ప్రీమియం హోటళ్లకు కళ
ప్రీమియం హోటళ్లు కళకళలాడనున్నాయి. ముఖ్యంగా ఆదాయం విషయంలో రాణించనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 80%, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 15-20% మేర వృద్ధి చెందనున్నట్లు క్రిసిల్ తన నివేదికలో పేర్కొంది.
80% పెరగనున్న ఆదాయం: క్రిసిల్ నివేదిక అంచనా
ముంబయి: ప్రీమియం హోటళ్లు కళకళలాడనున్నాయి. ముఖ్యంగా ఆదాయం విషయంలో రాణించనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 80%, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 15-20% మేర వృద్ధి చెందనున్నట్లు క్రిసిల్ తన నివేదికలో పేర్కొంది. విహార, కార్పొరేట్, ఎమ్ఐసీఈ (సమావేశాలు, ప్రోత్సాహకాలు, కాన్ఫరెన్స్లు, ప్రదర్శనలు), అంతర్జాతీయ ప్రయాణాలు పెరగడంతో ప్రీమియం హోటళ్లలో దశాబ్దంలోనే అత్యధిక ఆక్యుపెన్సీ కనిపిస్తోందని క్రిసిల్ మార్కెట్ ఇంటలిజెన్స్ నివేదిక చెబుతోంది. అందులోని ముఖ్యాంశాలు..
* గిరాకీ పెరగడంతో సగటు గది రేట్లు(ఏఆర్ఆర్) కరోనా ముందు స్థాయికి చేరాయి. దీంతో ఆపరేటింగ్ మార్జిన్లు రికార్డు స్థాయికి చేరుతున్నాయి.
* 2021-22లో ప్రీమియం హోటళ్లలో ఏఆర్ఆర్ 13% పెరిగింది. 2022-23లో 19-21% పెరగడంతో దశాబ్ద గరిష్ఠస్థాయి రూ.7500-10,000కు చేరుకుంది.
* 2021-22లో ఆక్యుపెన్సీ స్థాయి 50% ఉండగా.. ఈ ఏడాది అది 67-72 శాతానికి చేరింది. ఇది కూడా దశాబ్దపు గరిష్ఠమే. కాగా, 2020-21లో ఏఆర్ఆర్ 20-25% క్షీణించడంతో పాటు ఆక్యుపెన్సీ 31 శాతానికి పరిమితమైంది.
* ప్రతీకార ప్రయాణాలు (కరోనా సమయం ఇంటికే పరిమితం కావడంతో తర్వాత చేస్తున్న విహారాలు), విరామ, కార్పొరేట్, ఎమ్ఐసీఈ అంశాల్లో మెరుగుపడడంతో దేశీయ గిరాకీ రాణిస్తోంది.
* విదేశీ పర్యాటకుల సంఖ్య ఇంకా కరోనా ముందు స్థాయిలకు చేరలేదు. తొలి 9 నెలల్లో 54 లక్షలు లేదా కరోనా ముందు స్థాయిలో 70% మాత్రమే నమోదైంది. అయితే 2023-24లో 100 శాతానికి చేరొచ్చని అంచనా.
* కాగా, ప్రస్తుత రికవరీలో ప్రీమియం హోటళ్లలోనే అధిక ఏఆర్ఆర్, ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. బడ్జెట్ హోటళ్లలో మాత్రం తగ్గుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Stock Market: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాల్లో ట్రేడింగ్ను మొదలుపెట్టాయి. -
2024-25లోనూ ఐటీ నియామకాలు అంతంతే
ఐటీ రంగం ఆకర్షణీయ వృద్ధి బాట పట్టేందుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మెరుగైన పరిస్థితి ఉంటుందనే అంశమే కాస్త ఊరట కలిగిస్తోంది. -
దీర్ఘకాలంలో చిన్న, మధ్య షేర్లు బలంగానే
చిన్న, మధ్య స్థాయి షేర్ల విలువలు మరీ అధిక స్థాయికి చేరాయని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చేసిన వ్యాఖ్యలతో ఈ షేర్లు గత 3 వారాల్లో భారీగా కుదేలయ్యాయి. -
ఆఫీసుకు వస్తేనే పదోన్నతులు
కార్యాలయాలకు రాకపోతే పదోన్నతులు ఇవ్వబోమని తమ ఉద్యోగులకు స్పష్టం చేస్తూ ల్యాప్ట్యాప్ల తయారీ కంపెనీ డెల్ లేఖ పంపినట్లు తెలుస్తోంది. -
రూ.1991కే ఫ్లై91 ప్రయాణం
ఫ్లై91 సంస్థ సోమవారం తన విమాన సర్వీసులను ప్రారంభించింది. మొదటి విమానం గోవా మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉదయం గం.7.55కు బయలుదేరి వెళ్లింది. -
ప్రాంగణ నియామకాల్లో మహిళల వాటా 5% పెరిగింది: హైర్ ప్రో
అంతక్రితం ఏడాదితో పోలిస్తే, 2022-23 ప్రాంగణ నియామకాల్లో మహిళల వాటా 5% పెరిగినట్లు ఏఐ పవర్డ్ రిక్రూట్మెంట్ ఆటోమేషన్ సంస్థ హైర్ ప్రో నివేదిక వెల్లడించింది. -
అంకురాలకు విలువే సర్వస్వం కాదు
పారదర్శకత, నైతిక ప్రవర్తన కోసం స్వీయ నియంత్రణ విధానాన్ని దేశీయ అంకుర సంస్థలు అవలంబించాలని జీ20లో భారత తరపు ప్రధాన ప్రతినిధి (షెర్పా) అమితాబ్ కాంత్ తెలిపారు. -
మదుపర్ల అప్రమత్తత
ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం వెలువడనున్నందున, మదుపర్లు అప్రమత్తత పాటించారు. -
బీమా రంగంలోకి రూ.54,000 కోట్ల ఎఫ్డీఐ
గత తొమ్మిదేళ్లలో బీమా రంగం రూ.54,000 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ)ను ఆకర్షించిందని ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి తెలిపారు. -
బెంగళూరు- లక్షద్వీప్ విమాన సర్వీసు: ఇండిగో
లక్షద్వీప్కు విమాన సదుపాయాన్ని విస్తరించడంలో భాగంగా ఈనెల 31 నుంచి బెంగళూరు- అగత్తి మధ్య నేరుగా విమాన సర్వీసులను నడుపుతున్నట్లు ఇండిగో సోమవారం వెల్లడించింది. -
మనవడికి రూ.240 కోట్ల ఇన్ఫోసిస్ షేర్లు
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి, తన మనవడు ఏకాగ్రహ్ రోహన్ మూర్తికి భారీ బహుమతి ఇచ్చారు. -
సంక్షిప్త వార్తలు
ఈ వేసవిలో ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అంతర్జాతీయ విమాన సర్వీసులను 20 శాతానికి పైగా పెంచనుంది. దేశ, విదేశీ మార్గాల్లో రోజువారీ 360కి పైగా విమాన సర్వీసులను నడపబోతోంది. -
WhatsApp: వాట్సప్ పేమెంట్స్ ఇక మరింత సులువుగా.. ఇక చాట్ లిస్ట్లోనే
WhatsApp payments: వాట్సప్లో పేమెంట్స్ ఇక మరింత సులువు కానుంది. చాట్ లిస్ట్లోనే ఇకపై క్యూఆర్ కోడ్ స్కానర్ కనిపించనుంది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా మూకల దాడిలో గాయపడిన తెదేపా కార్యకర్త మృతి
-
TS News: తమిళిసై రాజీనామాకు ఆమోదం.. ఝార్ఖండ్ గవర్నర్కు అదనపు బాధ్యతలు
-
Liquor Policy Case: రూ.100కోట్ల చెల్లింపులపై ఈడీ ప్రకటన.. అక్రమంగా ఒక్క రూపాయీ లేదన్న ఆప్
-
POLL: రోహిత్ను కాదని హార్దిక్కు కెప్టెన్సీ... ముంబయి ఇండియన్స్ నిర్ణయం సరైనదేనా?
-
Modi: ‘మీవాళ్లు క్షేమంగా ఉన్నారు..త్వరలో తిరిగొస్తారు’: బల్గేరియా అధ్యక్షుడికి మోదీ రిప్లై
-
Actors turned Directors: ధనుష్, ఉపేంద్ర, కంగన.. మళ్లీ మరో కోణాన్ని చూపించేందుకు...