విజయవాడ, విశాఖ రైల్వేస్టేషన్లలో స్విగ్గీ నుంచీ ఆహారం అందుకోవచ్చు
భారతీయ రైల్వే క్యాటరింగ్, టూరిజమ్ కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ)కు చెందిన ఇ-క్యాటరింగ్ పోర్టల్లో ముందస్తుగా ఆర్డర్ చేసిన మీల్స్ను సరఫరా చేసేందుకు స్విగ్గీతో ఐఆర్సీటీసీ ఒప్పందం కుదుర్చుకుంది.
దిల్లీ: భారతీయ రైల్వే క్యాటరింగ్, టూరిజమ్ కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ)కు చెందిన ఇ-క్యాటరింగ్ పోర్టల్లో ముందస్తుగా ఆర్డర్ చేసిన మీల్స్ను సరఫరా చేసేందుకు స్విగ్గీతో ఐఆర్సీటీసీ ఒప్పందం కుదుర్చుకుంది. తొలుత ఈ సదుపాయాన్ని 4 రైల్వే స్టేషన్లలో (బెంగళూరు, భువనేశ్వర్, విజయవాడ, విశాఖపట్నం) ప్రారంభించనున్నట్లు ఐఆర్సీటీసీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. ఇ-క్యాటరింగ్ సేవలు త్వరలోనే అందుబాటులోకి వస్తాయని పేర్కొంది.
ఇఫ్కోకు ప్రపంచంలోనే అగ్రస్థానం
దిల్లీ: ప్రపంచంలోని అత్యుత్తమ 300 సహకార (కో-ఆపరేటివ్) సంస్థల్లో ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ (ఇఫ్కో)కు మళ్లీ అగ్రస్థానం లభించింది. తద్వారా గతేడాది లభించిన గౌరవాన్ని నిలబెట్టుకున్నట్లయ్యింది. స్థూల దేశీయోత్పత్తి, సంస్థ టర్నోవరు మధ్య నిష్పత్తి ఆధారంగా ఈ ర్యాంకులను ఇస్తారు. ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ (ఐసీఏ) రూపొందించిన ఈ నివేదిక ప్రకారం.. టర్నోవరు పరంగా ఇఫ్కో స్థానం గత ఆర్థిక సంవత్సరంలోని 97వ స్థానం నుంచి 72కు మెరుగయ్యింది. ‘ఇఫ్కోకు, దేశీయ సహకార ఉద్యమానికి ఇది గర్వించదగ్గ పరిణామం. దేశవ్యాప్తంగా రైతుల ఆదాయాలను పెంచేందుకు మేం ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నామ’ని ఇఫ్కో ఎండీ ఉదయ్ శంకర్ అవస్థి తెలిపారు.
మారుత్ డ్రోన్స్కు ‘యుటిలిటీ పేటెంట్’
ఈనాడు, హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిసి మారుత్ డ్రోన్స్ అభివృద్ధి చేసిన మల్టీ-నాజల్ సీడ్ డిస్పెన్సింగ్ డివైజ్ డ్రోన్కు ‘యుటిలిటీ పేటెంట్’ లభించింది. ప్రపంచంలోనే ఇటువంటి పేటెంట్ తొలిసారిగా లభించిందని, వచ్చే 20 ఏళ్ల పాటు ఈ పేటెంట్ అమల్లో ఉంటుందని సంస్థ తెలిపింది. వరి సాగులో ఉపయోగపడే ఈ డ్రోన్ను రైతులకు విస్తృత స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు మారుత్ డ్రోన్స్ పేర్కొంది. డైరెక్ట్ సీడింగ్ రైస్ పద్ధతిలో వరిసాగుకు వీటిని వినియోగిస్తారు. ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో మనదేశంలో వరి సాగు రూపురేఖలు గణనీయంగా మారుతాయని మారుత్ డ్రోన్స్ సీఈఓ ప్రేమ్ కుమార్ విస్లావత్ వివరించారు.
బైక్ బుకింగ్ సేవల్లోకి ఉబర్!
బెంగళూరు: క్యాబ్ బుకింగ్ సంస్థ ఉబర్, ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ)తో అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ఫలితంగా ఉబర్ యాప్పై వినియోగదారులకు విస్తృత శ్రేణిలో సేవలు లభిస్తాయని కంపెనీ తెలిపింది. ఓఎన్డీసీని ప్రభుత్వానికి చెందిన పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) నిర్వహిస్తోంది. బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో ఉబర్ గ్లోబల్ సీఈఓ దారా ఖోస్రోవ్సీ, ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్ నీలేకనీ పాల్గొన్నారు. దేశీయంగా తక్కువ ఛార్జీతో ప్రయాణించేందుకు ఉపయోగ పడుతున్న బైక్ ట్యాక్సీల బుకింగ్ సేవల్లోకి ప్రవేశిస్తామని ఉబర్ సీఈఓ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్