Banks- RBI: జరిమానాలపైౖ వడ్డీ వేయొద్దు
బ్యాంకులో వ్యక్తిగత/గృహరుణం వంటివి తీసుకున్నప్పుడు, తిరిగి చెల్లింపునకు సంబంధించి నిబంధనలు ఇప్పటివరకు ఆంగ్లంలో ఉంటున్నాయి. ఇకనుంచి అలా చెల్లదు.
ఖాతాదారుల మాతృభాషలోనూ నిబంధనలుండాలి
చెల్లింపు క్రమశిక్షణ పెంచడమే ధ్యేయంగా వ్యవహరించాలి
బ్యాంకులకు ఆర్బీఐ ముసాయిదా
ఈనాడు, హైదరాబాద్ : బ్యాంకులో వ్యక్తిగత/గృహరుణం వంటివి తీసుకున్నప్పుడు, తిరిగి చెల్లింపునకు సంబంధించి నిబంధనలు ఇప్పటివరకు ఆంగ్లంలో ఉంటున్నాయి. ఇకనుంచి అలా చెల్లదు. ఖాతాదారుల మాతృభాషలోనూ ఈ పత్రాలను బ్యాంకులు/ఆర్థిక సంస్థలు ఇవ్వాలి. ‘రుణ చెల్లింపు ఆలస్యమైతే’ విధించే జరిమానాల వివరాలను అందులో పొందుపరిచి, ఖాతాదారులతో చదివించి, వారి సంతకాలను బ్యాంకులు తీసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సూచించింది. ఇందుకోసం రూపొందించిన ముసాయిదాను అన్ని బ్యాంకులకు పంపింది. దీని ప్రకారం..
ఇప్పుడన్నీ ఆంగ్లంలోనే
రుణం తీసుకున్న వారు, నిర్ణీత గడువులోగా చెల్లించకపోతే ఎగవేతదారుల కింద జరిమానాలు బ్యాంకులు విధిస్తున్నాయి. ఎంత కాలానికి, ఎంతమొత్తం జరిమానా వసూలు చేస్తున్నారు, జరిమానాపై మళ్లీ వడ్డీ వేస్తున్నారా అనే వివరాలేమీ చాలా మంది రుణగ్రహీతలకు తెలియదు. రుణం మంజూరు సమయంలో, ఖాతాదారుల సంతకాలు తీసుకునే రుణ నిబంధనల ఒప్పంద పత్రాలన్నీ ఆంగ్లంలో ఉంటున్నాయి. వాటిని చదివి అర్థం చేసుకోవడం అత్యధికులకు కష్టమే. బ్యాంకు సిబ్బంది చెప్పిన చోటల్లా సంతకాలు పెట్టి, రుణం పొందే వారే ఎక్కువ. ఈ నేపథ్యంలో నిర్ణీత గడువులోగా బకాయి తిరిగి చెల్లించని వారికి ఒక్కో బ్యాంకు, ఒక్కో తీరుగా జరిమానా విధిస్తోంది.
ఇలాంటివి కుదరవు
ఉదాహరణకు ఒక బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకుంటే, 6 నెలల్లోగా తిరిగి చెల్లించాలనే నిబంధన ఉంది. ఈ గడువులోగా నిధులు చెల్లించి, బంగారాన్ని విడిపించుకోకపోతే బాకీ సొమ్ము విలువపై 2 శాతాన్ని జరిమానాగా విధిస్తోంది. అయినా ఖాతాదారుడు బాకీ కట్టకపోతే, కొంతకాలం తరవాత బంగారాన్ని వేలం వేసి, బాకీ సొమ్మును జమచేసుకుంటోంది. ఇలా జమచేసుకునే సమయం నాటికి, సదరు 2% జరిమానాపై వడ్డీ వసూలు చేస్తోంది. ఇలా జరిమానాపై వడ్డీ వసూలు చేయడం తగదని ఆర్బీఐ తాజా ముసాయిదాలో పేర్కొంది. తుది ఉత్తర్వులు జారీచేశాక, ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి.
ఎంతనే వివరాలు తెలియక..
కొన్ని ప్రైవేటు బ్యాంకులైతే జరిమానా ఎంత విధిస్తున్నారో ఖాతాదారులకు చెప్పడం లేదు. ఆంగ్ల భాష తెలియని, బ్యాంకు నిబంధనలపై అవగాహన లేని ఖాతాదారులు బ్యాంకు చెప్పినంత సొమ్మును చెల్లిస్తున్నారు. అందుకే జరిమానాల వసూలు ఎలా ఉండాలో కూడా ఆర్బీఐ నిర్దేశించింది. ఈ ప్రకారం..
* జరిమానాలు అధికంగా విధించి, ఆదాయాన్ని పెంచుకునే విధానాలను బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు అనుసరించకూడదు.
* బ్యాంకులు, ఆర్థిక సంస్థలు నిర్దేశిత వడ్డీరేటు కన్నా అధికంగా జరిమానాలు విధించకూడదు.
* నిర్ణీత రేటు ప్రకారమే రుణాలపై వడ్డీ వసూలు చేయాలి. అంతకుమించి వసూలు చేయకూడదు.
* రుణాలను తిరిగి వసూలు చేసుకునేందుకు, ఖాతాదారుల్లో క్రమశిక్షణ పెంచేలా జరిమానా రేట్లు ఉండాలి.
* వ్యాపారం కోసం కాకుండా వ్యక్తిగత అవసరాల తీసుకున్న రుణాలపై వేసే జరిమానాల మొత్తం అనేది.. ఇతర వర్గాలు లేదా సంస్థలపై విధించే జరిమానాలకన్నా ఎక్కువగా ఉండకూడదు.
* ఏ రుణంపై ఎంత జరిమానా, ఎంత కాలానికి విధిస్తారనే వివరాలన్నీ బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ వెబ్సైట్లో పొందుపరచాలి. వడ్డీ రేట్లు, సర్వీసు రుసుముల వివరాలు కూడా వెబ్సైట్లో కనిపించాలి.
* రుణం సకాలంలో తిరిగి కట్టని వారికి నోటీసు పంపినప్పుడు, ఎంత జరిమానా వేశారనే వివరాలను అందులో తెలపాలి.
* ప్రతి బ్యాంకు / ఆర్థిక సంస్థ ఖాతాదారులపై వేసే జరిమానాలు ఎంత ఉండాలనేది ఆ సంస్థ బోర్డు ఆమోదించిన విధానంలో ఉండాలి.
* జరిమానా వడ్డీ(పీనల్ ఇంట్రస్ట్) అని, జరిమానా రుసుం(పీనల్ ఛార్జి) అని వేర్వేరు పేర్లతో వసూలు చేస్తున్నారు. ఏ పేరుతో పిలిచినా దానికి సదరు బ్యాంకు పాలకమండలి ఆమోదం ఉండాలి.
* కొత్త నిబంధనలు ప్రత్యేక సేవల మార్గదర్శకాల కింద జారీచేసిన క్రెడిట్ కార్డులకు వర్తించవు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం