భారత వృద్ధిలో మరింత జోరు
సంస్కరణల అమలును వేగవంతం చేస్తే భారత వృద్ధి మరింత దూసుకెళ్లొచ్చని ప్రపంచ బ్యాంక్ తాజా నివేదికలో పేర్కొంది.
సంస్కరణల అమలులో వేగం ముఖ్యం
ప్రపంచ బ్యాంక్ నివేదిక
దిల్లీ: సంస్కరణల అమలును వేగవంతం చేస్తే భారత వృద్ధి మరింత దూసుకెళ్లొచ్చని ప్రపంచ బ్యాంక్ తాజా నివేదికలో పేర్కొంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటోందని, ఇటీవలి కాలంలో ఆర్థిక వృద్ధికి కారణమైన చోదకాలు ప్రస్తుతం డీలాపడినట్లు వెల్లడించింది. ‘ఫాలింగ్ లాంగ్ టెర్మ్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్: ట్రెండ్స్, ఎక్స్పెక్టేషన్స్, పాలసీస్’ పేరిట ప్రపంచ బ్యాంక్ ఈ నివేదికను విడుదల చేసింది. 2030 నాటికి అంతర్జాతీయ వృద్ధి మూడు దశాబ్దాల్లోనే కనిష్ఠ స్థాయికి చేరే అవకాశం ఉందని, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు ఇందుకు కారణమని అంచనా వేసింది. కొవిడ్-19 రాకముందే ఉత్పాదకతలో మందగమనం మొదలైందని, ఆదాయ వృద్ధి, అధిక వేతనాలకు ఇవి కీలకమని.. దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను దెబ్బతీసినట్లు నివేదిక అభిప్రాయపడింది. పెట్టుబడుల వృద్ధి కూడా బలహీనంగా ఉందని, అంతర్జాతీయ ఉద్యోగాల వృద్ధి మందకొడిగానే ఉన్నట్లు తెలిపింది. కరోనా సంక్షోభం కారణంగా కోల్పోయిన మానవ వనరులు మళ్లీ పుంజుకోలేదని వివరించింది. ఫలితంగా దశాబ్ద కాలాన్ని ప్రపంచం కోల్పోతుందని, అంతర్జాతీయ సగటు వృద్ధి సాధించేందుకు విధానపరమైన తోడ్పాటు అవసరమని పేర్కొంది. నివేదికలోని ఇతర ముఖ్యాంశాలు..
* ఇప్పటి నుంచి 2030 వరకు అంతర్జాతీయ వృద్ధి దశాబ్ద కనిష్ఠమైన 2.2 శాతానికి చేరొచ్చు. 2011-21 మధ్య ఇది 2.6 శాతంగా ఉంది.
* దేశాలు స్థిరమైన, వృద్ధి ఆధారిత విధానాలను అవలంబిస్తే అంతర్జాతీయ జీడీపీ వృద్ధి 0.7 శాతం పెరిగి వార్షిక సగటు రేటు 2.9 శాతానికి వెళ్లొచ్చు. పోటీ దేశాలతో పోలిస్తే భారత్ వేగంగా వృద్ధి సాధిస్తోంది. సంస్కరణల అమలుతో ఇది మరింత జోరందుకోవచ్చు.
* ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్కు తక్కువ అభివృద్ధి చెందిన బ్యాంకింగ్ వ్యవస్థ ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల పాత్రను మరింత హేతుబద్ధీకరిస్తే స్టాక్ మార్కెట్ల అభివృద్ధికి ఊతమందించే అవకాశం ఉంటుంది.
* జాతీయ మౌలిక రంగ పైప్లైన్పై టాస్క్ఫోర్స్ చేసిన సంస్కరణల సిఫారసులను అమలు చేయాలి. మౌలిక రంగాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. 2000-10లో వార్షిక పెట్టుబడుల వృద్ధి సగటు 10.5 శాతంగా ఉండగా.. 2011-21 మధ్య 5.7 శాతానికి చేరింది.
* ప్రభుత్వం మౌలిక రంగ పెట్టుబడులపై దృష్టి పెట్టడం, కార్మిక నిబంధనల సరళీకరణ, ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణ, లాజిస్టిక్స్ రంగ ఆధునికీకరణ వంటి దీర్ఘకాలంలో మేలుచేకూర్చనున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
iPhones cheaper: ఐఫోన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. కస్టమ్స్ సుంకాన్ని తగ్గించడమే దీనికి కారణం. -
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
Sundar Pichai: భారత్లోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఐఐటీ ఖరగ్పూర్ నుంచి గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. -
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
Stock market: దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1292, నిఫ్టీ 428 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
TIME Greatest Places: హోటళ్లు, క్రూజ్లు, రెస్టారంట్లు, పర్యటక స్థలాలు, మ్యూజియంలు, పార్క్లను పరిగణనలోకి తీసుకొని టైమ్ మ్యాగజైన్ ప్రపంచంలోని 100 గొప్ప ప్రదేశాల జాబితాను విడుదల చేసింది. -
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
Gold price: బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో ఆ దుకాణాల్లో ఆభరణాలు కొనుగోలు చేసే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. -
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
SearchGPT: గూగుల్కు పోటీగా ఓపెన్ ఏఐ సంస్థ కొత్త సెర్చింజిన్ను తీసుకొచ్చింది. ఏఐ సాయంతో ఇది పని చేస్తుంది. -
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?
ITR filing: ఐటీఆర్ ఫైలింగ్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దాఖలు గడువు ఉండకపోవచ్చునని అంచనా వేస్తున్నాయి. -
జియో ఫ్రీడమ్ ఆఫర్.. ఈ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లపై 30% తగ్గింపు
Jio Freedom Offer: ఫ్రీడమ్ ఆఫర్లో భాగంగా జియో ఎయిర్ఫైబర్ ప్లాన్ల ఇన్స్టాలేషన్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు జియో ప్రకటించింది. ఇది పరిమితకాల ఆఫర్. -
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
Job Trends: ఉదయం వచ్చి సాయంత్రం ఇంటికెళ్లే ఉద్యోగాలు ఇకపై కనుమరుగవుతాయని లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ అంచనా వేశారు. -
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 222 పాయింట్లు లాభపడి 82,262 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 24,489 వద్ద ట్రేడవుతోంది. -
పసిడి బాండ్లు ఇక జారీ కావా?
పసిడి లోహాన్ని కొనే బదులు, డిజిటల్ పద్ధతిలో బంగారంపై పెట్టుబడులు పెట్టించి, దానిపై ప్రతిఫలం కూడా అందించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన పసడి బాండ్లు ఇకపై జారీ కావనే అభిప్రాయాన్ని కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
స్థిరమైన వృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం
కెనరా బ్యాంకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.3,905 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వేతన పెంపు ఈ త్రైమాసికంలోనే
ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా, ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.851 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
అయిదో రోజూ నష్టాలే
లోహ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా అయిదో రోజూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
పబ్లిక్ ఇష్యూకు స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ త్వరలో ఐపీఓ (తొలి పబ్లిక్ ఆఫర్) కు రానుంది. -
లారస్ ల్యాబ్స్ లాభం రూ.13 కోట్లు
లారస్ ల్యాబ్స్ 2024-25 మొదటి త్రైమాసికానికి రూ.13 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఆదాయం రూ.1195 కోట్ల్లుగా నమోదైంది. -
పిట్టీ ఇంజినీరింగ్ చేతికి దక్షిణ్ ఫౌండ్రీ
పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్, కర్ణాటకకు చెందిన దక్షిణ్ ఫౌండ్రీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కొనుగోలు చేయనుంది. -
స్వల్పంగా తగ్గిన సైయెంట్ ఆదాయాలు
ఐటీ, ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయెంట్ ఆదాయాలు, లాభాల్లో క్షీణత కనిపించింది. -
హెచ్ఎమ్డీ ‘క్రెస్ట్’ ఫోన్ల ఆవిష్కరణ
ఫిన్లాండ్కు చెందిన మొబైల్ కంపెనీ హెచ్ఎమ్డీ కొత్త శ్రేణి, సొంత బ్రాండ్ల స్మార్ట్ఫోన్లను మనదేశంలో తయారు చేయనుంది. -
ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ విలువ 4 రెట్లు
కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీ(సీపీఎస్ఈ)ల పనితీరును మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందదని.. కేవలం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాల కోసమే చూడటం లేదని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు (7)
సంక్షిప్త వార్తలు
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి