ఇంటి నుంచి పని.. ముగిసినట్లే!
‘మార్చి చివరికల్లా ఉద్యోగులు వారంలో అన్ని రోజులూ కార్యాలయాలకు వచ్చి పనిచేయాలి. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి. ఉద్యోగులకు ఇస్తున్న చివరి అవకాశం ఇదే’
కార్యాలయాలకు రావాల్సిందేనంటున్న ఐటీ కంపెనీలు
ఉద్యోగులను వెంటాడుతున్న లేఆఫ్ల బెడద
ఇళ్లు, వాణిజ్య భవనాలకు గిరాకీ
‘మార్చి చివరికల్లా ఉద్యోగులు వారంలో అన్ని రోజులూ కార్యాలయాలకు వచ్చి పనిచేయాలి. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి. ఉద్యోగులకు ఇస్తున్న చివరి అవకాశం ఇదే’
టీసీఎస్
‘ఉద్యోగులు వారంలో కనీసం 3 రోజులు.. ఫ్రెషర్లు వారంలో 5 రోజులూ కార్యాలయాలకు రావాల్సిందే. లేకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం’
హెచ్సీఎల్
ఇవే కాదు.. ఇన్ఫోసిస్, విప్రో, ఒరాకిల్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలన్నీ ఇంటి నుంచి పని (వర్క్ ఫ్రమ్ హోమ్) విధానానికి స్వస్తి పలకాలని చూస్తున్నాయి. ‘ఇంటి నుంచి పని’ వల్ల ఉత్పాదకత ఏమీ తగ్గలేదని కొవిడ్ సమయంలో పేర్కొన్న కంపెనీలే, ఇప్పుడు మాత్రం కంపెనీకి వచ్చి, బృందంగా పనిచేస్తేనే వినూత్నత, ఉత్పాదకత పెరుగుతాయని అంటున్నాయి. అసలే నియామకాలు తగ్గడంతో పాటు విదేశాల్లో భారీ సంఖ్యలో లేఆఫ్లు అమలవుతున్న తరుణంలో, ఇక్కడి ఉద్యోగులు కంపెనీల ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటున్నారు. స్వస్థలాల నుంచి ఉద్యోగుల కుటుంబాలు తరలి వస్తున్నందున, ఐటీ కంపెనీల సమీప ప్రాంతాల్లో ఇళ్ల అద్దెలు పెరుగుతున్నాయి.
ఇదీ జరిగింది
కొవిడ్కు ముందు కూడా ఐటీ ఉద్యోగులు వారంలో కొన్ని రోజులపాటు ఇంటి నుంచి పని చేసేవారు. కొవిడ్ సమయంలో ఐటీ ప్రాజెక్టులకు ఆటంకం ఏర్పడకుండా, పూర్తిగా ఇంటి నుంచే పనికి కంపెనీలు అనుమతించాయి. ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నందున, కొన్ని ఐటీ కంపెనీలు నిర్వహణ వ్యయాలు అదుపు చేసేందుకు, అద్దె భవనాలను ఖాళీ చేశాయి కూడా.
కొవిడ్ తీవ్రత తగ్గుముఖం పడుతున్న సమయంలో హైబ్రిడ్ (వారంలో కొన్ని రోజులు ఇంటి నుంచి.. మరికొన్ని రోజులు ఆఫీసు నుంచి పనిచేసే) విధానాన్ని కంపెనీలు అమలు చేశాయి. ఇప్పుడు కొవిడ్ కేసులు పూర్తిగా తగ్గినందున, ఉద్యోగులను పూర్తిగా కార్యాలయాలకు రమ్మని ఒత్తిడి తెస్తున్నాయి. అసలే లేఆఫ్ల ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో, కార్యాలయాలకు రావడం మినహా ఐటీ ఉద్యోగులకు మరో దారి కనిపించడం లేదు.
కారణాలు ఉన్నాయ్
మన ఐటీ కంపెనీలకు ప్రధాన ఖాతాదారులున్న అమెరికా, ఐరోపాల్లో ఆర్థిక వ్యవస్థలు మందగమనంలో ఉన్నాయి. ఫలితంగా ఖాతాదారులు ఐటీపై వ్యయాలకు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కొవిడ్ సమయంలో ప్రాజెక్టులు భారీగా రావడంతో, అధిక వేతనాలపై ఉద్యోగులను నియమించుకున్న సంస్థలకు ఇప్పుడు వారు భారంగా కనపడుతున్నారు. ఫలితంగా దిగ్గజ కంపెనీలు కూడా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దేశీయ ఐటీ రంగంలో భారీ తొలగింపులు లేకున్నా, గిరాకీ తగ్గిన ఎడ్టెక్, ఇ-కామర్స్, అంకుర సంస్థల్లో ఉద్యోగుల తొలగింపులు జరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నికర నియామకాలు 60,000 కు పరిమితమయ్యాయని ఐటీ కంపెనీల సంఘం నాస్కామ్ ఇటీవలే వెల్లడించడం గమనార్హం. ఆశించిన స్థాయిలో కొత్త ప్రాజెక్టులు రాకపోతే.. మన దగ్గరా పరిస్థితులు శరవేగంగా మారే ప్రమాదం ఉంది. కృత్రిమ మేధ ప్రభావంపై అంచనాలూ కలవరపెడుతున్నాయి. కొత్త నియామకాలు తగ్గినందున, ఉద్యోగులు వేరే కంపెనీలకు మారదామన్నా ఆశాజనక పరిస్థితులు కనిపించడం లేదు.
ఉద్యోగులు ఏమంటున్నారంటే..
ఐటీ రంగంలోని చిన్న కంపెనీలు తమ ఉద్యోగులను వారంలో అన్ని రోజులూ కార్యాలయాలకు రప్పిస్తున్నాయి. పెద్ద కంపెనీల్లోనే ఇంకా కొంత వెసులుబాటు ఉంది. రోజూ కార్యాలయాలకు రావడానికి ఎక్కువ శాతం ఉద్యోగులు ఇష్టపడటం లేదని, 25- 34 ఏళ్ల వారు విముఖత ప్రదర్శిస్తున్నారని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. బెంగళూరు, హైదరాబాద్, నోయిడా.. వంటి ఐటీ కంపెనీలు కేంద్రీకృతమైన నగరాల్లో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగింది. ఇంటి నుంచి కార్యాలయానికి వెళ్లి, వచ్చేందుకు రోడ్లపై కనీసం 2-3 గంటలు పడుతోందని.. ఈ చికాకు ఉండదు కనుక ‘ఇంటి నుంచి మరింత సమర్థంగా పనిచేస్తున్నట్లు’ ఉద్యోగులు పేర్కొంటున్నారు. కొవిడ్ సమయంలో ఇంటి నుంచి కదలకున్నా, తమ బృందాలతో అద్భుతంగా పనిచేశామని గుర్తు చేస్తున్నారు.
ఈనాడు వాణిజ్య విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్