Home loan: రెండేళ్లుగా ఇళ్లు కొనడం కష్టమవుతోంది!
గృహాల ధరలు, రుణ (తనఖా) రేట్లు పెరిగిపోవడంతో గత రెండేళ్లుగా ఇళ్లు కొనడం కష్టమవుతోందని, అందుబాటు ధరలో లభించకుండా పోతున్నాయని జేఎల్ఎల్ ఇండియా నివేదిక వెల్లడించింది.
ధరలు, రుణ రేట్లు పెరిగాయ్
2024లో పరిస్థితులు మెరుగవ్వొచ్చు
రెపో రేటు 60-80 బేసిస్ పాయింట్లు తగ్గొచ్చు
జేఎల్ఎల్ ఇండియా నివేదిక
దిల్లీ: గృహాల ధరలు, రుణ (తనఖా) రేట్లు పెరిగిపోవడంతో గత రెండేళ్లుగా ఇళ్లు కొనడం కష్టమవుతోందని, అందుబాటు ధరలో లభించకుండా పోతున్నాయని జేఎల్ఎల్ ఇండియా నివేదిక వెల్లడించింది. దేశ వ్యాప్తంగా 7 ప్రధాన నగరాల్లో ఇదే పరిస్థితి ఉందని పేర్కొంది. 2024లో రెపో రేటు (బ్యాంకులు ఆర్బీఐ వద్ద తీసుకునే నిధులకు చెల్లించే వడ్డీ రేటు) తగ్గే వీలున్నందున, ఇళ్ల కొనుగోలుదార్లకు మళ్లీ మంచి రోజులు రావొచ్చని పేర్కొంది. స్థోమత స్థాయి మెరుగై, ఇళ్ల అమ్మకాలు మరింత పెరుగుతాయని తెలిపింది. స్థిరాస్తి ధరలు, గృహ రుణాలపై వడ్డీ రేట్లు పెరిగినా వినియోగదార్ల స్థోమత స్థాయి పెరిగితే గృహాల విక్రయాలు ఊపందుకుంటాయని పేర్కొంది. ‘హోమ్ పర్చేజ్ అఫర్డబిలిటీ ఇండెక్స్’ (హెచ్పీఏఐ)ను జేఎల్ఎల్ ఆదివారం విడుదల చేసింది. ఇది కుటుంబాల సగటు వార్షిక ఆదాయ ఆర్జన (నగర స్థాయిలో), ప్రస్తుతం ఆ నగరంలో ఉన్న మార్కెట్ ధర ప్రకారం ఆస్తిపై గృహ రుణం పొందేందుకు అర్హతను నిర్ణయిస్తుంది. అంతర్జాతీయ మందగమనం, అధిక ద్రవ్యోల్బణ ధోరణితో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2022లో రెపో రేటును క్రమంగా పెంచుకుంటూ పోయిందని నివేదిక తెలిపింది. ఇళ్లకు బలమైన గిరాకీ వల్ల కూడా వాటి ధరలు పెరిగాయని, దీంతో కుటంబాల గృహ కొనుగోలు స్థోమత తగ్గిందని పేర్కొంది. 2022తో పోలిస్తే ఈ ఏడాది కూడా స్థోమత స్థాయులు స్వల్పంగా తగ్గాయని తెలిపింది. వచ్చే ఏడాది రెపో రేటులో 60-80 బేసిస్ పాయింట్ల కోతకు అవకాశం ఉందని జేఎల్ఎల్ అంచనా వేస్తోంది. ఇది జరిగితే గృహ రుణ రేట్లు తగ్గి, (Home loan) వినియోగదార్లు ఇళ్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తారని అభిప్రాయపడింది.
ఇదీ లెక్క
హెచ్పీఏఐ 100 ఉంటే, గృహరుణం పొందే ఆదాయార్హత సగటు కుటుంబాలకు ఉన్నట్లు. ఇది 100 కంటే లోపుంటే, రుణానికి తగిన ఆదాయం లేనట్లు. 100 కంటే అధికంగా ఉంటే, రుణం పొందేందుకు అవసరమైన ఆదాయం కంటే ఎక్కువ ఉన్నట్లు. ముంబయిలో ఈ సూచీ గతేడాది 92 కాగా, ఈ ఏడాది 88కి తగ్గింది. హైదరాబాద్లో 174 నుంచి 169కి పరిమితమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
3 ఐపీఓలు.. రూ.6,400 కోట్ల లక్ష్యం
ఈ వారం మూడు కంపెనీల తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)లు మార్కెట్లో సందడి చేయనున్నాయి. రూ.6,400 కోట్ల సమీకరించే లక్ష్యంతో ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండీజీన్, టీబీఓ టెక్ ఐపీఓలు వస్తున్నాయి. -
లాభాలకే అవకాశం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత శుక్రవారం సూచీలు భారీగా నష్టపోయినా, అది తాత్కాలికమేనని.. సూచీలు అధిక స్థాయులకు చేరాయనే భావనతో, లాభాల స్వీకరణకు దిగడం వల్లే ఆ పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
పసిడిలో లాభాల స్వీకరణ!
పసిడి ఇటీవల రూ.73,925 వద్ద గరిష్ఠాన్ని తాకిన తర్వాత లాభాల స్వీకరణ కనిపిస్తోంది. ఇదే ధోరణి కొనసాగితే జూన్ కాంట్రాక్టు ఈ వారం రూ.69,418 వరకు పడిపోవచ్చు. -
75,100 పైన మరిన్ని సానుకూలతలు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో గత వారం సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. దేశీయ కంపెనీల త్రైమాసిక ఫలితాలు, ముడిచమురు ధరలు చల్లపడటం కలిసొచ్చాయి. -
పురుగు మందుల అవశేషాలపై భారత్లో కఠిన నిబంధనలు: ప్రభుత్వం
ఆహార పదార్థాల్లో పురుగు మందుల అవశేషాల విషయంలో.. భారత్ అత్యంత కఠినమైన నిబంధనలను కలిగి ఉందని ప్రభుత్వం ఆదివారం పునరుద్ఘాటించింది. -
గృహ రుణ బకాయిలు పెరిగాయ్: ఆర్బీఐ
గృహ నిర్మాణ రంగానికి బకాయిపడిన రుణాలు గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో సుమారు రూ.10 లక్షల కోట్లు పెరిగి ఈ ఏడాది మార్చి నాటికి రికార్డు స్థాయిలో రూ.27.23 లక్షల కోట్లకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన డేటా వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం