చమురు ధరలతో యుద్ధమే
యుద్ధం.. ఓటమి పాలైన వారితో పాటు గెలిచిన వారికీ కొంతమేర విషాదం మిగుల్చుతుంది.
ఇజ్రాయెల్-హమాస్ సంఘర్షణలు పెరిగితే ఇంకా కష్టం
ఈనాడు వాణిజ్య విభాగం
యుద్ధం.. ఓటమి పాలైన వారితో పాటు గెలిచిన వారికీ కొంతమేర విషాదం మిగుల్చుతుంది. ఆ యుద్ధంతో సంబంధం లేకున్నా, దాని ప్రభావానికి లోనైన వారూ ఇబ్బంది పడక తప్పదు. ప్రస్తుత ఇజ్రాయెల్-హమాస్ (పాలస్తీనా)ల మధ్య యుద్ధం మరింత విస్తరిస్తే, ఆ రెండు దేశాలే కాక, ప్రపంచ దేశాలు కూడా ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడొచ్చు. చమురు- ఆహార ధరలు పెరిగితే.. అసలే ఆర్థిక మందగమనంలో ఉన్న ప్రపంచం మరింత కష్టాలకు లోను కాక తప్పదు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ‘రెండో దశ’ యుద్ధాన్ని ప్రకటించిన నేపథ్యంలో ఈ అనుమానాలు రాకమానవు.
పశ్చిమాసియాలో యుద్ధ పరిణామాలు ప్రస్తుతానికి చమురు ధరలపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. యుద్ధం మరింత విస్తరించకపోతే చమురు బ్యారెల్ ధర 90- 100 డాలర్ల మధ్యే ఉండొచ్చు. కానీ లెబనాన్ రాజకీయపార్టీ హెజ్బుల్లా జోక్యం చేసుకుని, యుద్ధం మరింత రాజుకుంటే మాత్రం అపుడు బ్యారెల్ చమురు ధర 105-110 డాలర్లకు చేరొచ్చని అంటున్నారు. చమురు సరఫరాలో ఆటంకాలు పెరిగితే, బ్యారెల్ 120 డాలర్లకు చేరొచ్చు. ఇరాన్ చమురు.. మార్కెట్కు సరఫరా కాకుంటే ఈ పరిస్థితి ఎదురవుతుంది. అందుకు అవకాశాలు బాగా తక్కువే కాబట్టి.. స్వల్పకాలానికి చమురు ధరల్లో ఊగిసలాటలు భారీగా ఉండకపోవచ్చని అమెరికా బ్రోకరేజీ సంస్థ యూబీఎస్ అంచనా వేస్తోంది.
ప్రపంచ బ్యాంకు కూడా ఇదే విషయాన్ని తన ‘కమొడిటీ మార్కెట్స్ అవుట్లుక్’లో స్పష్టం చేసింది. గాజాలోకి మరిన్ని యుద్ద ట్యాంకులను ప్రవేశపెట్టాక, ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు రెండో దశ యుద్ధాన్ని ప్రకటించారు. దీంతో హమాస్ అధికారులు ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బుల్లా వంటి మద్దతుదార్ల సహాయం కోరాయి. ఒక వేళ హమాస్కు సహాయంగా ఇరాన్ వంటి దేశాలు వస్తే మాత్రం చమురు ధర సెగ పెరగడం తథ్యం.
- చమురు ధరలపై ఉన్న 3 అవకాశాలివీ: ప్రపంచ బ్యాంకు
- యథాతథ స్థితి కొనసాగినా బ్యారెల్ చమురు సగటున ధర వచ్చే ఏడాది వరకు 81 డాలర్ల వద్దే ఉండొచ్చు
- ఒక వేళ మధ్య స్థాయి అనిశ్చితి ఏర్పడితే (ఇరాక్ యుద్ధం తరహా పరిస్థితులు), అంతర్జాతీయంగా చమురు సరఫరా రోజుకు 3-5 మిలియన్ బారెళ్ల మేర తగ్గుతుంది. అపుడు చమురు ధరలు 35 శాతం వరకు పెరిగినా ఆశ్చర్యం లేదు.
- ఒక వేళ భారీ స్థాయిలో అనిశ్చిత పరిస్థితులు ఏర్పడితే (1973 నాటి అరబ్ చమురు సంక్షోభం తరహా), అంతర్జాతీయంగా చమురు సరఫరా రోజుకు 6-8 మి. బారెళ్ల మేర తగ్గుతుంది. అపుడు ధరలు 56-75 శాతం పెరుగుతాయి. అంటే బ్యారెల్ ధర 140-157 డాలర్ల వరకు చేరొచ్చు.
మనదేశంపై ప్రభావం ఏమిటి?: చమురు ధర పెరిగితే, వినియోగం కోసం దిగుమతులపై అధికంగా ఆధారపడిన మనదేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం తప్పదు. చమురు బ్యారెల్ ధర 10 డాలర్ల చొప్పున పెరిగే కొద్దీ మన కరెంట్ ఖాతా లోటు(సీఏడీ) 0.5 శాతం అధికమవుతుంది. ఇది రూపాయి స్థిరత్వాన్ని దెబ్బతీస్తుంది. ద్రవ్యోల్బణాన్ని ఊగిసలాటలకు గురి చేస్తుంది. చమురు మార్కెటింగ్ కంపెనీ(ఓఎమ్సీ)ల రిఫైనింగ్ మార్జిన్లపై, ఆయా కంపెనీల షేర్లపై ప్రభావం చూపిస్తుంది. అపుడు ప్రభుత్వం కొన్ని సుంకాలు, పన్నుల్లో కోత వేసి.. కంపెనీలపై ఆర్థిక భారాన్ని తగ్గించాల్సి ఉంటుంది. ఇంధన రిటైల్ ధరలు బాగా పెరిగితే, సాధారణ ప్రజల జేబుకు చిల్లు పడుతుంది. అపుడు ఇతరత్రా వ్యయాలు తగ్గించుకోవాల్సి ఉంటుంది. పరోక్షంగా ఇది మొత్తం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
iPhones cheaper: ఐఫోన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. కస్టమ్స్ సుంకాన్ని తగ్గించడమే దీనికి కారణం. -
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
Sundar Pichai: భారత్లోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఐఐటీ ఖరగ్పూర్ నుంచి గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. -
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
Stock market: దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1292, నిఫ్టీ 428 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
TIME Greatest Places: హోటళ్లు, క్రూజ్లు, రెస్టారంట్లు, పర్యటక స్థలాలు, మ్యూజియంలు, పార్క్లను పరిగణనలోకి తీసుకొని టైమ్ మ్యాగజైన్ ప్రపంచంలోని 100 గొప్ప ప్రదేశాల జాబితాను విడుదల చేసింది. -
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
Gold price: బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో ఆ దుకాణాల్లో ఆభరణాలు కొనుగోలు చేసే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. -
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
SearchGPT: గూగుల్కు పోటీగా ఓపెన్ ఏఐ సంస్థ కొత్త సెర్చింజిన్ను తీసుకొచ్చింది. ఏఐ సాయంతో ఇది పని చేస్తుంది. -
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?
ITR filing: ఐటీఆర్ ఫైలింగ్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దాఖలు గడువు ఉండకపోవచ్చునని అంచనా వేస్తున్నాయి. -
జియో ఫ్రీడమ్ ఆఫర్.. ఈ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లపై 30% తగ్గింపు
Jio Freedom Offer: ఫ్రీడమ్ ఆఫర్లో భాగంగా జియో ఎయిర్ఫైబర్ ప్లాన్ల ఇన్స్టాలేషన్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు జియో ప్రకటించింది. ఇది పరిమితకాల ఆఫర్. -
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
Job Trends: ఉదయం వచ్చి సాయంత్రం ఇంటికెళ్లే ఉద్యోగాలు ఇకపై కనుమరుగవుతాయని లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ అంచనా వేశారు. -
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 222 పాయింట్లు లాభపడి 82,262 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 24,489 వద్ద ట్రేడవుతోంది. -
పసిడి బాండ్లు ఇక జారీ కావా?
పసిడి లోహాన్ని కొనే బదులు, డిజిటల్ పద్ధతిలో బంగారంపై పెట్టుబడులు పెట్టించి, దానిపై ప్రతిఫలం కూడా అందించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన పసడి బాండ్లు ఇకపై జారీ కావనే అభిప్రాయాన్ని కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
స్థిరమైన వృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం
కెనరా బ్యాంకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.3,905 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వేతన పెంపు ఈ త్రైమాసికంలోనే
ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా, ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.851 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
అయిదో రోజూ నష్టాలే
లోహ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా అయిదో రోజూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
పబ్లిక్ ఇష్యూకు స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ త్వరలో ఐపీఓ (తొలి పబ్లిక్ ఆఫర్) కు రానుంది. -
లారస్ ల్యాబ్స్ లాభం రూ.13 కోట్లు
లారస్ ల్యాబ్స్ 2024-25 మొదటి త్రైమాసికానికి రూ.13 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఆదాయం రూ.1195 కోట్ల్లుగా నమోదైంది. -
పిట్టీ ఇంజినీరింగ్ చేతికి దక్షిణ్ ఫౌండ్రీ
పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్, కర్ణాటకకు చెందిన దక్షిణ్ ఫౌండ్రీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కొనుగోలు చేయనుంది. -
స్వల్పంగా తగ్గిన సైయెంట్ ఆదాయాలు
ఐటీ, ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయెంట్ ఆదాయాలు, లాభాల్లో క్షీణత కనిపించింది. -
హెచ్ఎమ్డీ ‘క్రెస్ట్’ ఫోన్ల ఆవిష్కరణ
ఫిన్లాండ్కు చెందిన మొబైల్ కంపెనీ హెచ్ఎమ్డీ కొత్త శ్రేణి, సొంత బ్రాండ్ల స్మార్ట్ఫోన్లను మనదేశంలో తయారు చేయనుంది. -
ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ విలువ 4 రెట్లు
కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీ(సీపీఎస్ఈ)ల పనితీరును మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందదని.. కేవలం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాల కోసమే చూడటం లేదని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు (7)
సంక్షిప్త వార్తలు
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి