Home loan: రెండేళ్లుగా ఇళ్లు కొనడం కష్టమవుతోంది!
గృహాల ధరలు, రుణ (తనఖా) రేట్లు పెరిగిపోవడంతో గత రెండేళ్లుగా ఇళ్లు కొనడం కష్టమవుతోందని, అందుబాటు ధరలో లభించకుండా పోతున్నాయని జేఎల్ఎల్ ఇండియా నివేదిక వెల్లడించింది.
ధరలు, రుణ రేట్లు పెరిగాయ్
2024లో పరిస్థితులు మెరుగవ్వొచ్చు
రెపో రేటు 60-80 బేసిస్ పాయింట్లు తగ్గొచ్చు
జేఎల్ఎల్ ఇండియా నివేదిక
దిల్లీ: గృహాల ధరలు, రుణ (తనఖా) రేట్లు పెరిగిపోవడంతో గత రెండేళ్లుగా ఇళ్లు కొనడం కష్టమవుతోందని, అందుబాటు ధరలో లభించకుండా పోతున్నాయని జేఎల్ఎల్ ఇండియా నివేదిక వెల్లడించింది. దేశ వ్యాప్తంగా 7 ప్రధాన నగరాల్లో ఇదే పరిస్థితి ఉందని పేర్కొంది. 2024లో రెపో రేటు (బ్యాంకులు ఆర్బీఐ వద్ద తీసుకునే నిధులకు చెల్లించే వడ్డీ రేటు) తగ్గే వీలున్నందున, ఇళ్ల కొనుగోలుదార్లకు మళ్లీ మంచి రోజులు రావొచ్చని పేర్కొంది. స్థోమత స్థాయి మెరుగై, ఇళ్ల అమ్మకాలు మరింత పెరుగుతాయని తెలిపింది. స్థిరాస్తి ధరలు, గృహ రుణాలపై వడ్డీ రేట్లు పెరిగినా వినియోగదార్ల స్థోమత స్థాయి పెరిగితే గృహాల విక్రయాలు ఊపందుకుంటాయని పేర్కొంది. ‘హోమ్ పర్చేజ్ అఫర్డబిలిటీ ఇండెక్స్’ (హెచ్పీఏఐ)ను జేఎల్ఎల్ ఆదివారం విడుదల చేసింది. ఇది కుటుంబాల సగటు వార్షిక ఆదాయ ఆర్జన (నగర స్థాయిలో), ప్రస్తుతం ఆ నగరంలో ఉన్న మార్కెట్ ధర ప్రకారం ఆస్తిపై గృహ రుణం పొందేందుకు అర్హతను నిర్ణయిస్తుంది. అంతర్జాతీయ మందగమనం, అధిక ద్రవ్యోల్బణ ధోరణితో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2022లో రెపో రేటును క్రమంగా పెంచుకుంటూ పోయిందని నివేదిక తెలిపింది. ఇళ్లకు బలమైన గిరాకీ వల్ల కూడా వాటి ధరలు పెరిగాయని, దీంతో కుటంబాల గృహ కొనుగోలు స్థోమత తగ్గిందని పేర్కొంది. 2022తో పోలిస్తే ఈ ఏడాది కూడా స్థోమత స్థాయులు స్వల్పంగా తగ్గాయని తెలిపింది. వచ్చే ఏడాది రెపో రేటులో 60-80 బేసిస్ పాయింట్ల కోతకు అవకాశం ఉందని జేఎల్ఎల్ అంచనా వేస్తోంది. ఇది జరిగితే గృహ రుణ రేట్లు తగ్గి, (Home loan) వినియోగదార్లు ఇళ్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తారని అభిప్రాయపడింది.
ఇదీ లెక్క
హెచ్పీఏఐ 100 ఉంటే, గృహరుణం పొందే ఆదాయార్హత సగటు కుటుంబాలకు ఉన్నట్లు. ఇది 100 కంటే లోపుంటే, రుణానికి తగిన ఆదాయం లేనట్లు. 100 కంటే అధికంగా ఉంటే, రుణం పొందేందుకు అవసరమైన ఆదాయం కంటే ఎక్కువ ఉన్నట్లు. ముంబయిలో ఈ సూచీ గతేడాది 92 కాగా, ఈ ఏడాది 88కి తగ్గింది. హైదరాబాద్లో 174 నుంచి 169కి పరిమితమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట