సుజుకీ మోటార్ గుజరాత్ నుంచి 30 లక్షల వాహనాల ఉత్పత్తి
మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ)కు కార్లు తయారు చేసే సుజుకీ మోటార్ గుజరాత్ (ఎస్ఎంజీ), ఇప్పటివరకు మొత్తం 30 లక్షల వాహనాలను ఉత్పత్తి చేసినట్లు బుధవారం తెలిపింది.
దిల్లీ: మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ)కు కార్లు తయారు చేసే సుజుకీ మోటార్ గుజరాత్ (ఎస్ఎంజీ), ఇప్పటివరకు మొత్తం 30 లక్షల వాహనాలను ఉత్పత్తి చేసినట్లు బుధవారం తెలిపింది. ఎస్ఎంజీ 2017 ఫిబ్రవరిలో ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించగా, 6 ఏళ్ల 11 నెలల్లో ఈ మైలురాయిని అధిగమించిందని పేర్కొంది. ఎస్ఎంజీ ఏడాదికి 7.5 లక్షల వాహనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. ఈ ప్లాంటులో ఉత్పత్తి అయిన వాహనాలను దేశీయంగా విక్రయించడమే కాకుండా, విదేశాలకూ ఎగుమతి చేస్తున్నారు. ‘సుజుకీ మోటార్ గుజరాత్ కొనుగోలుతో మా ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత విస్తరిస్తున్నాం. గుజరాత్ ప్లాంటులో మా బ్యాటరీ విద్యుత్ వాహనాల ఉత్పత్తి కూడా 2024-25లో జరుగుతుందని ఆశిస్తున్నామ’ని ఎంఎస్ఐ ఎండీ, సీఈఓ హిసాషి టకుచి తెలిపారు. స్విఫ్ట్, బాలెనో, డిజైర్, ఫ్రోంక్స్ వంటి ప్రముఖ మోడళ్లు ఈ ప్లాంటు నుంచే ఉత్పత్తి అవుతున్నాయి. 2022-23లో ఎస్ఎంజీలో ఉత్పత్తి చేసిన వాహనాల్లో సుమారు 50 శాతం ఎగుమతి చేశామని టకుచి తెలిపారు. సుజుకీ మోటార్ కార్పొరేషన్ (ఎస్ఎంసీ), జపాన్ నుంచి ఎస్ఎంజీ కొనుగోలుకు ఎంఎస్ఐ వాటాదార్లు ఇటీవలే ఆమోదం తెలిపారు. ఎస్ఎంజీ గతంలో ఎస్ఎంసీకి పూర్తి స్థాయి అనుబంధ సంస్థగా ఉండగా, ప్రస్తుతం మారుతీ సుజుకీ యాజమాన్యంలోకి వచ్చింది.
విద్యుత్ ఎస్యూవీ ఉత్పత్తి గుజరాత్లోనే..
తమ సంస్థ త్వరలో తీసుకురాబోతున్న విద్యుత్ స్పోర్ట్స్ వినియోగ వాహన (ఇ-ఎస్యూవీ) ఉత్పత్తి కూడా గుజరాత్ ప్లాంటులోనే జరుగుతుందని మారుతీ సుజుకీ వెల్లడించింది. ప్రస్తుత తయారీ ప్లాంటు ఉన్న హన్సాల్పుర్కు సుమారు 90 కిలోమీటర్ల దూరంలో కొత్త ప్లాంటును నెలకొల్పబోతున్నట్లు తెలిపింది. ‘మా తొలి ఇ- ఎస్యూవీని వచ్చే ఆర్థిక సంవత్సరంలో విడుదల చేయాలనుకుంటున్నాం. ఇది ఎస్ఎంజీ గుజరాత్ ప్లాంటు నుంచే వస్తుంది. ప్రస్తుతం ఎస్ఎంజీ హన్సాల్పుర్లో ఎ, బి, సి అనే మూడు ప్లాంట్లున్నాయి. ఈవీల తయారీకి కొత్త ప్లాంటు కూడా సిద్ధమవుతోంద’ని మారుతీ సుజుకీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కార్పొరేట్ వ్యవహారాలు) రాహుల్ భారతీ వెల్లడించారు. ఎస్ఎంజీ ప్లాంటులో ఉత్పత్తి చేయబోయే ఇ- ఎస్యూవీలను ఎగుమతి కూడా చేస్తామని పేర్కొన్నారు. 2022 మార్చిలో ఎస్ఎంజీ మాతృ సంస్థ సుజుకీ మోటార్ కార్పొరేషన్, గుజరాత్ ప్రభుత్వంతో కొత్త ప్లాంటు కోసం అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుందని తెలిపారు. ఇందులో భాగంగా ఈవీల తయారీ కోసం హన్సాల్పుర్ ప్లాంటులో రూ.3,100 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు రాహుల్ తెలిపారు. మారుతీ ఈవీ కాన్సెప్ట్ను ఇప్పటికే ఆవిష్కరించింది. ఒక ఛార్జింగ్తో 550 కి.మీ. ప్రయాణించేలా 60 కిలోవాట్ అవర్ బ్యాటరీతో ఈ వాహనాన్ని తీసుకు రాబోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం