సంక్షిప్త వార్తలు
భారత పర్యటనలో ఉన్న ఉబర్ సీఈఓ డారా ఖోస్రోవాహితో శనివారం అదానీ గ్రూపు ఛైర్మన్ గౌతమ్ అదానీ భేటీ అయ్యారు.
భవిష్యత్లో ఉబర్తో అదానీ జట్టు!
దిల్లీ: భారత పర్యటనలో ఉన్న ఉబర్ సీఈఓ డారా ఖోస్రోవాహితో శనివారం అదానీ గ్రూపు ఛైర్మన్ గౌతమ్ అదానీ భేటీ అయ్యారు. భవిష్యత్లో ఇరు సంస్థల మధ్య ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని ఈ భేటీ ద్వారా సంకేతాలిచ్చారు. అలాగే ఇరువురు వ్యాపార అధిపతుల మధ్య చర్చల్లో భారత వృద్ధి గాథ, ఉపఖండంపై వారి అంచనాలు ప్రస్తావనకు వచ్చాయి. ‘ఉబర్ సీఈఓతో అద్భుతమైన చర్చ జరిగింది. భారత్లో విస్తరణపై ఆయనకున్న దూరదృష్టి నిజంగా స్ఫూర్తిమంతం. ముఖ్యంగా భారత డ్రైవర్లను వృద్ధిలోకి తీసుకొచ్చే విషయంలో ఆయనకున్న నిబద్ధత మెచ్చుకోదగినది. డారా, ఆయన బృందంతో భవిష్యత్లో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ఉత్సుకతతో ఉన్నామ’ని ఎక్స్ ప్లాట్ఫామ్ ద్వారా అదానీ తెలిపారు. అయితే సమావేశ ఫొటోలను అదానీ పోస్ట్ చేసినప్పటికీ... సమావేశం ఎక్కడ జరిగిందనే వివరాలను ఆయన తెలియజేయలేదు. అహ్మదాబాద్లోని అదానీ గ్రూపు ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరిగినట్లుగా ఫొటోలను చూస్తే అర్థమవుతోంది.
విచారణ స్వీకరణకు ముందే 27,514 దివాలా దరఖాస్తుల ఉపసంహరణ
ఐబీబీఐ
దిల్లీ: 2023 అక్టోబరు వరకు 27,514 కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ(సీఐఆర్పీ) దరఖాస్తులు.. విచారణకు స్వీకరించడాని కంటే ముందే ఉపసంహరించుకున్నారని ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ బోర్డ్ ఆఫ్ ఇండియా(ఐబీబీఐ) తెలిపింది. ఈ దరఖాస్తులతో రూ.9.74 లక్షల కోట్ల బకాయిలు ముడిపడి ఉన్నాయని పేర్కొంది. ‘ఎగవేత పరిస్థితి తప్పదని భావించినప్పుడో.. తిరిగి చెల్లించాలని నోటీసులు వచ్చినప్పుడనే కాదు.. దివాలా పరిష్కార ప్రక్రియ దరఖాస్తు సమర్పణకు ముందు, సమర్పణ తర్వాత, విచారణ స్వీకరణకు ముందు, అవసరమైతే విచారణ స్వీకరణ తర్వాత కూడా రుణ పరిష్కారం చేసుకుంటున్నారు. ఇలా దివాలా పరిష్కార ప్రక్రియ నుంచి తప్పించుకునేందుకు అవసరమైన అన్ని రకాల ప్రయత్నాలను కార్పొరేట్ రుణ గ్రహీతలు చేస్తున్నార’ని ఐబీబీఐ తెలిపింది.
రూ.3.21 లక్షల కోట్లు వసూలు: 2023 డిసెంబరు వరకు 3,050 కార్పొరేట్ రుణ గ్రహీతలను-రుణ పరిష్కార ప్రక్రియ ద్వారా 891, అప్పీల్ లేదా సమీక్ష లేదా సెటిల్మెంట్ ద్వారా 1,124, ఉపసంహరణ ద్వారా 1,035- సంక్షోభం నుంచి బయటపడేసేందుకు దివాలా స్మృతి (ఐబీసీ) ఉపయోగపడింది. గతేడాది డిసెంబరు 31 వరకు దివాలా పరిష్కార ప్రక్రియ ద్వారా రుణ సంస్థలకు రూ.3.21 లక్షల కోట్లు వసూలయ్యాయి. అయితే వీటి ద్వారా వాస్తవానికి రూ.10.07 లక్షల కోట్ల బకాయిలు రావాలని రుణ సంస్థలు క్లెయిమ్ చేసుకున్నాయి. ఈ ప్రకారం చూస్తే 32 శాతం మాత్రమే వసూలయ్యాయన్నమాట. లిక్విడేషన్ కోసం 2,376 కార్పొరేట్ రుణ గ్రహీతల దరఖాస్తులను సిఫారసు చేశారు. 2023 డిసెంబరు వరకు 830 కార్పొరేట్ రుణ గ్రహీతలను లిక్విడేషన్ చేశారు. దివాలా పరిష్కార ప్రక్రియ పూర్తికి కాలపరిమితిని నిర్దేశిస్తూ.. 2016 డిసెంబరులో దివాలా స్మృతిని ప్రభుత్వం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
వ్యాపారులకు క్రెడిట్బీ వ్యక్తిగత రుణం
ఈనాడు, హైదరాబాద్: ఎలాంటి తనఖా అవసరం లేకుండా వ్యాపారులకు వ్యక్తిగత రుణాలను అందించే పథకాన్ని ప్రారంభించినట్లు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ క్రెడిట్బీ వెల్లడించింది. స్వయం ఉపాధి పొందుతున్న వారికి రుణాలు లభించక ఇబ్బంది పడుతుంటారని, వారికోసం రూ.30వేల నుంచి రూ.3 లక్షల వరకూ రుణాలను అందిస్తున్నామని క్రెడిట్బీ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ మధుసూదన్ ఏకాంబరం వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు