‘పేటీఎమ్’పై నిషేధం ఇందుకేనా?
పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్)లో అంతర్గత నష్టభయ నిర్వహణ (ఇంటర్నల్ రిస్క్ మేనేజ్మెంట్)లో ఇబ్బందులున్నాయంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పలుమార్లు హెచ్చరించినా.. వాటిని సరిచేయడంలో కంపెనీ విఫలమైందని తెలుస్తోంది.
పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్)లో అంతర్గత నష్టభయ నిర్వహణ (ఇంటర్నల్ రిస్క్ మేనేజ్మెంట్)లో ఇబ్బందులున్నాయంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పలుమార్లు హెచ్చరించినా.. వాటిని సరిచేయడంలో కంపెనీ విఫలమైందని తెలుస్తోంది. ముఖ్యంగా రాజకీయాలతో సంబంధమున్న వ్యక్తుల (పీఈపీలు) జోక్యం ఉన్న లావాదేవీల విషయంలో కంపెనీ పెద్దగా స్పందించనందునే, ఈనెల 29 తరవాత ముఖ్య కార్యకలాపాలు జరపకుండా ఆర్బీఐ నిషేధించిందని.. ఈ పరిణామాలతో సంబంధమున్న ఇద్దరిని ఉటంకిస్తూ ఒక ఆంగ్ల వార్తా సంస్థ పేర్కొంది. సాధారణంగా పీఈపీలు రాజకీయ నాయకులతో లేదా సీనియర్ అధికారులతో సంబంధమున్న వారై ఉంటారు.
పీపీబీఎల్పై ఆర్బీఐ జరిపిన ఆడిట్లో.. కంపెనీ రిస్క్ మేనేజ్మెంట్ వ్యవస్థలో పలు లోపాలు గుర్తించినట్లు తెలుస్తోంది. పీఈపీలను చేర్చుకోవడంలో సరైన విధానాలను పాటించలేదని సమాచారం. పీఈపీలను పర్యవేక్షించడానికి సరైన వ్యవస్థ లేకపోవడమే కాదు.. అనుమానాస్పద లావాదేవీల విషయాన్ని ప్రభుత్వానికి చెందిన ఫైనాన్షియల్ ఇంటలిజెన్స్ యూనిట్(ఎఫ్ఐయూ)కు నివేదించడంలోనూ పీపీబీఎల్ విఫలమైందనీ అంటున్నారు. ఆర్బీఐ పరిశీలనలు ఏ ఒక్క పీఈపీని లక్ష్యం చేసుకోలేదని.. కేవలం బ్యాంక్లో రిస్క్ మేనేజ్మెంట్ను చక్కదిద్దడంపైనే ఉన్నాయని తెలిపారు. ఈ విషయంపై పేటీఎమ్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ ‘నియంత్రణపరమైన మార్గదర్శకాలను పాటించడానికి మా వద్ద సరైన వ్యవస్థ, ప్రక్రియ ఉంద’ని చెప్పుకొచ్చారు.
సలహా కమిటీ ఏర్పాటు: పీపీబీఎల్పై ఆర్బీఐ నిషేధం నేపథ్యంలో, సెబీ మాజీ ఛైర్మన్ ఎం. దామోదరన్ ఆధ్వర్యంలో ఒక సలహా కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు పేటీఎమ్ బ్రాండ్ యజమాని ఒన్97 కమ్యూనికేషన్స్ ప్రకటించింది. కంపెనీలో నిబంధనలు పాటించడం, నియంత్రణ అంశాలపై సలహా ఇస్తుందని స్టాక్ ఎక్స్ఛేంజీలకిచ్చిన సమాచారంలో పేటీఎం శుక్రవారం పేర్కొంది. ఆంధ్రా బ్యాంక్ మాజీ ఎండీ ఆర్ రామచంద్రన్, ఐసీఏఐ మాజీ ప్రెసిడెంట్ ఎం.ఎం. చితాలే ఈ కమిటీలో ఉన్నారు.
పీపీబీఎల్ బోర్డు నుంచి ఇద్దరు బయటకు: ఇద్దరు స్వతంత్ర డైరెక్టర్లు పీపీబీఎల్ బోర్డు నుంచి రాజీనామా చేశారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా, పీడబ్ల్యూసీ మాజీ ఎగ్జిక్యూటివ్ షింజిని కుమార్, ఎస్బీఐ మాజీ డిప్యూటీ ఎండీ మంజు అగర్వాల్ ఈ జాబితాలో ఉన్నట్లు ఒక ఆంగ్ల వార్తా పత్రిక తన కథనంలో వెల్లడించింది. ఇప్పటికే షింజిని రాజీనామాకు ఆమోదం లభించిందని, బదులుగా మరొకరిని ఎంపిక చేశారని తెలిపింది.
ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్లో సందడి: వినియోగదారు ఖాతాలు, వాలెట్లు, ఫాస్టాగ్లలో ఫిబ్రవరి 29 తర్వాత డిపాజిట్/టాపప్ చేయకూడదంటూ పీపీబీఎల్పై ఆర్బీఐ నిషేధం విధించిన తర్వాత ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్లో సందడి పెరిగింది. కొద్ది రోజులుగా బ్యాంక్ ఖాతాలు, ఫాస్టాగ్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేస్తున్నవారి సంఖ్య భారీగా పెరిగిందని కంపెనీ సీఈఓ అనుబ్రత బిస్వాస్ పేర్కొన్నారు. జనవరితో పోలిస్తే ఇవి 5-7 రెట్లు పెరిగాయని తెలిపారు.
పేటీఎమ్ ఇ-కామర్స్ పేరు మార్పు: పేటీఎమ్ ఇ-కామర్స్ తన పేరును పాయ్ ప్లాట్ఫామ్స్గా మార్చుకుంది. మూడు నెలల కిందటే పేరు మార్పు కోసం దరఖాస్తు చేసుకోగా, ఫిబ్రవరి 8న రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ నుంచి ఆమోదం లభించిందని తెలుస్తోంది.
ఓఎన్డీసీలో ఒక సెల్లర్ ప్లాట్ఫాం అయిన బిట్సిలాను సంస్థ కొనుగోలు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!