంచి సహకారం లభిస్తుందని సంస్థ భావిస్తోంది. ‘మాకు టాటా సన్స్ అండ ఉంది. అందువల్ల విమానాల కొనుగోలుకు అవసరమైన నిధులు లభిస్తాయ’ని కాపా ఇండియా ఏవియేషన్ సదస్సు సందర్భంగా క్యాంప్బెల్ తెలిపారు. తమ అంతర్గత నిధుల నుంచి కొత్త విమానాల కోసం ఇప్పటికే కొంత మొత్తాన్ని ముందస్తుగా చెల్లించామని తెలిపారు. పెద్ద పరిమాణ (వైడ్బాడీ) విమానాల నవీకరణ కోసం 400 మిలియన్ డాలర్లను (సుమారు రూ.3,280 కోట్లు) ఎయిరిండియా వెచ్చించనుంది.
2023-24లో 1.6- 1.8 బి.డా. నష్టం
వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత విమానయాన సంస్థలు ఏకీకృతంగా 1.6- 1.8 బిలియన్ డాలర్ల మేర నష్టాన్ని నమోదు చేసే అవకాశం ఉందని విమానయాన కన్సల్టెన్సీ సంస్థ కాపా ఇండియా సోమవారం తెలిపింది. ఇందులో పూర్తి స్థాయి సేవల విమానయాన సంస్థలకే 1.1- 1.2 బిలియన్ డాలర్ల మేర నష్టం రావొచ్చని పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత విమానయాన సంస్థలకు కొత్తగా 132 విమానాలు సమకూరొచ్చని, దీంతో మొత్తం విమానాల సంఖ్య 816కు చేరొచ్చని తెలిపింది. సరఫరా, సరఫరాయేతర సమస్యల కారణంగా భారత విమానయాన సంస్థలకు చెందిన 100కి పైగా విమానాలు నిలిపేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ..2023-24పై అంచనాలు వెల్లడిస్తూ కాపా తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్