IT: ఐటీలో.. వారానికి 50 గంటల పని
ప్రపంచంతో పోటీ పడాలంటే.. వారానికి 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి చెప్పిన మాటలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆయన సూచనను కొందరు సమర్థిస్తే, మరికొందరు వ్యతిరేకించారు.
ఉద్యోగులపై ప్రతికూల ప్రభావం
పనితీరు అంచనాకు కొత్త విధానాలు అవసరం
ఎక్స్ఫినో నివేదిక
ఈనాడు, హైదరాబాద్: ప్రపంచంతో పోటీ పడాలంటే.. వారానికి 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి చెప్పిన మాటలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆయన సూచనను కొందరు సమర్థిస్తే, మరికొందరు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో ‘ఐటీ ఉద్యోగులు వారానికి 45-50 గంటలకు తగ్గకుండా పనిచేస్తున్నార’ని ఉద్యోగ నియామక సంస్థ ఎక్స్ఫినో నివేదిక వెల్లడించింది. రోజూ దాదాపు 10 గంటల చొప్పున, వారానికి 5 రోజుల పాటు ఐటీ రంగంలోని ఉద్యోగులు పనిచేస్తున్నారని పేర్కొంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా వారానికి పని గంటలు 40కి తగ్గడం లేదని తెలిపింది. తమకు ఇచ్చిన లక్ష్యాలను సమయానికి పూర్తి చేసే క్రమంలో, కొందరు 50 గంటలు, అంతకు మించీ పనిచేస్తున్నారని తెలిపింది.
ప్రతి రూపాయిపై రూ.1.9 ఆర్జన: గత అయిదు ఆర్థిక సంవత్సరాల్లో ఐటీ సంస్థలు తమ ఉత్పాదకతను పెంచుకునేందుకు చేస్తున్న ఖర్చులో పెద్ద మార్పేమీ కనిపించడం లేదని ఆ నివేదిక పేర్కొంది. నిపుణులపై ఖర్చు చేసే ప్రతీ రూపాయిపైన కంపెనీలు రూ.1.8 నుంచి రూ.1.9 చొప్పున ఆర్జిస్తున్నాయని పేర్కొంది.
ఒక ఉద్యోగిపై ఎంత ఆదాయం అన్నదే ముఖ్యం: ఐటీ రంగంలో ఉత్పత్తిపై దృష్టి పెట్టకుండా, ఉద్యోగులు ఎన్ని గంటలు పనిచేస్తున్నారన్నదే ప్రధానంగా సంస్థలు పట్టించుకుంటున్నాయని నివేదిక పేర్కొంది. పని గంటలు పెరగడం వల్ల ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని తెలిపింది. ఐటీ రంగంలో ఒక ఉద్యోగిపై ఎంత ఆదాయం ఆర్జించారన్న దానిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని వెల్లడించింది.
- టీసీఎస్, విప్రో, హెచ్సీఎల్ టెక్ లాంటి సంస్థలకు ఉద్యోగి సగటు రాబడి.. గత అయిదేళ్లలో 3.8-11 శాతం వరకూ తగ్గినట్లు పేర్కొంది. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా విషయంలో ఇది 2.6 శాతం, 5.6 శాతం వరకూ పెరిగినట్లు నివేదిక వివరించింది.
- ఐటీ రంగంలో పనిచేస్తున్న వారిలో 58 శాతం మంది ఉద్యోగ, వ్యక్తిగత జీవితం మధ్య సమతౌల్యం పాటించలేకపోతున్నారని పేర్కొంది. ప్రపంచ సగటు 40 శాతం కన్నా ఇది అధికంగా ఉండటం గమనార్హం. ఈ ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగంలో వృద్ధి రేటు తక్కువగా నమోదు కావడంతో కొత్త నియామకాలూ అంతగా లేకపోవడంతో, ఉద్యోగులపై ఒత్తిడికి కారణమవుతోంది.
పనితీరుపై ప్రభావం: సహజంగా భారతీయులు కష్టజీవులు. కానీ, పనిగంటలు విపరీతంగా పెరిగిపోతుండటంతో వారి నైపుణ్యాలపై ప్రతికూల ప్రభావం పడుతోందని నివేదిక పేర్కొంది. అధిక పని గంటలు, ప్రయాణ దూరాలు, మౌలిక వసతుల సమస్య, పనిలో ఒత్తిడిలాంటివి వారి పనితీరును దెబ్బతీస్తున్నాయని తెలిపింది. కొవిడ్ సమయంలో టెక్ సేవలకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. దీనిని అందుకునేందుకు సంస్థలు తమ ఉద్యోగులు అధికంగా పనిచేసేలా ప్రోత్సహించాయి. కేవలం లక్ష్యాలను సాధించే దిశగా పనులు సాగాయి. అప్పుడు ఎవరూ పని గంటలను లెక్కలోకి తీసుకోలేదు. ఎక్కడి నుంచైనా పనిచేయడం లాంటి వెసులుబాట్లు వచ్చిన నేపథ్యంలో ఐటీ ఉద్యోగుల పనితీరు, ఉత్పాదకతను అంచనా వేసేందుకు కొత్త విధానాలను తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆ నివేదిక పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట