విమానాల పార్కింగుకు అధిక ఛార్జీలు!
సాంకేతిక, ఇతర సమస్యల కారణంగా విమానాలను నిలిపివేస్తున్న (గ్రౌండింగ్) సందర్భాలు పెరుగుతున్నాయి. కార్యకలాపాలు సాగించని ఇలాంటి విమానాలను నిలిపి ఉంచడం వల్ల, దిల్లీ విమానాశ్రయంలో అందుబాటులో ఉన్న పార్కింగ్ స్థలం తగ్గిపోతోంది.
దిల్లీ విమానాశ్రయ యోచన
దిల్లీ: సాంకేతిక, ఇతర సమస్యల కారణంగా విమానాలను నిలిపివేస్తున్న (గ్రౌండింగ్) సందర్భాలు పెరుగుతున్నాయి. కార్యకలాపాలు సాగించని ఇలాంటి విమానాలను నిలిపి ఉంచడం వల్ల, దిల్లీ విమానాశ్రయంలో అందుబాటులో ఉన్న పార్కింగ్ స్థలం తగ్గిపోతోంది. రోజువారీ కార్యకలాపాలు సాగించే విమానాలు నిలిపేందుకు చోటు సరిపోవడం లేదు. ఇది విమానాశ్రయ కార్యకలాపాల సామర్థ్యాన్నీ ప్రభావితం చేస్తోంది. అందువల్ల కార్యకలాపాలు నిర్వహించకుండా, మరమ్మతుల కోసం నిలిపి ఉంచిన విమానాలకు ఇకపై విమానయాన సంస్థల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేయాలని దిల్లీ విమానాశ్రయాన్ని నిర్వహించే దిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (డీఐఏఎల్) ప్రణాళిక సిద్ధం చేసింది. నిర్ణీత కాల వ్యవధికి మించి విమానాశ్రయంలో నిలిపి ఉంచిన విమానాలకు ఆయా సంస్థల నుంచి అధిక మొత్తంలో ఛార్జీలు వసూలు చేయాలనుకుంటున్నట్లు డీఐఏఎల్ సీఈఓ విదేహ్ కుమార్ వెల్లడించారు. తదుపరి విమాన ట్రాఫిక్ సమీక్షను వచ్చే ఏడాది ప్రారంభంలో చేయనున్నారు.
- నవంబరు 17 నాటికి ఇండిగో, స్పైస్జెట్, ఎయిరిండియా తదితర విమానయాన సంస్థలు 64 విమానాలను దిల్లీ విమానాశ్రయ ప్రాంగణంలో నిలిపి ఉంచాయని డీఐఏఎల్ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఇండిగో విమానాలు 24, స్పైస్జెట్ విమానాలు 6, ఎయిరిండియా విమానాలు 2, అలియన్స్ ఎయిర్ విమానం ఒకటి చొప్పున విమానాశ్రయ ఆవరణలో నిలిపి ఉంచినట్లు పేర్కొన్నారు.
- కార్యకలాపాలు సాగించని విమానయాన సంస్థ గోఫస్ట్ 23 విమానాలను అక్కడే నిలిపి ఉంచింది. జూమ్ ఎయిర్ విమానాలు 5, జెట్ ఎయిర్వేస్ విమానాలు 3 కూడా ఇక్కడే ఆగి ఉన్నాయని తెలిపారు.
- ప్రస్తుతం డీఐఏఎల్ నిర్వహిస్తున్న ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఏఐ)లో 295 విమాన పార్కింగ్ స్టాండ్లు ఉన్నాయి.
- ప్రస్తుతం దిల్లీ విమానాశ్రయంలో మూడు టెర్మినల్స్ (టీ1, టీ2, టీ3) ద్వారా సుమారు 1,300-1,500 విమానాలు రోజువారీగా రాకపోకలు సాగిస్తున్నాయి. ట్రాఫిక్ ధోరణిని గమనించి టీ4 టెర్మినల్ ఏర్పాటుపై త్వరలోనే సంస్థ ఒక నిర్ణయం తీసుకోబోతోంది. 2024 మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ విమానాశ్రయం నుంచి 7 కోట్ల మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరే అవకాశం ఉందని డీఐఏఎల్ వెల్లడించింది. జీఎంఆర్ గ్రూప్ ఆధ్వర్యంలోని కన్సార్షియమే డీఐఏఎల్.
దేశంలో వృథాగా 166 విమానాలు
విమానయాన రంగ సలహా సంస్థ కాపా ఇండియా నివేదిక ప్రకారం, ఇండిగో, ఎయిరిండియా, గోఫస్ట్, స్పైస్జెట్ సంస్థలకు చెందిన 161-166 విమానాలు దేశంలో కార్యకలాపాలు సాగించకుండా నిలిపి ఉన్నాయి. మార్చి నాటికి ఈ సంఖ్య 196-201కి చేరే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే