రోగులకు ఇంటి వద్దే నర్సింగ్ సేవలు
వివిధ రకాలైన వ్యాధులకు ఆసుపత్రులలో శస్త్రచికిత్స లేదా ఇతర చికిత్సలు చేయించుకొని ఇంటి దగ్గర కోలుకుంటున్న తరుణంలో రోగులకు అవసరమైన నర్సింగ్, ఫిజియో థెరపీ సేవలు అందించే సంస్థ ఒకటి తెలుగు రాష్ట్రాల్లో తన కార్యకలాపాలు విస్తరిస్తోంది.
కార్యకలాపాలు విస్తరిస్తున్న హెల్త్ ఆన్ అజ్ టెక్నాలజీ
హైదరాబాద్, విశాఖల్లో ‘ట్రాన్సిషన్ కేర్’ కేంద్రాలు
హైదరాబాద్: వివిధ రకాలైన వ్యాధులకు ఆసుపత్రులలో శస్త్రచికిత్స లేదా ఇతర చికిత్సలు చేయించుకొని ఇంటి దగ్గర కోలుకుంటున్న తరుణంలో రోగులకు అవసరమైన నర్సింగ్, ఫిజియో థెరపీ సేవలు అందించే సంస్థ ఒకటి తెలుగు రాష్ట్రాల్లో తన కార్యకలాపాలు విస్తరిస్తోంది. అదే హెల్త్ ఆన్ అజ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఇంటి దగ్గర కోలుకుంటున్న రోగులకు అవసరమైన నర్సింగ్, ఫిజియో థెరపీ సేవలను రోజులో ఏ సమయంలో అయినా అందిస్తామని సంస్థ ఛైర్మన్ లింగమనేని రమేశ్ తెలిపారు. దీని కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్, ‘హెల్త్ ఆన్ అజ్’ను మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని, దాని ద్వారా అన్ని రకాల సేవలను బుక్ చేసుకోవచ్చని ఆయన శనివారం ఇక్కడ విలేకరుల సమావేశంలో వివరించారు. సాధారణ నర్సింగ్కు భిన్నంగా, శిక్షణ పొందిన సిబ్బందితో క్లినికల్ నర్సింగ్ సేవలను అందించడం తమ ప్రత్యేకతగా పేర్కొన్నారు. బుక్ చేసుకున్నాక, సిబ్బంది ఎంత సమయంలోగా తమ ఇంటికి చేరతారన్నది కూడా యాప్లో ట్రాక్ చేసుకోవచ్చన్నారు.
భవిష్యత్లో విజయవాడ, తిరుపతి, బెంగళూరులోనూ..: ప్రధాన చికిత్సానంతరం హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయిన వారికి అవసరమైన ఆరోగ్య సేవలను అందించేందుకు వీలుగా ఆక్సిజన్ సరఫరా, ఐసీయూ, వెంటిలేటర్ వసతులతో కూడిన ‘ట్రాన్సిషన్ కేర్’ కేంద్రాలను ఈ సంస్థ హైదరాబాద్, విశాఖపట్టణాల్లో ఏర్పాటు చేస్తోంది. ‘హైదరాబాద్లోని మాదాపూర్లో 28 పడకల సామర్థ్యంతో ఈ కేంద్రం ప్రారంభించాం. 20 పడకలతో విశాఖపట్నం కేంద్రం 3 నెలల్లో ప్రారంభమవుతుంది. వ్యాధిగ్రస్తుల ఇళ్లకు నర్సింగ్ సిబ్బంది త్వరగా వెళ్లేందుకు వీలుగా పలు ప్రాంతాల్లో శాటిలైట్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. పూర్తిస్థాయి శిక్షణ పొందిన 100 మంది నర్సింగ్ సిబ్బంది, 75 మంది ఫిజియో థెరపిస్టులు, 50 మంది ఫార్మసిస్టులతో పాటు 85 మంది ఐటీ సిబ్బంది కూడా పనిచేస్తున్నారు. ఈ కేంద్రాలపై రూ.50 కోట్ల పెట్టుబడి పెట్టాం. భవిష్యత్తులో విజయవాడ, తిరుపతి, బెంగళూరుల్లోనూ ఈ కేంద్రాలు నెలకొల్పుతాం. రాబోయే మూడేళ్లలో ఇందుకు రూ.175 కోట్ల వరకు పెట్టుబడి అవసరమ’ని రమేశ్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్