చమురు ధరలతో యుద్ధమే
యుద్ధం.. ఓటమి పాలైన వారితో పాటు గెలిచిన వారికీ కొంతమేర విషాదం మిగుల్చుతుంది.
ఇజ్రాయెల్-హమాస్ సంఘర్షణలు పెరిగితే ఇంకా కష్టం
ఈనాడు వాణిజ్య విభాగం
యుద్ధం.. ఓటమి పాలైన వారితో పాటు గెలిచిన వారికీ కొంతమేర విషాదం మిగుల్చుతుంది. ఆ యుద్ధంతో సంబంధం లేకున్నా, దాని ప్రభావానికి లోనైన వారూ ఇబ్బంది పడక తప్పదు. ప్రస్తుత ఇజ్రాయెల్-హమాస్ (పాలస్తీనా)ల మధ్య యుద్ధం మరింత విస్తరిస్తే, ఆ రెండు దేశాలే కాక, ప్రపంచ దేశాలు కూడా ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడొచ్చు. చమురు- ఆహార ధరలు పెరిగితే.. అసలే ఆర్థిక మందగమనంలో ఉన్న ప్రపంచం మరింత కష్టాలకు లోను కాక తప్పదు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ‘రెండో దశ’ యుద్ధాన్ని ప్రకటించిన నేపథ్యంలో ఈ అనుమానాలు రాకమానవు.
పశ్చిమాసియాలో యుద్ధ పరిణామాలు ప్రస్తుతానికి చమురు ధరలపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. యుద్ధం మరింత విస్తరించకపోతే చమురు బ్యారెల్ ధర 90- 100 డాలర్ల మధ్యే ఉండొచ్చు. కానీ లెబనాన్ రాజకీయపార్టీ హెజ్బుల్లా జోక్యం చేసుకుని, యుద్ధం మరింత రాజుకుంటే మాత్రం అపుడు బ్యారెల్ చమురు ధర 105-110 డాలర్లకు చేరొచ్చని అంటున్నారు. చమురు సరఫరాలో ఆటంకాలు పెరిగితే, బ్యారెల్ 120 డాలర్లకు చేరొచ్చు. ఇరాన్ చమురు.. మార్కెట్కు సరఫరా కాకుంటే ఈ పరిస్థితి ఎదురవుతుంది. అందుకు అవకాశాలు బాగా తక్కువే కాబట్టి.. స్వల్పకాలానికి చమురు ధరల్లో ఊగిసలాటలు భారీగా ఉండకపోవచ్చని అమెరికా బ్రోకరేజీ సంస్థ యూబీఎస్ అంచనా వేస్తోంది.
ప్రపంచ బ్యాంకు కూడా ఇదే విషయాన్ని తన ‘కమొడిటీ మార్కెట్స్ అవుట్లుక్’లో స్పష్టం చేసింది. గాజాలోకి మరిన్ని యుద్ద ట్యాంకులను ప్రవేశపెట్టాక, ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు రెండో దశ యుద్ధాన్ని ప్రకటించారు. దీంతో హమాస్ అధికారులు ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బుల్లా వంటి మద్దతుదార్ల సహాయం కోరాయి. ఒక వేళ హమాస్కు సహాయంగా ఇరాన్ వంటి దేశాలు వస్తే మాత్రం చమురు ధర సెగ పెరగడం తథ్యం.
- చమురు ధరలపై ఉన్న 3 అవకాశాలివీ: ప్రపంచ బ్యాంకు
- యథాతథ స్థితి కొనసాగినా బ్యారెల్ చమురు సగటున ధర వచ్చే ఏడాది వరకు 81 డాలర్ల వద్దే ఉండొచ్చు
- ఒక వేళ మధ్య స్థాయి అనిశ్చితి ఏర్పడితే (ఇరాక్ యుద్ధం తరహా పరిస్థితులు), అంతర్జాతీయంగా చమురు సరఫరా రోజుకు 3-5 మిలియన్ బారెళ్ల మేర తగ్గుతుంది. అపుడు చమురు ధరలు 35 శాతం వరకు పెరిగినా ఆశ్చర్యం లేదు.
- ఒక వేళ భారీ స్థాయిలో అనిశ్చిత పరిస్థితులు ఏర్పడితే (1973 నాటి అరబ్ చమురు సంక్షోభం తరహా), అంతర్జాతీయంగా చమురు సరఫరా రోజుకు 6-8 మి. బారెళ్ల మేర తగ్గుతుంది. అపుడు ధరలు 56-75 శాతం పెరుగుతాయి. అంటే బ్యారెల్ ధర 140-157 డాలర్ల వరకు చేరొచ్చు.
మనదేశంపై ప్రభావం ఏమిటి?: చమురు ధర పెరిగితే, వినియోగం కోసం దిగుమతులపై అధికంగా ఆధారపడిన మనదేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం తప్పదు. చమురు బ్యారెల్ ధర 10 డాలర్ల చొప్పున పెరిగే కొద్దీ మన కరెంట్ ఖాతా లోటు(సీఏడీ) 0.5 శాతం అధికమవుతుంది. ఇది రూపాయి స్థిరత్వాన్ని దెబ్బతీస్తుంది. ద్రవ్యోల్బణాన్ని ఊగిసలాటలకు గురి చేస్తుంది. చమురు మార్కెటింగ్ కంపెనీ(ఓఎమ్సీ)ల రిఫైనింగ్ మార్జిన్లపై, ఆయా కంపెనీల షేర్లపై ప్రభావం చూపిస్తుంది. అపుడు ప్రభుత్వం కొన్ని సుంకాలు, పన్నుల్లో కోత వేసి.. కంపెనీలపై ఆర్థిక భారాన్ని తగ్గించాల్సి ఉంటుంది. ఇంధన రిటైల్ ధరలు బాగా పెరిగితే, సాధారణ ప్రజల జేబుకు చిల్లు పడుతుంది. అపుడు ఇతరత్రా వ్యయాలు తగ్గించుకోవాల్సి ఉంటుంది. పరోక్షంగా ఇది మొత్తం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్పామ్ కాల్స్కు ఇక గుడ్బై.. త్వరలో కొత్త మార్గదర్శకాలు
స్పామ్ కాల్స్ను నియంత్రించేందుకు కేంద్రం నడుంబిగించింది. ఇకపై వాటికి స్వస్తి చెప్పేందుకు కొత్త మార్గదర్శకాలు జారీ చేయనుంది. -
మూడు రోజుల వరుస లాభాలకు విరామం.. నష్టాల్లో సూచీలు
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 117, నిఫ్టీ 17 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. -
ప్రాజెక్ట్ అస్త్ర.. జీమెయిల్లో జెమినీ.. లెక్కల్లో సాయం.. గూగుల్ కొత్త అప్డేట్స్!
Google I/O: ఏఐ మోడల్ జెమినీని అప్గ్రేడ్ చేయటంతో పాటు వీడియోతో లెన్స్ సెర్చ్, సర్కిల్తో లెక్కల్లో సాయం, జీమెయిల్లో జెమినీ ఫీచర్స్ వంటి కొత్త అప్డేట్లను గూగుల్ తమ వార్షిక సదస్సులో ప్రకటించింది. -
ఎఫ్డీ రేట్లు పెంచిన ఎస్బీఐ.. లేటెస్ట్ వడ్డీ రేట్లు ఇవే..
SBI hikes FD rates: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను సవరించింది. కొత్త వడ్డీ రేట్లు మే 15 నుంచి అమల్లోకి వచ్చాయి. -
గో డిజిట్ ఐపీఓ ప్రారంభం.. పూర్తి వివరాలివే..
Go Digit IPO: రూ.2,615 కోట్ల సమీకరణ లక్ష్యంతో గో డిజిట్ ఐపీఓకి వచ్చింది. మదుపర్లు రూ.14,960తో కనీసం 55 షేర్లకు బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,250 ఎగువన నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 97 పాయింట్లు పుంజుకొని 73,202 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 45 పాయింట్లు ఎగబాకి 22,262 దగ్గర కొనసాగుతోంది. -
ఆంధ్రప్రదేశ్లో బంగారం ఉత్పత్తి ఈ ఏడాదిలోనే
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి బంగారం గనిలో ఈ సంవత్సరాంతానికి బంగారం ఉత్పత్తి మొదలు కానున్నట్లు తెలుస్తోంది. -
2023-24లో పీఎస్బీల లాభం రూ.1,41,203 కోట్లు
దేశంలోని 12 ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ (పీఎస్బీ) కలిపి గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో రూ.1,41,203 కోట్ల నికరలాభాన్ని ఆర్జించాయి. -
వాహన, లోహ షేర్లకు కొనుగోళ్లు
వరుసగా మూడో రోజూ సూచీల లాభాలు కొనసాగాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు రాణించడం, సానుకూల ద్రవ్యోల్బణ గణాంకాలు ఇందుకు మద్దతుగా నిలిచాయి. -
భారతీ ఎయిర్టెల్ లాభంలో 31% క్షీణత
భారతీ ఎయిర్టెల్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.2,072 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,005.60 కోట్లతో పోలిస్తే, ఇది 31% తక్కువ. -
13 నెలల గరిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం
ఈ ఏడాది ఏప్రిల్లో టోకు ద్రవ్యోల్బణం 13 నెలల గరిష్ఠమైన 1.26 శాతానికి చేరింది. ఆహార వస్తువులు.. ముఖ్యంగా కూరగాయల ధరలు పెరగడమే ఇందుకు కారణం. -
వార్షిక ఖర్చులో 6-7% సాంకేతికపైనే
దేశంలోని అతిపెద్ద ప్రైవేటు బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏటా తన వార్షిక నిర్వహణ ఖర్చులో 6-7% సాంకేతికత సంబంధిత అంశాలపైనే ఖర్చు చేస్తోంది. -
భారత్లో లీప్ మోటార్ ఈవీల తయారీ
చైనాకు చెందిన తన భాగస్వామ్య సంస్థ లీప్మోటర్ విద్యుత్ వాహనాలను భారత్లో తయారు చేసి, విక్రయించేందుకు భారత్లోని తన తయారీ కేంద్రాన్ని అంతర్జాతీయ దిగ్గజ సంస్థ స్టెల్లాంటిస్ ఉపయోగించుకోనుంది. -
ఎఫ్అండ్ఓ పై పర్యవేక్షణ పెరగాలి
అధిక నష్టభయం ఉండే ఫ్యూచర్లు, ఆప్షన్ల (ఎఫ్ అండ్ ఓ) విభాగంపై పర్యవేక్షణ లేమి వల,్ల వాటిల్లో ట్రేడ్ చేసే చిన్న మదుపర్ల కుటుంబాలకు ఆర్థిక సమస్యలు వచ్చే ప్రమాదముందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. -
టీవీఎస్ ఐక్యూబ్లో కొత్త వేరియంట్లు
టీవీఎస్ మోటార్ తన విద్యుత్తు స్కూటర్ టీవీఎస్ ఐక్యూబ్లో కొత్త వేరియంట్లను విడుదల చేసింది. వీటి ప్రారంభ ధర రూ.94,999 (ఎక్స్ షోరూం). -
హైదరాబాద్లో ఆఫీసు స్థలాన్ని అద్దెకు తీసుకున్న టేబుల్ స్పేస్
కార్యాలయ స్థలానికి కార్పొరేట్ సంస్థల నుంచి గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో, దేశంలోని 4 ప్రధాన నగరాల్లో 13.5 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకున్నట్లు టేబుల్ స్పేస్ వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు
ప్రాంతీయ మార్గాల్లో సేవలను విస్తరించే లక్ష్యంతో కనీసం 100 చిన్న విమానాలు కొనుగోలు చేయాలని ఇండిగో భావిస్తోంది. ఇందుకోసం 3 విమాన తయారీ సంస్థలు ఏటీఆర్, ఎంబ్రాయిర్, ఎయిర్బస్లతో చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు (Latest News)
-
గోల్ఫ్ ఆడడం, నచ్చింది తినడం.. మిస్టర్ కూల్ ‘ఫేవరెట్ ప్లేస్’ అదేనట!
-
డీజీపీ, ఇంటెలిజెన్స్ ఏడీజీలతో సీఎస్ జవహర్రెడ్డి అత్యవసర భేటీ
-
కార్చిచ్చుల వేళ.. అగ్నిమాపక సిబ్బందికి ఎన్నికల విధులా..?
-
ముంబయిలో బిల్బోర్డ్ ట్రాజెడీ.. ఎనిమిదేళ్ల క్రితమే పుస్తకంలో ప్రస్తావించిన రచయిత
-
ఐపీఎల్ ప్లేఆఫ్స్.. రెండు బెర్తుల కోసం ఐదు టీమ్లు.. ఏ జట్టు పర్సంటేజీ ఎంతంటే?
-
స్పామ్ కాల్స్కు ఇక గుడ్బై.. త్వరలో కొత్త మార్గదర్శకాలు