Jobs for Freshers: ఫ్రెషర్ల నియామకాలు పెరిగే అవకాశం: టీంలీజ్ ఎడ్టెక్ నివేదిక
టెక్నాలజీ రంగాల్లో తాజా ఉత్తీర్ణుల (ఫ్రెషర్స్)ను నియమించుకునేందుకు సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఇ-కామర్స్, టెక్నాలజీ అంకురాలు, టెలికమ్యూనికేషన్స్, ఇంజినీరింగ్, మౌలిక సదుపాయాల సంస్థలు వీరికి అవకాశాలు ఇస్తున్నట్లు టీంలీజ్ ఎడ్టెక్ నివేదిక వెల్లడించింది.
టీంలీజ్ ఎడ్టెక్ నివేదిక
దిల్లీ: టెక్నాలజీ రంగాల్లో తాజా ఉత్తీర్ణుల (ఫ్రెషర్స్)ను నియమించుకునేందుకు సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఇ-కామర్స్, టెక్నాలజీ అంకురాలు, టెలికమ్యూనికేషన్స్, ఇంజినీరింగ్, మౌలిక సదుపాయాల సంస్థలు వీరికి అవకాశాలు ఇస్తున్నట్లు టీంలీజ్ ఎడ్టెక్ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధం (జులై-డిసెంబరు)లో ఫ్రెషర్ల నియామకాలు 3% పెరిగి, 65 శాతానికి చేరుకుంటాయని అంచనా వేసింది. అన్ని రకాల ఉద్యోగ నియామకాలు 68% నుంచి 73 శాతానికి పెరిగే అవకాశాలున్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ మార్కెట్లో ఆశాజనక పరిస్థితులు కనిపిస్తున్నాయని నివేదిక వెల్లడించింది. ‘ఫ్రెషర్స్’కు ఇది ఎంతో సానుకూలమని పేర్కొంది.
- దేశంలో 18 రంగాల్లోని 737 చిన్న, మధ్యస్థ, పెద్ద కంపెనీలను టీంలీజ్ ఎడ్టెక్ సర్వే కోసం ఎంచుకుంది. ఇందులో మెట్రో నగరాలు, ప్రథమ, ద్వితీయ శ్రేణి నగరాల్లోని సంస్థలున్నాయి. ఉద్యోగాల మార్కెట్లో సవాళ్లు ఎదురవుతున్న వేళ.. ఫ్రెషర్లను నియమించుకునేందుకు సంస్థలు ముందుకు రావడం, మొత్తం నియామకాలూ పెరిగే వీలుండటం సానుకూల పరిణామమని టీంలీజ్ ఎడ్టెక్ వ్యవస్థాపకుడు, సీఈఓ శంతను రూజ్ తెలిపారు. ఫ్రెషర్స్ను నియమించుకునే ధోరణి ఇ-కామర్స్, టెక్నాలజీ స్టార్టప్లలో 59%, టెలికమ్యూనికేషన్లో 53%, ఇంజినీరింగ్, మౌలిక సంస్థల్లో 50% ఉన్నట్లు సర్వేలో తేలింది.
ఐటీ రంగంలో ఈ నైపుణ్యాలకు గిరాకీ: ఐటీ రంగ నియామకాల్లో కొంత ప్రతికూలత ఉండే అవకాశాలున్నట్లు పేర్కొంది. అయినప్పటికీ, డెవ్ఆప్స్ ఇంజినీర్, చార్టర్డ్ అకౌంటెంట్, ఎస్ఈఓ అనలిస్టు, యూఎక్స్ డిజైనర్, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్, కృత్రిమ మేధ నైపుణ్యాలు ఉన్న వారికి మంచి అవకాశాలు లభిస్తున్నాయని నివేదిక వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?