IT: ఐటీలో.. వారానికి 50 గంటల పని
ప్రపంచంతో పోటీ పడాలంటే.. వారానికి 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి చెప్పిన మాటలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆయన సూచనను కొందరు సమర్థిస్తే, మరికొందరు వ్యతిరేకించారు.
ఉద్యోగులపై ప్రతికూల ప్రభావం
పనితీరు అంచనాకు కొత్త విధానాలు అవసరం
ఎక్స్ఫినో నివేదిక
ఈనాడు, హైదరాబాద్: ప్రపంచంతో పోటీ పడాలంటే.. వారానికి 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి చెప్పిన మాటలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆయన సూచనను కొందరు సమర్థిస్తే, మరికొందరు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో ‘ఐటీ ఉద్యోగులు వారానికి 45-50 గంటలకు తగ్గకుండా పనిచేస్తున్నార’ని ఉద్యోగ నియామక సంస్థ ఎక్స్ఫినో నివేదిక వెల్లడించింది. రోజూ దాదాపు 10 గంటల చొప్పున, వారానికి 5 రోజుల పాటు ఐటీ రంగంలోని ఉద్యోగులు పనిచేస్తున్నారని పేర్కొంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా వారానికి పని గంటలు 40కి తగ్గడం లేదని తెలిపింది. తమకు ఇచ్చిన లక్ష్యాలను సమయానికి పూర్తి చేసే క్రమంలో, కొందరు 50 గంటలు, అంతకు మించీ పనిచేస్తున్నారని తెలిపింది.
ప్రతి రూపాయిపై రూ.1.9 ఆర్జన: గత అయిదు ఆర్థిక సంవత్సరాల్లో ఐటీ సంస్థలు తమ ఉత్పాదకతను పెంచుకునేందుకు చేస్తున్న ఖర్చులో పెద్ద మార్పేమీ కనిపించడం లేదని ఆ నివేదిక పేర్కొంది. నిపుణులపై ఖర్చు చేసే ప్రతీ రూపాయిపైన కంపెనీలు రూ.1.8 నుంచి రూ.1.9 చొప్పున ఆర్జిస్తున్నాయని పేర్కొంది.
ఒక ఉద్యోగిపై ఎంత ఆదాయం అన్నదే ముఖ్యం: ఐటీ రంగంలో ఉత్పత్తిపై దృష్టి పెట్టకుండా, ఉద్యోగులు ఎన్ని గంటలు పనిచేస్తున్నారన్నదే ప్రధానంగా సంస్థలు పట్టించుకుంటున్నాయని నివేదిక పేర్కొంది. పని గంటలు పెరగడం వల్ల ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని తెలిపింది. ఐటీ రంగంలో ఒక ఉద్యోగిపై ఎంత ఆదాయం ఆర్జించారన్న దానిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని వెల్లడించింది.
- టీసీఎస్, విప్రో, హెచ్సీఎల్ టెక్ లాంటి సంస్థలకు ఉద్యోగి సగటు రాబడి.. గత అయిదేళ్లలో 3.8-11 శాతం వరకూ తగ్గినట్లు పేర్కొంది. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా విషయంలో ఇది 2.6 శాతం, 5.6 శాతం వరకూ పెరిగినట్లు నివేదిక వివరించింది.
- ఐటీ రంగంలో పనిచేస్తున్న వారిలో 58 శాతం మంది ఉద్యోగ, వ్యక్తిగత జీవితం మధ్య సమతౌల్యం పాటించలేకపోతున్నారని పేర్కొంది. ప్రపంచ సగటు 40 శాతం కన్నా ఇది అధికంగా ఉండటం గమనార్హం. ఈ ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగంలో వృద్ధి రేటు తక్కువగా నమోదు కావడంతో కొత్త నియామకాలూ అంతగా లేకపోవడంతో, ఉద్యోగులపై ఒత్తిడికి కారణమవుతోంది.
పనితీరుపై ప్రభావం: సహజంగా భారతీయులు కష్టజీవులు. కానీ, పనిగంటలు విపరీతంగా పెరిగిపోతుండటంతో వారి నైపుణ్యాలపై ప్రతికూల ప్రభావం పడుతోందని నివేదిక పేర్కొంది. అధిక పని గంటలు, ప్రయాణ దూరాలు, మౌలిక వసతుల సమస్య, పనిలో ఒత్తిడిలాంటివి వారి పనితీరును దెబ్బతీస్తున్నాయని తెలిపింది. కొవిడ్ సమయంలో టెక్ సేవలకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. దీనిని అందుకునేందుకు సంస్థలు తమ ఉద్యోగులు అధికంగా పనిచేసేలా ప్రోత్సహించాయి. కేవలం లక్ష్యాలను సాధించే దిశగా పనులు సాగాయి. అప్పుడు ఎవరూ పని గంటలను లెక్కలోకి తీసుకోలేదు. ఎక్కడి నుంచైనా పనిచేయడం లాంటి వెసులుబాట్లు వచ్చిన నేపథ్యంలో ఐటీ ఉద్యోగుల పనితీరు, ఉత్పాదకతను అంచనా వేసేందుకు కొత్త విధానాలను తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆ నివేదిక పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
Mahindra XUV 3XO: మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఎక్స్యూవీ 3XOను లాంచ్ చేసింది. దీని ధర రూ.7.49 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. -
4 నెలలకే ఓలా క్యాబ్స్ సీఈఓ రాజీనామా.. 10% మంది ఉద్యోగులకు ఉద్వాసన!
ఓలా క్యాబ్స్ సీఈఓ పదవికి హేమంత్ భక్షి రాజీనామా చేశారు. సీఈఓ పదవి చేపట్టిన 4 నెలలకే బాధ్యతల నుంచి వైదొలిగారు. -
సౌత్ ఇండియన్ బ్యాంకుతో జట్టు కట్టిన టాటా మోటార్స్
వాణిజ్య వాహనాల ఫైనాన్స్ కోసం టాటా మోటార్స్.. సౌత్ ఇండియన్ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది. -
యూపీఐ వచ్చినా క్యాషే కింగ్.. పెరిగిన ఏటీఎం విత్డ్రాలు!
దేశంలో డిజిటల్ లావాదేవీలతో పాటు నగదు వినియోగమూ అదే స్థాయిలో పెరుగుతోంది. సీఎంఎస్ సంస్థ వెలువరించిన తాజా నివేదిక ఈ పరిస్థితిని తెలియజేస్తోంది. -
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 900+, నిఫ్టీ 220+
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 941 పాయింట్లు, నిఫ్టీ 223 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ఈ క్రెడిట్ కార్డులతో బిల్లులు చెల్లిస్తున్నారా? మే 1 నుంచి అదనపు ఛార్జీ..!
Credit Card: ఇప్పటి వరకు అద్దె చెల్లింపులపై మాత్రమే అదనపు రుసుము వసూలు చేసిన క్రెడిట్ కార్డు జారీ సంస్థలు ఇకపై ఇతర యుటిలిటీ బిల్లులకు కూడా దాన్ని విస్తరించేందుకు క్రమంగా సిద్ధమవుతున్నాయి. -
భారత్లో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్.. ధర, ఫీచర్లివే..!
Nothing phone 2a: నథింగ్ ఫోన్ 2ఏ ప్రత్యేక ఎడిషన్ భారత్లో విడుదలైంది. నేవీ బ్లూ రంగులో దీన్ని తీసుకొచ్చారు. -
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 329 పాయింట్ల లాభంతో 74,059 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 85 పాయింట్లు పెరిగి 22,505 దగ్గర కొనసాగుతోంది. -
3 ఏళ్లలో రూ.3,000 కోట్లు.. అపోలో హాస్పిటల్స్ పెట్టుబడులు!
వచ్చే మూడేళ్లలో రూ.3,000 కోట్ల పెట్టుబడులకు అపోలో హాస్పిటల్స్ సన్నాహాలు చేస్తోంది. అమెరికాకు చెందిన దిగ్గజ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్తో ఒప్పందం ఫలితంగా, వస్తున్న నిధులకు మరికొంత జతచేసి, సంస్థ విస్తరణ కార్యకలాపాలపై పెట్టుబడి పెట్టాలని అపోలో నిర్ణయించింది. -
కార్పొరేట్ ఫలితాలు.. అమెరికా వడ్డీరేట్లే కీలకం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈవారంలో వెలువడే పెద్ద కంపెనీల ఆర్థిక ఫలితాలకు తోడు, వడ్డీరేట్లపై బుధవారం వెల్లడయ్యే అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు మార్కెట్కు దిశానిర్దేశం చేయొచ్చంటున్నారు. -
అదానీకనెక్స్ రూ.11,520 కోట్ల రుణ సమీకరణ
అదానీ ఎంటర్ప్రైజెస్, ఎడ్జ్కనెక్స్ సంయుక్తంగా డేటా కేంద్రాల కోసం నెలకొల్పిన సంస్థ అదానీకనెక్స్ 1.44 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.11,520 కోట్ల) వరకు రుణం సమీకరించినట్లు ప్రకటించింది. -
బ్యాంకుల రుణవృద్ధి అంతంతే!
దేశంలో ఆర్థిక వృద్ధి బలంగా ఉన్నందున బ్యాంకుల లాభదాయకత, ఆస్తుల నాణ్యత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ పటిష్ఠంగా ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. -
చైనాలో ఎలాన్ మస్క్
అమెరికా విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హఠాత్తుగా చైనాలో పర్యటిస్తున్నారు. -
వెండిపై ఆచితూచి!
పసిడి జూన్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.72,462 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.72,944; రూ.73,425 వరకు రాణించే అవకాశం ఉంటుంది. -
74500 ఎగువన కొత్త గరిష్ఠాలకు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం దేశీయ సూచీలు లాభపడ్డాయి. బాండ్ రాబడులు పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు, చమురు ధరలు ప్రభావం చూపాయి. -
సంక్షిప్త వార్తలు
స్టాక్ మార్కెట్లు, బీమా కంపెనీలు, ఆన్లైన్ చెల్లింపు గేట్వే ఇంటర్మీడియర్లు, క్రిప్టో కరెన్సీ సేవల ప్రొవైడర్లకు భారత ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) తాజా హెచ్చరికలు జారీ చేసింది. -
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
SBI Credit Card: ఎస్బీఐ కార్డు విమాన ప్రయాణికుల కోసం మూడు ప్రత్యేక క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. వాటిలోని ప్రయోజనాలు, ఫీజుల వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..!
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్