ఎఫ్ఐఐల కొనుగోళ్లతో ముందుకే
ఈ వారమూ మార్కెట్లలో జోష్ కొనసాగేందుకే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది పెద్దగా పనితీరు కనబరచని బ్యాంకింగ్, ఆర్థిక సేవల షేర్ల వైపు అందరి దృష్టీ ఉంది. దేశీయ వృద్ధిపై బలమైన అంచనాలకు తోడు అంతర్జాతీయంగా అధిక వడ్డీ రేట్లు, చమురు ధరల్లో ఊగిసలాటలు కొలిక్కి వస్తుండటంతో మార్కెట్లో సెంటిమెంటు సానుకూలంగా మారింది.
గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణకూ అవకాశం
సెంటిమెంటు మాత్రం సానుకూలం
ఆర్బీఐ పరపతి విధానంపైనా దృష్టి
లోహ, ఎఫ్ఎమ్సీజీ షేర్లు రాణించొచ్చు
విశ్లేషకుల అంచనాలు
ఈ వారమూ మార్కెట్లలో జోష్ కొనసాగేందుకే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది పెద్దగా పనితీరు కనబరచని బ్యాంకింగ్, ఆర్థిక సేవల షేర్ల వైపు అందరి దృష్టీ ఉంది. దేశీయ వృద్ధిపై బలమైన అంచనాలకు తోడు అంతర్జాతీయంగా అధిక వడ్డీ రేట్లు, చమురు ధరల్లో ఊగిసలాటలు కొలిక్కి వస్తుండటంతో మార్కెట్లో సెంటిమెంటు సానుకూలంగా మారింది. దీంతో విదేశీ సంస్థాగత మదుపర్లు(ఎఫ్ఐఐ) తమ షార్ట్ పొజిషన్లను కవర్ చేసుకోవడాన్ని కొనసాగించొచ్చని భావిస్తున్నారు. ‘బ్యాంకులు, ఆర్థిక సేవల షేర్లు రాణించడం మొదలుపెడితే నిఫ్టీ-50 మరింత ముందుకెళ్లొచ్చు. బ్యాంక్నిఫ్టీ తన జీవనకాల గరిష్ఠమైన 46,369.5 పాయింట్లను పరీక్షించొచ్చని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో మూడింటిలో భాజపా విజయం సాధించినందున, మార్కెట్ సెంటిమెంటు మెరుగుపడొచ్చు. రికార్డు గరిష్ఠాల వద్ద, మదుపర్లు కొంత మేర లాభాలు స్వీకరించొచ్చు. ఈనెల 6-8 తేదీల్లో జరిగే ఆర్బీఐ పరపతి విధాన కమిటీ నిర్ణయాల కోసం మదుపర్లు వేచిచూడొచ్చు. వడీరేట్లలో మార్పులు చేయకపోవచ్చని భావిస్తున్నారు. వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..
- ప్రామాణిక సూచీలతో పాటే సిమెంటు షేర్లూ రాబోయే రోజుల్లో రాణించొచ్చు. సాధారణ ఎన్నికలకు ముందు మౌలిక రంగంలో ప్రభుత్వం పెట్టుబడులు పెంచుతుందన్న అంచనాలే ఇందుకు నేపథ్యం.
- లోహ కంపెనీల షేర్లలో లాభాలు కొనసాగొచ్చు. లోహ సూచీ 7,175 పాయింట్ల వద్ద తన నిరోధాన్ని అధిగమిస్తే ఎక్కువ లాభాలకు అవకాశం ఉంది.
- కొన్ని వాహన షేర్లు లాభపడొచ్చు. గరిష్ఠాలకు చేరినందున లాభాల స్వీకరణ జరగొచ్చు. నవంబరు విక్రయాల ప్రభావమూ ఉంటుంది.
- మార్కెట్తో పాటే ఎఫ్ఎమ్సీజీ షేర్లూ పెరగొచ్చు. కొంత మేర లాభాల స్వీకరణ ఉన్నా,రక్షణాత్మక రంగం కాబట్టి ఈ సూచీ రాణించడానికే అవకాశం ఎక్కువ.
- ముడి చమురు ధరలు స్థిరంగా ఉంటాయన్న అంచనాల మధ్య, చమురు మార్కెటింగ్ కంపెనీల షేర్లలో కొనుగోళ్లు కొనసాగొచ్చు. ఈ షేర్ల ధరలు మరీ ఎక్కువకు చేరినందున లాభాలు పరిమితంగానే ఉండొచ్చు.
- ఐటీ కంపెనీల షేర్లు చాలా తక్కువ శ్రేణిలో కదలాడొచ్చు. ఇన్ఫోసిస్ రూ.1500 ధరపైన బులిష్ బ్రేకవుట్కు అవకాశం ఉంది. టీసీఎస్కు రూ.3550 వద్ద నిరోధం, రూ.3400 వద్ద మద్దతు కనిపిస్తున్నాయి.
- ఔషధ షేర్లు సానుకూలంగా కనిపిస్తున్నాయి. ఇటీవలి కనిష్ఠాల దిగువకు చేరకపోతే మాత్రం సెంటిమెంటు మెరుగ్గానే ఉండొచ్చు.
- ప్రభావం చూపే వార్తలు లేనందున ఎంపిక చేసిన టెలికాం షేర్లలో కదలికలుంటాయి. భారతీ ఎయిర్టెల్ వరుసగా అయిదో వారమూ పెరిగింది.
- బ్యాంక్ నిఫ్టీకి మిశ్రమ ఫలితాలు కనిపించొచ్చు. కొంత మేర లాభాల స్వీకరణ, దిద్దుబాటుకు అవకాశం ఉంది. బ్యాంక్ నిఫ్టీకి 44,000 పాయింట్ల వద్ద మద్దతు; 45,250 వద్ద నిరోధాన్ని అంచనా వేస్తున్నారు.
- యంత్ర పరికరాల కంపెనీల్లో స్వల్పకాలంలో కొంత లాభాల స్వీకరణకు అవకాశం ఉంది. గత అయిదు వారాల్లో ఈ రంగ సూచీ 11 శాతం వరకు లాభాలందుకోవడం ఇందుకు నేపథ్యం. ఏబీబీ ఇండియాకు రూ.4,700 వద్ద: సీమెన్స్కు రూ.3,950 వద్ద బలమైన నిరోధం ఎదురుకావొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4 లక్షల స్కూటర్లు రీకాల్ చేసిన సుజుకీ.. ఇందులో మీ మోడల్ ఉందా?
Suzuki Motorcycle: సుజుకీ కంపెనీ దాదాపు 4 లక్షల వాహనాలను రీకాల్ చేసింది. ఆయా వాహనాల్లో ఉన్న లోపాన్ని గుర్తించి ఈ రీకాల్ చేపట్టింది. -
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి