జోష్
దేశ ఆర్థిక వ్యవస్థ సెప్టెంబరు త్రైమాసికంలో అంచనాలను మించి రాణించడంతో, శుక్రవారం స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లాయి. నిఫ్టీ మరో కొత్త శిఖరానికి చేరగా.. మదుపర్ల సంపద రికార్డు గరిష్ఠాలను అధిరోహించింది
జీవనకాల గరిష్ఠానికి నిఫ్టీ
దేశ ఆర్థిక వ్యవస్థ సెప్టెంబరు త్రైమాసికంలో అంచనాలను మించి రాణించడంతో, శుక్రవారం స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లాయి. నిఫ్టీ మరో కొత్త శిఖరానికి చేరగా.. మదుపర్ల సంపద రికార్డు గరిష్ఠాలను అధిరోహించింది. నవంబరు నెలలో వాహన విక్రయాలకు పండగ శోభ సంతరించగా.. జీఎస్టీ వసూళ్లలో జోరు కొనసాగింది. దేశీయ తయారీ రంగమూ మరోమారు ఆకర్షణీయ పనితీరుతో ఆకట్టుకుంది.
సానుకూల ఆర్థిక గణాంకాలు, విదేశీ కొనుగోళ్ల మద్దతుతో నిఫ్టీ జీవనకాల గరిష్ఠాన్ని అధిరోహించింది. సెన్సెక్స్ 11 నెలల గరిష్ఠం దగ్గర ముగిసింది. జీడీపీ వృద్ధి అంచనాలను మించడం, విదేశీ మార్కెట్లు రాణించడం సానుకూల ప్రభావం చూపాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 4 పైసలు పుంజుకుని 83.33 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు 0.57% తగ్గి 80.40 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
- సూచీల లాభాలతో మదుపర్ల సంపదగా పరిగణించే, బీఎస్ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్ విలువ తాజా గరిష్ఠమైన రూ.337.67 లక్షల కోట్లకు చేరింది. గత నాలుగు ట్రేడింగ్ రోజుల్లో సెన్సెక్స్ 1,511.15 పాయింట్లు, నిఫ్టీ 473.2 పాయింట్లు చొప్పున రాణించగా, మదుపర్ల సంపద రూ.8.95 లక్షల కోట్లు వృద్ధి చెందింది.
- సెన్సెక్స్ ఉదయం 67,181.15 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా అదే జోరు కొనసాగించిన సూచీ, 67,149.07 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 492.75 పాయింట్ల లాభంతో 67,481.19 వద్ద ముగిసింది. నిఫ్టీ 134.75 పాయింట్లు పెరిగి 20,267.90 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో 20,291.55 పాయింట్ల వద్ద రికార్డు గరిష్ఠాన్ని నమోదుచేసింది. సెన్సెక్స్ 30 షేర్లలో 19 పరుగులు తీశాయి.
- ఫ్లెయిర్ రైటింగ్ షేరు అరంగేట్రంలో మెరిసింది. ఇష్యూ ధర రూ.304తో పోలిస్తే బీఎస్ఈలో 65.45% లాభంతో రూ.503 వద్ద ప్రారంభమైంది. అదే జోరు కొనసాగిస్తూ 69% లాభపడి, రూ.514 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 48.91% లాభంతో రూ.452.70 వద్ద ముగిసింది. మార్కెట్ విలువ రూ.4,771.25 కోట్లుగా నమోదైంది. మదుపరి ఒక లాట్పై రూ.14,896 పెట్టుబడి పెడితే, ముగింపు ధర ప్రకారం ఆ విలువ మరో రూ.7,287 పెరిగినట్లయ్యింది.
- 52 వారాల గరిష్ఠానికి హెచ్ఏఎల్ షేరు: భారత సైన్యం, ఎయిర్ఫోర్స్కు లైట్ కాంబాట్ హెలీకాప్టర్లను అందించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ (హెచ్ఏఎల్) షేరు ఇంట్రాడేలో 5% లాభపడి రూ.2499 వద్ద 52 వారాల గరిష్ఠానికి చేరింది. చివరకు 3.35% లాభంతో రూ.2,462.15 వద్ద ముగిసింది.
- నవంబరు 24తో ముగిసిన వారానికి మన విదేశీ మారకపు (ఫారెక్స్) నిల్వలు 2.538 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.21,000 కోట్లు) పెరిగి 597.935 బి.డాలర్ల (రూ.49.62 లక్షల కోట్ల)కు చేరాయని ఆర్బీఐ పేర్కొంది.
- లిక్విఫైడ్ సహజవాయువు (ఎల్ఎన్జీ) డెలివరీ చేయనందుకు నష్టపరిహారంగా రష్యా సంస్థ గాజ్ప్రోమ్ నుంచి 1.817 బి.డాలర్ల పరిహారం కోరుతూ గెయిల్ న్యాయ ప్రక్రియను ప్రారంభించనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!