Apple Event 2023: ఐఫోన్ 15 ఫోన్లొచ్చాయ్
టెక్ దిగ్గజం యాపిల్ గురువారం ‘వండర్లస్ట్’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో కొత్త ఐఫోన్ 15 మోడళ్లను, యాపిల్ వాచ్ సిరీస్ 9, వాచ్ అల్ట్రా 2ను విడుదల చేసింది. ఈ ఉత్పత్తుల తయారీలో పర్యావరణహితానికి కంపెనీ ప్రాధాన్యమివ్వడం ప్రత్యేకతగా చెప్పొచ్చు.
శాన్ఫ్రాన్సిస్కో: టెక్ దిగ్గజం యాపిల్ గురువారం ‘వండర్లస్ట్’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో కొత్త ఐఫోన్ 15 మోడళ్లను, యాపిల్ వాచ్ సిరీస్ 9, వాచ్ అల్ట్రా 2ను విడుదల చేసింది. ఈ ఉత్పత్తుల తయారీలో పర్యావరణహితానికి కంపెనీ ప్రాధాన్యమివ్వడం ప్రత్యేకతగా చెప్పొచ్చు. 2030 కల్లా పూర్తిగా యాపిల్ ఉత్పత్తులన్నీ పర్యావరణహితంగానే ఉంటాయని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తెలిపారు.
ఐఫోన్ 15, 15 ప్లస్: ఐఫోన్ 15.. 6.1 అంగుళాలు, ఐఫోన్ 15 ప్లస్ 6.7 అంగుళాల్లో లభ్యం కానుంది. ఐఫోన్ 15 ధర 799 డాలర్లు (128 జీబీ), ఐఫోన్ 15 ప్లస్ ధర 899 డాలర్లు (128 జీబీ). ఏ16 బయోనిక్ చిప్, ఓఎల్ఈడీ సూపర్ రెటీనా డిస్ప్లే, డైనమిక్ ఐలాండ్తో కూడిన ఈ ఫోన్లు గులాబీ, పసుపు, ఆకుపచ్చ నీలం, నలుపు రంగుల్లో లభ్యమవుతాయి. 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమేరా ఇందులో ఉంది. మొదటిసారిగా టైప్-సి ఛార్జర్తో వీటిని తీసుకొచ్చారు.
ఐఫోన్ 15 ప్రో, 15 ప్రో మ్యాక్స్: ఐఫోన్ 15 ప్రో 6.1 అంగుళాలు, ఐఫోన్ ప్రో మ్యాక్స్ 6.7 అంగుళాలు. టైటానియమ్ డిజైన్, సూపర్ రెటీనా ఎక్స్డీఆర్ డిస్ప్లే, సరికొత్త ఏ17 ప్రో చిప్తో వీటిని తీసుకొచ్చారు. 100% రీసైకిల్డ్ మెటీరియల్స్తో ఇవి తయారయ్యాయని కంపెనీ తెలిపింది. పల్చటి బోర్డర్లు, తేలికపాటి బరువు వీటి మరో ప్రత్యేకత. ఐఫోన్ 15 ప్రో ప్రారంభ ధర 999 డాలర్లు.. ప్రోమ్యాక్స్ 1199 డాలర్లు. ఈ ఫోన్లు సెప్టెంబరు 22 నుంచి లభిస్తాయి.
వాచ్ సిరీస్ 9: సరికొత్త ఎస్9 చిప్తో వాచ్ సిరీస్ 9ను యాపిల్ తీసుకొచ్చింది. మునుపటి సిరీస్లతో పోలిస్తే అత్యంత వేగంగా పనిచేసేందుకు ఎస్9 చిప్ ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది. మెషీన్ కంప్యూటేషన్లను కూడా రెండు రెట్ల వేగంగా ఇది చేస్తుంది. ఈ వాచీ సాయంతో ఐఫోన్లను కూడా ట్రేస్ చేయొచ్చు. డబుల్ ట్యాప్తో ఫోన్ కాల్ స్వీకరించడం, ముగించడం లాంటి ఫోను ప్రధాన విధులను నియంత్రించే వీలుంది. ఈ వాచీ మొట్టమొదటి కర్బన తటస్థ ఉత్పత్తిగా కంపెనీ పేర్కొంది. దీని ధర 399 డాలర్లు (జీపీఎస్), 499 డాలర్లు (జీపీఎస్+ సెల్యులార్).
వాచీ అల్ట్రా 2: ఇందులోనూ ఎస్9 చిప్సెట్, డబుల్ట్యాప్ సదుపాయం ఉంది. ఐఫోన్లను కూడా ట్రేస్ చేయొచ్చు. 95 శాతం రీసైకిల్డ్ మెటీరియల్తో దీనిని తయారు చేశారు. లో- పవర్ మోడ్లో 72 గంటల పాటు బ్యాటరీ ఛార్జింగ్ ఉంటుందని కంపెనీ పేర్కొంది. దీని ప్రారంభ ధర 799 డాలర్లు (జీపీఎస్+ సెల్యులార్).
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 329 పాయింట్ల లాభంతో 74,059 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 85 పాయింట్లు పెరిగి 22,505 దగ్గర కొనసాగుతోంది. -
3 ఏళ్లలో రూ.3,000 కోట్లు.. అపోలో హాస్పిటల్స్ పెట్టుబడులు!
వచ్చే మూడేళ్లలో రూ.3,000 కోట్ల పెట్టుబడులకు అపోలో హాస్పిటల్స్ సన్నాహాలు చేస్తోంది. అమెరికాకు చెందిన దిగ్గజ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్తో ఒప్పందం ఫలితంగా, వస్తున్న నిధులకు మరికొంత జతచేసి, సంస్థ విస్తరణ కార్యకలాపాలపై పెట్టుబడి పెట్టాలని అపోలో నిర్ణయించింది. -
కార్పొరేట్ ఫలితాలు.. అమెరికా వడ్డీరేట్లే కీలకం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈవారంలో వెలువడే పెద్ద కంపెనీల ఆర్థిక ఫలితాలకు తోడు, వడ్డీరేట్లపై బుధవారం వెల్లడయ్యే అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు మార్కెట్కు దిశానిర్దేశం చేయొచ్చంటున్నారు. -
అదానీకనెక్స్ రూ.11,520 కోట్ల రుణ సమీకరణ
అదానీ ఎంటర్ప్రైజెస్, ఎడ్జ్కనెక్స్ సంయుక్తంగా డేటా కేంద్రాల కోసం నెలకొల్పిన సంస్థ అదానీకనెక్స్ 1.44 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.11,520 కోట్ల) వరకు రుణం సమీకరించినట్లు ప్రకటించింది. -
బ్యాంకుల రుణవృద్ధి అంతంతే!
దేశంలో ఆర్థిక వృద్ధి బలంగా ఉన్నందున బ్యాంకుల లాభదాయకత, ఆస్తుల నాణ్యత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ పటిష్ఠంగా ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. -
చైనాలో ఎలాన్ మస్క్
అమెరికా విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హఠాత్తుగా చైనాలో పర్యటిస్తున్నారు. -
వెండిపై ఆచితూచి!
పసిడి జూన్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.72,462 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.72,944; రూ.73,425 వరకు రాణించే అవకాశం ఉంటుంది. -
74500 ఎగువన కొత్త గరిష్ఠాలకు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం దేశీయ సూచీలు లాభపడ్డాయి. బాండ్ రాబడులు పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు, చమురు ధరలు ప్రభావం చూపాయి. -
సంక్షిప్త వార్తలు
స్టాక్ మార్కెట్లు, బీమా కంపెనీలు, ఆన్లైన్ చెల్లింపు గేట్వే ఇంటర్మీడియర్లు, క్రిప్టో కరెన్సీ సేవల ప్రొవైడర్లకు భారత ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) తాజా హెచ్చరికలు జారీ చేసింది. -
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
SBI Credit Card: ఎస్బీఐ కార్డు విమాన ప్రయాణికుల కోసం మూడు ప్రత్యేక క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. వాటిలోని ప్రయోజనాలు, ఫీజుల వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..!
తాజా వార్తలు (Latest News)
-
ఇసుక అక్రమ తవ్వకాలు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
-
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్