ప్రస్తుత పొదుపు, పెట్టుబడి రేట్లతో 8% వృద్ధి సాధ్యపడదు
ప్రస్తుతం ఉన్న పొదుపు, పెట్టుబడుల వడ్డీ రేట్లతో ఆర్థిక వ్యవస్థ 8 శాతం వృద్ధి సాధించలేదని ఇండియా రేటింగ్స్ నివేదిక అంచనా వేసింది.
ఇండియా రేటింగ్స్ నివేదిక
ముంబయి: ప్రస్తుతం ఉన్న పొదుపు, పెట్టుబడుల వడ్డీ రేట్లతో ఆర్థిక వ్యవస్థ 8 శాతం వృద్ధి సాధించలేదని ఇండియా రేటింగ్స్ నివేదిక అంచనా వేసింది. స్థిరమైన ప్రాతిపదికన ఈ రేట్లు 35 శాతంగా ఉండాలని, ప్రస్తుతం ఇవి వరుసగా 30.2 శాతం, 29.6 శాతంగా ఉన్నట్లు వెల్లడించింది. ప్రైవేట్ రంగ పెట్టుబడులు మళ్లీ పుంజుకోవాలంటే మౌలిక రంగంలో భారీ పెట్టుబడులు అవసరమని అభిప్రాయపడింది. అంతర్జాతీయ ఇబ్బందుల కారణంగా విదేశీ గిరాకీ బలహీనపడటం, సరఫరా పరమైన సమస్యలు వంటి వాటిని దూరం చేయడానికి ఈ పెట్టుబడులు తోడ్పడతాయని తెలిపింది. అధిక పెట్టుబడులతో పాటు అధికంగా దేశీయ పొదుపులు కూడా అవసరమని, అప్పుడే పొదుపు-పెట్టుబడుల మధ్య లోటు అదుపులో ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం ప్రభుత్వం మౌలిక రంగ వ్యయాలపై దృష్టి పెట్టినప్పటికీ.. పొదుపు పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం లేదని ఇండియా రేటింగ్స్ వివరించింది. 2020-21లో 6.6 శాతం క్షీణించిన ఆర్థిక వ్యవస్థ.. గత ఆర్థిక సంవత్సరంలో 8.7 శాతం వృద్ధి నమోదుచేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7 శాతానికి వృద్ధి తగ్గొచ్చని, వచ్చే ఆర్థిక సంవత్సరం మరింత తగ్గి 5.9 శాతానికి చేరొచ్చన్న అంచనాలు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
-
అత్యవసర నిధి ఖర్చులను తట్టుకునేలా
అవసరాలు ఎప్పుడు ఏ రూపంలో పలకరిస్తాయో చెప్పలేం. ఇలా వచ్చేవాటిని తట్టుకునేందుకు ఆర్థికంగా సిద్ధంగా ఉండాల్సిందే. నెలనెలా ఆదాయం వచ్చేదాకా వీటిని వాయిదా వేయలేం. -
ఆరోగ్య బీమా: సమాచారం ఇస్తేనే మేలు
ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు అప్పటి వరకూ ఉన్న ముందస్తు వ్యాధుల గురించి బీమా సంస్థకు తప్పనిసరిగా తెలియజేయాలి. -
31లోగా ఇవి పూర్తి చేయండి..
ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో మార్చి 31 నాటికి పూర్తి చేయాల్సిన కొన్ని పనులు.. ముగుస్తున్న పథకాల వివరాలను పరిశీలిద్దాం.. -
విశ్రాంత జీవితంలో తోడుగా
పదవీ విరమణ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవకుండా, స్థిరమైన ఆదాయాన్ని అందించే పదవీ విరమణ పథకాలపై మదుపరుల్లో ఆసక్తి పెరుగుతోంది -
డెబిట్ కార్డు ఛార్జీలను పెంచిన ఎస్బీఐ
డెబిట్ కార్డులపై నిర్వహణ ఛార్జీలను ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సవరించింది. కొత్త ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. -
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
Retail Brands: ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చేపడుతున్న కార్యక్రమాల ద్వారా దేశంలో ఆధ్యాత్మిక పర్యటకం అభివృద్ధి చెందుతోంది. దీంతో రిటైల్ బ్రాండ్లు ఆధ్యాత్మిక నగరాలకు తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే