TATA - IPhone: ఇక టాటాల తయారీ ఐఫోన్లు
మనదేశంలో ఐఫోన్లు తయారు చేయనున్న తొలి దేశీయ సంస్థగా టాటా గ్రూప్ అవతరించనుంది. బెంగళూరులో ఐఫోన్ల తయారీ కోసం నెలకొల్పిన ప్లాంట్ను విక్రయించడానికి తైవాన్ సంస్థ విస్ట్రాన్ గ్రూప్ అంగీకరించడమే ఇందుకు నేపథ్యం.
విస్ట్రాన్ భారత కార్యకలాపాల కొనుగోలు
దిల్లీ: మనదేశంలో ఐఫోన్లు తయారు చేయనున్న తొలి దేశీయ సంస్థగా టాటా గ్రూప్ అవతరించనుంది. బెంగళూరులో ఐఫోన్ల తయారీ కోసం నెలకొల్పిన ప్లాంట్ను విక్రయించడానికి తైవాన్ సంస్థ విస్ట్రాన్ గ్రూప్ అంగీకరించడమే ఇందుకు నేపథ్యం. టాటా ఎలక్ట్రానిక్స్కు విస్ట్రాన్ ఇన్ఫోకామ్ మాన్యుఫ్యాక్చరింగ్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ను 125 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.1035 కోట్ల)కు విక్రయించడానికి విస్ట్రాన్ బోర్డు ఆమోదం తెలిపింది. బెంగళూరు సమీపంలో ఐఫోన్ అసెంబ్లింగ్ ప్లాంట్ను విస్ట్రాన్ నిర్వహిస్తోంది. దాదాపు ఏడాది పాటు చర్చల అనంతరం విస్ట్రాన్ కార్పొరేషన్ ఫ్యాక్టరీ, టాటాల చేతిలోకి వస్తోంది. ప్రస్తుతం ఐఫోన్ 14 మోడల్ను కూడా అసెంబ్లింగ్ చేస్తున్న ఈ ప్లాంట్లో 10,000 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇరు సంస్థల మధ్య ఒప్పందాలపై సంతకాలు పూర్తయ్యాక, ప్రభుత్వ సంస్థల నుంచి తప్పనిసరి అనుమతులు పొందేందుకు ముందుకు వెళ్తామని విస్ట్రాన్ వెల్లడించింది. యాపిల్ ఐఫోన్ల అసెంబ్లింగ్ను తైవాన్ తయారీ సంస్థలు పెగాట్రాన్ కార్పొరేషన్, ఫాక్స్కాన్ టెక్నాలజీ గ్రూప్ దేశీయంగా చేపడుతున్నాయి. తాజా పరిణామాలతో వీటి సరసన టాటా సన్స్ అనుబంధ సంస్థ టాటా ఎలక్ట్రానిక్స్ చేరనుంది. విస్ట్రాన్ కార్యకలాపాలను టాటాలు కొనుగోలు చేయడంపై కేంద్ర ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ‘ఎక్స్ (గతంలో ట్విటర్)’లో అభినందనలు తెలిపారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) పథకంతో స్మార్ట్ఫోన్ తయారీ, ఎగుమతులకు భారత్ హబ్గా మారుతోందని అన్నారు. ఇక్కడ నుంచి విదేశాలకు ఐఫోన్లను టాటా గ్రూప్ ఎగుమతి చేయాలని ఆకాంక్షించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
-
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
-
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
-
ఆదుకుంటానన్నావ్.. పీల్చి పిప్పి చేశావ్!!