వద్దంటున్నా.. వస్తున్నాయ్!
‘మేము ఫలానా బ్యాంక్/ఎన్బీఎఫ్సీ (బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ)/ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం.. మీకు లోన్/క్రెడిట్కార్డు మంజూరైంది. ఆకర్షణీయ బీమా పాలసీ మీ కోసమే ఉంది.
డీఎన్డీలో నమోదు చేసుకున్నా ఆగని అవాంఛిత కాల్స్: లోకల్ సర్కిల్స్
‘మేము ఫలానా బ్యాంక్/ఎన్బీఎఫ్సీ (బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ)/ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం.. మీకు లోన్/క్రెడిట్కార్డు మంజూరైంది. ఆకర్షణీయ బీమా పాలసీ మీ కోసమే ఉంది. తీసుకుంటారా’ అనో.. ‘స్థిరాస్తి వెంచర్లున్నాయ్.. ఫ్లాట్/ప్లాట్ కొంటారా’ అనో ప్రతిరోజూ కాల్స్ ప్రతి మొబైల్కు వస్తూనే ఉన్నాయ్.
మనకు సంబంధం లేని, పరిచయం లేని వారి నుంచి వచ్చే ఇలాంటి అవాంఛిత కాల్స్ను ఆపేందుకు ‘డు నాట్ డిస్ట్రబ్’ (డీఎన్డీ) వ్యవస్థను టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ తీసుకొచ్చింది. ఇందులో నమోదు చేసుకుంటే, వాణిజ్య సంస్థల నుంచి వచ్చే కాల్స్ అన్నీ ఆగిపోవాలి. ‘అయితే డీఎన్డీలో నమోదైనా కూడా, పరిచయం లేని నంబర్ల నుంచి అవాంఛిత కాల్స్’ వస్తూనే ఉన్నాయని లోకల్ సర్కిల్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో అభిప్రాయాలు తెలిపిన వారిలో 90% మంది చెప్పారు. అధికారికంగా నమోదైన వాణిజ్య నంబర్ల నుంచి కాకుండా, వ్యక్తిగత నంబర్ల నుంచి ఇలాంటి కాల్స్ వస్తున్నాయని అత్యధికులు తెలిపారు. 378 జిల్లాల్లోని 60,000 మంది నుంచి 2023 నవంబరు 15 నుంచి ఈనెల 16 మధ్య సేకరించిన అభిప్రాయాల ప్రకారం..
- ప్రతిరోజూ 1-2 అవాంఛిత కాల్స్ వస్తున్నాయని 90% మంది చెప్పారు. రోజుకు 10కి పైగా ఇలాంటి కాల్స్ వస్తున్నాయని 3% మంది పేర్కొన్నారు. డీఎన్డీలో నమోదైనా వాణిజ్యపరమైన కాల్స్ తమ మొబైల్ నంబరుపై గత 12 నెలలుగా వస్తున్నట్లు 90% మంది వెల్లడించారు.
- వివిధ కంపెనీలు/బ్రాండ్ల పేరిట వస్తున్న అవాంఛిత కాల్స్ శాతం 2023 ఫిబ్రవరిలో 29% కాగా, ఈ నెలలో ఇవి 36 శాతానికి చేరాయని లోకల్ సర్కిల్స్ వ్యవస్థాపకుడు సచిన్ తపారియా వివరించారు.
- ఇలాంటి కాల్స్లో 40% ఒక దిగ్గజ ఎన్బీఎఫ్సీ సంస్థ, మరో అగ్రగామి ప్రైవేటు బ్యాంకు తరఫునే వస్తున్నట్లు చెప్పారు. ఇవి రెండూ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదైనవే కావడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం