అన్అకాడెమీలో 350 మంది ఉద్యోగులకు లేఆఫ్లు
అన్అకాడెమీలో 350 మంది ఉద్యోగులకు లేఆఫ్లు ప్రకటించనున్నట్లు కంపెనీ సహ వ్యవస్థాపకులు, సీఈఓ గౌరవ్ ముంజాల్ వెల్లడించారు.
దిల్లీ: అన్అకాడెమీలో 350 మంది ఉద్యోగులకు లేఆఫ్లు ప్రకటించనున్నట్లు కంపెనీ సహ వ్యవస్థాపకులు, సీఈఓ గౌరవ్ ముంజాల్ వెల్లడించారు. ప్రస్తుత అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో నిధుల సమీకరణ కష్టంగా మారినందున అనుకున్న లక్ష్యాల్ని చేరడానికి ఉద్యోగులను తొలగించక తప్పట్లేదని తెలిపారు. గతేడాది ఏప్రిల్లో 600 మంది ఉద్యోగులను తొలగించగా.. నవంబరులోనూ 350 మందికి లేఆఫ్లు ప్రకటించింది. ఒక ఏడాదిలో మొత్తం ఉద్యోగుల సంఖ్యను 3,000కు తీసుకురావాలని సంస్థ భావిస్తున్నట్లు సమాచారం. ఉద్యోగం నుంచి తొలగించిన వారికి నోటీసు కాలంతో పాటు అదనంగా మరో నెల వేతనం చెల్లించడంతో పాటు సెప్టెంబరు 30 వరకు వైద్య బీమా సౌకర్యాన్ని కల్పించనుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
కోర్టు బోనెక్కనున్న బ్రిటన్ రాకుమారుడు..
-
Ap-top-news News
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. 18 దూరప్రాంత రైళ్ల రద్దు
-
India News
అరిహాను స్వదేశానికి పంపండి.. మూడేళ్ల పాప కోసం జర్మనీపై భారత్ ఒత్తిడి
-
India News
పెద్దమనసు చాటుకున్న దీదీ
-
Crime News
పెద్ద నోట్లకు ఆశపడితే ఉన్న నోట్లు జారిపాయే!.. రాజానగరంలో సినీఫక్కీలో రూ. 50 లక్షల చోరీ
-
Ts-top-news News
రీజినల్ పాస్పోర్టు కార్యాలయంలో అదనపు కౌంటర్లు