Apple Event 2023: ఐఫోన్ 15 ఫోన్లొచ్చాయ్
టెక్ దిగ్గజం యాపిల్ గురువారం ‘వండర్లస్ట్’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో కొత్త ఐఫోన్ 15 మోడళ్లను, యాపిల్ వాచ్ సిరీస్ 9, వాచ్ అల్ట్రా 2ను విడుదల చేసింది. ఈ ఉత్పత్తుల తయారీలో పర్యావరణహితానికి కంపెనీ ప్రాధాన్యమివ్వడం ప్రత్యేకతగా చెప్పొచ్చు.
శాన్ఫ్రాన్సిస్కో: టెక్ దిగ్గజం యాపిల్ గురువారం ‘వండర్లస్ట్’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో కొత్త ఐఫోన్ 15 మోడళ్లను, యాపిల్ వాచ్ సిరీస్ 9, వాచ్ అల్ట్రా 2ను విడుదల చేసింది. ఈ ఉత్పత్తుల తయారీలో పర్యావరణహితానికి కంపెనీ ప్రాధాన్యమివ్వడం ప్రత్యేకతగా చెప్పొచ్చు. 2030 కల్లా పూర్తిగా యాపిల్ ఉత్పత్తులన్నీ పర్యావరణహితంగానే ఉంటాయని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తెలిపారు.
ఐఫోన్ 15, 15 ప్లస్: ఐఫోన్ 15.. 6.1 అంగుళాలు, ఐఫోన్ 15 ప్లస్ 6.7 అంగుళాల్లో లభ్యం కానుంది. ఐఫోన్ 15 ధర 799 డాలర్లు (128 జీబీ), ఐఫోన్ 15 ప్లస్ ధర 899 డాలర్లు (128 జీబీ). ఏ16 బయోనిక్ చిప్, ఓఎల్ఈడీ సూపర్ రెటీనా డిస్ప్లే, డైనమిక్ ఐలాండ్తో కూడిన ఈ ఫోన్లు గులాబీ, పసుపు, ఆకుపచ్చ నీలం, నలుపు రంగుల్లో లభ్యమవుతాయి. 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమేరా ఇందులో ఉంది. మొదటిసారిగా టైప్-సి ఛార్జర్తో వీటిని తీసుకొచ్చారు.
ఐఫోన్ 15 ప్రో, 15 ప్రో మ్యాక్స్: ఐఫోన్ 15 ప్రో 6.1 అంగుళాలు, ఐఫోన్ ప్రో మ్యాక్స్ 6.7 అంగుళాలు. టైటానియమ్ డిజైన్, సూపర్ రెటీనా ఎక్స్డీఆర్ డిస్ప్లే, సరికొత్త ఏ17 ప్రో చిప్తో వీటిని తీసుకొచ్చారు. 100% రీసైకిల్డ్ మెటీరియల్స్తో ఇవి తయారయ్యాయని కంపెనీ తెలిపింది. పల్చటి బోర్డర్లు, తేలికపాటి బరువు వీటి మరో ప్రత్యేకత. ఐఫోన్ 15 ప్రో ప్రారంభ ధర 999 డాలర్లు.. ప్రోమ్యాక్స్ 1199 డాలర్లు. ఈ ఫోన్లు సెప్టెంబరు 22 నుంచి లభిస్తాయి.
వాచ్ సిరీస్ 9: సరికొత్త ఎస్9 చిప్తో వాచ్ సిరీస్ 9ను యాపిల్ తీసుకొచ్చింది. మునుపటి సిరీస్లతో పోలిస్తే అత్యంత వేగంగా పనిచేసేందుకు ఎస్9 చిప్ ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది. మెషీన్ కంప్యూటేషన్లను కూడా రెండు రెట్ల వేగంగా ఇది చేస్తుంది. ఈ వాచీ సాయంతో ఐఫోన్లను కూడా ట్రేస్ చేయొచ్చు. డబుల్ ట్యాప్తో ఫోన్ కాల్ స్వీకరించడం, ముగించడం లాంటి ఫోను ప్రధాన విధులను నియంత్రించే వీలుంది. ఈ వాచీ మొట్టమొదటి కర్బన తటస్థ ఉత్పత్తిగా కంపెనీ పేర్కొంది. దీని ధర 399 డాలర్లు (జీపీఎస్), 499 డాలర్లు (జీపీఎస్+ సెల్యులార్).
వాచీ అల్ట్రా 2: ఇందులోనూ ఎస్9 చిప్సెట్, డబుల్ట్యాప్ సదుపాయం ఉంది. ఐఫోన్లను కూడా ట్రేస్ చేయొచ్చు. 95 శాతం రీసైకిల్డ్ మెటీరియల్తో దీనిని తయారు చేశారు. లో- పవర్ మోడ్లో 72 గంటల పాటు బ్యాటరీ ఛార్జింగ్ ఉంటుందని కంపెనీ పేర్కొంది. దీని ప్రారంభ ధర 799 డాలర్లు (జీపీఎస్+ సెల్యులార్).
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి