భారత వృద్ధిలో మరింత జోరు
సంస్కరణల అమలును వేగవంతం చేస్తే భారత వృద్ధి మరింత దూసుకెళ్లొచ్చని ప్రపంచ బ్యాంక్ తాజా నివేదికలో పేర్కొంది.
సంస్కరణల అమలులో వేగం ముఖ్యం
ప్రపంచ బ్యాంక్ నివేదిక
దిల్లీ: సంస్కరణల అమలును వేగవంతం చేస్తే భారత వృద్ధి మరింత దూసుకెళ్లొచ్చని ప్రపంచ బ్యాంక్ తాజా నివేదికలో పేర్కొంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటోందని, ఇటీవలి కాలంలో ఆర్థిక వృద్ధికి కారణమైన చోదకాలు ప్రస్తుతం డీలాపడినట్లు వెల్లడించింది. ‘ఫాలింగ్ లాంగ్ టెర్మ్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్: ట్రెండ్స్, ఎక్స్పెక్టేషన్స్, పాలసీస్’ పేరిట ప్రపంచ బ్యాంక్ ఈ నివేదికను విడుదల చేసింది. 2030 నాటికి అంతర్జాతీయ వృద్ధి మూడు దశాబ్దాల్లోనే కనిష్ఠ స్థాయికి చేరే అవకాశం ఉందని, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు ఇందుకు కారణమని అంచనా వేసింది. కొవిడ్-19 రాకముందే ఉత్పాదకతలో మందగమనం మొదలైందని, ఆదాయ వృద్ధి, అధిక వేతనాలకు ఇవి కీలకమని.. దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను దెబ్బతీసినట్లు నివేదిక అభిప్రాయపడింది. పెట్టుబడుల వృద్ధి కూడా బలహీనంగా ఉందని, అంతర్జాతీయ ఉద్యోగాల వృద్ధి మందకొడిగానే ఉన్నట్లు తెలిపింది. కరోనా సంక్షోభం కారణంగా కోల్పోయిన మానవ వనరులు మళ్లీ పుంజుకోలేదని వివరించింది. ఫలితంగా దశాబ్ద కాలాన్ని ప్రపంచం కోల్పోతుందని, అంతర్జాతీయ సగటు వృద్ధి సాధించేందుకు విధానపరమైన తోడ్పాటు అవసరమని పేర్కొంది. నివేదికలోని ఇతర ముఖ్యాంశాలు..
* ఇప్పటి నుంచి 2030 వరకు అంతర్జాతీయ వృద్ధి దశాబ్ద కనిష్ఠమైన 2.2 శాతానికి చేరొచ్చు. 2011-21 మధ్య ఇది 2.6 శాతంగా ఉంది.
* దేశాలు స్థిరమైన, వృద్ధి ఆధారిత విధానాలను అవలంబిస్తే అంతర్జాతీయ జీడీపీ వృద్ధి 0.7 శాతం పెరిగి వార్షిక సగటు రేటు 2.9 శాతానికి వెళ్లొచ్చు. పోటీ దేశాలతో పోలిస్తే భారత్ వేగంగా వృద్ధి సాధిస్తోంది. సంస్కరణల అమలుతో ఇది మరింత జోరందుకోవచ్చు.
* ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్కు తక్కువ అభివృద్ధి చెందిన బ్యాంకింగ్ వ్యవస్థ ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల పాత్రను మరింత హేతుబద్ధీకరిస్తే స్టాక్ మార్కెట్ల అభివృద్ధికి ఊతమందించే అవకాశం ఉంటుంది.
* జాతీయ మౌలిక రంగ పైప్లైన్పై టాస్క్ఫోర్స్ చేసిన సంస్కరణల సిఫారసులను అమలు చేయాలి. మౌలిక రంగాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. 2000-10లో వార్షిక పెట్టుబడుల వృద్ధి సగటు 10.5 శాతంగా ఉండగా.. 2011-21 మధ్య 5.7 శాతానికి చేరింది.
* ప్రభుత్వం మౌలిక రంగ పెట్టుబడులపై దృష్టి పెట్టడం, కార్మిక నిబంధనల సరళీకరణ, ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణ, లాజిస్టిక్స్ రంగ ఆధునికీకరణ వంటి దీర్ఘకాలంలో మేలుచేకూర్చనున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్టాక్స్ లాభాలు బల్లే బల్లే
ప్రస్తుత (2023-24) ఆర్థిక సంవత్సరాన్ని సూచీలు లాభాలతో ముగించాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో గురువారం సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 1% రాణించాయి. -
షియామీ ఎస్యూ7 ఈవీ
షియామీ తన తొలి విద్యుత్ కారు (ఈవీ) ఎస్యూ7ను (ఎస్యూ అంటే స్పీడ్ అల్ట్రా) గురువారం విడుదల చేసింది. -
నెమ్మదించిన కీలక రంగాల వృద్ధి
దేశీయంగా 8 కీలక మౌలిక రంగాల వృద్ధి గత నెలలో నెమ్మదించింది. ఎరువుల వంటి రంగాల బలహీన పని తీరుతో ఫిబ్రవరిలో కీలక రంగాల వృద్ధి 6.7 శాతానికి పరిమితమైంది. -
ద్రవ్యలోటు రూ.15 లక్షల కోట్లు
ఫిబ్రవరి చివరి నాటికి ప్రభుత్వ ద్రవ్యలోటు రూ.15 లక్షల కోట్లుగా నమోదైంది. బడ్జెట్లో సవరించిన వార్షిక లక్ష్యం రూ.17.35 లక్షల కోట్లలో ఇది 86.5 శాతమని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. -
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఔషధ రంగ వృద్ధి 8-10% : ఇక్రా
వచ్చే ఆర్థిక సంవత్సరంలో, 25 దేశీయ ఫార్మా కంపెనీల ఆదాయాల్లో వృద్ధి 8- 10 శాతానికి మించకపోవచ్చని రేటింగ్ సేవల సంస్థ ఇక్రా లిమిటెడ్ అంచనా వేసింది. -
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్లపై విదేశాల్లో మోసపూరిత లావాదేవీలు
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదార్లలో చాలా మంది మోసపూరిత విదేశీ లావాదేవీలకు బలయ్యారు. -
అంబానీ, అదానీ తొలిసారి కలిశారు
సంపద పరంగా దేశంలో తొలి రెండు స్థానాల్లో ఉన్న కుబేరులు అంబానీ, అదానీ మధ్య వ్యాపార భాగస్వామ్యం కుదిరింది. గుజరాత్కే చెందిన వారిద్దరి మధ్య, కనిపించని పోటీ ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటాయి. -
ఎంఎస్డీతో కాంట్రాక్టు తయారీ చర్చల కొనసాగింపు
ఔషధాల కాంట్రాక్టు తయారీ ఒప్పందాల నిమిత్తం బహుళ జాతి ఫార్మా కంపెనీ ఎంఎస్డీ (మెర్క్ షార్ప్ అండ్ దోహ్మే సింగపూర్ ట్రేడింగ్ పీటీఈ లిమిటెడ్), తమ అనుబంధ సంస్థ క్యూరాటెక్ బయోలాజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య జరుగుతున్న సంప్రదింపులు మరో 2 నెలలు కొనసాగుతాయని అరబిందో ఫార్మా వెల్లడించింది. -
యూఏఈలో యూపీఏ చెల్లింపులకు నియోపే టెర్మినళ్లు వాడొచ్చు: ఫోన్పే
తమ వినియోగదార్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు (యూఏఈ) వెళ్లినప్పుడు.. అక్కడి మాష్రెఖ్ బ్యాంకుకు చెందిన నియోపే టెర్మినళ్ల ద్వారా యూపీఐ చెల్లింపులు చేయొచ్చని ఫోన్పే తెలిపింది. -
చెన్నై రిఫైనరీలో ఐఓసీ వాటా పెంపు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), దాని అనుబంధ సంస్థ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ (సీపీసీఎల్) సంయుక్తంగా ఏర్పాటు చేసిన సంస్థ ఆధ్వర్యంలో చెన్నైలో నిర్మిస్తున్న 9 మిలియన్ టన్నుల రిఫైనరీలో తన వాటాను 75 శాతానికి పెంచుకోనుంది. -
సంక్షిప్తవార్తలు (5)
సూక్ష్మరుణాలు అందించే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ) సొనాటా ఫైనాన్స్ లిమిటెడ్ను కోటక్ మహీంద్రా బ్యాంకు రూ.537 కోట్లకు కొనుగోలు చేసింది. -
కొత్త ఆర్థిక సంవత్సరం ఇలా ప్రారంభిద్దాం...
ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే చాలా విషయాల్లో మార్పులు వస్తుంటాయి. ఆదాయపు పన్ను విషయం కావొచ్చు.. బ్యాంకింగ్ సంబంధిత లావాదేవీలు.. ఇలా ఎన్నో ఏప్రిల్ 1 నుంచి మనకు కొత్తగా కనిపిస్తుంటాయి -
పసిడిలో మదుపు 10 శాతమే..
నాకు నెలకు రూ.60వేల వేతనం వస్తోంది. నా వయసు 39. ఇప్పటి వరకూ ఎలాంటి జీవిత బీమా పాలసీలనూ తీసుకోలేదు. ఇప్పుడు ఎలాంటి పాలసీలను తీసుకోవాలి. -
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
స్టాక్ మార్కెట్ సూచీలు గరిష్ఠ స్థాయికి చేరుతుండటంతో ఇటీవల కాలంలో చాలామంది ఇందులో మదుపు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మూడేళ్లుగా ఈక్విటీల్లోకి వస్తున్న పెట్టుబడులే ఇందుకు నిదర్శనం -
అత్యవసర నిధి ఖర్చులను తట్టుకునేలా
అవసరాలు ఎప్పుడు ఏ రూపంలో పలకరిస్తాయో చెప్పలేం. ఇలా వచ్చేవాటిని తట్టుకునేందుకు ఆర్థికంగా సిద్ధంగా ఉండాల్సిందే. నెలనెలా ఆదాయం వచ్చేదాకా వీటిని వాయిదా వేయలేం. -
ఆరోగ్య బీమా: సమాచారం ఇస్తేనే మేలు
ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు అప్పటి వరకూ ఉన్న ముందస్తు వ్యాధుల గురించి బీమా సంస్థకు తప్పనిసరిగా తెలియజేయాలి. -
31లోగా ఇవి పూర్తి చేయండి..
ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో మార్చి 31 నాటికి పూర్తి చేయాల్సిన కొన్ని పనులు.. ముగుస్తున్న పథకాల వివరాలను పరిశీలిద్దాం.. -
విశ్రాంత జీవితంలో తోడుగా
పదవీ విరమణ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవకుండా, స్థిరమైన ఆదాయాన్ని అందించే పదవీ విరమణ పథకాలపై మదుపరుల్లో ఆసక్తి పెరుగుతోంది -
డెబిట్ కార్డు ఛార్జీలను పెంచిన ఎస్బీఐ
డెబిట్ కార్డులపై నిర్వహణ ఛార్జీలను ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సవరించింది. కొత్త ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. -
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
Retail Brands: ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చేపడుతున్న కార్యక్రమాల ద్వారా దేశంలో ఆధ్యాత్మిక పర్యటకం అభివృద్ధి చెందుతోంది. దీంతో రిటైల్ బ్రాండ్లు ఆధ్యాత్మిక నగరాలకు తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్